-
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
పశ్చిమ బెంగాల్లోని బన్గావ్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?బన్గావ్.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో దిగారు.బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఇక.. బన్గావ్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రచారాన్ని బన్గావ్ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్గావ్లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.అటు.. బన్గావ్ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్ నగర్లో ఆయన భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.మరోవైపు.. సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్కు.. బెంగాల్ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
కునాల్ఘోష్కు తృణమూల్ షాక్
కోల్కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ఘోష్కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.ఇంతకుముందే ఘోష్ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్రాయ్పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. తపస్రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
కాంగ్రెస్పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ
కోల్కతా: దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో నువ్వానేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ బీజేపీ అభ్యర్ధి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది.బెంగాల్ నార్త్ మల్దా నియోజవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఖగేన్.. ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడు. చంచల్ శ్రిహిపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రచారంలో భాగంగా ఖగేన్ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది.దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించింది. ‘బీజేపీ ఎంపీ బెంగాల్లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడింది. అయితే ఖగేన్ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. చదవండి: పతంజలి కేసు.. ‘క్షమాపణలు అంగీకరించం.. చర్యలు తప్పవు’ -
సందేశ్ఖాలీ హింస.. దీదీ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం
సందేశ్ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. ఈ మేరకు సందేశ్ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్ను వినిపించడండి.’ అని మందలించారు. కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత? -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్’ట్విటర్’లో వెల్లడించింది. మమతా తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమెకు ఈ గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్షీల్డ్కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది. Our chairperson @MamataOfficial sustained a major injury. Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE — All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024 -
టీఎంసీ అభ్యర్థులను జాబితాలో కనిపించని 'నుస్రత్ జహాన్' పేరు
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి రాబోయితే లోక్సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో బహరంపూర్ స్థానం నుండి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి. టీఎంసీ పార్టీ 16 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు, 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కృష్ణానగర్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన లోక్సభ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ నామినేట్ చేసింది. సందేశ్ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్ను బరిలోకి దింపారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్
కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో 'మమతా బెనర్జీ' రాబోయే లోక్సభ ఎన్నికల కోసం 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు 'అభిషేక్ బెనర్జీ' డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే సందేశ్ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్ను బరిలోకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా కూచ్బెహార్: జగదీష్ చంద్ర బసునియా అలీపుర్దువార్: ప్రకాష్ చిక్ బరైక్ జల్పాయ్గురి: నిర్మల్ చంద్ర రాయ్ డార్జిలింగ్: గోపాల్ లామా రాయ్గంజ్: కృష్ణ కళ్యాణి బాలూర్ఘాట్: బిప్లబ్ మిత్ర మాల్డా నార్త్: ప్రసూన్ బెనర్జీ మాల్డా సౌత్: షానవాజ్ అలీ రెహాన్ జంగీపూర్: ఖలుయిలుర్ రెహమాన్ బెర్హంపూర్: యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్: అబూ తాహెర్ ఖాన్ కృష్ణానగర్: మహువా మోయిత్రా రణఘాట్: ముకుట్ మణి అధికారి బొంగావ్: బిస్వజిత్ దాస్ బర్రా క్పూర్: పార్థ భౌమిక్ దుండం: సౌగత రాయ్ బరాసత్: కకోలి ఘోష్ దస్తిదార్ బసిర్హత్: హాజీ నూరుల్ ఇస్లాం జాయ్నగర్: ప్రతిమ మండల్ మధురాపూర్: బాపి హల్దర్ డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ జాదవ్పూర్: సయోని ఘోష్ కోల్కతా సౌత్: మాలా రాయ్ డబ్ల్యూ కోల్జాత నార్త్: సుదీప్ బంద్యోపాధ్య హౌరా: ప్రసూన్ బెనర్జీ ఉకుబెర్రా: సజ్దా అహ్మద్ సెరాంపూర్: కళ్యాణ్ బెనర్జీ హుగ్లీ: రచనా బెనర్జీ ఆరంబాగ్: మిటాలి బాగ్ తమ్లుక్: దేబాంగ్షు భట్టాచార్య కాంతి: ఉత్తమ్ బారిక్ ఘటల్: దేవ్ దీపక్ అధికారి ఝర్గ్రామ్: కలిపాడా సోరెన్ మిడ్నాపూర్: జూన్ మాలియా పురూలియా: శాంతిరామ్ మహతో బుర్ద్వాన్ వెస్ట్: అరూప్ చల్రనోర్తి బర్డ్వాన్ ఈస్ట్: డాక్టర్ షర్మిలా సర్కార్ దుర్గాపూర్ బుర్ద్వాన్: కీర్తి ఆజాద్ అసన్సోల్: శత్రుఘ్న సిన్హా బోల్పూర్: అసిత్ మాల్ బీర్భం: సతాబ్ది రాయ్ బిష్ణుపూర్: సుజాత మోండల్ ఖాన్ -
టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. అయితే ఆమె సీఎం ఆమోదించలేదు. ప్రొటోకాల్ ప్రకారం లోక్సభ ఎంపీ రాజీనామాను స్పీకర్కు సమర్పించాలి. ఇంకా లోక్సభ స్పీకర్కు రాజీనామాను అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు. -
కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పేసిన తృణమూల్, ఆప్
-
మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల్లో పోటీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయంపై ప్రతిపక్ష ఇండియా కూటమి అయోమయ స్థితిలో పడేసింది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్న మమతా ప్రకటనతో కూటమిలోని పార్టీలో టెన్షన్ మొదలైంది. దిది నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు, ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమికి టీఎంసీ బలమైన పిల్లర్గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీతో సీట్ల పంపకాల చర్చలు ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ అన్నారు. ఓడించేందుకు మేము ఏమైనా చేస్తాం. మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ భారత కూటమికి బలమైన మూల స్తంభాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. దిది లేని భారత కూటమిని మనం ఊహించలేం. ఈ కూటమి పశ్చిమ బెంగాల్లో కూటమిలా పోరాడుతుంది. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగమయ్యేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలాసార్లు కోరారు’ అని తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్న జైరాం రమేష్.. పశ్చిమ బెంగాల్లో భారత కూటమి ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తుందని, దానిపై తమకు పూర్తి విశ్వాసముంది. బీజేపీని ఓడించేందుకు తాము ఏ అవకాశాన్ని వదలదని ఆయన అన్నారు. అదే ఆలోచనతో ప్రస్తుతం అస్సాంలో ఉన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుందని అన్నారు. -
ఇండియా కూటమికి దీదీ షాక్
కోల్కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపై బుధవారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అంతేగాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఉద్ధేశిస్తూ ‘ వారు రాష్ట్రానికి వస్తున్నారు. కనీసం దీనిపై మాకు సమాచారం ఇచ్చే మర్యాద వారికి లేదు’అని మండిపడ్డారు. కాగా లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఖర్గే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగమే. ప్రస్తుతం ఎన్నికల కోసం కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతా తాజాగా ప్రకటన చేయడం అధికార బీజేపీని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అయితే మమతా బెనర్జీ అవకాశవాది అంటూ, ఆమె సహాయం లేకుండానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ సీఎంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే మమతా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు! -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్కతా: దాదాపు 1,20,000 మందితో కోల్కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
దుష్ప్రవర్తనను నిగ్గు తేల్చడమెలా?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకు గానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్క రించాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. లోక్సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేస్తుంది. నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా, కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. సభ్యులను విచా రించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రక్రియ సమర్థతపై సరైన అంచనా ఇంకా రావలసే ఉంది. పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకుగానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్కరించాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటులో ప్రశ్నలను లేవనెత్తడం కోసం ఆమెకు ఇచ్చిన లాగిన్ వివరాలు, పాస్వర్డ్ను దుబాయ్కి చెందిన ఒక వ్యాపారవేత్తతో పంచుకున్నారనేది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఆ వ్యాపారవేత్త ఆమె పేరుతో లోక్సభకు ప్రశ్నలు పంపడానికి ఆమె లాగిన్, పాస్వర్డ్ను ఉపయోగించుకున్నారు. ఆయన వ్యాపార ప్రయోజనాల సమర్థవంతమైన ప్రమోషన్ కోసం ఆమె లాగిన్ ఐడీని దుర్వినియోగం చేయడానికి అనుమతించారనేది మొయిత్రాపై ఉన్న అభియోగంలోని ప్రధానాంశం. ఎథిక్స్ కమిటీ రెండు రోజులపాటు సమావేశమై, మొయిత్రాను దోషిగా నిర్ధారించి, ఆమెను బహిష్కరించాలని కోరింది. లోక్సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేయవలసి ఉంటుంది. అయితే, నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ చరిత్రలో లేని బహిష్కరణ ఎథిక్స్ కమిటీ ఇప్పటివరకు పరిశీలించిన కేసులు ఏమంత ఎక్కువగా లేవు. సాధారణ ప్రవర్తనా నియమాలకు భిన్నమైన చిన్న చిన్న అతిక్రమణలతో ఈ కమిటీ వ్యవహరించింది. అటువంటి అతిక్రమణల తీవ్రతను బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి: ఉపదేశించడం, మందలించడం, సభా సమావేశాల నుండి నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయడం సాధారణంగా సిఫారసు చేస్తారు. లోక్సభ ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. పార్లమెంటు నుండి బహిష్కరించడం చాలా తీవ్రమైన శిక్ష. ఎందుకంటే బహిష్కరించబడిన ఎంపీకి చెందిన నియోజకవర్గ ప్రజలకు సభలో ప్రాతినిధ్యం వహించే హక్కు, అవకాశం లేకుండాపోతాయి. అందువల్ల, బహిష్కరణ చాలా అరుదుగా సిఫారసు చేస్తారు. 1951లో, తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు హెచ్డి ముద్గల్, ఒక వ్యాపార సంస్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నట్లూ, దానికిగానూ ఆర్థిక ప్రయోజనాలను పొందు తున్నట్లూ గుర్తించి సభ నుండి బహిష్కరించారు. హౌస్లోని ప్రత్యేక కమిటీ ఈ కేసును విచారించి, ఆయన బహిష్కరణకు సిఫారసు చేసింది. అదే విధంగా, 2005లో, 10 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు డబ్బును స్వీకరిస్తున్నట్లు ఒక స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన సందర్భంలో వారిని లోక్సభ నుండి బహిష్కరించారు. ఈసారి కూడా ప్రత్యేక కమిటీ కేసు దర్యాప్తు చేసింది. ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పార్లమెంటరీ పని చేయడం కోసం డబ్బును స్వీకరించడం సభా నియమాలకు సంబంధించి తీవ్ర మైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దుష్ప్రవర్తనకు గాను అంగీకరించిన శిక్ష– బహిష్కరణ. రాజా రామ్ పాల్ వర్సెస్ గౌరవనీయ స్పీకర్, లోక్సభ (2007) ఉదంతంలో సుప్రీంకోర్టు... ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సభ్యుడిని బహిష్కరించే సభ అధికారాన్ని ఆమోదించింది. అధికారం ఉందా, లేదా? అయితే, (ఆ సందర్భంలో) అటువంటి ప్రత్యేక హక్కు ఉందా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. అలాంటి హక్కు ఉనికిలో లేదని గుర్తిస్తే, సదరు బహిష్కరణను కొట్టివేస్తుంది. రాజా రామ్ పాల్ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక ఎంపీని బహిష్కరించే సభ అధి కారం ఒక ప్రత్యేక హక్కు ఉనికితో నేరుగా ముడిపడి ఉండటం. దాన్ని ఉల్లంఘిస్తే బహిష్కరణ సాధ్యపడుతుంది. అయితే ఇది ఒక ముఖ్య మైన ప్రశ్నకు దారి తీస్తుంది. విశేషాధికారాల కమిటీకి కాకుండా, ఇతర కమిటీకి బహిష్కరణను సిఫార్సు చేసే అధికారం ఉందా? (1951, 2005 సంవత్సరాలలో ఎంపీల బహిష్కరణకు సిఫార్సు చేసిన కమి టీలు నైతిక లేదా విశేషాధికారాల కమిటీలు కావు. నిర్దిష్ట సమస్యలపై విచారణ కోసం సభ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు.) రాజా రామ్ పాల్ తీర్పులోని తర్కాన్ని అనుసరించినట్లయితే, విశేషాధికారాల కమిటీ లేదా సభ నియమించిన ప్రత్యేక కమిటీ మాత్రమే విశేషాధికారాల ఉల్లంఘనపై ఎంపీని బహిష్కరించే వ్యవహా రాన్ని నడపగలదు. పార్లమెంట్లోని ఏ ఇతర సాధారణ కమిటీ ఆ సిఫారసు చేయలేదు. విశేషాధికారాల కమిటీ ముందుకు తేలేని సమస్యలతోనే ఎథిక్స్ కమిటీ వ్యవహరిస్తుంది. ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడంలోని తర్కం ఏమిటంటే, విశేషాధికారాల కమిటీ ముందుకు తేనక్కరలేనంతటి దుష్ప్రవర్తనలు చాలా ఉన్నాయి. అయితే అదే సమయంలో అటువంటి ప్రవర్తనతో తగిన విధంగా వ్యవహరించడానికి సభా క్రమశిక్షణా యంత్రాంగం అందుబాటులో ఉండాలి. వివిధ కమిటీల పాత్రల్లోని ఈ వ్యత్యాసం పార్లమెంటు దృష్టిని డిమాండ్ చేస్తుంది. తద్వారా పార్లమెంట్ శిక్షాస్మృతి అధికారాల కార్యాచరణలో మరింత స్పష్టత తేవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు చేసే దర్యాప్తు పరిధి, ప్రయోజనం, దాని స్వభావం కూడా ఇక్కడ దృష్టిలో ఉంటుంది. తక్షణ అవసరం స్కామ్లు, ఇతర తీవ్రమైన కేసులకు దారితీసే ఆర్థిక దుర్విని యోగానికి సంబంధించిన విషయాలను పార్లమెంట్ పరిశోధిస్తుంది. ఇటువంటి పరిశోధనలు భారీ ఆర్థిక మోసాలకు దారి తీసే వ్యవస్థాగత లోపాలను వెలికితీసేంత సమగ్రంగా ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థ చేయలేని ఈ విధిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నిర్వహిస్తుంది. అయితే సభ్యుడిని బహిష్కరించే అధికారంపై ఎటువంటి వివాదం లేనప్పటికీ, విచారణ విధానం గురించి కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఫిర్యాదుదారు, ప్రతివాది ఎంపీ, ఇతర ప్రమేయం గల వ్యక్తులతో సహా సాక్ష్యం తీసుకోవడం కమిటీ సాధారణంగా అనుసరించే విధానం. వారు రాతపూర్వక పత్రాలను సమర్పించవచ్చు. అలాగే మౌఖిక ప్రకటనలు తీసుకోవచ్చు. ఆధారాలు సేకరించిన తర్వాత, సచివాలయ అధికారులు అటువంటి సాక్ష్యాలను జల్లెడ పట్టి, కనుగొన్న విషయాలు, సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికను సిద్ధం చేస్తారు. కాబట్టి, ఒక ఎంపీకి ఇచ్చే అత్యంత తీవ్రమైన శిక్ష అయిన బహిష్కరణను కమిటీలోని మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. పార్లమెంటరీ విచారణ స్వభావాన్ని మనం పరిశీలించినప్పుడు. సాక్ష్యాధారాలను బేరీజు వేసే అధికారుల సామర్థ్యాలు, దర్యాప్తు రంగంలో వారి నైపుణ్యం, మరియు ఎక్కువగా నిపుణులు కాని, న్యాయపరంగా శిక్షణ పొందని కమిటీ సభ్యుల మనస్సును అన్వయించడం వంటి సంబంధిత అంశాలను ఎప్పుడూ పరిగణనలోకి తీసు కోవాలి. పరిశోధనాత్మక యంత్రాంగాల ద్వారా విధానపరమైన సమగ్ర తను కొనసాగించినప్పుడు మాత్రమే న్యాయం, సత్యం నిర్ధారించ బడతాయి. ఏ తప్పు చేసినా దాని సభ్యులను విచారించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు, న్యాయం చేయడానికి అనుసరించే ప్రక్రియ సమర్థత, దాని పటిష్టతపై సరైన అంచనా అనేది ఇంకా రావలసే ఉంది. మహువా మొయిత్రా కేసు ఈ పనికి సంబంధించిన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తోంది. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్సభ మాజీ ప్రధాన కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆ అధికారం ఎథిక్స్ కమిటీకి లేదు: ఎంపీ మహువా మొయిత్రా
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ నైతిక విలువల కమిటీకి నేరపూరిత ఆరోపణలను పరిశీలించే అధికారాలు లేవని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కమిటీకి బుధవారం ఓ లేఖ రాశారు. కాగా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మహువా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కమిటీ ముందు హాజరయ్యే ఒకరోజు ముందు ఆమె లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తనకు జారీ చేసిన సమన్లను మీడియాకు విడుదల చేయడం సరైందని ఎథిక్స్ కమిటీ భావించినందున.. గురువారం విచారణను ఎదుర్కొనే ముందు నా లేఖను సైతం విడుదల చేయడం ముఖ్యమని భావిస్తున్నాను’ అని ఆమె చెప్పారు. ప్యానల్కు క్రిమినల్ అధికార పరిధి లేదు కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్కు రాసిన లేఖలో.. తనపై వచ్చిన నేరాపూరిత ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు లోక్సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే క్రిమినల్ అధికార పరిధి లేదని పేర్కొన్నారు. చట్టపరమైన దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇటువంటి కేసులో విచారించవచ్చునని చెప్పారు. దేశ రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ కమిటీల దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో ఇలాంటి ఏర్పాట్లు చేశారని మోయిత్రా తెలిపారు. చదవండి: రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు హీరానందానీని కూడా విచారణకు పిలవాలి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు అనుమతించాలని మోయిత్రా డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్లో అడిగేందుకు తన నుంచి ప్రశ్నలు స్వీకరించినట్లు దర్శన్ ఆరోపిస్తున్నారు. అంతేగాక దుబాయ్ నుంచి ప్రశ్నలు పోస్టు చేసేందుకు ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్కు వాడినట్లు తెలిపారు. కాగా అదానీ గ్రూప్ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేలా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మోయితా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన లోక్సభ స్పీకర్కు లేఖ రాయగా.. నైతిక విలువలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నవంబర్ రెండున మహువా లోక్సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. -
అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన లోక్సభ లాగిన్ ఐడీ వివరాలు వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె ఆంగీకరించారు. అయితే అతని నుంచి కేవలం చిన్న చిన్న గిఫ్ట్లే అందుకున్నట్లు చెప్పారు. హిరానందని గ్రూప్ సీఈవో నుంచి స్కార్ఫ్, కొన్ని లిప్స్టిక్లు, ఐషాడో వంటి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటులో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు తన లోక్సభ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించేందుకు స్నిహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. అయితే హీరానందని నుంచి డబ్బుల రూపంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను మహువా ఖండించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తను ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరులకు కూడా వివరాలు ఇచ్చా! లోక్సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, తన ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు.. ముంబైలో ఉన్నప్పుడు హీరానందానీ కారు వాడాను వ్యాపారవేత్త అయిన హీరానందాని తన స్నేహితుడని, అతని నుంచి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్, లిప్స్టిక్లు, బాబీ బ్రౌన్ నుంచి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు మొయిత్రా పేర్కొన్నారు. తన కోసం దుబాయ్లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తన ఇంటి ఇంటీరియర్లను మార్చడం కోసం తాను అతనిని సంప్రదించానని, అతను ఆమెకు కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్లు, డ్రాయింగ్లను అందించాడని, అయితే ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సీపీడబ్ల్యూడీ చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబయిలో ఉన్నప్పుడల్లా హీరానందానీ స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానినని కూడా చెప్పింది. రూ. 2 కోట్ల ప్రస్తావన లేదు దర్శన్ హీరానందని తనకు ఇంకా ఏమైనా ఇచ్చి ఉంటే వెంటనే వచ్చి చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆరోపణ చేస్తారని, కానీ ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత వారిపై ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అఫిడవిట్లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే.. దయచేసి ఎప్పుడు ఇచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని కోరారు. సొమ్ములు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం ప్రధాని మోదీ, అదానీ గ్రూప్ను,లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించినవేనని లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీటికి తోడు మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని నిషికాంత్ దూబే మరో ఆరోపణలు చేయడం దుమారం చెలరేపింది. ఈ ఫిర్యాదుపై లోక్సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31న తమ ముందు విచారణకు హాజరు కావాలని మహువాను కమిటీ తెలిపింది. అయితే తన నియోజకవర్గం కృష్ణానగర్లో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల మరికొంత సమయం కావాలని ఎంపీ కోరగా.. ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు మారింది. కొత్త తేదీ ఇచ్చిన ఎథిక్స్ కమిటీ.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని వెల్లడించింది. ఇక ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ నైతిక వ్యవహారాల కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా మహువాకు వ్యతిరేకంగాపలు సాక్ష్యాలను సమర్పించారు. -
రాజ్యసభలో హైడ్రామా.. డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్.. ఆపై ఉపసంహరణ
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్కు చెందిన ప్రమోద్ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్ను కోరారు. స్పందించిన ధన్ఖడ్.. ఒబ్రియాన్ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయెల్పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్క్లిక్ వెబ్పోర్టల్కు నిధులందాయంటూ గోయెల్ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఈ మేరకు నోటీసు అందజేశారు. -
నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
కోల్కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్లోని పల్సిట్లో గురువారం రాత్రి ఆయన కారు టోల్ గేటు దాటుతుండగా టోల్ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది. అయితే ఈ ఘటన మొత్తం టోల్ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు. ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu — Archana Pushpendra (@margam_a) August 4, 2023 -
విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి. ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి. చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
రాజకీయ వేడి!
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలంతా చేయి చేయి కలిపి తమ బలం చాటనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ నెల 23న పలో సమావేశమై మోదీని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను రచించనున్నారు. దేశంలో అత్యంత బలవంతుడైన నాయకుడు మోదీని ఎదిరించి నిలబడుతున్న రాహుల్ గాందీ, అరవింద్ కేజ్రివాల్; మమతా బెనర్జీ వంటి వారు ఈ సమావేశానికి హాజరై వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా మంత్రాంగం నడపనున్నారు. పాట్నా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలందరూ ఒకే తాటిపైకి రాగలరా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పార్టీల్లో ఎవరికి వారికే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆశ ఉండడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్ష పార్టీ లన్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ చూపించారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీజేపీకి దీటుగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుదామని ఆయన ప్రతిపాదించారు. కానీ ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తోందన్న అనుమానాలున్నాయి. ♦ ప్రాంతీయ పార్టీ ల మధ్య నెలకొన్న రాజకీయ శత్రుత్వం విపక్షాల ఐక్యతకు అసలు సిసలైన సవాల్గా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న టీఎంసీ, లెఫ్ట్ పార్టీ లను ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి వాటితో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు ♦ సీట్ల సర్దుబాటు అన్నది లెక్కకు మించిన పార్టీ ల మధ్య సవ్యంగా జరగడం అతి పెద్ద సవాల్. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లోనే 172 లోక్సభ స్థానాలున్నాయి. ♦ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ , రాజస్తాన్లలో తాము పోటీకి దిగమని హామీ ఇస్తోంది కానీ తమకు గట్టి పట్టున్న న్యూఢిల్లీ, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పోటీపడకూడదని షరతు విధిస్తోంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధిక సంఖ్యలో సీట్లు కాంగ్రెస్కుకేటాయించడానికి సిద్ధంగా లేరు. ♦ బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని నితీశ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. ఆ దిశగా ఆయన ఎంతవరకు ఒప్పించగలరన్నది సందేహమే. ♦ ప్రధాని మోదీకున్న చరిష్మాను తట్టుకొని నిలబడాలంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ♦ ఈ సవాళ్లన్నింటిని అధిగమించడం ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుత సమావేశం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన ధరాభారం, నిరుద్యోగంతో పాటు మతం పేరుతో సమాజాన్ని చీల్చే చర్యలకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని చర్చించడానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి ఒకవైపు విపక్ష పార్టీ లన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీయే నుంచి ఇప్పటికే ఎన్నో పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో శివసేన దూరమయ్యాక ఆ పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేని సీఎంను చేసిన బీజేపీకి ఇప్పుడు ఆయన వైఖరి కూడా కొరుకుడు పడడం లేదు. మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకి జనాదరణ అధికంగా ఉందని పేపర్లో ప్రకటన ఇవ్వడం బీజేపీకి మింగుడు పడడం లేదు.తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై జయలలితపై చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది. ఇక బీహార్లో నితీశ్ కుమార్ జేడీ (యూ) దూరమయ్యాక ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ఇటీవల ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో జరిగిన సమావేశంలో తమతో కలిసే మిత్రపక్షాలను కలుపుకొని పోవాలని మోదీ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ♦కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయేకి గుడ్బై కొట్టేసిన పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ను కూడా తిరిగి ఎన్డీయే గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీ(ఎస్) ఈ సారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. బీహార్లో కులప్రాతిపదికన చిన్న పార్టీ లను కలుపుకొని వెళితే మేలన్న యోచనలో బీజేపీ ఉంది. లోక్జనశక్తి పార్టీ (చిరాగ్ చీలిక వర్గం) ఎన్డీయేకి దూరమవకుండా చర్యలు తీసుకుంటూనే హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) దగ్గరకు తీసుకునే చర్యలు చేపడుతోంది. నితీశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఇటీవల విభేదాల కారణంగా బయటకు వచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నితో కూడా మంతనాలు సాగిస్తోంది. ♦ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్ రాజ్బహార్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో మంతనాలు సాగిస్తోంది. బీజేపీ యూపీ అధ్యక్షుడు చౌధరి భూపేంద్ర సింగ్ వారణాసిలో జరిగిన రాజ్బహార్ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా అన్ని వైపుల నుంచి ఎన్డీయేని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. పశ్చిమ మెదినీపూర్ జిల్లాఆలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా ముర్షిదాబాద్ జిల్లాలోని మైనార్టీల ప్రాబల్యం ఉన్న సాగర్డిఘి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేరాన్ బిస్వాస్.. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్కు ఉన్న ఏకైక శాసన సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సాగర్డిఘీ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిపై దేబాశిష్ బెనర్జీపై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. తాజాగా ఆయన కూడా పార్టీ మారడంతో రాష్టంంలో హస్తం పార్టీ ఖాళీ అయ్యింది. Today, during the ongoing #JonoSanjogYatra in the presence of Shri @abhishekaitc, INC MLA from Sagardighi Bayron Biswas joined us. We wholeheartedly welcome him to the Trinamool Congress family! To strengthen your resolve to fight against the divisive and discriminatory… pic.twitter.com/CyCaUKTyRs — All India Trinamool Congress (@AITCofficial) May 29, 2023 బైరాన్ చేరిక అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బిస్వాస్ను తృణమూల్ కాంగ్రెస్ల కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా కేవలం టీఎంసీ మాత్రమే పోరాడగలదని పేర్కొన్నారు. కాషాయ పార్టీ విభజన, వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సరైన వేదికను ఎంచుకున్నారని తెలిపారు. కలిసి కట్టుగా పోరాడి గెలుస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2021లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది ఉప ఎన్నికలో బిశ్వాస్ కాంగ్రెస్ టిక్కెట్పై సాగర్డిఘి స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఉన్నారు. చదవండి: ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే -
మైక్ పట్టుకొని పాట పాడిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట పాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో గురువారం తన నిరసనను సీఎం ఓ పాట రూపంలో వ్యక్తపరిచారు. రవింద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఓ బెంగాలీ పాటను మైక్ పట్టుకొని స్వయంగా ఆలపించారు. ధర్నా సమయంలో స్టేజ్ మీదున్న ఇతర నేతలు, కళాకారులతో కలిసి ‘ఎబార్ తోర్ మోరా గంగే’ అనే పాటను పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ కోల్కతాలో రెండు రోజులుగా మమతా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం స్వయంగా ఈ ధర్నా చేపట్టారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది. చదవండి: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..! #WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty — ANI (@ANI) March 30, 2023 -
అమ్మా.. పోలీసులు తీసుకెళుతున్నారు!
న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్ గోఖలేని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని తృణమాల్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. సాకేత్ గోఖలే సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి రాజస్తాన్లోని జైపూర్కి విమానంలో వెళ్లారని, అక్కడ ముందుగానే వేచి ఉన్న గుజరాత్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓబ్రెయిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తన అమ్మకు ఫోన్ చేసి తనను పోలీసులు అహ్మదాబాద్ తీసుకువెళ్తున్నారని, మధ్యాహ్నానికి అక్కడకి చేరుకుంటానని చెప్పారు. ఆయనకు పోలీసులు ఫోన్ చేయడానికి కేవలం రెండు నిమిషాలే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోఖలే మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి కొన్ని వార్తపత్రికల క్లిప్పింగ్ల తోపాటు మోర్బీ ప్రధాని పర్యటనకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్టీఐ పేర్కొందని ట్వీట్ చేశారు. ఐతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వార్తలను నకిలీవిగా పేర్కొనడం గమనార్హం. ఐతే ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం గోఖలే చేసిన ట్వీట్లను గుర్తించింది. గోఖలే చేసిన ట్విట్లను దృష్టిలో ఉంచుకునే ఇలా తప్పుడూ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందంటూ తృణమాల్ కాంగ్రెస్ నేత ఓబ్రెయిన్ ఆరోపణలు చేశారు. ఐతే ఆయన ఇక్కడ ఏ ట్వీట్ అనేది స్పష్టం చేయలేదు. ఇలాంటి చర్యలతో తృణమాల్కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల నోటిని మూయించలేరన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యను మరో స్థాయికి తీసుకువెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. కాగా, జైపూర్ విమానాశ్రయ పోలీసు ఇన్ఛార్జ్ దిగ్పాల్ సింగ్ ఈ విషయమై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఎవరు తెలియజేయ లేదని స్పష్టం చేశారు. (చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
Advertisement