బాంబు పేలుడు: నలుగురు మృతి | Four killed in Pakistan roadside blast | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: నలుగురు మృతి

Published Tue, Jun 3 2014 10:28 AM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

పాకిస్థాన్లోని ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో బాంబు పేలుడు సంభవించింది.

పాకిస్థాన్లోని ఫెడరల్ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాలో బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారని స్థానిక మీడియా డాన్ ఆన్లైన్ బుధవారం వెల్లడించింది. పాకిస్థాన్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ఖుర్రం ప్రాంతంలో రహదారి పక్కనే తీవ్రవాదులు బాంబు అమర్చిపెట్టారు. అయితే అదే సమయంలో అటుగా వాహనం వెళ్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. దాంతో ఆ ఘటన చోటు చేసుకుందని డాన్ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement