'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం' | No interference in people's choice of food: Mamata | Sakshi
Sakshi News home page

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'

Published Mon, Sep 21 2015 5:40 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం' - Sakshi

'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'

కోల్కతా: ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. తమ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోదని చెప్పారు. ఏం తినాలనేది నిర్ణయించుకునేది ప్రజలే తప్ప ప్రభుత్వ పరంగా నిర్ణయించలేమని, నిర్ణయించకూడదని అన్నారు.

ఎవరు ఏం తినాలో వారి స్వయం నిర్ణయం అని చెప్పారు. సోమవారం మైనారిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే తాను తన రాష్ట్రంలో విభజించి పాలన చేయనని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement