అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌ | blind t20 world cup match in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌

Published Fri, Feb 3 2017 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్‌ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్‌ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు. ఈ నెల 7న స్థానిక అనంత క్రీడా మైదానంలో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ టీ–20 మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మ్యాచ్‌ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

ఈ క్రీడా పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనంతలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయన్నారు.  ఫైనల్‌ మ్యాచ్‌ ఈనెల 12న బెంగుళూరులో జరుగుతుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement