ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది! | ICICI Bank blocks Flipkarts e-wallet PhonePe citing security | Sakshi
Sakshi News home page

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది!

Published Mon, Jan 16 2017 3:27 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది! - Sakshi

ఫోన్పే వ్యాలెట్ను ఆ బ్యాంకు బ్లాక్ చేసింది!

పేటీఎంకు పోటీగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రంగంలోకి దించిన ఫోన్పే ఈ-వ్యాలెట్ను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసింది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల మూలాన ఫ్లిప్కార్ట్ ఈ-వ్యాలెట్ ఫోన్పేతో చేస్తున్న లావాదేవీలను బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ నెల మొదట్లో కూడా దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా ఇదే తరహా కారణాలతో పేటీఎం, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ఈ-వ్యాలెట్ సంస్థలకు ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్లను రద్దు చేసింది. శుక్రవారం నుంచి ఫోన్పేపై చేస్తున్న లావాదేవీలను బ్యాంకు రద్దు చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 
తమ సొంత ఈ-వ్యాలెట్లను కాపాడుకోవడానికే బ్యాంకులు ఈ తరహా పద్ధతిని అవలంభిస్తున్నాయని మరోవైపు నుంచి ఆరోపణలు ఎదురవుతున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్.. ఐసీఐసీఐ బ్యాంకు అన్ని ఫోన్పే, వైబీఎల్ లావాదేవీలను శుక్రవారం నుంచి బ్లాక్ చేస్తుందని, ఎలాంటి నోటీసులు లేకుండా ఈ పని చేస్తుందని మండిపడ్డారు.  డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement