Blind Person
-
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?
అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు. ఊహలతో, ఊసులతో ప్రపంచాన్ని వీక్షించేవారు. వీరు సమాజంతో సంబంధాలు నెరవేర్చేందుకు ఏర్పడినదే బ్రెయిలీ లిపి. ఇది అంధులకు వరంలాంటిదని చెప్పుకోవచ్చు.ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతీఏటా జనవరి 4న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. లూయిస్ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవకుండా ఉండేందుకే ఈ బ్రెయిలీ లిపిని రూపొందించారు. అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారు. లూయీస్ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కింది. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం.లూయిస్ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సైమన్ రాలీ బ్రెయిలీ. అతను నాటిరోజుల్లో రాజ గుర్రాలకు జీనులు తయారు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో లూయిస్ తన మూడేళ్ల వయసు నుండే తన తండ్రితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కత్తి అతని ఒక కన్నుకు గుచ్చుకుని, అతని చూపు దెబ్బతింది. కొద్దికాలానికి మరో కంటి చూపు కూడా పోయింది. సరైన వైద్యం అందక లూయీస్ ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిగా చూపు కోల్పోయాడు. తరువాత లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరాడు. చీకట్లో కూడా మెసేజ్లను చదవడంలో సహాయపడే సైనిక కోడ్ గురించి లూయిస్కు బాగా తెలుసు. అంధుల కోసం అలాంటి స్క్రిప్ట్ రూపొందించాలనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో అతను బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఇది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయుక్తమయ్యే ఒక స్పర్శ కోడ్. ఈ లిపి కోసం ఎంబోస్డ్ పేపర్ను వినియోగిస్తారు. దానిపై ఉన్న చుక్కలను స్పర్శిస్తూ చదవవచ్చు. బ్రెయిలీ లిపిని టైప్రైటర్తో సమానమైన బ్రెయిల్రైటర్ ద్వారా రాయవచ్చు. ఇదేకాకుండా స్టైలస్, బ్రెయిలీ స్లేట్ ఉపయోగించి కూడా రాయవచ్చు. బ్రెయిలీ లిపిలో ఉపయోగించే చుక్కలను సెల్ అని అంటారు.ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. సుమారు 253 మిలియన్ల మంది దృష్టిలోపానికి గురయ్యారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది. అదిమొదలు ప్రతీయేటా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు -
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!
సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్ నరాలు మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్ సిస్టమ్ ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్లెస్ ఇంప్లాట్ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్ పల్స్తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్లెస్గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఇది కస్టమ్ డిజైన్ హెడ్కేర్ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన హై రిజల్యుషన్ ఇమేజ్లు విజన్ ప్రాసెసర్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్లెస్గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్ అనే పరికరానికి రిసీవ్ అవుతాయి. అవి విజువల్ కార్టెక్స్లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్ని అందించడం విశేషం . (చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
కళ్లు లేకున్నాక్యాన్సర్ చూపుతారు
‘చూపున్నా చూడలేని అంధుల కంటే....అంధులు బాగా చూడగలరు’ అంటుంది పెర్షియన్ సామెత. కంటిచూపు బాగున్నా వాస్తవాలు చూడలేని వారిపై ఈ సామెత ఒక చురక అనుకున్నప్పటికీ.... చూపులేని మహిళలు వైద్యరంగంలో కొత్త కాంతితో వెలుగుతున్నారు. తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’తో ఎర్లీ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తిçస్తూ ఎంతోమంది మహిళలు ప్రమాదం బారిన పడకుండా చూస్తున్నారు...మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ్రపారంభ సంకేతాలను గుర్తించడంలో చూపులేని అయేషా వైద్యులకు సహాయపడుతుంది. ఈ పరీక్షల కోసం తన చేతి వేళ్లను ఉపయోగిస్తుంది. ‘మా చేతి వేళ్లలోని అధిక స్పర్శ జ్ఞానం వక్షోజాలలోని చిన్న లంప్స్ను కనిపెట్టడంలో సహాయపడుతుంది. ఈ వృత్తి నాలాంటి చూపులేని మహిళలకు బాగా సరిపోతుంది’ అంటుంది అయేషా.బెంగళూరులోని ‘సైట్కేర్’ హాస్పిటల్లో పనిచేస్తుంది అయేషా. రోజుకు తొమ్మిది పరీక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి అరగంట సమయం తీసుకుంటుంది.‘కంటిచూపు లేని అయేషాలాంటి యువతులు ఎర్లీ స్టేజిలో బ్రెస్ట్ క్యాన్సర్ను డిటెక్ట్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు’ అంటున్నాడు ‘సైట్కేర్’ హాస్పిటల్స్ కో–ఫౌండర్, సీయివొ సురేష్ రాము. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన అయేషా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయేషా తన నెల జీతంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. (మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...)అయేషాలాగే కోలార్కు చెందిన 29 సంవత్సరాల నూరున్నీసా చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. తన ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా ఎంతోమంది మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంటుంది.బెంగళూరులోని ‘జ్యోతి నివాస్ కాలేజీ’లో డిగ్రీ చేసిన నూరున్నీసాకు ఉద్యోగం దొరకడం కష్టం అయింది. ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా తనకు ఉపాధి దొరకడమే కాదు గుర్తింపు కూడా లభించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ‘గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు చూపులేని వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది నూరున్నీసా.అయేషా, నూరున్నీసా...ఈ ఇద్దరిలో ఎవరికీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు.బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కలిగించడానికి, టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించడానికి అయేషా, నూరున్నీసాలు దేశంలోని ఎన్నో ్రపాంతాలు తిరిగారు. టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు అనేవి చూపు లేని మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షలను నిర్వహించేవారిని మెడికల్ టక్ట్యల్ ఎగ్జామినర్స్(ఎంఐటీ)లుగా వ్యవహరిస్తారు. ‘ఎంఐటీ’లుగా ఎంతో మంది చూపు లేని మహిళలు ఉపాధి పొందడమే కాదు తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను ఎర్లీ స్టేజీలో గుర్తిస్తున్నారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)డిస్కవరింగ్ హ్యాండ్స్దిల్లీకి చెందిన ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ టక్ట్యల్ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి చూపు లేని మహిళల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థ బెంగళూరులో కూడా శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళల్లో అయేషా, నూరున్నీసా ఉన్నారు. ‘మొదట్లో వైద్యానికి సంబంధించిన పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది’ అంటుంది లీనా మెహతా. పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె చూపు కోల్పోయింది. అయితే ట్రైనర్స్ ఒకటికి పదిసార్లు అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. త్రీడీ మోడల్స్తో శరీర పనితీరును సులభంగా అర్థం చేయించేవారు. -
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
Akshita Sachdeva: ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు..
మనం ఏ బాట ఎంచుకోవాలో అనేది విధి నిర్ణయిస్తుందో లేదోగానీ పరిస్థితులు మాత్రం నిర్ణయిస్తాయి. డాక్టర్ కావాలనుకున్న అక్షితా సచ్దేవా పరిస్థితుల ప్రభావం వల్ల పరిశోధన రంగంలోకి వచ్చింది. ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది అంధులతో మాట్లాడింది. వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుక్కోవాలనుకుంది. బెంగళూరు కేంద్రంగా ఆమెప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అంధులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ల్యాబ్స్ నుంచి వచ్చిన ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు....అక్షితా సచ్దేవా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. అయితే కాలేజీ రోజుల్లో ఒక లెక్చరర్తో మాట్లాడిన తరువాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘డాక్టర్ కావాలి’ అనే తన లక్ష్యం గురించి చెప్పినప్పుడు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత, దాని ప్రాధాన్యతతో పాటు హెల్త్కేర్ రంగంలోని ఎన్నో ఆవిష్కరణల గురించి చెప్పారు ఆ లెక్చరర్.‘నా కళ్లు తెరిపించిన సందర్భం అది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంటుంది అక్షిత. ఆ రోజు నుంచి హెల్త్కేర్ రంగానికి సంబంధించిన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. ఫరీదాబాద్లోని మానవ్ రచన కాలేజ్లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక గ్లోవ్ను రూపొందించింది అక్షితా సచ్దేవా. చూపుడు వేలిపై కెమెరా ఉండే ఈ హ్యాండ్గ్లోవ్ సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు చదవవచ్చు.ఈ గ్లోవ్ గురించి న్యూ దిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్ఏబీ)కి వివరించింది అక్షిత. దృష్టి లోపం ఉన్న ఒక యువకుడు ఈ గ్లోవ్ను ఉపయోగించి న్యూస్పేపర్ చదవగలిగాడు. ఈ విజయం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలను పెంచింది. అంధులకు జీవనోపాధి, విద్య, దైనందిన జీవన విషయాల్లో సహాయపడడానికి తన ఆవిష్కరణను ముందుకు తీసుకువెళ్లాలనుకుంది.అంధులు ఎదుర్కొనే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంది. బ్యాంకర్లు, పీహెచ్డీ స్కాలర్లు, గృహిణులు... వివిధ విభాగాలకు చెందిన అంధులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుంది. ఆ సమయంలోనే దీపాలి పవార్ అనే స్టూడెంట్తో మాట్లాడింది.కాలేజీలో ఒక సెమిస్టర్ పూర్తి చేసిన దీపాలి హటాత్తుగా చూపు కోల్పోయింది. ఆమెను తిరిగి తీసుకోవడానికి కాలేజి వారు నిరాకరించారు. బ్రెయిలీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. బ్రెయిలీ నేర్చుకోవడానికి దీపాలి రెండేళ్లు గడిపింది. అయితే అది ఆమెకు కష్టంగా ఉండేది. బ్రెయిలీ నేర్చుకున్న తరువాత కూడా ఆమెకు కాలేజీలో చదివే అవకాశం రాలేదు. యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీలో చేరడమే దీపాలి ముందు ఉన్న ఏకైక మార్గం అయింది.ఆడియో–రికార్డెడ్ పుస్తకాలను అందించే ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది దీపాలి. అయితే ఒక్కొక్క పుస్తకం కోసం నాలుగు నుంచి ఆరువారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆమె దగ్గర మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకాలను తీసుకువెళ్లిన అక్షిత వాటిని మొబైల్ అప్లికేషన్ ఫామ్లోకి మార్చి దీపాలికి ఇచ్చింది.మూడు నెలల తరువాత..దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. ‘సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను సింగిల్ అటెంప్ట్లో పూర్తి చేశాను’ అని సంతోషంగా చెప్పింది. ఇది అక్షితకు మరో విజయం. మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన విజయం. ఈ ఉత్సాహ బలమే బోనీదేవ్తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీప్రారంభించేలా చేసింది.నాసిక్లోని ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్’లో పెద్దయంత్రాన్ని చూసింది అక్షిత. అయితే అది పెద్దగా ఉపయోగంలో లేదు. ఈ మెషిన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ను చదవగలుగుతుంది. అయితే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. అప్పుడే అక్షితకు ఎన్నో భారతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలను చదవగలిగే యంత్రాన్ని రూపొందించాలనే ఐడియా తట్టింది.అది ‘కిబో’ రూపంలో సాకారం అయింది. ఈ పరికరం విజయం సాధించడంతో నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్, ఐఐఎం–అహ్మదాబాద్... మొదలైన సంస్థల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘భారతీయ భాషలపై దృష్టి కేంద్రీకరించిన తొలి అసిస్టివ్ టెక్ టూల్ కిబో’ అంటుంది అక్షిత.మరింతగా..అంధులకు ఉపకరించే దిశగా ఆసియా, ఆఫ్రికాలలో మా సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ‘కిబో’కు మరిన్ని భాషలను జోడించాలనుకొంటున్నాము. ఏఐ సాంకేతికతతో సెల్ఫ్–లెర్నింగ్, సెల్ఫ్–ట్రైనింగ్ మాడ్యూల్స్కు రూపకల్పన చేస్తాం. – అక్షితా సచ్దేవా, కో–ఫౌండర్, ట్రెస్టిల్ ల్యాబ్స్కిబో ఇలా..‘కిబో’ వాటర్ బాటిల్ ఆకారంతో ఉంటుంది. దీని ఎడమవైపు ఉన్న బటన్ను నొక్కితే టేబుల్ ల్యాంప్ ఆకారంలోకి మారుతుంది. యూఎస్బీ కేబుల్ దీన్ని ల్యాప్టాప్కు కనెక్ట్ చేస్తుంది. పుస్తక పాఠాన్ని ‘కిటో’ సంగ్రహిస్తుంది.అరవై భాషలలో ఏ భాషలలోనైనా అనువాదం అడగవచ్చు. వ్యక్తులు, సంస్థల కోసం విడిగా నాలుగు ‘కిబో’ప్రాడక్ట్స్ను రూపొందించారు. ‘కిబో ఎక్స్ఎస్’ను స్కూలు, కాలేజీలలోని లైబ్రరీల కోసం అందుబాటులో ఉంచారు. ‘కిబో 360’ని వ్యాపారసంస్థలు, యూనివర్శిటీలు, ప్రచురణ సంస్థల కోసం రూపొందించారు. -
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్కు వెళ్లి వారి ఆన్సర్స్ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్) తన భర్త రాజ్కుమార్ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు. కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్మాస్టర్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు. అసలేం జరిగింది? ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్ హెడ్మాస్టర్. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్/చైల్డ్ కేర్ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్ కాగానే వారి కి ఫోన్ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్ పే/గూగుల్ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్మాస్టర్కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం.. ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్ తీసుకున్నారని తిరుమల–రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్.. తిమ్మాపూర్లో ఓ టీచర్ 2022 సెప్టెంబర్లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్ జీతం డిసెంబర్లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్మాస్టర్ సదరు టీచర్ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్ హెచ్ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విదేశాలకు వెళ్లిన టీచర్కు డీఈవో అనుమతి కనికరం లేని పోలీసులు.. పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్మాస్టర్ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇవి చదవండి: ఏఆర్ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన -
‘నీ గొంతు గుర్తు పట్టాను సుమా’.. అంధుడి ముఖంపై చిరునవ్వు
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి.. ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో... విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు.. కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్లో తను.. తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు! కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది.. ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు.. చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు.. నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని! ఇదీ ఓ బంధమే. అపురూపమైంది! ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే.. ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు! View this post on Instagram A post shared by Priya Gamree (@gamreepriya) -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023 -
స్విమ్మింగ్తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
చూపు లేదు కాని క్యాన్సర్ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్స్టాప్గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్స్టాప్గా ఏడవం అనే ఫీట్ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!
పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు. అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్ సులువుగా నడిచేలా.. చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు. ♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
అక్షర జ్యోతులు వెలిగిస్తున్న అంధురాలు
కై కలూరు: చీకట్లో చిరుదివ్వెలా.. నిశీధిలో కాంతి పుంజంలా.. అసమాన ప్రతిభతో ఆదర్శంగా నిలుస్తున్నారు అంధురాలు బొల్లా జోత్స్న ఫణిజా. విద్య, సంగీతం, రచన, వచన, గానం, అనువాదం, బోధన ఇలా పలు రంగాల్లో రాణిస్తూ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతున్నారు. ఆమె గాత్రం ఓ మధురస్వరం.. కంప్యూటర్ కోబోర్డు ఆమె క్లోజ్ ఫ్రెండ్.. మనోనేత్రంతో అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆమె కవిత చేరడం గర్వించదగిన విషయం. ఆంగ్ల సాహిత్యంలో రాణిస్తూ.. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి కుమార్తె జ్యోత్స్న ఫణిజా పుట్టుకతో అంధురాలు. అయినా తల్లిదండ్రులు ఏమాత్రం కుంగిపోలేదు. చిన్నతనం నుంచి ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహించారు. జ్యోత్స్న ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం అంధుల పాఠశాల, ఇంటర్ కై కలూరు, డిగ్రీ విజయవాడలో పూర్తిచేశారు. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో ఎంఏ ఆంగ్ల సాహిత్యం, ఇదే అంశంలో పీహెచ్డీ డాక్టరేట్, అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు, ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా ఇలా చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఫెయిర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్షిప్తో పాటు మిస్ కాలేజీ రన్నరప్గానూ ఆమె నిలిచారు. సంగీతం.. ఆమె ప్రాణం జ్యోత్స్న ఫణిజా కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యం పొందారు. కువైట్ తెలుగు కళాసమితి నిర్వహించిన సంగీత స్వరనీరాజనంలో సత్తాచాటారు. ‘సాక్షి టీవీ’ నిర్వహించిన ‘కచేరి’ సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపారు. అలాగే పలు టీవీ చానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ప్రతిభ చాటారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘ఆలపాన’ కార్యక్రమంలో పలు గీతాలు ఆలపించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి వేదికలపై సంగీత కచేరీలు ఇచ్చారు. కవితల్లో ఘనాపాటి ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ఆనర్స్ మూడో సంవత్సర సిలబస్లో జ్యోత్స్న రాసిన ‘సీ’ కవితను పాఠ్యాంశంగా చేర్చారు. ఇప్పటివరకూ ఆమె 120 వరకు కవితలు రాశారు. అమెరికా, లండన్, మలేషి యా, కెనడా, ఇంగ్లిష్ మేగజైన్లలో ఆమె ప్రచురితమయ్యాయి. ప్రముఖ కవి మోపూరు పెంచుల నరసింహం తెలుగులో రచించిన రెండు కవితా సంపుటాలను క్రింసన్ లేంప్, స్టోండ్ సాంగ్ పేరుతో ఆమె అనువదించారు. ఆమె రాసిన ‘నేడు కురిసినవాన’ కవితకు నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) కవితా పురస్కారం దక్కింది. పెన్నా రచయిత సంఘం ఉగాది పురస్కారం, సత్యశ్రీ సాహితీ పురస్కారం, రాధేయ ఉత్తమ పురస్కారం, పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం వంటివి ఆమె అందుకున్నారు. 25 ఏళ్లకే పీహెచ్డీ : ఫారెన్ లాంగ్వేజెస్ అంశంపై 25 ఏళ్లకే ఆమె పీహెచ్డీ సాధించి 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఆమె రాసిన సిరామిక్ ఈవ్నింగ్ పుస్తకాన్ని చదివిన ప్రధాని మోదీ అభినందన లేఖను పంపారు. వరల్డ్ ఐ రైట్ ఇన్ పుస్తకానికి ఎడిటర్గా ఆమె కూడా పనిచేశారు. 2009లో దగ్గర బంధువు రాధాకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు హరిచందన్ ఆదిత్య చిన్నతనం నుంచే కవితా రచనలో ఆసక్తి చూపుతున్నాడు. అతడు రాసిన జాస్మిన్ బడ్స్ అనే కవిత డిఫరెంట్ ట్రూట్స్ అనే మేగజైన్లో ప్రచురితమయ్యింది. అవార్డుల పరంపర : ఆమె వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో 100 వరకు బహుమతులు సాధించారు. రెటీనా ఇండియా అవార్డు, బాలా మెమోరియల్ అ వార్డు, సంఘ మిత్ర అసోసియేన్ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ అవార్డు, స్వరం ఓ వరం సంగీత సన్మానం, ఏలూరు వెల్ఫేర్ సొసైటీ మహిళా దినోత్సవ సన్మానం, సరిగమ సంగీత పరిషత్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతిభా పురస్కారం, ధీరూబాయ్ అంబానీ స్కాలర్షిప్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రతిభ పురస్కారం పొందారు. ఆత్మరాం సనాతన్ ధర్మా కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 2015లో అసిస్టెంట్ ప్రొ ఫెసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ సెట్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. విద్యార్థులకు మాతృభాషలో సాహితీ విలువలను నేర్పించాలి. సమాజంలో మహిళలపై వివక్ష చూపరాదు. మనం సంపాదించిన డబ్బుతో ఒకరి ఆకలి తీర్చండి, తెలిసిన విద్యను నేర్పించి ఉపాధి మార్గం చూపండి. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చు. ప్రతిఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలి. – జ్యోత్స్న ఫణిజా, సాహితీవేత్త, కై కలూరు -
తానా: అమ్మభాషా సేవలో అంధమేధావుల సభవిజయవంతం
డాలస్, టెక్సాస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెలనెలా తెలుగువెలుగ్ఙు కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “జ్ఞాననేత్రులు తెలుగు దివ్వెలు అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొంటున్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుఅన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంమే ఆయుధాలుగా చేసుకుని జీవనపోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ ఆదర్శమంటూ స్వాగతం పలికారు. ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖముఖ్య కార్యనిర్వహణాధికారిఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు,విశ్రాంతతెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు,ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్),షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా.బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు,నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు. మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులకు, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
హైదరాబాద్: బ్లైండ్ స్కూల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ అంధ విద్యార్థుల స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో.. లక్ష్మి గౌతమ్ శ్రీకర్(12) అనే ఆరో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. ఈ క్రమంలో కిందపడి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
అంధుల స్కూల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది దుర్మరణం
కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్మాస్టర్ ప్రాన్సిస్ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఇదీ చదవండి: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి -
ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం
పెద్దపప్పూరు: ఆస్తి కోసం అంధురాలిపై సొంత తమ్ముడి భార్యే హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పెద్దక్క, నాగార్జున అక్కాతమ్ముడు. పెద్దక్కకు కళ్లు కనిపించవు. ఆమె ఆస్తిపై కన్నేసిన తమ్ముడు నాగార్జున, అతని భార్య స్వాతి.. సోమవారం ఉదయం పెద్దక్కను గ్రామ శివారులోని అక్కమ్మ గుడి వద్దకు పిలుచుకెళ్లారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఆ సమయంలో పెద్దక్కతో నాగార్జున గొడవపడ్డాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పెద్ద బండరాయిని స్వాతి తీసుకుని పెద్దక్క తలపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నాగార్జున, స్వాతి పారిపోయారు. తలకు తీవ్రగాయమైన పెద్దక్కను స్థానికులు వెంటనే తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పెద్దక్క తండ్రికి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంధురాలైన పెద్దక్కకు పెళ్లి కాలేదు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమార్తెలతో పాటు కుమారుడికీ తండ్రి భాగ పరిష్కారాలు చేసిచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్న పెద్దక్క ఆస్తిని ఎలాగైనా తమ పేరున రాయించుకోవాలని నాగార్జున భార్య స్వాతి ప్రయత్నించి విఫలం కావడంతో హతమార్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా: సీఐ మధు) -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి) -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్లో ఫిక్సయితే.. బ్లైండ్గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్గా రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్గా సోనమ్కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్లాంటి పాత్రలతో బాక్సాఫీస్పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్ఫోన్తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు అంధులు, బధి రుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 462 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థి వయసు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 3 జతచేసి దరఖాస్తులు పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్నివేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పి స్తారన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయన్నారు. ఖాళీలు ఇలా.. ► విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 43 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 83175–48039, 94403–59775 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ► విశాఖపట్నం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 54 ఖాళీలు ఉన్నాయి. బాలికలకు మాత్రమే. వివరాలకు ఫోన్ 94949–14959, 90144–56753 నంబర్లలో సంప్రదించాలి. ► హిందూపురం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 106 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 77022–27917, 77805–24716 నంబర్లలో సంప్రదించవచ్చు. ► విజయనగరం బధిరుల పాఠశాలలో 1నుం చి 8వ తరగతి వరకు 20 ఖాళీలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఫోన్ 90000–13640, 99638–09120 నంబర్లలో సంప్రదించాలి. ► బాపట్ల బధిరుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 78 ఖాళీలు ఉన్నాయి. ఫోన్ 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. ► ఒంగోలు బధిర పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 136 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 94404–37629, 70132–68255 నంబర్లలో సంప్రదించవచ్చు. ► బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్.. కళ్లులేనివారిపై కర్కశం
చెన్నై: మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం చేశాడు. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైడ్ వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన చైన్నైలో శనివారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ పోలీసు కానిస్టేబుల్.. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైండ్ వ్యక్తుల వాకింగ్ స్టిక్స్ను విరిచి అనంతరం వారిపై చేయి చేసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల అరుపులతో ఘటనాస్థలంలోని స్థానికులు ఆ కానిస్టేబుల్ను పట్టుకొని ట్రిప్లికేన్ పోలీసులకు అప్పగించారు. సదరు పోలీసు కానిస్టేబుల్ను జీ.దినేశ్కుమార్గా ట్రిప్లికేన్ పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే దినేష్ కుమార్ తాజాగా మెడికల్ లీవ్ పూర్తి చేసుకొని శనివారమే విధుల్లోకి చేరాడని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు కూడా సదరు కానిస్టేబుల్ పోలీసు యూనీఫామ్లో లేడని.. సివిల్ డ్రెస్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై అగరుబత్తులు అమ్ముకునే బ్లైండ్ వ్యక్తులపై పోలీసు కానీస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!
ఉక్రెయిన్లో రష్యా విధ్వసం కొనసాగుతోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్లో ప్రధాన నగరాలైన కీవ్, మరియూపోల్పై రష్యా సైన్యం విరుచుపడుతోంది. అయితే ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని కోరదనే విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే దానికి బదులుగా ఉక్రెయిన్ భద్రత దృష్యా రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, తమ దళాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అదే విధంగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మరియూపోల్లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ని ఓ పాఠశాలపై బాంబులతో దాడికి తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. కాగా కాగా సగటు ఉక్రేనియన్లు తమ భాష తప్ప మరోటి మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇంగ్లిష్ అర్థం చేసుకుంటారు. మాట్లాడే వారైతే మరీ తక్కువ. స్థానికులకు కూడా చాలావరకు అటు ఇంగ్లిష్, వీరి భాష రావు. దాంతో పరాయి దేశాల్లో వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే కనీసం బస్టేషన్, రైల్వే స్టేషన్ పేర్లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లిష్, ఉక్రేనియన్ తెలిసిన విద్యార్ధులు, మేధావులు శిబిరాలకు వెళ్లి సాయం చేస్తున్నారు. బుడాపెస్ట్లో వాలంటీర్గా పని చేసేందుకు ముందుకొచ్చిన అంధుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘‘శరణార్థుల్లో చాలామందికి మా భాష రాదు. వారికి అనువాదకునిగా సాయం చేస్తున్నా. నాకు 7 భాషలొచ్చు. వారికి ఏ భాషలో కావాలన్నా సాయం చేస్తా. చాలామందికి ఎటు పోవాలో కూడా తెలియదు. వారిని ఎన్జీవో శిబిరాలకు పంపుతున్నా. అంతా వదిలేసి కట్టుబట్టలతో, పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భరోసా ఇవ్వడమే మనం చేసే గొప్ప సాయం!’’ అన్నాడతను. -
ఆ అటెండర్ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్
సాక్షి,కర్నూలు (ఓల్డ్సిటీ): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. పుట్టుకతోనే అంధుడు. కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఇతను విధుల నిర్వహణలో పర్ఫెక్ట్ అండ్ షార్ప్. కొన్ని సందర్భాల్లో కళ్లున్న అటెండర్లు ఫైల్ ఎక్కడ పెట్టారో మర్చిపోవచ్చు కానీ మధు మాత్రం మరచిపోడు. మధు డ్యూటీలో ఉన్నాడంటే పైఅధికారులు అడిగిన తక్షణం ఫైల్ టేబుల్పై ఉంటుంది. కార్యాలయం ఉద్యోగులు ఎవరు ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో అతని టేబుల్ మీదకు చేరుస్తాడు. కళ్లు కనబడని వ్యక్తి విధులు ఎలా నిర్వర్తిస్తారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. కళ్లు కనిపించని వారికి మనోనేత్రం ఉంటుందనడానికి మధుయే సమాధానం. ఏది ఏమైనా సకలాంగులు చేయలేని పని మధు చేస్తున్నందున అతనికి పలువురు హాట్సాప్ చెబుతుండటం విశేషం. చదవండి: ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు -
రూ.5.5 కోట్ల కిడ్నాప్ కేసు.. ప్రత్యక్ష సాక్షిగా అంధుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసుల పని తీరుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మీలాంటి అధికారులుంటే.. మా జీవితాలు బాగుపడ్డట్లే అని విమర్శిస్తున్నారు. పోలీసులపై ఇంత భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణం ఏంటంటే ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై జనాలతో పాటు.. విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాలు... (చదవండి: రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు) కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్యామ్నగర్కు చెందిన మాంసం వ్యాపారి హాజీ ఆస్ మహ్మద్ అనే వ్యక్తిని అతడి బంధువులు హాజీ అన్సార్, అన్వర్లు మోసం చేశారు. మాంసం వ్యాపారం సాకుతో అతడి వద్ద నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు కానీ పని చేయలేదు. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా హాజీ నిందితులను కోరాడు. వారు అంగీకరించకపోగా.. అతడిపై దాడి చేసి.. కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దాంతో హాజీ ఆస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల మీద దాడి, కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ కేసులో ఓ అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. అతడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎలా.. అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొని.. తమకు కళ్లు లేవని పోలీసులు నిరూపించుకున్నారు అని దుయ్యబట్టారు. వివాదం కాస్త పెద్దది కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. -
Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!
కష్టాలు అందరికీ వస్తాయి! ఐతే అవి కొందరిని ఉతికి ఆరేస్తాయి. మరికొందరేమో వాటినే ఉతకడంలో రాటుతేలిపోతారు. ఇటువంటి వాళ్లకి ఓడిపోవడం అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఈ రెండో కోవకి చెందినవాడు. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన ఇటువంటి వారిముందు విధి సైతం తలవంచవల్సిందే! తాజాగా చూపుకోల్పోయిన వృద్ధుడి జీవనపోరాటానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తం క్లిప్ చూస్తే అతని అంకిత భావం అవగతమౌతుంది. విధి నిర్థాక్షిణ్యంగా చూపుకోల్పోయేలా చేసినప్పటికీ ప్రతిరోజూ తను చేసే పనిని మాత్రం ఆపకుండా చేసుకుపోతున్నాడండీ! దీనిని చూసిన నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. అసలీ వీడియోలో ఏముందంటే.. నాసిక్లోని మఖ్మలబాద్ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్లో వేస్తాడు. తర్వాత హెల్పర్ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్స్కర్ స్కేమణి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఓల్డ్మాన్కి మర్యాద ఇవ్వండి. నాసిక్లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్ కొనమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్ను ఈ పోస్టుకు జోడించాడు. ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్ పవర్ ప్లాంట్లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 12 లక్షల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి స్థితిని చూసి చలించిపోతున్నారు. అతని హార్డ్ వర్క్ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా చూడండి!! చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. View this post on Instagram A post shared by Sanskar Khemani 🐒 (@sanskarkhemani) -
జీవితంలో ఇదో గొప్ప గౌరవం
-
మార్బర్గ్; అంధుల స్వర్గధామం.. నగరమంతా ‘ప్రత్యేక’మే..
మార్బర్గ్.. జర్మనీలోని ఓ అద్భుత నగరం. కళ్లను కట్టిపడేసే ప్రాచీన భవంతులు, చుట్టూ పచ్చని పర్వతాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దీని సొంతం. జర్మనీలోని సుందర నగరాల్లో ఇది ఒకటి. వీటన్నింటిని మించిన ప్రత్యేకత మార్బర్గ్కు ఉంది. అంధుల సంక్షేమ నగరంగా దీనికి పేరుంది. వారు అత్యున్నత శిఖరాలను అందుకునేలా ముందుకు నడిపించే నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: లియోన్ పోర్జ్కు పుట్టుకతో వచ్చిన అనారోగ్యం వల్ల 8 ఏళ్ల వయసులో క్రమంగా కంటిచూపు మందగించింది. సైన్స్ సంబంధిత విషయాల మీద లియోన్ పోర్జ్కు అమితాసక్తి ఉండేది. అదే సమయంలో మార్బర్గ్ నగరం గురించి.. అంధుల కోసం అక్కడ ఉన్న విద్యా సంస్థల గురించి పోర్జ్ తెలుసుకున్నాడు. వెంటనే సెంట్రల్ జర్మనీలోని తన స్వస్థలం నుంచి సమీపంలోని మార్బర్గ్కు మారిపోయాడు. ఇలాంటి వారు అనేక మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతిభా పాటవాలు చాటుతున్నారు. నగరమంతా ‘ప్రత్యేక’మే.. అంధుల విద్యోన్నతి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ‘బ్లిస్టా’ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థ ఎంతో మంది అంధ విద్యార్థుల జీవితాలను మార్చేసింది. దీనిని స్థాపించినప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు అనేకఆవిష్కరణలు చేశారు. టాక్టైల్ అనే మ్యాథమెటికల్ ఫాంట్ను కూడా కనుగొన్నారు. కాలక్రమేణా మార్బర్గ్.. ఓ ఆదర్శ నగరంగా మారింది. ఇక్కడ బ్లిస్టాతో పాటు అంధుల కోసం మరికొన్ని విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. వారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎలాంటి భయాలు లేకుండా తిరిగేలా మార్పులు తీసుకొచ్చారు. వారిని అప్రమత్తం చేసే బీపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రత్యేక రహదారులు, అవసరమైన చోట్ల వాటిపై కాస్త ఎత్తయిన సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. చదవండి: వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా? అలాగే మార్బర్గ్ను సందర్శించేందుకు వచ్చే పాక్షిక అంధుల కోసం ఎక్కడికక్కడ నగర ల్యాండ్మార్క్స్ను తెలియజేసే చిన్న చిన్న రూపాలను ఉంచారు. వీటి సాయంతో వారు సులభంగా తాము వెళ్లాలనుకొన్న ప్రదేశానికి వెళ్లొచ్చు. అంధుల కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్, ఫుట్బాల్, రోయింగ్, క్లైంబింగ్ క్లబ్లున్నాయి. తరచూ వారికి పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. అలాగే బస్ స్టాప్లను కూడా వీరికి తగిన సమాచారమిచ్చేలా రూపొందించారు. వీరితో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తరచూ డ్రైవర్లు, రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల మెనూ కూడా బ్రెయిలీ లిపిలో ఉంటుంది. బయోకెమెస్ట్రీతో రికార్డుల్లోకి.. బ్లిస్టాతో పాటు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునే వారు భారీ పుస్తకాలతో ఇబ్బంది పడకుండా.. ప్రత్యేక స్క్రీన్ రీడర్స్ అందుబాటులో ఉంటాయి. లియోన్ పోర్జ్ ప్రస్తుతమిక్కడ కంప్యూటర్ సైన్స్, బయోకెమిస్ట్రీ చదువుతున్నాడు. మొత్తం జర్మనీలోనే చాలా తక్కువ మంది ఎంచుకొనే ‘బయోకెమిస్ట్రీ’ చదువుతున్న మొట్టమొదటి అంధ విద్యారి్థగా పోర్జ్ రికార్డుల్లోకి ఎక్కాడు. సాధారణ మనుషులే ఇందులో ఉండే చిత్రాలు, ల్యాబ్ ప్రయోగాలు నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ దీనికి కూడా మార్బర్గ్లోని విద్యా సంస్థలు ప్రత్యామ్నాయాలను కనుగొన్నాయి. అంధ విద్యార్థులు వీలైనంత సులభంగా చదువుకునేలా ఇక్కడి అధ్యాపకులు ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలు కనుగొంటూ, విద్యార్థులతోనే విభిన్న ఆవిష్కరణలు చేయిస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా వీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చదువులో ముందుకు దూసుకువెళ్తున్నారు. చదవండి: వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి -
'ఐకాన్' స్టార్ ప్రయోగం : అంధుడిగా అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప షూటింగ్ అనంతరం అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవట. అంధుడి పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఐకాన్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. గతంలో మాస్ మహారాజా రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడి పాత్రలో నటించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి బన్నీ చేయనున్న ఈ ప్రయోగంలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది. చదవండి : పది కేజీఎఫ్లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు -
40 ఏళ్ల తర్వాత కంటిచూపు.. అవుంటేనే చూడగలడు!
లండన్ : కొత్త పుంతలు తొక్కుతున్న సైన్స్ పరిజ్ఞానంతో అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలు సుసాధ్యాలుగా మారాయి. మారుతూనే ఉన్నాయి. మనిషి ధీర్ఘకాలిక శారీరక లోపాలకు సైతం సైన్స్ చక్కటి పరిష్కారాలను అందిస్తోంది. సైన్సు పుణ్యమా అని తాజాగా ఓ 58 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల తర్వాత లోకాన్ని చూడగలుగుతున్నాడు. వివరాలు.. ఇంగ్లాండ్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దాదాపు నలభై ఏళ్లుగా ‘రెటినిటిస్ పిగ్మంటోస’ అనే కంటి సంబంధ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా కంటి వెనకాల ఉండే రెటీనా దెబ్బతినటంతో రెండు కళ్లూ కనిపించటం లేదు. కొద్దిరోజుల క్రితం పరిశోధకులు అతడికి ‘జెనరిక్ ఇంజనీరింగ్ అండ్ లైట్ యాక్టివేటెడ్ థెరపీ’ నిర్వహించారు. దీంతో కొన్ని నెలల వైద్యం తర్వాత ఓ కన్ను పాక్షికంగా కనిపించటం మొదలైంది. ఇప్పుడు ‘లైట్ స్టిములేటింగ్’ కంటి అద్దాల సహాయంతో వస్తువులను చూస్తున్నాడు.. వాటిని ముట్టుకోగలుగుతున్నాడు. అతడికి కంటి చూపు రప్పించటానికి పరిశోధకుల బృందం తీవ్రంగా శ్రమించింది. ‘ఆప్తోజెనిటిక్స్’ అనే పక్రియను వారు ఉపయోగించారు. జెన్యుపరంగా రెటీనాలోని కణాల్లో మార్పులు చేసి, లైట్ సెన్సిటివ్ ప్రొటీన్స్ను ఉత్పత్తి చేశారు. ఈ ప్రయోగం ఫలితాన్నిచ్చి ఓ కంటిలో మార్పు చోటుచేసుకుంది. అనంతరం, ఓ ప్రత్యేకమైన కంటి అద్దాలను తయారుచేశారు. ఈ అద్దాలు అన్నింటినీ ఫొటో తీసి రెటీనాకు చేరవేస్తాయి. దీంతో ఆ వస్తువులు కనపడతాయి. జన్యుపరంగా మార్పులు చేయబడిన కణాలు మామూలు స్థితికి రావటానికి సదరు వ్యక్తికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చారు. కొన్ని నెలల శిక్షణ తర్వాత పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. చదవండి : ఒక్కసారిగా మీదకు దూకిన శివంగి.. పరుగులు తీసిన జనం -
సోనూసూద్.. హైదరాబాద్లో కలుద్దామన్నారు: నాగలక్ష్మి
ఆమె ముఖంలోని రెండు కళ్లు సరిగా చూడలేవు.. ఆమె మనో నేత్రం ప్రపంచాన్ని చూడగలదు.. సాటివారి ఇబ్బందులను తెలుసుకోగలదు.. వారికి చేతనైన సహాయం చేయించగలదు.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా చూసింది. తన ఐదు మాసాల పెన్షన్ను విరాళం ఇచ్చేలా ప్రోత్సహించింది. ‘‘కళ్లు లేకపోతేనేం, నా మనసుతో ప్రపంచాన్ని చూస్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నాను. గెలుపు సాధించి, అందరికీ స్ఫూర్తిగా ఉండాలనే తపనతో ఉన్నాను. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలి’’ అంటారు కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల నాలుగో సంతానం నాగలక్ష్మి. పుట్టుకతోనే అంధురాలు. ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడి కన్ను కేవలం ఐదు శాతం మాత్రమే కనిపిస్తుంది. అది కూడా వస్తువును చాలా దగ్గరగా పెట్టుకుంటేనే కనిపిస్తుంది.‘‘మా నాన్న కృష్ణారెడ్డి చిన్న రైతు. మాది అతి సాధారణమైన కుటుంబం. మమ్మలి కష్టపడి పెంచి పెద్ద చేశారు’’ అంటున్న నాగలక్ష్మికి చిన్నతనం నుంచి చిన్న అన్నయ్య ఆదిరెడ్డితో అనుబంధం ఎక్కువ. ఆ అన్నయ్య ప్రోత్సాహంతో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు నాగలక్ష్మి. ఏడు సంవత్సరాల క్రితం నాగలక్ష్మి తల్లి కాలం చేశారు. దానితో చిన్న అన్నయ్యకు నాగలక్ష్మి బాధ్యత రెట్టింపయింది. ఆమెను జాగ్రత్తగా, కన్నబిడ్డలా చూసుకోవటం ప్రారంభించారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు చూసిన నాగలక్ష్మికి, ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే, తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేయటం అలవాటు. ఇది ఆమెకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. చిన్న అన్నయ్య ఆదిరెడ్డికి ఎం.ఎస్సి. చదివిన కవితతో వివాహం నిశ్చయమైనప్పుడు, ‘మనతో పాటు అంధురాలైన నా చెల్లెలు కూడా ఉంటుంది’ అని చెప్పారట. అందుకు కవిత అంగీకరించారట. అలా వదినతో నాగలక్ష్మికి అనుబంధం ఏర్పడింది. ఇంట్లో ఏ పనీ లేకుండా ఉండటం నాగలక్ష్మికి నచ్చలేదు. కాని ఏదైనా పని చేయాలంటే చేయలేని పరిస్థితి. ‘‘మా వదినతో కలిసి ఆరు నెలల క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. కుటుంబ బంధాలు, ఇంటి పనులు–వంటపనుల్లో మహిళలు పాటించవలసిన మెళకువలు, పిల్లల పెంపకం... ఇలా పలు అంశాలపై వీడియోలు చేయడం మొదలు పెట్టాం. కేవలం ఆరు నెలల్లో 1.75 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ చేరారు. కోటీ యాభై లక్షల మంది మా యూ ట్యూబ్ ఛానల్ను వీక్షించారు. నాకు, వదినకు ఎంతో సంబరంగా అనిపించింది’’ అంటారు నాగలక్ష్మి. ఇటీవలే అంటే సెకండ్ వేవ్లో నాగలక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెను ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టారు. ‘‘గదిలో ఒంటరిగా ఉండటం వల్ల బోర్గా అనిపించేది. కంటికి దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాను. అలా గమనిస్తూండగా, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా భాధితుల కోసం చేస్తున్న సహాయాలకు సంబంధించిన అంశాలను గమనించాను. నాకు ప్రభుత్వం ప్రతినెల మూడు వేల రూపాయలు పింఛన్గా అందిస్తోంది. నేను నా ఐదు నెలల పింఛన్ను దాచిపెట్టాను. అలా దాచిన పదిహేను వేల రూపాయలను సోనూసూద్ ట్రస్ట్కు అందచేశాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పారు నాగలక్ష్మి. నగదు పంపిన మూడు రోజులు తర్వాత సోనూసూద్.. నాగలక్ష్మికి నేరుగా ఫోన్ చేసి, మూడు నిమిషాల పాటు మాట్లాడారు. ‘‘ఆయన హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. ఆయన మాటల్లో ‘యూ ఆర్ రియల్ హీరో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడతాను, హైదరాబాద్లో కలుద్దాం’ అన్న మాటలు మాత్రమే అర్థం అయ్యాయి’’ అంటూ తృప్తిగా తన సంభాషణ ముగించారు నాగలక్ష్మి. – కె.ఎస్, కావలి, సాక్షి నెల్లూరు జిల్లా -
Covid: పసిబిడ్డ మృతి.. ఆస్పత్రిలో అంధ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్ గార్డెన్ నివాసి అయిన శశాంక్ శేఖర్(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో మహిళతో కొన్నేళ్ల క్రితం అతడికి వివాహం జరగింది. ఈ అంధ దంపతులు జీవితంలో వెలుగులా వచ్చాడు క్రిషు. అంధులైనప్పటిక బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. బిడ్డ బోసి నవ్వు వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అయితే వారు సంతోషంగా ఉండటం చూసి విధికి కూడా కన్ను కుట్టింది. మహమ్మారి రూపంలో ఆ కుటుంబాన్ని వెంటాడింది. తొమ్మిది నెలల పసికందు క్రిషు కోవిడ్ సోకి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం పాపం ఆ అంధ తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే వారు కూడా ఆస్పత్రిలో కోవిడ్తో పోరాడుతున్నారు. ఈ కన్నీటి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. 18 రోజుల క్రితం శశాంక్ భార్యకు కోవిడ్ సోకింది. బిడ్డకు పాలిస్తుండటంతో ఆవిడ ద్వారా వైరస్ 9 నెలల పసికందు క్రిషుకు వ్యాపించింది. ఆ తర్వాత శశాంక్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. శశాంక్ పరిస్థితి విషమించడంతో అతడిని తాహీర్పూర్ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. గురు తేఘ్ బహదూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి క్రిషు గురువారం మరణించాడు. చిన్నారి మరణ వార్త ఆ అందతల్లిదండ్రులకు తెలియదు. వారు తమ అనారోగ్యం గురించి కాకుండా బిడ్డకు ఎప్పుడు నయమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక స్థానిక బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేందర్ సింగ్ అలియాస్ షంటి చిన్నారి క్రిషుకి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 2000 మంది కోవిడ్ మృతులకు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు. చదవండి: Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే.. -
నా దృష్టిలో నాగలక్ష్మి అత్యంత ధనవంతురాలు: సోనూసూద్
ముంబై: టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలతో పరిచయమైన సోనూసూద్ లాక్డౌన్ మొదలు నుంచి ప్రజలకు సహాయం చేస్తూ నిజ జీవితంలో హిరోగా మారాడు. సోనూ ముంబైలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ ఎటువంటి సహాయం కావాలన్న తక్షణమే ఆపన్న హస్తం అందించడంలో సోనూ ముందుంటున్నాడు. ఒక్కోసారి ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని కొన్ని పనులను ఆయన క్షణాల్లో చేసి చూపెడుతున్నారు. సేవ చేయాలంటే కావాల్సింది చేయాలనే శ్రద్ధ అని నిరూపిస్తున్న సోనూసూద్ తాజాగా ఒక మహిళను ట్విటర్లో ప్రశంసించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంధురాలైన నాగలక్ష్మి అనే మహిళ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ లభిస్తోంది. ఇటీవల ఆమె తన ఐదు నెలల పెన్షన్ 15 వేల రూపాయలను సోనూసూద్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సోనూసూద్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్కు 15 వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బు ఆమెకు ఐదు నెలల పెన్షన్ అని సోనూసూద్ పేర్కొన్నారు. నా వరకు ఆమె భారతదేశంలోని అత్యంత ధనవంతురాలు. ఒకరి బాధను చూడటానికి మనకి కంటి చూపు అవసరం లేదని ఆమె సందేశం ఇచ్చింది. ఆమె నిజమైన హీరో అని సోనూ పేర్కొన్నాడు. ( చదవండి: రూ. 11 కోట్లకు చేరువలో ‘విరుష్క’ విరాళాల సేకరణ ) Boddu Naga Lakshmi A Blind girl and a youtuber. From a small village Varikuntapadu in andra Pradesh Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months. For me she's the RICHEST Indian. You don't need eyesight to see someone's pain. A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6 — sonu sood (@SonuSood) May 13, 2021 -
ప్రేమ గుడ్డిది కాదు.. మనసులు కలిసిన శుభవేళ!
సాక్షి, ఖమ్మం: కళాకారులైన ఇద్దరు అంధులు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులు, మిత్రులు, పెద్దలు పెళ్లి జరిపి, ఆశీర్వదించారు. మండల పరిధిలోని తాటిపూడి గ్రామానికి చెందిన శ్రీరంగం శేషుకుమారి అంధురాలు. ఆమె తండ్రి వెంకటరమణ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత తల్లి అనురాధ అన్నీ తానై కుమార్తెను పెంచింది. శేషుకుమారి ఓ అంధుల కచేరి బృందంలో గాయనిగా అలరిస్తోంది. అదే బృందంలో ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన అంధుడైన గుత్తా క్రాంతికుమార్తో వాయిద్య కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వరుడి బంధువులు మొదట్లో ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో తాటిపూడి ఎంపీటీసీ అల్లిక కాటంరాజు, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని వారిని ఒప్పించారు. చివరికి ఇరు కుటుంబాల బంధువులు, మిత్రులు, గ్రామస్తుల సమక్షంలో శేషుకుమారి, క్రాంతికుమార్ల వివాహం గురువారం తాటిపూడిలో ఘనంగా జరిగింది. ఎంపీటీసీ అల్లిక కాటంరాజు పెళ్లి, భోజనం ఏర్పాట్లు చేశారు. -
ఆమె కోపం.. రూ.8కోట్లు తెచ్చింది
డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికం కాదు. పేదరికం అనేక రూపాల్లో, స్వరూపాల్లో ఉంటుంది. చదువు లేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఒకరిపై ఆధారపడటం.. ఇవన్నీ పేదరికాలే. శారీరక వైకల్యం కూడా ఒక విధమైన పేదరికమే. దృష్టి, మాట, వినికిడి.. వంటివి లేకపోవడం భౌతిక పేదరికాలు. పేదరికంలో ఉన్నవాళ్లు పోరాటం చేయలేరు. చేసినా వారికి న్యాయం జరిగితే బాగుండన్న ఆశైతే ఉంటుంది తప్ప న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండదు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అనే నానుడి ఇందుకే వచ్చి ఉండాలి. అయితే లీసా ఇర్వింగ్ అనే మహిళ ఈ నానుడిని తుడిచేశారు. ఆమెకు కోపం వచ్చింది కానీ ఆ కోపం ఆమెకు చేటు అవలేదు. తనను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోకుండా నిరాకరించిన ఉబర్ కంపెనీ మీద కోపంతో ఆమె వేసిన కేసులో ఇప్పుడు ఆమెకు రాబోతున్న నష్టపరిహారం 1.1 మిలియన్ డాలర్లు. అంటే 8 కోట్ల రూపాయలు! ఆమె పేదరికం.. కంటి చూపు లేకపోవడం. లీసా అంధురాలు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటారు. ఇంట్లో తనొక్కరే ఉంటారు లీసా. ఆ మాట పూర్తిగా నిజం కాదనాలి. ఆమెతో పాటు ఆమె పెంపుడు శునకం బెర్నీ కూడా ఆమెతో ఉంటుంది. లీసా ఓ ప్రేవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే.. ఆమె అనేకసార్లు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లారు. ఎందుకు అలస్యంగా వెళ్లారు అంటే క్యాబ్లు ఏవీ ఆమెను ఎక్కించుకోలేదు. ఉబర్ క్యాబ్లైతే ఆమెను పద్నాలుగుసార్లు క్యాబ్ ఎక్కించుకోడానికి నిరాకరించాయి. ఆమె అంధురాలు అవడం ఒక కారణం అయితే, ఆమె వెంట బెర్నీ ఉండటం ఇంకొక కారణం. ‘‘కుక్క ఉంటే ఎక్కించుకోం’’ అని క్యాబ్లు.. దగ్గరి వరకు వచ్చి కూడా లీసా పక్కన బెర్నీని చూసి వెళ్లిపోయిన సందర్భాలు ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి. కానీ పక్కన బెర్నీ లేకుంటే ఆమెకు జీవితమే లేదు. ఇంట్లో లీసాకు సహాయం చేసేదీ, ఆఫీస్కు రోడ్డు దాటించేదీ, క్యాబ్లు ‘మాట్లాడిపెట్టి’ (అరుపులతో క్యాబ్లను ఆపి) ఇంటికి, ఆఫీస్కు ఆమె పక్కన ఉండి మరీ తీసుకెళ్లి తీసుకొచ్చేదీ బెర్నీనే! లీసాకు ఉద్యోగం కంటే కూడా బెర్నీ ముఖ్యం. అందుకే ఉద్యోగం పోతే ఆమెకు పెద్దగా మనసు కష్టం అనిపించలేదు కానీ.. బెర్నీని, తనను క్యాబ్లో ఎక్కించుకోడానికి క్యాబ్ డ్రైవర్లు అయిష్టం చూపడం ఆమెను బాధించింది. కొందరు ఎక్కించుకున్నా కూడా.. దారి పొడవునా.. బెర్నీని ఏదో ఒకటి అనడం కూడా ఆమె హృదయాన్ని మరింతగా గాయపరిచింది. తన నిస్సహాయతను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆమెకు ఆవేదనగా ఉండేది. కోపం ఆమెను ఊపేసేది. చివరికి లీసా ఉబర్పై కోర్టుకు వెళ్లారు. ఆమె కేసు వేసింది 2018లో. మొన్న గురువారం తీర్పు వెలువడింది. ఉబర్ ఆమెకు 8 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్డర్! ఉబర్ తన వాదనను వినిపించకుండా ఉంటుందా? తమ డ్రైవర్లు కాంట్రాక్ట్ మీద చేరినవారు కనుక వారు చూపిన నిర్లక్ష్యానికి కంపెనీ తరఫున తాము నష్టపరిహారాన్ని చెల్లించే అవసరం లేదని వాదించినా కోర్టు లీసా వైపే నిలబడింది. ‘‘మానవత్వం మరచి, అంధురాలిపై వివక్ష కనబరుస్తూ లీసాకు రైడ్ ఇవ్వడకుండా నిరాకరించినందుకు, ఇచ్చికూడా ఆమెను, ఆమె శునకాన్ని తృణీకారంగా మాట్లాడినందుకు నష్టపరిహారం చెల్లించవలసిందేనని అంతిమంగా తీర్పు చెప్పింది. లీసా ఇర్వింగ్ అప్పట్లో చేస్తూ ఉన్నది పెద్ద ఉద్యోగం కాదు. పెద్ద ఉద్యోగం కాదంటే.. పెద్ద జీతం వచ్చే ఉద్యోగం కాదు. కనుక ఆమె సొంతంగా క్యాబ్లో వెళ్లలేరు. రైడ్ షేరింగ్ క్యాబ్ను మాట్లాడుకోవలసిందే. యాప్తో రైడ్ షేరింగ్ని బుక్ చేయడం కూడా ఆమెకు కష్టమే. అలాంటప్పుడు క్యాబ్ డ్రైవర్లే ఆపి, ఆమెకు రైడ్ షేరింగ్ ఇవ్వడం వారి కనీస ధర్మం. పైగా అమెరికాలోని ‘డిజెబిలిటీస్ యాక్ట్’ ప్రకారం అంధులకు ‘గైడ్’ గా ఉన్న డాగ్కు ఛార్జి తీసుకోకూడదు. షేర్ రైడింగ్ కనుక డాగ్కి కూడా చోటు కల్పించడం కష్టం అనీ, డాగ్ ఉన్నప్పుడు మరొకరు షేరింగ్కు రారని క్యాబ్ డ్రైవర్లు అంధుల విషయంలో ఉదాసీనతను ప్రదర్శిస్తుంటారు. నిజానికి క్యాబ్ డ్రైవర్లు ఒకసారి క్యాబ్లో ఎక్కిన అంధుడు / అంధురాలి ఫోన్ నెంబర్ తీసుకుని వారు కనుక ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో ప్రయాణించే ఉద్యోగులు అయితే మర్నాడు మళ్లీ అదే సమయానికి వారికి కాల్ చేసి అందుబాటులోకి క్యాబ్ని తెస్తారు. అయితే లీసాకు చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమె దాదాపుగా పీడకల వంటి ఒక పెద్ద మానసిక క్షోభనే అనుభవించారు. ఆ క్షోభకే ఇప్పుడు ఈ నగదు పరిహారం. ఉబర్ చెల్లిస్తుందా, పైకోర్టుకు వెళుతుందా చూడాలి. ఏమైనా లీసా చేసిన న్యాయపోరాటం వల్ల ‘పేదవారికి’ కూడా పోరాడగలం అనే ధైర్యం వచ్చింది. పోరాడాలి అన్న స్పహ కూడా. -
అతడి పరిచయంతో ఆమె జీవితం మారింది
అలల ప్రయాణం తీరం చేరేవరకే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్పచ్ఛమైన ప్రేమ ప్రయాణం ఎన్ని అడ్డంకులెదురైనా వివాహ బంధంతో ముడి వేస్తుందని రుజువు చేశారా దంపతులు. ఆస్తి కానీ, అందం కానీ వారిని ఆకర్షించలేదు. ఒకరిలో ఇంకొకరు ఏదో ఆశించడంతో వారి మధ్య ప్రేమ చిగురించలేదు. తొలిచూపులోనే వారి మనసులు కలిశాయి. మాటలు ఒక్కటయ్యాయి. స్వచ్ఛమైన ప్రేమకు మనసులు అందంగా ఉంటే చాలనుకున్న వారిద్దరూ మమతానురాగాలు పంచుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయిన యువతిని తొలిచూపులోనే ప్రేమించిన యువకుడు ఏడేళ్ల పాటు ఆమెకు అండగా ఉండి తన స్వచ్ఛమైన ప్రేమను అందించాడు. సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తరువాత జగత్సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ సమితి కనకపూర్ గ్రామస్తురాలు ప్రమోదిని రౌల్, ఖుర్దా జిల్లాలోని బలిపట్న సమితి ఝియింటొ గ్రామానికి చెందిన సరోజ్ సాహుల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ప్రేమ జంట వివాహానికి ప్రముఖులు హాజరై ప్రశంసించారు. వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ : తిర్తోల్ ప్రాంతంలోని ఆది కవి సరళా దాస్ కళాశాలలో +2 చదువుతున్న రోజుల్లో బంధువుల ఇంటి నుంచి సోదరునితో కలిసి వస్తుండగా 2009వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ప్రేమోన్మాది యాసిడ్ దాడిలో ప్రమోదిని గాయపడింది. యాసిడ్ దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భద్రక్ ప్రాంతీయుడు సంతోష్ కుమార్ వేదాంత్. పారా మిలటరీ జవాన్. యాసిడ్ దాడిని పురస్కరించుకుని జగత్సింగ్పూర్ పోలీసులు సంతోష్ను అరెస్టు చేసి ఉద్యోగం నుంచి బహిష్కరించి కటకటాల పాలు చేశారు. యాసిడ్ దాడికి గురైన ప్రమోదిని తీవ్రంగా గాయపడి కోమాలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కోమా నుంచి కోలుకుని యాసిడ్ దాడి తీవ్రతతో బాధితురాలు ప్రమోదిని దాదాపు 5 ఏళ్లు కోమాలో ఉండి క్రమంగా 2014వ సంవత్సరంలో కోలుకోగా ఆమె కంటి చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ దశలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న సరోజ్ కుమార్ సాహు విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వచ్చి ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆమె చికిత్స వ్యవహారాల్లో నిపుణులతో నిరంతర సంప్రదింపులు, ఆరోగ్య సంరక్షణతో ప్రమోదిని జీవితంలో కొత్త వెలుగులు నింపాడు. ఆత్మస్థైర్యంతో ఆమె స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి తదుపరి జీవనం గడిపేందుకు సిద్ధమైంది. 2014వ సంవత్సరంలో ఏర్పడిన తొలి పరిచయంతోనే వారిద్దరి మధ్య కలిగిన ప్రేమబంధం బలపడి పెళ్లి బాట వైపు అడుగులు వేయించింది. 2018వ సంవత్సరంలో లక్నోలో వారిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది. వధూవరుల కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో వైదిక సంప్రదాయంలో వారి వివాహం అత్యంత ఆనందోత్సాహాలతో సోమవారం జరిగింది. పెళ్లి విందుకు రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ మీనతి బెహరా, జగత్సింగ్పూర్ జిల్లా ఎస్పీ ప్రకాష్ రంగరాజన్, సబ్ డివిజినల్ పోలీసు అధికారి ఎస్డీపీఓ దీపక్ రంజన జెనా, తిర్తోల్ పోలీసు స్టేషన్ అధికారి భావగ్రాహి రౌత్, సర్పంచ్ నమిత రౌల్ ప్రత్యక్షంగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ..
‘చూపు ఉన్నవాళ్లు చూడలేనివాళ్లలా నటించడం అనుకున్నంత సులువు కాదు. అందుకే నా కొత్త చిత్రం కోసం కళ్లకు గంతలు కట్టుకుని సాధన చేస్తున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. హిందీ చిత్రం ‘బ్లైండ్’లో సోనమ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో చూపులేని పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారామె. ఈ పాత్రను బాగా చేయడానికి చూపులేనివాళ్లను గమనిస్తున్నారట సోనమ్. అలానే ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు గంతలు కట్టుకుని ఒకసారి, మామూలుగా ఓసారి నటించి చూసి అందులో వ్యత్యాసాలను గమనిస్తున్నారట. అలానే ఈ పాత్ర కోసం ఓ కోచ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు సోనమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్కాట్ల్యాండ్లోని గ్లాస్గో ప్రాంతంలో జరుగుతోంది. షోమే మక్జీ దర్శకత్వంలో ఈ సినిమాను సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. -
ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.. మేం నడిపిస్తాం.. మీరు నడవండంటూ ఏడడుగులు నడిపించారు.. కళ్లు లేని వారంటే సమాజంలో చిన్న చూపుందనేది నాటిమాట.. కానీ నేటి సమాజానిది పెద్దచూపు.. ఆ కాలనీవాసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ముందు చూపు, పెద్ద మనసుతో కళ్లు లేని జంట పెళ్లిని కనులపండువగా నిర్వహించారు. పుట్టుకతోనే కళ్లులేని వారిని చేరదీసి వారిని పెంచి, పెద్ద చేసి చదివించి వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఓ ఇంటివారిని చేస్తే అంతకు మించిన తృప్తి, ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. శ్రీనగర్కాలనీలోని కేశవనగర్ సరస్వతి విద్యామందిర్లో ఆకాశమంత పందిరిలో వేద మంత్రాల సాక్షిగా, కాలనీవాసుల ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ఉదయం ఓ అంధ జంట ఒక్కటయ్యారు.. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ చేతులమీదుగా జరిగిన ఈ వివాహానికి స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. చదవండి: గన్నీ బ్యాగులో మృతదేహం.. ఇంకా మిస్టరీలే! ► నిఖిల్, రాణి ఇద్దరూ పుట్టుకతోనే కళ్లు లేని వారు.. వారిని ఇట్రాయిడ్ అనే సంస్థ చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. వీరికి వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ మ్యూజిక్లో, పాటలు పాడటంలో శిక్షణనిచ్చారు. నిఖిల్ సింగర్గా స్థిరపడ్డాడు. రాణి డిగ్రీ వరకు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ► ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో పాటు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించారు. ఇదే విషయాన్ని ఇట్రాయిడ్ సంస్థ ఫౌండర్ మధుకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ► వెంటనే వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరిద్దరిని ఆదివారం రోజు ఒక్కటి చేశారు. వీరి పెళ్లి కేశవ్నగర్ కాలనీవాసులతో పాటు చాలామంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారని వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ ఫౌండర్ బంగారు కవిత తెలిపారు. ► పెళ్లి కోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. అంధుల పెళ్లి విషయాన్ని తెలుసుకొని తానే స్వయంగా వచ్చినట్లు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. ► మ కాలనీలో జరుగుతున్న వివాహం గురించి తెలుసుకున్న ఆ కాలనీవాసులు తమ ఇంట్లో వారి వివాహంలో చేసినట్లుగా పెళ్లిలో కోలాహలంగా గడిపారు. వివాహం తర్వాత వారికి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. -
భావోద్వేగం: అద్దాలు పెట్టుకోగానే అవాక్కయ్యాడు..
లండన్: మొదటిసారిగా తన చూట్టు ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. అదేంటి మొదటి సారి రంగులు చూడటమేంటని షాకవుతున్నారా. అసలు విషయం ఏంటంటే.. యూకేకు చెందిన మోకిన్లీ మాక్(22) పుట్టుకతోనే కలర్ బ్లైండ్. ఈ నేపథ్యంలో మాక్ ఫ్రెండ్స్ అతడికి కలర్ బ్లైండ్ గ్లాసెస్ను బహుమతిగా ఇచ్చారు. దీంతో మాక్ ఆ కళ్లద్దాలను పెట్టుకుని చూశాడు. దీంతో తన ఎదురుగా రంగురంగుల కార్లు, పచ్చని చెట్లు, రంగుల ఇళ్లను చూసి అతడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తన చూట్టు ఇంతటి అందమైన రంగుల ప్రపంచం ఉంటుందా అని తెలుసుకున్న మాక్ పట్టనంత ఆనందంతో ఉక్కిరిబిక్కయ్యాడు. ఇదంతా అతడి స్నేహితులు తమ సెల్ఫోన్లలో బందించారు. (చదవండి: 100 రోజులు ఒకే డ్రెస్ వేసుకుంది.. కారణం) అనంతరం ఈ వీడియోను మాక్ తన ఇన్స్టాగ్రామ్లో శనివారం పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. మాక్ పట్టనంత సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘ఇది చూసి నాగుండె బరువెక్కింది’, ‘ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో చూసే వారికి మీరు ఆదర్శంగా నిలిచారు.. నిజంగా మీ ఆనందానికి అవదులు లేవు’, ‘అసలైన రంగుల ప్రపంచాన్ని చూస్తునందుకు సంతోషం. మీకు నిజంగా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారి ఎప్పుడు అలాగే ఉంచుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: స్టార్ హీరోయిన్ క్యూట్ ఫొటో, కామెంట్ల వెల్లువ) View this post on Instagram A post shared by Mac (@maciavelli_) -
అంధత్వం; దేశంలోనే వరంగల్ రెండో స్థానం..
సాక్షి, హైదరాబాద్: మనిషికి జ్ఞానాన్నిచ్చే అవయవాల్లో కళ్లది క్రియాశీల పాత్ర. చూపులేకుంటే జీవితమంతా అంధకారమే. అలాంటి కళ్ల పనితీరు, దృష్టి లోపాలపై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కంటి పనితీరుకు ఊతమిచ్చే ఆహార పదార్థాలు తినడంలో తాత్సారంతో ఏటా వేలాది మంది అంధకారంలో పడిపోతున్నారు. 2015–19 మధ్య కాలంలో ర్యాపిడ్ అసిసెట్మెంట్ ఆఫ్ అవైడబుల్ బ్లైండ్నెస్ విధానం ద్వారా దేశంలో అంధత్వం, దృష్టి లోపాలపై కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజి కల్ సైన్సెస్, అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ సంయుక్తంగా సర్వే చేశాయి. దీని వివరాలను కేంద్రం విడుదల చేసింది. యాభై ఏళ్లలోపు వయసున్న వారిలో ఏటా 1.99 శాతం మంది అంధత్వానికి గురవుతున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. చదవండి: వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్! సర్వే సాగిందిలా... ఆర్ఏఏబీని లండన్లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐహెల్త్(ఐసీఈహెచ్) అభివృద్ధి చేసింది. దీని ప్రకారం 50 ఏళ్లలోపున్న వారిని నిర్ణీత పద్ధతిలో సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 31 జిల్లాలను ర్యాండమ్గా ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లాను ఎంచుకున్నారు. ప్రతి జిల్లా నుంచి 3వేల నమూనాల చొప్పున మొత్తం 93 వేల నమూనాలను ఎంచుకుని సర్వే చేసి ఫలితాలను క్రోడీకరించారు. సర్వే చేసిన వారిలో 1.99 శాతం అంధత్వంతో ఉండగా, 1.96 శాతం తీవ్రమైన దృష్టి లోపంతో ఉన్నట్లు గుర్తించారు. మరో 9.81 శాతం మధ్యస్త దృష్టి లోపంతో ఉండగా, 12.92 శాతం మంది త్వరలో ఏర్పడే దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారిం చారు. మరో 11.77 శాతం అతి తీవ్రతతో కూడిన దృష్టిలోపం, 13.76 శాతం మందిలో సాధారణ దృష్టిలోపం ఉన్నట్లు అంచనావేశారు. సాధారణ పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడే దృష్టిలోపంతో 1.03 శాతం మంది ఉన్నారు.చదవండి: ‘ప్రైవేటు’గా సమాచార సేకరణ! రెండో స్థానంలో వరంగల్... వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో అంధత్వంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.జాతీయ సగటు 1.99 శాతం ఉండగా.. వరంగల్ 3.47 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా (3.67శాతం) ఉంది. కాటరాక్ట్ సమస్యతోనే... 66.2 శాతం మందిలో అంధత్వానికి, 80.7శాతం మందిలో తీవ్రమైన దృష్టి లోపం రావడానికి, 70.2శాతం మందిలో మధ్యతరహా దృష్టి లోపానికి కాటరాక్ట్ కారణమని తెలింది. 2001 వరకూ వక్రీభవన లోపాలు దృష్టి లోపానికి రెండో అతి పెద్ద కారణమైతే, కార్నియా కారణంగా ఏర్పడే దృష్టి లోపాలు ఇప్పుడు మరో అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే కాటరాక్టు సర్జరీలో వచ్చే సమస్యల కారణంగా కూడా దృష్టి కోల్పోవడం ఎక్కువగా జరుగుతోందని సర్వే అంచనా వేసింది. ► అంధత్వంతో బాధపడుతున్నవారు: 1.99% ► అతి తీవ్ర దృష్టిలోపమున్నవారు: 11.77% ► తీవ్ర దృష్టి లోపమున్నవారు: 1.96% ► మధ్యస్తంగా ఉన్న వారు: 9.81% ►త్వరలో చూపు సమస్యలు ఏర్పడేవారు: 12.92% -
ఈ వీడియో చూస్తే ఏడుపొస్తుంది!
బాస్కెట్ బాల్ ఆడే ప్రతి ఒక్కరికి తెలుసు బాస్కెట్లో బాల్ వేయాలంటే ఎంత కష్టమో. టీవీలో చూస్తున్నప్పుడు బాస్కెట్లో బాల్ వేయడమే కదా ఎంత తేలికో వేసేయొచ్చు దాంట్లో ఏముంది అనుకుంటాం. కానీ గ్రౌండ్లోకి దిగి బాల్ పట్టుకుంటేనే అర్థం అవుతుంది బాల్ వేయడం ఎంత కష్టమో! అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లే అలా ఫీల్ అవుతుంటే కంటిచూపు లేని ఓ వ్యక్తి బాల్ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే! (వైరల్: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా..) ఫాదర్స్ డే సందర్భంగా ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కళ్లు కనబడని ఓ వ్యక్తి తొలిప్రయత్నంలోనే బాస్కట్లో బాల్ వేశాడు. అప్పుడు తన కుటుంబం రియాక్షన్ ఇంకా ఈ వీడియోని అద్భుతంగా మారే లా చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వీడియోని చూస్తే నాకు ఏడుపొస్తుంది అని ఒకరు కామెంట్ చేయగా, ఇది పోస్ట్ ఆఫ్ ది ఇయర్గా నిలుస్తోంది అని మరో నెటిజన్ ప్రశంసించారు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) This family’s reaction to their blind Uncle hitting a free throw on his first try — is the Twitter content I’m here for. Happy Father’s Day.🌎❤️🏀pic.twitter.com/QSYC60YYXG — Rex Chapman🏇🏼 (@RexChapman) June 21, 2020 -
కలతచెంది.. కాలినడకన బయలుదేరి..
అబ్దుల్లాపూర్మెట్: అసలే అంధురాలు.. ఆపై ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు కలత చెంది నల్లగొండకు కాలినడకన పయనమైంది. మానసిక వికలాంగుడైన సోదరుడిని వెంటబెట్టుకుని రోడ్డుమార్గాన వెళుతుండగా అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు చూసి ఆరా తీశారు. వారికి భోజనం పెట్టి వాహనం సమకూర్చి నల్లగొండకు పంపించారు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాటర్ వర్క్స్ ఈఈ కార్యాలయంలో అటెండర్గా పనిచేసే బుచ్చమ్మ(అంధురాలు) ఉగాది పండుగ కోసం హయత్నగర్లో నివసించే తనభర్త, కుమారుడి దగ్గరికి మానసిక వికలాంగుడైన సోదరుడు పరమేష్తో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బుచ్చమ్మకు ఆమె భర్త ప్రేమానందంకు మధ్య గొడవ రావడంతో మంగళవారం తెల్లవారు జామున హయత్నగర్ నుంచి తన సోదరుడితో కలిసి నల్గొండకు కాలినడకన పయనమైంది. అంధురాలైన ఆమెకు మానసిక వికలాంగుడైన సోదరుడి చేతులు పట్టుకుని విజయవాడ జాతీయ రహధారిపై గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు చూసి ఆరా తీసి భోజం పెట్టారు. అనంతరం వాహనం సమకూర్చి నల్గొండకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. తన సోదరుడికి కూడా కళ్లు సరిగ్గా కనిపించవని బుచ్చమ్మ తెలిపింది. నల్లగొండకు వెళ్తున్నామని, హయత్నగర్లో తన భర్తతో పాటు ఇద్దరు కుమారులు, కోడలు ఉన్నారని, వారు తమ పట్ల కనికరం చూపకుండా గొడవపడ్డారని బుచ్చమ్మ వాపోయింది. -
అంధులకు సవాల్గా మారిన భౌతిక దూరం
కోల్కతా: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం పాటించాలన్న సార్వజనీన సూత్రం అంధులకు మాత్రం పెనుసవాల్గా మారింది. గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం అంధులు శబ్దాల్ని గ్రహిస్తూ, ధ్వని ఆధారంగా ముందుకు సాగుతారు. అడుగు బయటపెట్టాలంటే ఎవరో ఒకరి చేదోడు అవసరమైన వీరు భౌతిక దూరం పాటించాలన్న నియమాన్ని అనుసరించలేని దయనీయస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ళల్లో ఉన్నాం కనుక భౌతిక దూరాన్ని పాటించగలిగామనీ, అయితే రేపు పాఠశాలలు ప్రారంభమైతే ఈ భౌతిక దూరాన్ని ఎలా పాటించాలో అర్థం కావడం లేదని కోల్కతాలోని ప్రముఖ అంధుల పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను మా అమ్మతో గానీ, మా సోదరితోగానీ లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం బయటకు వెళతాను. ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది’ అని అదే స్కూల్లో చదివే 11వ తరగతి విద్యార్థి సుబీర్ దాస్ అన్నారు. లాక్డౌన్తో స్కూల్ మూతపడటంతో విద్యార్థులకు మ్యాథ్స్ నేర్చుకునే అవకాశం లేకుండా పోయిందని టీచర్ ఒకరు చెప్పారు. మిగతా సబ్జెక్టులు ఆడియో ద్వారా పాఠాలు విని నేర్చుకునే అవకాశం ఉందని, కానీ మ్యాథ్స్ మాత్రం బ్రెయిలీ పుస్తకాల ద్వారా మాత్రమే అభ్యసించగలుగుతారని చెప్పారు. కాగా, విద్యార్థుల కావాల్సిన సదుపాయాలను వెంటనే సమకూర్చేందుకు గార్డియన్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చారని వెల్లడించారు. (చదవండి: గడప దాటని ఇద్దరికి కరోనా పాజిటివ్) -
అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్ ఎడెడ్ నోట్ ఐడెంటిఫయర్ (ఎంఏఎన్ఐ–మనీ) యాప్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ‘కలర్ బ్లైండ్నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా ఇండియన్ కరెన్సీ నోట్లలో ఇంటాగ్లియో ప్రింటింగ్, స్పర్శ, నోట్ల పరిమాణం, సంఖ్యలు, ఏక వర్ణ రంగులు, నమూనాలు’ వంటివి ఉన్నాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యాప్ ఎలా పని చేస్తుందంటే? యాప్లోని కెమెరాను ఆన్ చేసి నోట్ల మీద ఉంచగానే ఈ యాప్ కరెన్సీ నోట్ల మీద ఉండే మహాత్మా గాంధీ బొమ్మను, సిరీస్ను లేదా వెనక వైపున ఉండే నోట్ భాగాన్ని గుర్తిస్తుంది. నోట్ విలువ ఎంతనేది హిందీ, ఇంగ్లీష్ భాషలో ఆడియో ద్వారా తెలుపుతుంది. వినికిడి సమస్య ఉన్న వాళ్ల కోసం వైబ్రేషన్స్ ద్వారా కూడా చెబుతుంది. ఈ యాప్ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా పని చేస్తుంది. ఈ యాప్ను డౌన్లోడ్ ఆఫ్లైన్లో, వాయిస్ ఆధారిత అపరేటింగ్ సిస్టమ్ ద్వారా కూడా పని చేయటం ఈ యాప్ ప్రత్యేకతలు. -
సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్
తిరువనంతపురం : ప్రాంజల్ పాటిల్ తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలకగా, అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల్ సబ్ కలెక్టర్ట్గా బాధ్యతలు చేపట్టారు. కాగా చూపు లేకున్నా ప్రాంజల్ పాటిల్ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించారు. ప్రాంజల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రాంజల్ పాటిల్కు ఆరేళ్ల వయసులో తరగతి గదిలో సహ విద్యార్థి పొరపాటున పెన్సిల్తో కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు కోల్పోగా, ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపు కూడా కోల్పోయింది. అయితే ప్రాంజల్ అమ్మానాన్న మాత్రం ఆమెను ఎన్నడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల ఓ దృక్ఫదంతో పాటు కలలు కనేలాగానే పెంచారు. దాదర్లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్లో పాఠశాల విద్య, చండీబాయి కాలేజ్లో ఇంటర్ చేసింది. 2015లో ఎమ్ఫిల్ చేస్తూ ఐఏఎస్కి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రాంజల్ తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో తాను ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకున్నారు. -
మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం
సాక్షి, విజయవాడ: భవానీ దీక్షలో ఉన్న అంధ భక్తుడిని స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంధ భక్తుడు భవానీ మాల ధరించి.. విరమించుకునేందుకు మంగళవారం దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సుమారు ఐదు గంటల పాటు క్యూలైన్లో ఇరుక్కుపోయి ఇబ్బందిపడుతున్న అంధ భక్తుడిని గమనించిన నారాయణస్వామి తనతో పాటు దర్శనానికి తీసుకెళ్లారు. పోట్రోకాల్ను కూడా పక్కన పెట్టి మానవతా దృక్ఫథంతో తనతో పాటు తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిని భక్తులు అభినందించారు. -
అంధ విద్యార్థికి అండగా హరీశ్
సిద్దిపేటజోన్: పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థి లక్కీమీరానీకి ఎమ్మెల్యే హరీశ్రావు అండగా నిలిచారు. ఉన్నత విద్య కోసం తన వంతు సహాయంగా రూ.లక్ష నగదును అందిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్కు చెందిన లక్కీమీరానీ 2వ తరగతి నుండే అంధుడు. తన లక్ష్యానికి అంధత్వం అడ్డుగా మారింది. ఈ క్రమంలో కరీంనగర్లోని పారమిత గ్రూప్స్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ డా. ప్రసాద్ అంధ విద్యార్థి లక్కీమీరానీ ప్రతిభను గుర్తించి ఆర్థిక స్తోమత, స్థితిగతులను పరిశీలించి అక్కున చేర్చుకున్నాడు. రెండో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అంధ విద్యార్థికి ఉచిత విద్యను అందించారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో లక్కీమీరానీ 10/10 జీపీఏ సాధించి ఆసియా ఖండంలోనే మొదటి అంధ విద్యార్థిగా నిలిచాడు. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలుసుకున్న హరీశ్రావు సోమవారం సిద్దిపేటలో అంధ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. -
చీకటిని వెలిగించాడు
సముద్ర కెరటాన్ని మించిన ప్రాక్టికల్ లెసన్ ఉంటుందా? పడినా తిరిగి లేస్తుంది.. తీరాన్ని తాకేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది! కెరటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనుషులూ ఉన్నారు.. నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురు గర్వించదగిన స్థాయికి ఎదగాలనే తపనతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరుకున్న విజేతలు! అలాంటి అచీవరే ఎమ్డీ షకీర్...చిన్నతనంలోనే చూపును కోల్పోయిన ఈ యువకుడు కళ్లు లేవని బెంగపడలేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది అనే ప్రాక్టికాలిటీ అర్థమైన వ్యక్తి కావడంతో అంధత్వాన్ని తన లక్ష్యసాధనకు అడ్డుగా ఏమాత్రం భావించలేదు. అనుకున్నది సాధించి కళ్లున్నవాళ్లకూ స్ఫూర్తిగా కనిపిస్తున్నాడు. మోటివేటర్గా ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్న షకీర్కి అయిదారేళ్ల వయసులో చూపు పోయింది. అయినా చదువు ఆపలేదు. పట్టుదలతో బ్రెయిలీ లిపి నేర్చుకుని చదువు కొనసాగించాడు. అంధుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన తొలి ఆంధ్రుడిగా నిలిచాడు. అంతేకాదు ముస్లింల పవిత్ర గ్రం«థమైన ఖురాన్ను బ్రెయిలీ లిపిలో రచించి, లిమ్కా బుక్లో స్థానం పొంది, నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నుంచి ఎక్స్లెన్స్ అవార్డునూ అందుకున్నాడు. 2017, డిసెంబరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా ‘వినూత్న రత్న’ పురస్కారాన్నీ పొందాడు. షకీర్ గురించి మరిన్ని వివరాలు అతని మాటల్లోనే.. వింటూ.. అర్థం చేసుకుంటూ మాది సాధారణ కుటుంబం. మా నాన్న (సయ్యద్ ఇస్మాయేల్) పద్దెనిమిదేళ్లు మిలటరీలో పనిచేశారు. అమ్మ (రహీమా బేగం) గృహిణి. నేను యూకేజీలో ఉన్నప్పుడు గ్లకోమాతో చూపు పోయింది. మా పేరెంట్స్ మేనరిక వివాహమే ఇందుకు కారణమన్నారు. నాకు గ్లకోమా అని తేలగానే మా నాన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ప్రయోజనం లేదనే అన్నారంతా. యూకేజీదాకా మామూలు బడికి వెళ్లిన నేను ఒకటో తరగతికి చెన్నైలోని స్పెషల్ స్కూల్లో చేరాను. బ్రెయిలీ లిపి ద్వారా అక్కడే అయిదో తరగతి వరకు చదువుకున్నా. ఆ తరువాత నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మామూలు బడిలోనే చేరి ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివా. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ, క్లాస్మేట్స్ గట్టిగా చదువుతుంటే అర్థం చేసుకుంటూ.. బ్రెయిలీలో పరీక్షలు రాసేవాడిని. ఇంటర్, డిగ్రీ (బీఏ, ఇంగ్లిష్ లిటరేచర్)లో మాత్రం క్లాస్లో లెసన్స్ను రికార్డ్ చేసుకునే వాడిని. ఇంటికి వెళ్లాక ప్లే చేసుకుని వినేవాడిని. ఇట్లాగే 2002లో ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తరువాత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశాను. ఆ సమయంలోనే 2002లో కుప్పంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (వికలాంగుల కోటాలో) జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అంతా రికార్డు వర్క్కు సంబంధించిన ఉద్యోగం కావడంతో కంటి చూపులేక ఏ పనీ చెప్పేవారు కాదు. ఖాళీగా కూర్చోవలసి వచ్చేది. ఎగతాళితో పట్టుదల ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం చేయాలని ఉండేది. ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఏ కంపెనీ నుంచీ కాల్ లెటర్ రాలేదు. టీచింగ్లోకి వద్దామని ప్రైవేట్ కాలేజెస్ను సంప్రదించా. వాళ్లూ సుముఖత చూపించలేదు. ‘‘చూపు లేదు కదా, బోర్డు పై ఎలా రాస్తావ్? క్లాసులో స్టూడెంట్స్ను ఎట్లా మేనేజ్ చేస్తావ్?’’ అంటూ ఎగతాళి చేశారు. దాంతో నాలో కసి పెరిగింది. ఉద్యోగం కోసం ఎవ్వరినీ అర్థించకూడదు, నేనే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేలా ఉండాలని డిసైడ్ అయ్యా. డిసెంబరు 15, 2005లో విజయవాడలో సొంతంగా ‘ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్’ని పెట్టి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశా. ఈ 14 ఏళ్లలో 850 వరకు క్లాసెస్ నిర్వహించా. ఈ విషయం తెలుసుకుని నాడు జాబ్ ఇవ్వడానికి ఇష్టపడని కంపెనీలు, కాలేజెస్ ‘‘మా దగ్గర ఉద్యోగం చేయండి’’ అంటూ జాబ్ ఆఫర్లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా. స్టీవెన్స్ హావీ, టీనీరాబిన్స్, బ్రెయిన్ట్రెసీ వంటి అమెరిక్ రచయితల పుస్తకాలను బాగా చదువుతుంటా. ప్రతి నెలా ఏదో ఓ కొత్త పుస్తకం చదువుతాను. సాధారణంగా పుస్తక పఠనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు మెమొరీ కూడా ఎక్కువే. నా సెల్ ఫోన్లో ఉన్న 600 నంబర్లను ఎలా అడిగినా టక్కున చెప్పగలను. బ్రెయిలీ లిపిలో ఉన్న రిస్ట్ వాచ్ను, అలాగే టాకింగ్ కంప్యూటర్ను వాడతాను. కుటుంబం.. మేము నలుగురు అన్నదమ్ములం. నేనే ఆఖరు వాడిని. మూడో అన్నకూ కంటి చూపులేదు. తనూ నాలాగే బ్రెయిలీలో డిగ్రీ వరకు చదువుకుని జగ్గయ్యపేట కాలేజ్లో ఇంగ్లిష్ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాడు. పెద్దవాళ్లిద్దరూ కెనడా, యూఎస్ఏలో సాప్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ కాదు.. లైట్ హౌస్ ఇంటర్లో ఉన్నప్పుడు బ్రెయిలీలో ఖురాన్ను రాసి లిమ్కా బుక్లో స్థానం సంపాదించా. అబ్దుల్ కలామ్ నుంచి ఎక్స్లెన్స్ అవార్డు అందుకుంటున్నప్పుడు .. ‘నీవు స్ట్రీట్ లైట్వి కావు, లైట్ హౌస్వి’ అని ఆయన అన్న మాటలు నాకెప్పటికీ ప్రేరణే. వ్యక్తిత్వ వికాసంపై ఉర్దూ, తెలుగు, తమిళం, ఇంగ్లి్లష్, హిందీలలో అనర్గళంగా క్లాసెస్ ఇవ్వగలను. పర్సనాల్టీ డెవలప్మెంట్ పై 2016లో ’స్టార్ట్ ఏ న్యూ లైఫ్ నౌ’ అనే పుస్తకాన్నీ రాశా ఇంగ్లి్లష్లో. 2018లో ‘విజయీభవ’ పేరుతో తెలుగులో కూడా పబ్లిష్ అయింది. ప్రపంచమే క్లాస్ రూమ్ నన్నో మోడల్గా చూపించి, పది మందిని చైతన్యపర్చడానికి భగవంతుడు ఇలా చేశాడని భావిస్తుంటాను. జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు అంధత్వం గురించి కొద్దిగా బాధపడేవాడిని. మోటివేషన్ క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టాక ఆ బాధ ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాకు ప్రపంచమే క్లాస్ రూమ్. యువత ఉద్యోగమే కావాలనుకోకుండా స్వశక్తిపై వృద్ధిలోకి వచ్చి, మరో పదిమందికి ఉపాధి చూపించేలా తయారుకావాలి. వైకల్యం ఉన్నవాళ్లు దాన్నో లోపంగా భావించి బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. – గంధం రమణ, రాజానగరం, రాజమహేంద్రవరం -
చీకటిని జయించిన రాజు
సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు వయస్సు, అంగ వైకల్యం అడ్డురాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ కళ్లే లేకుంటే ప్రపంచమే అంధకారం. కాని చూపు లేకున్నా తాను ఎవ్వరికీ ఎందులోనూ తీసిపోనని నిరూపించారు పుష్పరాజ్. చిన్నప్పుడే కంటి చూపుకోల్పోయినా ఉన్నత చదువులు చదివి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. మరో వైపు క్రికెట్లో రాణిస్తూ ఎన్నో పతకాలను కైవసం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన సిమ్మన్స్, రాజేశ్వరి దంపతులకు పుష్పరాజ్, అశోక్ సంతానం. ఇందులో పెద్ద కుమారుడు పుష్పరాజ్.. చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోయారు. అతనికి ఏడవ ఏటవచ్చే సరికి తండ్రి చనిపోయారు. తల్లి రాజేశ్వరి అధైర్యపడకుండా కర్నూల్లోని ఓ ప్రవేయిటు పాఠశాల్లో ఆయాగా చేరారు. పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుడు పుష్పరాజ్కు కంటి చూపును తెచ్చుకోపవడానికి ప్రయత్నించారు. అప్పుచేసి ఎనిమిది సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయానా ఫలితం దక్కలేదు. పుష్పరాజ్ను ఉన్నత చదువులను చదివించాలని భావించి హైదరాబాద్లో ఉన్న దేవనగర్ అంధుల పాఠశాల్లో చేర్పించారు. అక్కడ 10వ తరగతి పూర్తిచేశారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 490 మార్కులను సాధించి అప్పటి రాష్ట్ర గవర్నర్గా పని చేసిన రంగరాజన్ చేతులమీదుగా ఉత్తమ విద్యార్థిగా పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల స్థాయిలో క్రికెట్లో మెలకువలు నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మంచి బ్యాట్స్మెన్గా రాణించారు. సంరక్షుడి నుంచి ఉపాధ్యాయుడిగా.. పదో తరగతి అనంతరం పుష్పరాజ్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నారు. నిజాం కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్లోనే వసతి గృహంలో ఉంటూ బీఈడీను పూర్తి చేశారు. క్రికెట్లోనూ రాణిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి ఎంపికై మద్దికెరలో రెండేళ్లు పనిచేశారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007లో ఉత్తమ వసతి గృహ సంరక్షుడి ఆవార్డు వరించింది. అదే ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్మానం అందుకున్నారు. క్రికెట్లో రాణించినందుకు 2012లో అప్పటి సీఎం కిరుణ్కుమార్రెడ్డి చేత సన్మానాన్ని పొందారు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పనిచేస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పుష్పరాజ్ అందిపుచ్చుకున్నారు. తన ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడంలో పుష్పరాజ్ దిట్ట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఈయన కైవసం చేసుకున్నారు. ధైర్యమే నా ఆయుధం.. వైకల్యం ఉందని బాధపడితే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాను. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. నా విజయానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే కారనం. కంటిచూపు లేదని నేను ఎన్నడూ బాధపడలేదు. అమ్మ ప్రోత్సాహంతో ఈస్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని వెలికి తీసినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. – పుష్పరాజ్ -
నా చెవులకు కళ్లున్నాయ్ నా చేతులు చూస్తున్నాయ్
‘నా చెవులకు కనులున్నాయ్.. నా చేతులు చూస్తున్నాయ్. తెలుసు నాకు వెలుగేదో.. తెలుసు నాకు చీకటేదో..’ అనే కవి మాటలే స్ఫూర్తిగా ఆమె ముందుకు కదిలారు. ఆమె పుట్టుకతోనే లోకం చూడని అంధురాలు. చదువుకుంటానని అంటే కుటుంబ సభ్యులు ‘అయ్యో తల్లీ’ అని ఆవేదన చెందారు. సమాజమైతే.. ‘అసలే ఆడపిల్లవు.. ఆపై అంధురాలవు. నీకెందుకు చదువు’ అంటూ నిరుత్సాహపరిచింది. అయినా పట్టుదల, ఆత్మవిశ్వాసమే నేత్రాలుగా చేసుకుంటూ.. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్లారు. బీఏ, బీఈడీ, ఎం.ఎ., న్యాయశాస్త్రం, ఎంఫిల్, పీహెచ్డీ.. ఇలా డిగ్రీలు పొందుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా జీవితం సాగిస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. భగవద్గీత మొత్తాన్నీ బ్రెయిలీలో లిఖించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిణామ క్రమంలో తనకు ఎదురైన జీవితానుభావాలను సాక్షి ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు లక్ష్మీనారాయణమ్మ. ‘నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేశారు ‘‘మాది విశాఖనగరమే అయినా... నాన్నగారు కలకత్తాలో రైల్వే ఉద్యోగి. నేను చదువుతానని చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లు అడ్డు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరు పిన్నిలు, మామయ్య కూడా అంధులే. వారు మాత్రం నన్ను ప్రోత్సహించారు. చదువుకోకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. అందుకే అమ్మాయిని చదువుకోడానికి పంపించండని నాన్నతో చెప్పడంతో హైదరాబాద్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. బాలురు, బాలికలకు కలిపి ఒకే పాఠశాల ఉండేది. రెండవ తరగతిలోనే ఎస్ఎఫ్ఐతో కలిసి బాల బాలికలకు వేర్వేరు పాఠశాలలు కావాలని డిమాండ్ చేస్తూ ధర్నా, నిరాహార దీక్షలో పాల్గొన్నాను. అప్పటి గవర్నర్ శారదాముఖర్జీ స్పందించి అంధ బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ విశాఖలోని బీవీకే కళాశాలలో పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగే యూత్ ఫెస్టివల్స్లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ అంధుల కోసం నిర్వహించే పోటీల్లో పాల్గొనేదాన్ని కాదు. అందరితో కలిసి పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలోనూ విజయం సాధించేదాన్ని. డిగ్రీ తర్వాత బీఈడీ ఎంట్రన్స్ రాస్తే రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ వచ్చింది. అంధుల కోటాలో కోరుకున్న చోట సీట్ అని చెప్పినా.. ఆ కోటాలో వద్దని.. జనరల్ కోటాలో తీసుకున్నాను. డిగ్రీ పూర్తయ్యాక చదువు చాలని ఇంట్లో వాళ్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో నాతో మాట్లాడటం మానేశారు. బీఈడీ పూర్తయిన తర్వాత ఆసెట్ రాసి ఏయూలో పీజీ చదివాను. సీట్ వచ్చిన తర్వాత ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్లేం మాట్లాడలేదు. నీ ఇష్టమని చెప్పి ఫోన్పెట్టేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీల్లో ర్యాంకులు వచ్చాయి. హిస్టరీలో చేరి పీజీ పూర్తి చేసిన తర్వాత లా డిగ్రీ సాధించాను. ఆ తర్వాత ఎంఫిల్ చేశాను. పీహెచ్డీ కూడా పూర్తి చేశాను. లా ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నాను. కానీ.. ఉపాధ్యాయ వృత్తి వైపు దారి మళ్లింది. ప్రస్తుతం విశాఖ నగరంలోని మహారాణిపేటలో ఉన్న ఎంవీడీ మున్సిపల్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ‘లోపలికి వెళ్లిపో’ అనేవారు అంధురాలిగా పుట్టినప్పటి నుంచే కష్టాలు కూడా నా వెంటే వచ్చాయి. చదువుకునే సమయంలో ఇంట్లో నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఒంటరిగా జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదోతరగతి పూర్తి చేసుకున్నాక ఇంటికి వెళ్లాను. ఇంటికి ఎవరైనా వస్తే.. లోపలికి వెళ్లిపో అని అనేవారు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఎవరైనా వస్తే నేనెందుకు దాక్కోవాలి? అంధురాలిగా జన్మించడం నా తప్పా.? అందుకే.. చదువుకోవాలి, నా కాళ్లపై నేను నిలబడాలని నిశ్చయించుకున్నాను. అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ప్రతి ప్రాంతం నాకెన్నో పాఠాలు నేర్పించింది. అంధురాల్ని చేసుకున్న నువ్వు గ్రేట్ అని ఎవరైనా నా భర్తను పొగిడితే.. నేను జీర్ణించుకోలేను. అందుకే.. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’ అని ముగించారు లక్ష్మీనారాయణమ్మ. కరుకోల గోపి కిశోర్రాజా, సాక్షి, విశాఖ వెయ్యి గిన్నిస్లు ఎక్కినంత! 1991లో జనవరి 3వ తేదీన బ్రెయిలీలో భగవద్గీత రాయడం ప్రారంభించాను. ఆహారం తీసుకోకుండా, నిద్ర పోకుండా, మంచినీరు తాగకుండా 24 గంటల పాటు నిర్విరామంగా ఐదున్నర అధ్యాయాలు రాశాను. తర్వాత 1991 మార్చి 23న అక్కడినుంచి 11 వ అధ్యాయం వరకూ రాశాను. ఏకబిగిన ఇరవై ఆరున్నర గంటల పాటు రాశాను. ఇక మిగిలిన ఏడు అధ్యాయాల్ని ఒకేరోజున పూర్తి చెయ్యాలని నిర్ణయించుకొని 1992లో 11వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకూ పూర్తి చేసేశాను. ఈసారి ఏకంగా ముప్ఫైమూడున్నర గంటల సేపు రాసి విజయవంతంగా పూర్తి చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసం çపంపితే.. ఇది మతపరమైన అంశమని తోసిపుచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ.. ఇది పూర్తి చేసిన తర్వాత వచ్చిన ప్రశంసలు నాకు వెయ్యి గిన్నిస్ బుక్లు ఎక్కినంత ఆనందాన్నిచ్చాయి. లక్ష్మీనారాయణమ్మ ►బ్రెయిలీలో భగవద్గీత ►మంచినీరు కూడా తీసుకోకుండా నిర్విరామ రచన ►అన్ని రంగాల్లో రాణించగల సత్తా ►అంధ ఉపాధ్యాయురాలు కొల్లూరు లక్ష్మీనారాయణమ్మ -
ప్రేమ పెళ్లి చేసుకున్న అపురూప జంట
కర్ణాటక, యశవంతపుర : చూపు లేకుండా చేసి విధి వింత నాటకం ఆడినా, ఇద్దరూ ఒక్కటై కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన ఒక అంధజంట ప్రేమ పెళ్లి చేసుకుంది. వివరాలు... నగరానికి చెందిన వధువు తారాబాయి అనాథ అంధ యువతి. ఒక గార్మెంట్స్లో పనిచేస్తోంది. మారుతి బసప్ప సంగీత ఉపాధ్యాయుడు. ఓ వేడుకలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో రిసోర్స్ సెంటర్కు చెందిన మేఘనా ఆదివారం వీరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. నగరానికి పలువురు ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
నివారింపదగిన అంధత్వంపై అవగాహన అవసరం
భారత్లోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల్లో ‘నివారించగలిగిన అంధత్వం’ గురించి అవగాహన పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు ‘ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినోద్ డేనియల్. ఇక్కడే చైన్నెలో పుట్టి ఐఐటీ ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన వృత్తిరీత్యా అంతర్జాతీయంగా ఎన్నో మ్యూజియంలలో పురాతన వారసత్వ సంపదను పరిరక్షించే పనిచేస్తుంటారు. అయితే భారత్లోని ప్రజల్లో చాలామంది కేవలం అవగాహన లేమితో చాలా తేలిగ్గా నివారించదగిన అంధత్వం బారిన పడి నాణ్యమైన జీవితం గడపలేని వారి కళ్లలో వెలుగులు నింపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ డేనియల్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పిన వివరాలివి... ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్తో కంటి సేవల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? వినోద్: గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ విజువల్ ఇంపెయిర్మెంట్ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని అంధుల్లో 20.5% మంది భారత్లో ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలోనూ 88.2% మంది అంధత్వాన్ని తేలిగ్గా నివారించవచ్చు. మన దేశంలో 13.3 కోట్ల మందికి కేవలం కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న చిన్న సహాయాలతోనే వారి అంధత్వాన్ని నివారించవచ్చుననీ, అలాగే 1.10 కోట్ల మంది పిల్లలదీ అదే పరిస్థితి అని ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ... ఢిల్లీ అప్టోమెట్రీ అండ్ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ అనే కార్యక్రమంలో వెల్లడించిది. అయితే ఇంత తేలిగ్గా నివారింపదగ్గ అంధత్వాన్ని కూడా వారు దూరం చేసుకోలేకపోతున్నారు. కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న కారణాలతో అంధత్వాన్ని నివారించగలిగితే మన ప్రజల్లోని ఉత్పాదకత 34% ఎక్కువవుతుంది. వాళ్ల ఆదారంలో కనీసం 20% పెరుగుదల ఉంటుంది. ఇలా పెద్దల్లోనే కాదు... మన దేశంలోని 8% నుంచి 10% మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం. ఈశాన్యరాష్ట్రాల్లో అయితే కళ్లజోళ్ల ద్వారా కంటిచూపు మెరుగు చేయగల పిల్లల సంఖ్య దాదాపు 20% వరకు ఉంది. ఇంత చిన్న కారణాలతో వాళ్ల కంటిచూపు మెరుగ్గా లేని కారణంగా పెద్దలు ప్రమాదాలకు గురికావడం, పిల్లల్లో చదువు లేక నేరాల వైపునకు మళ్లడం, తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచుకోలేక, జీవననాణ్యత లోపించిన బతుకులు గడుపుతున్నారు. ఇలాంటి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తోంది. ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ సంస్థæ కార్యకలాపాలేమిటి? వినోద్: మా సంస్థ రెండు రకాలుగా పనిచేస్తోంది. మొదటిది తేలిగ్గా నివారింపదగిన అంధత్వాన్ని రూపుమాపేందుకు అవసరమైన కళ్లజోళ్లు లాంటి మౌలికమైన వస్తువులు అందిస్తోంది. సాధారణంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పుడు ఒక కళ్లజోడు ధర కేవలం రూ. 50లకే వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రశ్న దాని ధర లేదా అదెంత ఖరీదైనది అని కాదు. దాదాపు మన ప్రజల్లో కేవలం కళ్లజోడు లాంటి చిన్న ఉపకరణంతోనే మన బతుకులో గణనీయమైన మార్పువస్తుందనే అవగాహనా తక్కువే. అందుకే ఒకవైపున మా సంస్థ ప్రజల్లో ఈ అవగాహన కల్పిస్తోంది. మరోవైపున కళ్లజోళ్లు అవసరమైన వారికి కావాల్సిన అద్దాల పవర్ ఎంతో తెలుసుకునే ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య చాలా చాలా తక్కువ. ఉదాహరణకు మన దేశ అవసరాల కోసం 1,25,000 ఆప్టోమెట్రీషియన్లు కావాలి. ప్రస్తుతం భారత్లో ఉన్న ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య 40,000 మాత్రమే. మా సంస్థ ఒకవైపు ప్రజలకు అవసరమైన మౌలిక కంటి పరీక్షలైన స్క్రీనింగ్ నిర్వహించి కళ్లజోళ్ల వంటివి సరఫరా చేస్తుండటమే కాకుండా... అంతగా నైపుణ్యం లేని అప్టోమెట్రీషియన్ల, ఐ కేర్ రంగంలో ఉన్న వృత్తినిపుణుల (ఐ కేర్ ప్రొఫెషనల్స్) నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా రెండంచెల్లో మా సంస్థ కృషి చేస్తూ ప్రజల్లో అంధత్వాన్ని నివారించడానికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమంలో మీకు ఎవరైనా సహాయపడుతున్నారా? వినోద్: బ్రియాన్ హాల్డెన్ అనే ఆస్ట్రేలియన్ ఇటీవలే చనిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రియాన్ హాల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ సంస్థలతో కలిసి (జాయింటి ఇనిషియేటివ్ ప్రాతిపదికన) మా సంస్థ పనిచేస్తోంది. అంతేగాక... చాలా కార్పొరేట్ సంస్థలు సేవాభావంతో మాకు సహకరిస్తున్నాయ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీ.ఎన్.రావు మా సంస్థ ట్రస్టీలలో ఒకరు. మన దేశంలో మీరు అందిస్తున్న సేవల గురించి సంక్షిప్తంగా... వినోద్: మన దేశంలో ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాంలతోపాటు మిజోరాం, మేఘాలయా వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు 18 రాష్ట్రాల్లోని ప్రజలకు మా సంస్థ సేవలందిస్తోంది. అలాగే ఇక్కడి పలు రాష్ట్రాల్లో ప్రజలకు కళ్లజోడు పవర్ నిర్ధారణ చేయగల నిపుణుల సంఖ్య చాలా తక్కువ. అందుకోసం ఆ నిపుణుల వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక స్కూల్ పిల్లల విషయానికి వస్తే వారు మూడోతరగతిలో ఉన్నప్పుడు ఒకసారి; ఎనిమిది లేదా తొమ్మిదోతరగతిలో ఉన్న సమయంలో ఒకసారి కంటిపరీక్షలు నిర్వహిస్తే... ఆ సమయంలో ఏవైనా కంటిలోపాలు ఉన్నట్లు తెలుసుకుంటే అది చాలా మంచిదనీ, అది వారి మంచి భవిష్యత్తునకు సోపానమవుతుందనే భావన ఉంది. ప్రతి ఏటా ఈ మేరకు స్క్రీనింగ్స్ జరిగి, అవసరమైన వారికి సహాయం అందేలా మా సంస్థ కృషి చేస్తుంది. అలాగే అనేక రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, బాణాసంచా తయారుచేసే రంగాల్లోని కార్మికులు, (జిప్సీ వంటి) సంచార జాతుల్లోని అణగారిన వర్గాల ప్రజలకు అవసరమైన కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకూ ఏడాదికి 1,50,000 మందికి మా సంస్థ ద్వారా సహాయం అందుతోంది. మా ద్వారా సహాయమందే వారిలో పెద్దలూ, పిల్లలూ 65 : 35 నిష్పత్తిలో ఉంటున్నారు. ప్రస్తుతానికి 1.50 లక్షలమందికి సహాయం అందుతున్నా... మేం మెరుగుపరచుకుంటున్న కార్యకలాపాల వల్ల ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మేం పనిచేసే ప్రతిచోటా స్థానికంగా అక్కడ పనిచేస్తున్న ఐ–కేర్ ప్రొఫెషనల్స్తో కలిసి అక్కడి స్థానికులకు మా సేవలందేలా కార్యకలాపాలు చేపడుతున్నాం. మీరు చేపడుతున్న వినూత్న కార్యకలాపాల గురించి... వినోద్: అవును... కొన్ని వినూత్న కార్యకాలాపాలు సైతం నిర్వహిస్తున్నాం. నివారించదగిన అంధత్వాలను రూపుమాపడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మా సంస్థ కొన్ని వినూత్న కార్యక్రమల్ని చేపడుతోంది. హైదరాబాద సహా బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై వంటి నగరల్లో ‘‘వాక్ విత్ ద డార్క్’’ పేరిట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాక్ విత్ ద డార్క్లో పూర్తిగా అంధులైన వారు కొంతమంది సెలిబ్రిటీలతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సెలిబ్రిటీల కళ్లకు పట్టీలు కడతారు. అంధులు ఆ సెలిబ్రిటీల చేతి తమ చేతిలోకి తీసుకొని, వారి కార్యకలాపాల కోసం వారికి అన్ని విధాలా సహాయపడతారు. ఈ కార్యక్రమం ద్వారా అంధత్వం ఎంత దుర్భరంగా ఉంటుందనేది లోకానికి తెలియజెప్పడంతో పాటు, తగినంత చేయూత లభిస్తే అంధులు సైతం మిగతావారిలాగే ఎన్నో కార్యకలాపాలు చేయగలరనే సందేశం వెళ్తోంది. అలాగే నివారింపదగిన అంధత్వాన్ని తేలిగా రూపమాపడం మంచిదన్న సందేశమూ ఇస్తాం. ఇది అన్ని వర్గాల వారికీ చేరువై నివారింపదగిన అంధత్వంపై అవగాహన పెరగడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గత కొన్ని నెలల కిందట హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులోనూ ఈ తరహా కార్యక్రమాన్ని మేం చేపట్టాం. చాలా చోట్ల చేపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో చాలామంది ప్రజలు తేలిగ్గా నివారించదగ్గ అంధత్వానికి దూరమై, వారి జీవననాణ్యత పెరిగితే ప్రభుత్వాల మీద కూడా చాలా భారాలు తొలగిపోతాయి. -
మీ ఓటు.. మీ హక్కు !
పాలమూరు : ఓటు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.. రాజకీయ చరిత్రను తిరగరాయాలన్నా.. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు ఉంటేనే సాధ్యం. ఇంతటి విలువైన ఓటు హక్కుపై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓటు హక్కు కోసం దరఖాస్తే చేసుకోకపోగా.. మరికొందరు ఓటు హక్కు ఉన్నా పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు నిరాదరణకు గురవుతోంది. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. 10.26 లక్షల మంది జిల్లాలో చేపట్టిన 2018–స్పెషల్ సమ్మరి రివిజన్(ఎస్ఎస్ఆర్) పూర్తయ్యే సరికి మొత్తం 10,26,728 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,13,091 మంది కాగా, మహిళలు 5,13, 581 మంది ఉన్నారు. ఇక ఇతరులు (థర్డ్జెండర్) 56మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా 2018 ఓటరు తుది జాబితా..తాజా లెక్కలను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు తమకు ఓటు హక్కు గల్లంతైందని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ కొత్తగా అర్హత ఉన్న వారితో పాటు ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లు గల్లంతైన వారి కోసం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది ఇప్పటి వరకు 46,994 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 11,504మంది ఓటు హక్కు కల్పించారు. ఇంకా పలువురి దరఖాస్తులను తిరస్కరించగా.. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు శుక్రవారం ప్రత్యేకంగా ఓటరు సహాయ కేంద్రాలను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల వద్ద బూత్లెవల్ అధికారు(బీఎల్ఓ)లు అందుబాటులో ఉంటారు. బీబిఎల్ఓలను కలిసి నేరుగా ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు వంటి సవరణలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వొచ్చు. దీంతో పాటు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించారు. అలాగే, కొత్తగా ఓటర్లుగా నమోదైన పది మంది ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇవేకాకుండా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, సెమినార్లు, మానవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో సైతం మానవహారాలు, ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే, ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఓటుహక్కు పొందడం ఇలా... సమాజంలో 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. ఇదివరకే ఓటు ఉన్న వారు జాబితాలో పేరు ఉందా, లేదా అన్నది తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. తద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్సైట్లో పరిశీలించొచ్చు. అవగాహన కల్పిస్తున్నాం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ విద్యార్థులతో మానవహారం, ప్రతిజ్ఞ చేయిస్తాం. టౌన్హాల్లో ఓటరు దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓల ఆద్వర్యంలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. – స్వర్ణలత, డీఆర్వో, మహబూబ్నగర్ -
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
శ్రీకాకుళం, వీరఘట్టం: కళ్లు, కాళ్లు సక్రమంగా ఉన్న వాళ్లే డిగ్రీలు పూర్తిచేసి లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉపాధి వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్లు సరిగ్గా కనిపించకపోయినా డిగ్రీ పూర్తి చేసి స్వయం ఉపాధితో తనకో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావు విజయగాథ ఇది.. తిరుపతిరావుకు చిన్నప్పటి నుంచే దృష్టి లోపం ఉంది. అయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ బ్రాహ్మణుల వలే మంత్రాలు చదువుతూ బతుకు తెరువు కోసం అర్చకుడిగా మారాడు. గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో బాబా సేవలో ఉంటూ భక్తుల గోత్రనామాలతో పూజలు చేస్తుండేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతులు ఇస్తూ వేదపండితుని మాదిరిగా మంత్రాలు చదువుతూ ఆదర్శంగా నిలిచాడు. భక్తులు ఇచ్చే దక్షిణలతో కొంత మొత్తంతో పూజా సామగ్రి కొని మిగిలిన దానితో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల ఆవరణలో 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ కూడా చెబుతూ ముందుకు సాగుతున్నాడు. పట్టుదలతో ఉన్నత చదువు పూర్తి.. వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావుకు పుట్టినప్పటి నుండే దృష్టి సమస్య ఉంది. రాత్రి పూట మాత్రం ఏమాత్రం కనిపించదు. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. 1 నుంచి 7వ తరగతి వరకు కంబర పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు కంబరవలస హైస్కూల్లో, ఇంటర్ వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివాడు. పార్వతీపురం వెంకటేశ్వర కళాశాలలో బీకాంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉపాధి కోసం దూరప్రాంతం వెళ్లలేని పరిస్థితి కావడంతో గ్రామంలో ఉన్న సాయిబాబాను నమ్ముకున్నాడు. గ్రామస్తులు కూడా అండగా నిలిచారు. పక్కనే ఉన్న రామాలయం పూజారి వద్ద మంత్రాలు, పూజా విధానం నేర్చుకుని సాయిబాబా ఆలయంలో శాశ్వత అర్చుకుడిగా మారాడు. దేవుని సేవలో.. దృష్టిలోపం ఉన్న ఈ కుర్రాడికి పెళ్లి ఎలా అవుతుంది.. పిల్లను ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. ఇంతలో దేవుడే తోవ చూపించాడు. నాలుగేళ్ల కిందట పాలకొండ మండలం తంపటాపల్లికి చెందిన అప్పలనరసమ్మ అనే ఓ యువతి తిరుపతిరావును వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. పెద్దలు వీరికి వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. బాబానే నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి సాయిబాబానే నమ్ముకున్నాను. బీకాం డిగ్రీ పూర్తి చేసినా దూరం ప్రాంతంలో పనిచేయలేను. అందుకే బాబాసేవలో ఉంటూ స్థానికంగా ట్యూషన్ చెబుతూ స్వయం ఉపాధి పొందుతున్నాను. దేవుని సేవ చేసే అదృష్టం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భార్య చేదోడుగా ఉంటోంది.– పొగిరి తిరుపతిరావు, అర్చకుడు ,సాయిబాబా గుడి, కంబర, వీరఘట్టం మండలం -
దీని పేరు డొనాల్డ్ ట్రంపీ..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడినిఒక జంతువుతో పోల్చడమా?అది కూడా అన్ని అవలక్షణాలు ఉన్నదానితోనా? ఎందుకబ్బా అన్న సందేహం వస్తోందా? అయితే ఇందులో ఓ లుక్కేయండి.. బాగా డబ్బున్న వాడని చెప్పాలంటే బిల్గేట్స్ అని.. మహాభయంకరమైన క్రూరుడు అనాలని అనుకుంటే అడాల్ఫ్ హిట్లర్తోనూ పోలుస్తుంటారు!మరి.. కాళ్లు, చేతుల్లేని.. కళ్లు కూడా కనిపించని.. మట్టిలో తలదూర్చి బతుకీడ్చే ఓ జీవిని ఎవరితో పోలిస్తే బాగుంటుంది? ‘‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’’ అనేద్దాం అంటోంది ఎన్విరోబిల్డ్! రెండు అమెరికాలను కలిపే ప్రాంతంలో పనామా అని ఓ బుల్లి దేశం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు అక్కడో విచిత్ర జంతువును గుర్తించారు. దీనికేమో కళ్లు కనపడవు. కీళ్ల వంటివి లేకపోవడం తో అటు ఇటు కదల్లేదు. ఒక్కోటి పది సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యమైంది ఇదో ఉభయచరం. జంతుశాస్త్ర పరిభాషలో ఈ జంతువు కెసీలియన్ జాతికి చెందినది. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే గుడ్డిదైన పాముల జాతి అని అర్థం. చివరగా.. వాతావరణ మార్పుల వల్లే ఈ జీవి త్వరలోనే అంతరించిపోనుంది. కెసీలియన్ ఉభయచరాన్ని గుర్తించింది మొదలు శాస్త్రవేత్తలు దీనికేం పేరు పెట్టాలబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎటూ తేల్చుకోలేక.. పేరు పెట్టే హక్కులను వేలం వేశారు. ఇలా వచ్చిన డబ్బును అడవుల సంరక్షణకు వాడాలన్నది వారి ఆలోచన. చివరకు దాదాపు 25 వేల డాలర్లు అంటే రూ. 17 లక్షలు పెట్టి ఎన్విరోబిల్డ్ సీఈవో ఐడన్ బెల్ ఈ హక్కులను చేజిక్కించుకున్నారు. అన్ని రకాలుగా ఆలోచించి.. ఆ జంతువుకు ‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’ అనే పేరు పెడతా అని ప్రకటించాడు. ఆ ఉభయచరానికి.. డొనాల్డ్ ట్రంప్కూ ఏంటోయ్ సంబంధం? అని బోలెడంత మంది గద్దిస్తే బెల్ మాత్రం అదే కరెక్ట్ పేరని నొక్కి వక్కాణిస్తున్నాడు! వాతావరణ మార్పుల ప్రభావం అందరికీ కనపడుతున్నా ట్రంప్ అలాంటిదేమీ లేదంటున్నారు. కళ్లున్నా చూడలేకపోతున్నారు కాబట్టి కెసీలియన్ పాము జాతి జంతువులానే ప్రవర్తిస్తున్నారని వివరించాడు. అధ్యక్షుడయ్యాక.. భూతాపోన్నతిని నియంత్రించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకునేలా చేశారు. అంతేనా.. మనిషి చర్యల వల్లే భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతోందన్న శాస్త్రవేత్తల మాటలను వినిపించకుండా ఉండేలా మట్టిలో తలదూర్చుకుని ఉంటున్నారు. ఇవన్నీ సరిపోవా ఆయనగారి పేరును ఈ ఉభయచరానికి పెట్టేందుకు? అని బెల్ ప్రశ్నిస్తున్నాడు. పోలికలు అచ్చుగుద్దినట్లు సరిపోయాయి.. ఇంకేముంది ఆ పేరు ఖాయం చేసేద్దాం అనుకుంటున్నారా? అంత ఈజీ కాదులెండి! శాస్త్రవేత్తల బృందం ఒకటి ఓకే చెబితేనే ‘డెర్మోఫిస్ డొనాల్డ్ ట్రంపీ’పేరు రూఢీ అవుతుంది. -
అధికార పార్టీ అరాచకం
అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఒంగోలులో విధుల్లో ఉన్న బీఎల్వోతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగి ఆమెతో దురుసుగా మాట్లాడారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేని ఆమె అక్కడికక్కడేకుప్ప కూలిపోయింది. ఒంగోలు: అధికార పార్టీ అరాచకం పరాకాష్టకు చేరిందనేందుకు ఆదివారం ఒంగోలులో జరిగిన ఘటనే నిదర్శనం. బీఎల్వో విధుల్లో ఉన్న కసుకుర్తి జయశ్రీపై పలువురు టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో వారిని నిలువరించడం అక్కడ ఉన్నవారందరికీ కష్టంగా మారింది. మహిళని కూడా చూడకుండా ఆమె మనసు తీవ్రంగా గాయపడేలా మాట్లాడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటన స్థానిక బైపాస్కు పడమర వైపు ఉన్న వివేకానంద విద్యావిహార్ (కొడవల్లూరు సుబ్బారెడ్డి) హైస్కూల్లో చోటుచేసుకుంది. ఏం..జరిగిందంటే? ఈ నెల 21న టీడీపీ నాయకుడు వాసు, మరికొంతమంది వచ్చి ఓటర్లను బండిల్స్గా తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె ససేమిరా అంది. ఆమెపై ఒత్తిడి తెచ్చారు. చివరకు అక్కడకు వెళ్లిన అధికారులు సైతం ‘మీరు అధికార పార్టీ నేతల టార్గెట్లో ఉన్నారు. ఎందుకు అనవసరమైన రాద్ధాంతం..దరఖాస్తులు తీసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇది ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమని, తాము అలా తీసుకోలేమంటూ బీఎల్వోలు తిరస్కరించారు. విషయం వైఎస్సార్ సీపీ నేతల దృష్టికి చేరడంతో వారు కూడా అక్కడకు చేరుకున్నారు. విషయం సద్దుమణిగింది. ఇది ఈ ఒక్కచోటే కాదు.. అనేక పోలింగ్ బూత్ల్లో పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 40 మందికిపైగా బూత్ లెవల్ ఆఫీసర్లు మరునాడైన సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు రక్షణ కల్పించకుంటే బీఎల్వోలుగా విధులు నిర్వహించలేమంటూ తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని మీడియాకు కూడా వివరించారు. ఈ వీడియో వాట్సప్లో రావడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకుడు వాసు కొంతమందితో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఆమెతో ఈ ఆదివారం వాగ్వాదానికి దిగాడు. అతనికి ఆమె సమాధానం చెబుతుండగానే వాసుతో పాటు వెళ్లిన జిల్లెలమూడి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆమెపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైపైకి వెళ్లడంతో ఒక్కసారిగా ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకొని భావోద్వేగానికి గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. అధికార పార్టీ నాయకుల అరాచక వాగ్వాద్దానికి తట్టుకోలేక బీఎల్ఓ పడిపోయారనే సమాచారం రావడంతో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గంటా రామానాయుడు, ఓగిరాల వెంకట్రావు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పడిపోయిన జయశ్రీని తమ కారులో ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడ ఉన్న వారికి చెప్పారు. అలా అయితే తమపై రాజకీయ ముద్రవేస్తారని, తాము ఇప్పటికే తహసీల్దార్కు సమాచారం అందించామని పేర్కొంటూ అక్కడ ఉన్న వారు విజ్ఞప్తి చేశారు. మరో వైపు సమస్య తన దృష్టికి రావడంతో సంఘటన స్థలానికి వెళ్లాలంటూ తహసీల్దార్ను ఒంగోలు ఆర్డీవో ఆదేశించారు. తహసీల్దార్ బ్రహ్మయ్య అక్కడకు చేరుకుని పరిశీలిస్తే ఆయనకు సైతం నోటమాట రాలేదు. ఒక వైపు శ్వాస పీల్చుకునేందుకు జయశ్రీ కష్టపడుతుండటంతో అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపి ఆమెకు ప్రాథమిక సహాయక చర్యలు అందించాలని సూచించారు. టీడీపీ నాయకులపై తహసీల్దార్ ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో వారు అదృశ్యమయ్యారు. అధికారుల్లో టెన్షన్ తహసీల్దార్ నుంచి సమాచారం అందగానే ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్ వివేకానంద విద్యావిహార్ వద్దకు చేరుకున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటోందని బీఎల్ఓలు ఆయనకు వివరించారు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇతర బీఎల్వోలతో ఆర్డీవో పెంచల కిశోర్ మాట్లాడారు. ప్రాథమిక చికిత్స అనంతనం తహసీల్దార్ బ్రహ్మయ్య తన కారులో జయశ్రీని రిమ్స్కు తరలించేందుకు యత్నిస్తుండగా 108 చేరుకుంది. 108లో ఆమెకు రిమ్స్కు తరలించారు. తన కుమార్తె ఇటీవలే ప్రాణాపాయం నుంచి బయటపడిందని జయశ్రీ తల్లి కోటమ్మ తెలపడంతో ఆమెకు గతంలో చేసిన వైద్యం తాలూకా రిపోర్టులు ఉంటేగానీ తాము అడుగు ముందుకు వేయలేమంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. రెండున్నర గంటల సమయంలో ఆమె కోలుకొని చిన్నగా మాట్లాడుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి మెరుగైందని, ఆమె ఎటువంటి ఒత్తిడికి గురికారాదంటూ కుటుంబ సభ్యులు, అధికారులకు వైద్యులు సూచించారు. వైఎస్సార్ సీపీ నాయకుల అసంతృప్తి జయశ్రీ మాటాపలుకు లేకుండా పడిపోయి ఉండడాన్ని చూసిన వైఎస్సార్ సీపీ నాయకులు తహసీల్దార్ బ్రహ్మయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. గత వారం ఫిర్యాదు చేసినా కనీసం సమస్యాత్మక కేంద్రం వద్ద పోలీసులను ఎందుకు మోహరింపజేయలేకపోయారంటూ మండిపడ్డారు. కట్టలు కట్టలుగా కనీస ఆధారాలు కూడా లేకుండా దరఖాస్తులు తీసుకొస్తుంటే భవిష్యత్తులో జరిగే చర్యలకు బీఎల్ఓలు బాధ్యులు కావాలా..అంటూ నిలదీశారు. బాధ్యతాయుతంగా పనిచేసే వారికి రాజకీయాలు అంటగట్టడం సరికాదని, కనీసం పడిపోయినప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించాలనే ఆలోచన అధికార పార్టీ నాయకులకు రాకపోవడం శోచనీయమని విమర్శించారు. -
బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు
సాక్షి, హైదరాబాద్: అంధుల సదుపాయార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్) జారీ చేపట్టింది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ చేతుల మీదుగా కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు. ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది. ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి.. తదితర వివరాలున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర కమిషనర్ బి.శైలజ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు, వలంటీర్లు, చక్రాల కుర్చీలు, తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డు ఐకాన్లుగా దివ్యాంగ సెలబ్రిటీలు.. వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్న 9 మంది దివ్యాంగులతో ఓపీ రావత్, కమిషనర్లు అశోక్ లవాసా, సునీల్ అరోరా సమావేశమయ్యారు. అంధత్వ దివ్యాంగులైన గాయని శ్రావ్య, అంతర్జాతీయ క్రికెటర్లు మహేందర్ వైష్ణవ్, జి.మధు, ఐటీ డెవలపర్ అనీస్ సుల్తానా, రేడియో జాకీ టి.వెంకటేశ్, బధిర దివ్యాంగులు నటి అభినయ, ఆర్థోపెడిక్కు సంబంధించి సైంటిస్ట్ (ఆర్ అండ్ డీ) థాండర్ బాబూ నాయక్, బారియర్ ఫ్రీ కంపెయినర్ నర్సింగ్రావు, టీవీ యాంకర్ సుజాత వీరిలో ఉన్నారు. ఐకాన్లుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు వీరంతా సమ్మతి తెలిపారు. సదరం జాబితాలోని వివరాలతో రాష్ట్రంలోని 4,12,098 మంది దివ్యాంగులను ఓటరు జాబితాలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో దాదాపు 56 వేల మంది అంధత్వ దివ్యాంగులున్నారని తెలిపారు. వాదా యాప్ ప్రారంభం.. హైదరాబాద్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ చైతన్య రథాలు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సహాయపడే మొబైల్ యాప్ ‘వాదా’(ఓటర్ యాక్సెస్బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్)లను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్ ప్రారంభించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లవాస, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ చైతన్య రథాల్లో కొన్నింటిని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులందరూ ఓటు వేసేందుకు సహాయ సహకారాలు అందించేందుకు వాదా యాప్ను రూపొందించామని దానకిశోర్ వివరించారు. -
అమావాస్య చందమామ!
కథానాయికలు కేవలం గ్లామర్కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు. -
దృష్టిలోపం ఉన్నవారికీ ఎంబీబీఎస్ చాన్స్
న్యూఢిల్లీ: దృష్టిలోపం ఉన్న అర్హులైన అభ్యర్థులు వైద్యవిద్య (ఎంబీబీఎస్)ను అభ్యసించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018 నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో పాసైనప్పటికీ దృష్టిలోపం ఉండటంతో అడ్మిషన్ కోల్పోయిన అశుతోశ్ అనే ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం.. దివ్యాంగుల కోటాలో అశుతోశ్కు అడ్మిషన్ ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ను ఆదేశించింది. 2018–19 విద్యాసంవత్సరంలోనే ఆయనకు ఎంబీబీఎస్ చేసేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై సీనియర్ కంటివైద్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసిన సుప్రీంకోర్టు వారిచ్చిన సూచనల ఆధారంగానే ఈ తీర్పునిచ్చింది. దివ్యాంగుల కోటా కింద అభ్యర్థి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందేందుకు అర్హుడంది. గతేడాది ఇద్దరు వర్ణ అంధత్వం ఉన్న విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెలువరించింది. కంటిచూపు సరిగాలేదనే కారణంతో అడ్మిషన్లను నిరాకరించలేమని స్పష్టం చేసింది. -
చూపు వస్తే ముందుగా జగనన్ననే చూస్తా..
-
ఎఫ్బీ, వాట్సాప్ బ్లాక్పై అభిప్రాయాలు చెప్పండి
న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహా యాప్స్ను బ్లాక్ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల అసోసియేషన్ (ఐఎస్పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయడంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కంప్యూటర్ ద్వారా ఏ సమాచారాన్ని కూడా పొందకుండా నిరోధించేందుకు ఉపయోగించతగిన అధికారాలను ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ తెలియజేస్తోంది. వాట్సాప్లో వచ్చిన వదంతుల ఆధారంగా ఇటీవలి కాలంలో అల్లరి మూకలు కొందరిపై దాడులకు దిగడం, కొట్టి చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఐటీ శాఖ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ... ‘‘సదరు సందేశాలు ఎలా వచ్చాయన్నది తనవంతుగా గుర్తించేందుకు వాట్సాప్ కట్టుబడి లేదు. ప్రభుత్వ డిమాండ్లలో ఇది కూడా ఒకటి. దుర్వినియోగానికి అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ తీసుకున్న చర్యల విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ప్లాట్ ఫామ్ను దుర్వినియోగం చేస్తున్న వారిని, సందేశాలతో రెచ్చగొడుతున్న వారిని గుర్తించే విషయమై బాధ్యతను విస్తరించజాలదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అలాగే, తగిన చర్యలు తీసుకోకపోతే వదంతుల వ్యాప్తి, ప్రోత్సాహక ప్లాట్ఫామ్గా ఫేస్బుక్ను గుర్తించాలంటూ ఆ శాఖకు పంపిన రెండో నోటీసులో హెచ్చరించింది. -
సత్వర దర్యాప్తు..ఉరిశిక్ష పడేలా చార్జిషీట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చెన్నై దివ్యాంగ బాలికపై రేప్ కేసులో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని తమిళనాడు పోలీసులు పట్టుదలగా ఉన్నారు. 3 నెలల్లోగా విచారణ ముగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. చెన్నైలోని అయనవరం ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్కు చెందిన దివ్యాంగ బాలిక(11)పై ఏడునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న 23 మందిలో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. ‘అయనవరం రేప్ కేసు ఒక్కటేకాదు లైంగిక నేరాల కేసులన్నీ త్వరగా∙విచారణ పూర్తి చేయాలి, కోర్టులు ఇలాంటి ఉదంతాలపై విచారణను వేగంగా ముగించి నిందితులను శిక్షించాలి’ అని మద్రాసు హైకోర్టు సీజే ఇందిరా బెనర్జీ బుధవారం పోలీసులు ఆదేశించారు. నిందితుల్లో 17 మంది నుంచి వాంగ్మూలం తీసుకుని రిమాండ్కు పంపారు. మిగతా వారి గాలింపు కోసం 50 మంది పోలీసులతో 5 బృందాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన హాసిని అనే ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన దశ్వంత్ అనే యువ ఇంజనీరుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసింది. ఈ తరహాలో అయనవరం నిందితులకు ఉరిశిక్ష పడేలా పగడ్బందీగా చార్జిషీటు వేయాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. నిందితులపై హత్యాయత్నం, ఫోక్సోచట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ సెక్షన్లపై కేసులు పెడితే ఉరిశిక్షకు అవకాశాలు ఎక్కువ. -
సూపర్ సవాల్
అడుగులు ముందుకు వేయడానికి చెవులకు, బ్రెయిన్కి పని చెబుతున్నారు కథానాయిక వరలక్ష్మీ శరత్కుమార్. అంత అందమైన కళ్లు ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే నిజ జీవితంలో చేయడం లేదు. సినిమాలో క్యారెక్టర్ కోసం చేస్తున్నారు. ఆల్రెడీ అరడజను సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ మరో సినిమాకు పచ్చజెండా ఊపారు. జేకే అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నారు వరలక్ష్మీ. ‘‘కొత్త సినిమా మొదలైంది. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి. తొలిసారి బ్లైండ్ క్యారెక్టర్లో నటించబోతున్నాను. ఇది నాకు సూపర్ చాలెంజింగ్ రోల్. సూపర్ ఎగై్జటింగ్గా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. మాథ్యూ ఛాయాగ్రాహకుడు. -
అంధురాలుగా వరూ!
తమిళసినిమా: నటి వరలక్ష్మి రూటే సపరేటు అనవచ్చు. సాధారణంగా కథానాయకిగా ఎదుగుతున్న నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడానికి అంగీకరించరు. తరువాత అలాంటి పాత్రలకే పరిమితం చేస్తారనే భయమే అందుకు కారణం. అయితే ఇందుకు పూర్తి భిన్నం వరలక్ష్మి. ఓటమి నుంచి విజ యం వైపు అడుగులు వేస్తున్న నటి వరలక్ష్మి. తొలి చిత్రం పోడాపోడీ నిరాశపరిచింది. బాలా దర్శకత్వంలో నటించి న తారైతప్పట్టై చిత్రం పరాజయం పొందినా, వరలక్ష్మి నటిగా ప్రశంసలందుకుంది. అలాంటి ఈ సంచలన నటి ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. అలాగని ఆమెకు హీరోయిన్గా అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో చిన్న పాత్రలోనే కని పించింది. అయితే అది కథకు కీలకమేననుకోండి. అలా సండైకోళి–2, హెచ్చరికై ఇదు మనిదర్గళ్ నడమాడుం ఇడం, కన్నిరాశి, వెల్వెట్ నగరం, సర్కార్, మారి–2, నీయా 2, శక్తి చిత్రాలు చేస్తూ హీరోయిన్గా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి పాత్రల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. జేకే అనే నవదర్శకుడి దర్శకత్వంలో నటించనుంది. సాయి సమరత్ మూవీస్ పతాకంపై జయప్రకాశ్, పవిత్ర కే.జయరామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో వరలక్ష్మి అంధురాలిగా నటించనుండడం విశేషం.దీనికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, మెథ్యూ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డుల్ని త్వరలో జారీచేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయకర్తలను నియమించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఓటర్కార్డుల్నే కాకుండా ఓటర్ స్లిప్పులను కూడా దివ్యాంగులు వాడుకునేలా రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడంపై బుధవారం నాడిక్కడ జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రావత్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై దివ్యాంగులకు అవగాహన కల్పిచేందుకు త్వరలోనే ఓ యాప్ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆడియో, వీడియోలతో పాటు సైగ భాషల రూపంలో వీరికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. -
జిల్లాలో నిండుకున్న విటమిన్ ఏ ద్రావణం
బొబ్బిలి: రేచీకటి, అంధత్వాన్ని నివారించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్ ఏ సిరప్ నిల్వల కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో చిన్నారుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ద్రావణం జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండుకుని సుమారు రెండు నెలలు గడచింది. పుట్టిన బిడ్డలకు 9వ నెల నుంచి ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి తప్పనిసరిగా వేయాల్సిన విటమిన్ ఏ ద్రావణం గతంలో నిత్యం సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడా నిల్వలు కానరా వడం లేదు. గతంలో నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చేసరికి సరఫరా చేసేవారు. కానీ రెండు నెలలు అవుతున్నా గానీ అటు జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఈ ద్రావణం లేక చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర కలత చెందుతున్నారు. ఇతర వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ముఖ్యమైన ఈ వ్యాక్సిన్ లేకపోవడంతో తల్లి దండ్రులు తమ చిన్నారుల భవిష్యత్తుపై అల్లాడుతున్నారు. కేవలం బొబ్బిలిలోని సీహెచ్సీలోనే ప్రతీ ఆరు నెలలకోసారి సుమారు 200కు పైగానే చిన్నారులకు ఈ ద్రావణం వేసేవారు. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు ఈ ద్రావణం వేస్తారు. ఇలా ప్రతీ సారి 9 నెలలు నిండిన ప్రతిబిడ్డకూ ఈ ద్రావణాన్ని వేయడం తప్పనిసరి, చిన్నారుల్లో ఈ ద్రావణం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఈ ద్రావణాన్ని ఇతర మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని కూడా రాయడం లేదు. బయట ఈ ద్రావణం దొరికే అవకాశం లేదు. గతంలో ఈ ద్రావణాన్ని సరఫరా చేసే సంస్థ నాణ్యతలో లోపాలతో పంపిణీ చేయడంతో అధికారులు వీటిని తిప్పి పంపారు. అయితే తిరిగి మరి ఆస్పత్రులకు ద్రావణాన్ని వేయకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మందుల కొరత వలన చిన్నారుల దృష్టి లోపం, రోగనిరోధక శక్తి, రేచీకటి సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. సర్దుబాటు చేస్తున్నాం.. రెండు నెలలుగా విటమిన్ ఏ ద్రావణం సరఫరా లేకపోయినప్పటికీ తమ వద్ద ఉన్న నిల్వ లతో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. నెల రోజుల క్రితం వరకు విటమిన్ ఏ డోసులు అందించాం. ఈ విషయమై డీఐఓ కార్యాలయానికి నివేదించామని, అక్కడ నుంచి హైదరాబాద్కు ఇండెంటు పెట్టినట్లు వారు చెప్పారు. – డాక్టర్ విజయ్మోహన్, బొబ్బిలి పీపీ యూనిట్ అధికారి. పిల్లలకు ఇతర విటమిన్ ద్రావణాలు వేస్తున్న దృశ్యం -
ముషార్రఫ్కు భారీ షాక్; పాస్పోర్టు రద్దు..!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్కు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషార్రఫ్ పాస్పోర్టును రద్దు చేయాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ముషార్రఫ్ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజ్యద్రోహం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ముషరాఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఉండాలనే లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డేటా బేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్పోర్టు డైరెక్టరేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించాయి. కోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ముషార్రఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కొల్పోవడంతోపాటు, బ్యాకింగ్ సేవలను వినియోగించుకోలేరు. -
వజ్రంలాంటి విశ్వాసం
అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా రాజుగారు ఎంతో ఉత్సాహంగా సభా వ్యవహారాలను ప్రారంభించారు. అంతలో ఒక వ్యక్తి రాజదర్బారులో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా దగ్గర అమూల్యమైన రెండు వజ్రాలున్నాయి అందులో ఏది అసలైనదో, ఏది నకిలీదో తెలుసుకునేందుకు నేను తిరగని సంస్థానమంటూ లేదు, చేరని రాజ్యమంటూ లేదు. మీరేమైనా పసిగట్టగలరా’’ అని ప్రశ్నించాడు. రాజుగారు ఆ రెండు వజ్రాలను చేతిలోకి తీసుకొని ‘‘ఈ రెండూ ఒకేలా ఉన్నాయిగా’’ అన్నారు ఆశ్చర్యంగా. దానికి ఆ వ్యక్తి ‘‘ఇందులో ఒకటి వెలకట్టలేని వజ్రం. రెండోది గాజుది. మీ కొలువులో ఉన్న వారిలో ఎవరైనా, ఇందులో అసలు వజ్రాన్ని పసిగడితే ఆ వజ్రాన్ని నేను కానుకగా అందిస్తాను. కనుక్కోలేకపోతే ఆ వజ్రానికి తగ్గ మూల్యం చెల్లించాలి’’ అని సవాల్ విసరాడు. రాజుగారు, మంత్రులు, ఇతర అధికారులు ఆ వజ్రాన్ని చేతిలో తీసుకుని ఎంత పరిశీలించినా వారికి అర్థం గాక తీవ్ర నిరాశ చెందారు. ఈ విషయం ఆ రాజ్యంలోని ఒక పుట్టుగుడ్డి చెవిలోనూ పడింది. తెలిసిన వారి సహాయంతో రాజదర్బారుకు చేరుకున్న ఆ అంధుడు రాజుగారితో ‘‘అయ్యా! నేను అసలు వజ్రాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తాను. నాకో అవకాశం కల్పించండి’’ అని వేడుకున్నాడు. అంధుడి మాటలు రాజుగారిలో కొత్త ఆశను రేకెత్తించడంతో అందుకు సరేనన్నారు. ఆ అంధుడు ఆ వజ్రాలను తడిమి చూసి, ఫలానా వజ్రం అసలైనది, ఫలానా వజ్రం నకిలీదని వెంటనే తేల్చి చెప్పాడు. వజ్రాన్ని తెచ్చిన వ్యక్తి ఖంగుతిన్నాడు. షరతు ప్రకారం వజ్రం రాజుగారి సొంతమయ్యింది. కళ్లు లేకపోయినా అసలు వజ్రాన్ని కనిపెట్టిన అంధుడిని అభినందించారు అందరూ. ఎలా కనిపెట్టగలిగావంటూ అంధుడిపై ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ‘ఈ రెండు వజ్రాల్లో ఒకటి వేడిగా ఉంది. ఒకటి చల్లగా ఉంది. ఎండకి వేడెక్కిన వజ్రం నకిలీదని పసిగట్టాను’ అని చెప్పాడు ఆ అంధుడు. అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అసలైన విశ్వాసులు నకిలీ వజ్రంలా వేడెక్కరు. అసలు వజ్రంలా ప్రశాంతంగా ఉంటారు. -
జాబితాలో సవరణకు అవకాశం
ధరూరు : ఓటరు లిస్టులో సవరణల కోసం ఈ నెల 8 వరకు అవకాశం ఉందని దానిని రాజకీయ పార్టీల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి నరసింహనాయుడు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో అయిదో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు లిస్టులో తొలగింపు చేయాల్సి ఉందని, కొత్తగా చేర్చిన వారి జాబి జాబితాలో నమోదు కాలేదని నాయకులు ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్ట్రోరల్ అధికారి, లేదా డీపీఓలను కలవాలని సూచించారు. మూడు చోట్ల ఓటు హక్కు.. మల్దకల్ : ప్రభుత్వం ఒక ఓటరు ఒకే చోట తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిబంధనలు విధించినప్పటికీ బీఎల్ఓల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొన్ని గ్రామాల్లో ఒక ఓటరు మూడు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మండల అధ్యక్షుడు పాలవాయి రాముడు, బ్రహ్మోజిరావు, బంగి గోవిందులు ఆరోపించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సూపరింటెండెంట్ రాజారమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాలో ఒక కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరైనా వేర్వేరు చోట ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఈ నెల 10లోపు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటరు జాబితాలో కొందరు ఓటర్ల పేర్లను బీఎల్ఓలు తొలగించకుండా అలాగే ఉంచారని, బీఎల్ఓలు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ.. వారి అనుచరుల పేర్లు తొలగించడం లేదన్నారు. వివాహాలు చేసుకుని వెళ్లిన, గ్రామంలో నివాసం లేకుండా వెళ్లిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉన్నాయని వాటన్నింటిని తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సవారమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు, నీలిపల్లి కృష్ణయ్య, కిశోర్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వెబ్సైట్లూ నియంత్రణ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగంలో అవాంఛిత అంశాల నియంత్రణకు స్కూళ్లు, గ్రంథాలయాలు, వ్యాపార,వాణిజ్ యసంస్థలు వంటివి ‘ఫిల్టరింగ్ టెక్నాలజీ’ ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. ప్రధానంగా అశ్లీలసైట్లు (పోర్నోగ్రఫీ), సమాచారం దొంగిలించే పథకాలు (ఫిష్షింగ్ స్కీమ్స్), రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి విభిన్న అంశాల నియంత్రణకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా దీనిని ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, అంశాలు నియంత్రిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్లో దాదాపు 1200 ప్రత్యేక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ (వెబ్అడ్రస్, వనరు గా పిలిచే యూఆర్ఎల్ ) బ్లాక్ అయినట్టు యూనివర్సిటీ ఆఫ్ టొరెంటోకు చెందిన ‘సిటిజన్ ల్యాబ్’ తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సెన్సారింగ్ అమలు తీరుపై జరిపిన విస్తృత అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. భారత్లో ఏయే సైట్లు బ్లాక్ చేశారన్నది సొంతంగా పరిశీలించేందుకు సిటిజన్ల్యాబ్తో ముంబయికి చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక కలిసి పనిచేసింది. ఇంటర్నెట్ను సెన్సార్ చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగిస్తున్న ఇండియాలో ఇటువంటివి జరగడం ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. గతంలో ప్రధానంగా పోర్న్, గేమింగ్ సైట్స్పై దృష్టి పెట్టినా, ఇప్పుడు జాతీయ భద్రతపైకి మళ్లింది. మానవహక్కుల బృందాలు, ప్రభుత్వేతర సంస్థల సైట్లు బ్లాకయ్యాయి. బ్లాకవుతున్నాయి’ అని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రీతూ సరీన్ చెప్పారు. ఇదీ పరిశోధన...! కెనడాకు చెందిన వాటర్లూ సంస్థ నెట్స్వీపర్ ‘ఇంటర్నెట్ ఫిల్టరింగ్ టెక్నాలజీ’ సహాయంతో భారత్తో సహా పాకిస్థాన్, అప్గనిస్తాన్, బహ్రెయిన్,కువైట్, ఖతార్, సుడాన్, యూఏఈ, యెమన్, సోమాలియా నెట్స్వీపర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ పది దేశాలు కొన్ని ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా ‘సెన్సార్’ చేస్తున్నట్టు తాజాగా తమకు ఆధారాలు దొరికాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా వార్తలు, మతపరమైన, రాజకీయ విమర్శలు, వ్యతిరేక ప్రచారాంశాలు, లెస్బియన్, గే, బై సెక్పువల్, ట్రాన్స్జెండర్స్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)ల వనరులు, వంటి విషయాలపై ఇంటర్నెట్ సెన్సార్ అమలవుతున్నట్టు పేర్కొన్నారు. వెల్లడైన అంశాలు... గూగుల్ సెర్చ్లో గే, లెస్బియన్ అనే కీ వర్డ్లను యూఏఈ, బహ్రెయిన్, యెమన్ బ్లాక్చేశాయి అబార్షన్లు అనే కేటగిరి కింద ఉన్న వెబ్సైట్లన్నింటిని కువైట్ పూర్తిగా బ్లాక్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను యూఏఈ, కువైట్లలో పోర్నోగ్రఫీ కింద వర్గీకరించాయి రాజకీయవార్తలు, అభిప్రాయాలు, విమర్శలకు వేదికలుగా ఉన్న వెబ్సైట్లను బహ్రెయిన్, ఖతార్, సుడాన్, సోమాలియా బ్లాక్ చేశాయి యెమన్లో అంతర్యుద్ధానికి సంబంధించి ఇంటర్నెట్లో సరైన సమాచారం అందకుండా హౌతి తిరుగుబాటుదారులపై నియంత్రణ ఉంది భారత్లో శరణార్థుల సంక్షోభంపై ఫేస్బుక్ గ్రూపుల్లో చర్చ, అల్జజీర, యూకే టెలిగ్రాఫ్ కథనాలు, యూట్యూబ్, ట్విటర్, ఫేస్బుక్లలో ప్రత్యేక అంశాలపై చర్చను బ్లాక్ చేస్తున్నారు కువైట్లో అబార్షన్, సెక్స్ ఎడ్యుకేషన్, అల్కహాల్ సంబంధిత అన్ని సైట్స్ సెన్సార్ బహ్రెయిన్లో రాజకీయ, మానవహక్కుల గ్రూపుల, గూగుల్లో గే, లెస్బియన్ సెర్చ్లపై నియంత్రణ యూఏఈలో రాజకీయ,మానవహక్కులసంఘాలతో పాటు గ్రీన్పీస్ వార్తలు,ప్రత్యామ్నాయ జీవనశైలి (ఎల్జీబీటీక్యూ)పై సెన్సార్ యెమన్లో ఇంటర్నెట్ ప్రైవేసీ టూల్స్, ప్రతిపక్షరాజకీయపార్టీలు, ప్రతిపక్షాల వార్తలపై ఆంక్షలు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాస్టారి వ్యథ
భీమవరం టౌన్:ఆయన ఎందరికో విద్యనేర్పిన మాస్టారు. నేడు వృద్ధాప్య పింఛను కోసం అందరి చుట్టూ తిరుగుతూ.. మలి జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. జీవనయాత్రలో తగిలిన ఎదురు దెబ్బలకు మతిచలించి, కంటిచూపు దెబ్బతిన్న ఆ మాస్టారుకు తోడు, నీడగా భార్య ఉన్నారు. కుటుంబ పోషణకు ప్రభుత్వం మంజూరు చేసే వెయ్యి రూపాయల పింఛను కోసం ఆ వృద్ధ దంపతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ నెలలో అయినా పింఛను వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసినఆ దంపతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రజా సాధికారిత సర్వేలోనమోదు కాలేదంటూ ఆ మాస్టారుకు పెన్షన్ మంజూరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ తెలుగు మాస్టారు గోడు ఇది. ఆ మాస్టారు పేరు తూరుభట్ల కృష్ణ. వయస్సు 68. నడుము వంగిపోయి.. మతిస్థిమితం సరిగా లేక.. కళ్లు కనిపించని స్థితిలో ఉన్న కృష్ణ మాస్టారును భార్య శ్యామల రిక్షాలో ఎక్కించుకుని సోమవారం భీమవరం మున్సిపాలిటీకి తీసుకువచ్చింది. ఈనెల కూడా పింఛను మంజూరు కాలేదని తెలిసి ఆమె నిశ్చేçష్టురాలయ్యారు. ఒక్క నిమిషం పాటు భర్త చేతిని వదిలి ఆమె మున్సిపల్ సిబ్బందిని వివరాలు కనుక్కుంటున్న సమయంలో.. ఆసరా కోల్పోయానేమోనని కంగారు పడుతూ ఓయ్ ఓయ్ అని పిలుస్తున్న భర్తను సమీపించి చేతిని ఆసరాగా ఇచ్చి ఏమీకాలేదులెండి అంటూ సముదాయిస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ గోడును శ్యామల వెళ్లబోసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... మతిస్థిమితం లేదు.. కళ్లు కనిపించవు తూరుభట్ల కృష్ణ 1949లో రాజమహేంద్రవరంలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్నారు. తెలుగుభాషపై మంచి పట్టు ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలుగు పాఠాలు బోధించేవారు. భీమవరానికి చెందిన తనకు ఆయనతో వివాహమైంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. 1985లో పాలకోడేరు వచ్చి భారతీ కాన్వెంట్ను స్థాపించాం. 2004 వరకూ ఆ కాన్వెంట్ను నడిపాం. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెల వివాహ నిమిత్తం కాన్వెంట్ను అమ్మేశాం. ఒక కుమార్తెకు గోపాలపురం, మరో కుమార్తెకు రాజమహేంద్రవరంలో సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాం. భీమవరం ప్రాంతంలో పలు ప్రైవేటు కాన్వెంట్లలో ఆయన తెలుగు పాఠాలు బోధించేవారు. ఆ వచ్చిన జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. కొన్నేళ్ల క్రితం గోపాలపురం సంబంధం చేసిన కుమార్తె సమస్యలతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన కృష్ణ మాష్టారు షాక్కు గురై తలను గోడకేసి కొట్టుకోవడంతో నరాలు చిట్లి మతి చలించడంతో పాటు కంటిచూపు కోల్పోయారు. తోటివారి సాయంతో కుటుంబ పోషణ ఆ తర్వాత ఆయన వద్ద పనిచేసిన కొందరు ఉపాధ్యాయులు, పలు కాన్వెంట్లు,, విద్యా సంస్థల్లోని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన సహాయంతో జీవనం గడుపుతున్నాం. మందులు, కుటుంబ పోషణకు ఎన్నో ఇబ్బందులు పడుతూ నెట్టుకువస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుందని దరఖాస్తు చేసుకుంటున్నా రావడంలేదు. ఇటీవలే ఏలూరు వెళ్లి అధికారులను కలిసి గోడు చెప్పుకున్నాం. ఏప్రిల్ నెలలో వస్తుందని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. తీరా సర్వేలో నమోదు కా>లేదని అందువల్ల పింఛను రాదని చెబుతున్నారు. విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా ప్రజా సాధికారిత సర్వేలో ఆ కుటుంబ వివరాలు నమోదు చేయించి పింఛనుకు దరఖాస్తు చేయిస్తే మంజూరు అవుతుందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే కృష్ణ మాస్టారు పింఛను వ్యవహారంపై సాక్షి మున్సిపల్ కమిషనర్ నాగనర్సింహారావును ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఆయన గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పింఛను మంజూరు కాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటాను. ఆయన అర్హుడైనప్పటికీ మంజూరు సమయంలో దరఖాస్తుపై పొందుపరిచిన చిరునామాలో అందుబాటులో లేకపోతే నాట్ ట్రేస్డ్ అని ఉద్యోగులు పైకి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కృష్ణ మాస్టారుకు పింఛను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. సాధికారిత సర్వేలో లేరని తెలిసింది. ఆ సర్వేలో కూడా ఆ కుటుంబం పేర్లు పొందుపరిస్తే త్వరితగతిన పింఛను మంజూరయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఆయనకు సొంతిల్లు లేకపోతే ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకంలో వచ్చేందుకు కృషి చేస్తాను. -
నీ వెలుగే నీకు దారి చూపాలి?
అది జపాన్లోని ఒక పల్లెటూరు. అక్కడ ఒకాయనకు కళ్లు కనబడేవి కావు. ఒక రోజు ఆయన ఒక పని మీద ఒక పెద్దమనిషిని కలవడానికి వెళ్లాడు. అన్నీ తనకు అలవాటైన తోవలే. మాట్లాడుతూ ఉండగానే చీకటి పడింది. ఇక బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అయితే, ఈయనను ఒంటరిగా తిరిగి ఇంటికి పంపడం పెద్దమనిషికి ఇష్టం లేదు. నాకేం ఫరవాలేదన్నాడు అంధుడు. ఆ కాలంలో జపాన్లో వెదురు, కాగితంతో చేసిన లాంతరు వాడేవారు. లోపల క్యాండిల్ ఉండేది. అట్లాంటి లాంతరు ఒకటి వెలిగించి ఇచ్చి, ఇక బయలుదేరమన్నాడు పెద్దమనిషి.‘నాకు ఎటూ కనబడదుకదా! నా చేతిలో లాంతరు ఉంటేనేం, లేకపోతేనేం’ అన్నాడు అంధుడు.‘నీకు కనబడదు సరే, దారిలో ఎవరెవరో వస్తుంటారు. కనీసం నీ చేతిలో లాంతరు చూస్తేనైనా వాళ్లు పక్కనుంచి వెళ్లిపోతారు కదా?’ అన్నాడు పెద్దమనిషి. ‘సరే’నని లాంతరు తీసుకుని, నమస్కారాలు చెప్పి, వీధిలో నడుచుకుంటూ పోతున్నాడు కళ్లు లేని మనిషి. అలా దారిలో కాసేపు ముందుకు సాగాక, ఒక మనిషి నేరుగా వచ్చి ఈయనకు తగిలాడు. ‘అయ్యా, ఎటు నడుస్తున్నావు? కనీసం నా చేతిలోవున్న లాంతరైనా కనబడట్లేదా?’ అన్నాడు అంధుడు. ‘లాంతరా? అదెప్పుడో ఆరిపోయింది’ అంటూ చెప్పి ముందుకు సాగాడు ఆగంతకుడు.