ఢిల్లీలో మహిళలకు భద్రతేదీ: మమతాశర్మ | ensure women safety in delhi, asks mamata sharma | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మహిళలకు భద్రతేదీ: మమతాశర్మ

Published Wed, Jan 15 2014 12:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

దేశ రాజధాని నగరంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు.

దేశ రాజధాని నగరంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు. ఢిల్లీలో ఓ డేనిష్ మహిళపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనపై ఆమె స్పందించారు.

రాజధాని నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని, వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ఆప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను సైతం ఏర్పాటుచేసింది. అయినా కూడా ఇంకా అక్కడ అత్యాచారాల పర్వం ఆగలేదు. తాజాగా డేనిష్ మహిళపై అత్యాచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement