14 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు | Net direct tax collections up 14% | Sakshi

14 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Dec 22 2013 2:04 AM | Updated on Sep 2 2017 1:50 AM

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి.

 న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 20 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13.7 శాతం వృద్ధితో రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 3.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల(రూ.5.65 లక్షల కోట్లు)తో పోల్చితే ఇది  19 శాతం అధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement