సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు! | detect tests in sunanda case | Sakshi
Sakshi News home page

సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!

Published Sat, May 16 2015 2:16 AM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు! - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని స్థానిక కోర్టును కోరారు. పోలీసుల అభ్యర్థనపై స్థానిక కోర్టు వచ్చే బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement