దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి | 'Never Said Muslims Must Go to Pakistan,' Clarifies Haryana Chief Minister Manohar Lal Khattar | Sakshi
Sakshi News home page

దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి

Published Sat, Oct 17 2015 2:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:11 PM

దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి - Sakshi

దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి

ముస్లింలపై హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు నివసించాలనుకుంటే వారు గోమాంసం (బీఫ్) తినడం ఆపేయాలని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘‘ముస్లింలు ఈ దేశంలో ఉండొచ్చు. కానీ అందుకోసం వారు గోమాంసం తినడాన్ని త్యజించాలి. ఎందుకంటే...ఇక్కడ(భారత్‌లో) గోవు మతవిశ్వాసానికి సంబంధించిన విషయం’ వ్యాఖ్యానించారు.  గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూ ను పత్రిక శుక్రవారం ప్రచురించింది.

ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇదో దుర్దినమని కాంగ్రెస్ విమర్శించిందది.  అయితే ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. కాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, పత్రిక  వక్రీకరించిందని ఖట్టర్ ఆరోపించారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే విచారం వ్యక్తం చేసానన్నారు.  సీఎం సలహాదారూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు గోమాంసం వాడొద్దని మేవత్ జిల్లాలో గోశాలలు నడుపుతున్న ముస్లింలు కొందరు సీఎం గోశాలల సందర్శనలో అన్నారని, వారి వ్యాఖ్యలనే ఖట్టర్ ప్రస్తావించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement