Mamata Benerjee
-
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చు: మమతా బెనర్జీ
సాక్షి, పశ్చిమ బెంగాల్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. దీని గురించి కేంద్రం సత్వరమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. ఈ మేరకు మమతా ఘటన స్థలికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. బెంగాల్ తరుఫున క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. (చదవండి: లెక్క తేలని మరణాలు!.. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే) -
సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ను కెప్టెన్గా నియమించారు. వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. తగ్గేదెలే! అంటున్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై పశ్చిమబెంగాల్ బీజేపీ నిరసనలు ఉధృతం చేసింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరిని పదవి నుంచి తప్పించాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు. బహిరంగ సభల్లో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమని భారీ స్పీచ్లు దంచికొట్టే తృణమూల్ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆమె ధ్వజమెత్తారు. అఖిల్ గిరిపై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలిస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ కూడా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా కూడా ఆయనను డిస్మిస్ చేయాలని అన్నారు. (చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే?) వివాదమేంటి? సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో క్లిప్ ప్రకారం.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారిపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్ మంత్రి అఖిల్ గిరి.. దేశ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సువేంధు అధికారి నా రూపం గురించి వ్యాఖ్యానిస్తారు. నేను చూడ్డానికి బాగుండనట. నువ్వెంత అందంగా ఉన్నావ్. మనిషి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎవరెలా ఉన్నా వారికిచ్చే గౌరవ మర్యాదలు వారికివ్వాలి. మన రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంటారు.. అయినా ఆమెను గౌరవిస్తున్నాం కదా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే, తన తప్పును తెలుసుకున్న మంత్రి అఖిల్ గిరి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం తగ్గడం లేదు. మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక వివాదం ముదరడంతో గిరి వివరణ ఇచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని గౌరవిస్తానని ఆయన అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సువేంధు అధికారి తనను ఉద్దేశించి కొన్ని బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తన రూపు గురించి మాట్లాడి దారుణంగా అవమానించారని, వయసులో పెద్దవాడిననే కనీస గౌరవం లేకుండా బాధపెట్టారని గిరి చెప్పుకొచ్చారు. ‘బాధ, కోపం వల్లే సువేంధు అధికారిని విమర్శించాలని అనుకున్నా.. ఆ క్రమంలోనే పొరపాటుగా రాష్ట్రపతికి ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడా’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీ నాయకుల విమర్శలపై తృణమూల్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. బీజేపీ నేతల తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ పార్టీ రాష్ట్రపతికి అపారమైన గౌరవం ఇస్తుందన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!) -
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు -
బాప్రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలే!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది. తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. రాజ్దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాలు ముగిశాయి. కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో తరలించారు అధికారులు. #WATCH | West Bengal: Hugh amount of cash, amounting to at least Rs 15 Crores, recovered from the residence of Arpita Mukherjee at Belgharia. She is a close aide of West Bengal Minister Partha Chatterjee. pic.twitter.com/7MMFsjzny1 — ANI (@ANI) July 27, 2022 మరో మహిళ ఎవరు? ఇదిలా ఉంటే.. స్కూల్ టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం దర్యాప్తులో భాగంగా ఈడీ చేపట్టిన సోదాల్లో.. గత శుక్రవారం అర్పితా ముఖర్జీ ఇంట్లో కోట్ల రూపాయలు బయటపడ్డాయి. అదే సమయంలో మంత్రి పార్థా ఛటర్జీని సైతం ఈడీ ప్రశ్నించింది. ఇక శనివారం మనీలాండరింగ్ కేసులో పార్థా ఛటర్జీతో పాటు అర్పితా ముఖర్జీలను ఈడీ అరెస్ట్ చేసింది. ఆగష్టు 3వ తేదీ వరకూ ఈ ఇద్దరూ ఈడీ కస్టడీలోనే ఉంటారు. ఇక విచారణలో.. అర్పితా ముఖర్జీ మరో మహిళ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పార్థ చటర్జీ తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని మినీ బ్యాంక్గా వాడుకునేవారని, పదిరోజులకొకసారి పార్థా ఛటర్జీ, ఆయన అనుచరులు ఇంటికి వచ్చే వాళ్లని, డబ్బు దాచేవాళ్లని అర్పితా ముఖర్జీ అంగీకరించింది. అయితే మరో మహిళ ఎవరనే విషయంపై మాత్రం అధికారులు ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: అర్పిత ముఖర్జీ ఎవరంటే.. రాజీనామానా? దేనికి.. ఇదిలా ఉంటే.. పార్థా ఛటర్జీ బెంగాల్లో సీనియర్ రాజకీయ నేత. టీఎంసీ తరపున ఆయన కేబినెట్తో పాటు పలు కీలక భాద్యతలు చేపట్టారు కూడా. కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది ఆయనకు మీడియా నుంచి. దానికి ఆయన మండిపడ్డారు. ఎందుకు? ఏ కారణంతో రాజీనామా చేయాలి? అని అసహనం ప్రదర్శించారు. గవర్నర్కు ఫిర్యాదు కేబినెట్ మంత్రిపై ఆరోపణలు.. అరెస్ట్ జరిగినా టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పందించకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్థా ఛటర్జీని మంత్రి పదవుల నుంచి తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. గవర్నర్ లా గణేశన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆధారాలు స్పష్టంగా ఉన్నా ఆమె(మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ..) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాను మాత్రమే మంచి వ్యక్తినని.. ఎదుటివాళ్లు చెడ్డవాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆమె అని అధికారి సువేందు గవర్నర్నుకలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మంత్రి అరెస్టుపై సీఎం మమత కీలక వ్యాఖ్యలు -
ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బహుశా ఆమె అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని అన్నారు. అయినా బీజేపీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతి పక్షాలతో కూడా చర్చించి ఉండాల్సిందన్నారు. బీజేపీ ఈ విషయమై తనను సంప్రందించింది కానీ ఎవర్నీ నిలబెడుతున్నామనేది తనకు చెప్పలేదన్నారు. ఎన్డీఏ ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాను ఏకాభిప్రాయం గురించి ఆలోచించేదాన్ని అన్నారు. తనకు గిరిజన మహిళల పట్ల గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాత్రం మమతా బెనర్జీ వైఖరి పై మండిపడుతున్నారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పోటీ చేస్తున్నారనిగా తెలిసే తృణమాల్ కాంగ్రెస్ విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపిందా? అని ప్రశ్నించారు. మమతా ముమ్మాటికి గిరిజన వ్యతిరేకి అని, సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి అంటూ ట్విట్టర్ వేదికగా దీదీ పై ఆరోపణలు చేశారు. యాదృచికంగా సిన్హా జూన్21న తృణమూల్ కాంగ్రెస్కి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన గతేడాది మార్చిలో టీఎంసీలో చేరారు. అదే రోజు తర్వాత బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అత్యున్నతి పదవికి ద్రౌపది ముర్ముని నామినేట్ చేసింది. అదీగాక ఇప్పటికే జేడీయు, వైకాపా ముర్ముకి మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ముకి రోజురోజుకి మద్దతు పెరిగిపోతుంది. తాజాగా అకాలీదళ్ కూడా తన మద్దతు ముర్ముకేనని పేర్కొంది. దీంతో మమతా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గెలిచే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ మమతా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటిస్తున్నట్లు చెప్పి ఉంటే కచ్చితంగా ఆలోచించి ఉండేదాన్ని అని చెప్పారు. ఏదీఏమైన అందరీ ఏకాభిప్రాయంతో ఎన్నికైన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండటం మంచిదని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. విచిత్రమేమిటంటే.. పోటీలో ఉన్న ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సభ్యులే కావడం విశేషం. (చదవండి: యశ్వంత్ గెలుస్తారనే ఆశాభావం ఉంది.. మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్) -
ఏం చేద్దాం: పీకేతో సీఎం కేసీఆర్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్తో వరుస భేటీలు జరుపుతున్నారు. -
గవర్నర్తో విభేదాలు.. మమత సర్కార్ కీలక నిర్ణయం
కోల్కత: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి. రాజ్భవన్తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్కడ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది. చదవండి👇 మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! -
Mamata Banerjee: దేశంలో పరిస్థితి ఏం బాగోలేదు
కోల్కతా: ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు–పాలించు, విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగళవారం ఆమె కోల్కతాలోని రెడ్ రోడ్లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. ‘దేశంలో పరిస్థితి బాగోలేదు.. ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు, విభజించు–పాలించు విధానాలు సరికావు. హిందూముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు. కానీ భయపడను. ఎలా పోరాడాలో నాకు తెలుసు’ అన్నారు. -
బెంగాల్పై నెత్తుటి మరక
పశ్చిమబెంగాల్లో మరోసారి రక్త చరిత్ర పునరావృతమైంది. ఈనెల 21 రాత్రి అక్కడి బీర్భూమ్ జిల్లాలోని రామ్పూర్హట్లో సాయుధులైన వందమంది దుండగులు చెలరేగి, ఇళ్లకు నిప్పంటించి ఎనిమిది నిండు ప్రాణాలు బలిగొన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాణాలతో ఉన్నవారు బతుకు జీవుడా అనుకుంటూ ఆ గ్రామం వదిలిపోయారు. దారుణాతి దారుణ హింస పశ్చిమ బెంగాల్కు కొత్తగాదు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది తప్పడం లేదు. అక్కడ పార్టీల్లో ఏర్పడే అంతర్గత కలహాలు, పార్టీల మధ్య రాజుకునే ఆధిపత్య సమరాలు తరచూ హింసకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. నాటు బాంబుల వాడకం రివాజైంది. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లా అందుకు పెట్టింది పేరు. గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారన్న భయాందోళనలతో ఇళ్లలో తలదాచుకున్నవారిని బయటకు లాగి గొడ్డళ్లతో తీవ్రంగా గాయపరిచి, ఆ తర్వాత వారిని లోపలికి నెట్టి, ఆ ఇళ్లకు నిప్పంటించారని వస్తున్న కథనాలు వింటే ఒళ్లు గగుర్పొడు స్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా... శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రాథమిక కర్తవ్యమన్న సంగతి దానికి గుర్తుందా అన్న సంశయం కలుగుతుంది. హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో మాట్లాడాక ఆమె ఆదేశించడంతో స్థానిక తృణమూల్ నాయకుడు అనారుల్ హుస్సేన్ను అదుపులోనికి తీసుకున్నారు. మారణకాండ సంగతి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ప్రస్తుతానికి అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సూత్ర ధారి కూడా అతగాడేనా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తాపీ పనిచేసుకుని బతుకీడ్చిన హుస్సేన్ ఇప్పుడు ఖరీదైన మోటార్ బైక్లు, కార్లు, ఐఫోన్లతో... కళ్లు చెదిరే రెండంతస్తుల భవంతితో దర్జాగా ఉన్నాడంటే ఆ ప్రాంతంలో ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నదో ఊహించడం కష్టమేమీ కాదు. తృణమూల్ అంతర్గత కలహాల పర్యవసానంగా అంతకుముందు రోజు ఒక నాయకుడు హత్యకు గురికాగా, అందుకు ప్రతీకారంగా ఈ మారణకాండ జరిగింది. హత్య సంగతి తెలిసినా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నదన్న ఆలోచన పోలీసులకు కలగలేదు. పైగా రాత్రి 9.35కు ఈ రాక్షసకాండ సంగతి తెలిస్తే పది గంటల ప్రాంతంలోగానీ పోలీసులు అక్కడికి చేరుకోలేదు. పోలీస్ స్టేషన్ అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది. అంతేకాదు... స్వయంగా మమతా బెనర్జీ ఆదేశించేవరకూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోలేదంటే వారి నిర్వాకమేమిటో అర్థమవుతుంది. జనరంజక విధానాలతో, మెరుగైన హామీలతో ప్రజల మనసులు గెల్చుకుని అధికారంలోకి రావాలని విపక్షాలు ఆలోచించడం లేదు. ప్రజానుకూల విధానాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మాత్రమే తిరిగి గద్దెనెక్కడం సాధ్యమవుతుందని పాలకులు ఆలోచించడం లేదు. నయానో భయానో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకునే స్థానిక పెత్తందార్ల అండతో గెలుపు శాశ్వతం చేసుకోవచ్చు నని భావించే ధోరణులు పుట్టుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే సమస్య. ఇంతక్రితం పాలించినవారితో విసుగెత్తి తృణమూల్ను గెలిపిస్తే గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు మింగేవాడు వచ్చిన తీరుగా అక్కడ పల్లెల్లో కొత్త పెత్తందార్ల హవా మొదలైంది. తమకెదురు తిరిగినవారిని నక్సలైట్ల పేరుమీదనో, మరే ఇతర పార్టీ పేరుమీదనో కేసుల్లో ఇరికించడం సర్వసాధారణంగా మారింది. స్థానికంగా దొరికే వనరులను దోచుకుంటున్న క్రమంలో పంపకాల్లో తేడా రావడం వల్లనో, ఆ దోపిడీని ప్రశ్నించడం వల్లనో కక్షలు బయల్దేరుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఆగ్రహం కలుగుతుందన్న కారణంతో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే తరహాలో ఆధిపత్య పోరు నడిచేది. అది తరచూ హింసాకాండకు దారితీసేది. దీన్నంతటినీ సమూలంగా మారుస్తానని, పల్లెసీమలు ప్రశాంతంగా మనుగడ సాగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి మమత అధికారంలోకి వచ్చారు. కానీ జరిగింది వేరు. పల్లెటూళ్లలో గూండాల ప్రాబల్యం పెరిగింది. సాధారణ పౌరుల బతుకులు పెనం మీంచి పొయ్యిలో పడిన తీరుగా మారాయి. ఇప్పుడంతా అయ్యాక ఈ విషాద ఘటనకు కారకులని భావిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా ఉన్న ఆయుధాలను పదిరోజుల్లోగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అన్నిచోట్లా గాలింపు మొదలైంది. గ్రామం విడిచి వెళ్లిపోయినవారు వెనక్కొస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని వివరాలనూ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అంతటితో ఆగకూడదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దారుణ విషాద ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించాలి. మారుమూల ప్రాంతాలవరకూ విస్తరించి ఉండే పోలీసు, నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వదిలిం చేలా సమూల ప్రక్షాళన చేయాలి. హింసకు పాల్పడేవారికి రాజకీయ ప్రాపకం లభించబోదన్న సందేశం వెళ్లాలి. ఇలాంటి ఉదంతాలు తన పాలనకు మచ్చ తీసుకురావడమే కాదు... అంతర్జాతీయంగా మన దేశానికి అప్రదిష్ట తెస్తాయని మమత గుర్తించాలి. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్లోని ఓ పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
మాపైకి మరో విమానం దూసుకొచ్చింది
కోల్కతా: మూడు రోజుల క్రితం చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కోల్కతాకు తిరిగి వస్తుండగా తమ విమానానికి ఎదురుగా మరో విమానం దూసుకొచ్చిందని చెప్పారు. తమ పైలట్ తక్షణమే అప్రమత్తమై చాకచాక్యంగా విమానాన్ని కిందకు దించడంతో పెద్ద ముప్పు తప్పిందని అన్నారు. లేకపోతే మరో 10 సెకండ్ల వ్యవధిలోనే రెండు విమానాలు ఢీకొనేవని తెలిపారు. పైలట్ సమర్థత కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని వెల్లడించారు. మమత ప్రయాణిస్తున్న విమానం భారీగా కుదుపులకు లోనైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానం కుదుపుల వల్ల మమతా బెనర్జీ ఛాతీ, వీపు భాగంలో గాయాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను బెంగాల్ ప్రభుత్వం కోరింది. (చదవండి: బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా) -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
Sakshi Cartoon: విష్ యూ హ్యాపీ బర్త్డే టూయూ!
విష్ యూ హ్యాపీ బర్త్డే టూయూ! -
బెంగాల్ బెబ్బులి జాతీయ స్వప్నం
‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్ పవార్తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్పై మమత బాణాలు సంధించడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్ శాఖ నిట్టనిలువునా చీలింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా వచ్చి తృణమూల్ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్ తన్వార్, యూపీలో లలితేశ్ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్లో సుస్మితా దేవ్– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే. అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్ బరిలోకి దిగింది. ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్తో దోస్తీ మార్చిన తృణమూల్ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది. కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్ బయట తృణమూల్ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది. అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. -
సాక్షి కార్టూన్ 29-10-2021
-
భవానీపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగ్రామ్లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు. చదవండి: Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
బెంగాల్ లో మూడు స్థానాలకు ఉపఎన్నిక పోలింగ్
-
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు షాక్
సాక్షి, ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు షాక్ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించాలని కోల్కత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో సిట్, సీబీఐ తమకు నివేదిక అందించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను గవర్నర్ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకుందని నివేదికలో వెల్లడైంది. -
ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం మమత నృత్యం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నృత్యం చేసి, డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. సోమవారం బెంగాల్లోని ఝార్గ్రామ్లో నిర్వహించిన ఓ వేడుకలో మహిళలతో కలిసి మమత డ్యాన్స్ చేశారు. సోమవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అధికారులు ఆదివాసీలు, గిరిజనులతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మమతా పాల్గొని, ఆదివాసీ మహిళలతో కలిసి సాంప్రదాయం నృత్యం చేశారు. అదే విధంగా ఆమె డోలు వాయిస్తూ ఆదివాసీ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం సీఎం మమతా చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘టీఎంసీ కార్యకర్తలపై దాడుల వెనక అమిత్ షా’
కోల్కతా: త్రిపురలో బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. త్రిపురలోని అగర్తలలో గాయపడిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో మమతా బెనర్జీ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని, ముఖ్యంగా త్రిపుర, అసోం, ఉత్తరప్రదేశ్లో అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఆదివారం త్రిపురలో కొందరు వ్యక్తులు.. సుదీప్, జయ అనే ఇద్దరు బెంగాల్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని మండిపడ్డారు. పోలీసుల ముందే దాడి జరిగినప్పటికీ వారు పట్టించుకోలేదని, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ దాడుల వేనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని మమతా ఆరోపించారు. అందుకే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఇటీవల టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బేనర్జీ త్రిపురలోని అగర్తల పట్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్పై కొంతమంది కర్రలతో దాడి చేసి విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని, వాటికి ఆయన బాధ్యతవహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. -
త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
గంగూలీకి దీదీ శుభాకాంక్షలు.. ఇంటికెళ్లి మరీ విష్ చేసిన బెంగాల్ సీఎం
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదా ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపు గడిపిన దీదీ.. గంగూలీ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ప్రిన్స్ ఆఫ్ కోల్కతాగా పిలువబడే గంగూలీని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ఇంటికెళ్లి మరీ విష్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గంగూలీ రాజకీయ అరంగేట్రం చేస్తాడని టీఎంసీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే దాదా బీజేపీతో సైతం క్లోజ్గానే మూవ్ అవుతుంటాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షాతో కలిసి దగ్గరగా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉంటే, గంగూలీ.. ఇవాళ ఉదయం కోల్కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిరాఢంబరంగా జరుపుకున్నాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్, యూరోకప్, కోపా అమెరికా ఫుట్బాల్, ఒలింపిక్స్కు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మరోవైపు దాదాకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయను విషెస్ తెలియజేశారు. భారత్ తరఫున 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్లకు సారథ్యం వహించిన ఆయన.. 97 మ్యాచ్ల్లో టీమిండియాకు విజయాలనందించి భారత దేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
దీదీ ఎత్తుగడ: ఏకంగా గవర్నర్కే గురి!
పశ్చిమ బెంగాల్ పాలనలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టేందుకు, రివెంజ్ దిశగా మమతా బెనర్జీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గవర్నర్ ధన్ఖర్ను గద్దెదించేందుకు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కోల్కతా: పాలనాపరంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొదటి నుంచే పొసగడం లేదు.ఈ క్రమంలో ఆయన బహిరంగంగానే దీదీ తీరును, పాలనను తప్పుబడుతూ వస్తున్నాడు. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి ఆ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని గవర్నర్ గిరి నుంచి సాగనంపేందుకు దీదీ పాచికలు కదుపుతోంది. ధన్ఖర్ను సాగనంపే విషయంపై ఇదివరకే మమతా, బిమన్ బెనర్జీతో చర్చించినట్లు సమాచారం. జులై 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ సమావేశాల్లో మొదటి సెషన్లో.. అది కూడా గవర్నర్ స్పీచ్ అనంతరమే తీర్మానం ప్రవేశపెట్టాలని, తద్వారా తమ పవర్ ఏంటో చూపించాలని టీఎంసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్సభ స్పీకర్కీ.. గవర్నర్ ధన్ఖర్ బెంగాల్ అసెంబ్లీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ స్పీకర్ బిమన్ బెనర్జీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘పెండింగ్ బిల్లులు సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నాడని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా.. అనైతికంగా గవర్నర్ తీరు ఉందని’ ఫిర్యాదులో బిమన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక టీఎంసీ సీనియర్ నేతలు కూడా గవర్నర్ను దించేయడమే ఎజెండాగా పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్నయించుకున్నారు. ఒక పార్టీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరు హేయనీయంగా ఉందంటూ వరుసగా టీవీ ఛానెల్స్ డిబెట్లలో పాల్గొంటున్నారు. ఇక బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడుతున్న గవర్నర్ను.. తామూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్ ఛీఫ్ దిలీప్ ఘోష్ చెబుతున్నాడు. -
Yaas Cyclone: మూడు లక్షల ఇళ్లు ధ్వంసం
కోల్కతా:యాస్ తుపాను పశ్చిమ బెంగాల్కు అపార నష్టం చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. తుపాను దాదాపు కోటి మందిపై ప్రభావం చూపినట్టు ఆమె వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ముందస్తుగా దాదాపు 15 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. ఐతే భారీ ఆస్తి నష్టం తప్పలేదన్నారు మమత. మూడు లక్షల ఇళ్లు ధ్వంసం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం యాస్ తుపాను వల్ల రాష్ట్రంలో ఒకరు మరణించగా సుమారు మూడు లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆమె తెలిపారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న పర్బా మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర పరగణాల జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోటి రూపాయల విలువైన సహాయక సామగ్రిని పంపించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక తుపాను తీరం దాటిన ఒడిషాలోని దమ్రా, దక్షిణ బహనాగా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అల్లకల్లోలం పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్ తుపాను తీరం దాటింది. దీంతో తుపాను తీవ్రత అధికంగా ఉంది. సముద్రం గతంలో ఎన్నడూ లేనంత అల్లకల్లోలంగా మారింది. రెండు మీటర్ల ఎత్తులో రాకాసి అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. ఒడిషా, బెంగాల్ తీరంలో సముద్రం చాలా చోట్ల పది మీటర్ల వరకు ముందుకు వచ్చింది చదవండి: yaas cyclone: బురదలో చిక్కుకున్న వందమంది yass cyclone పట్టపగలే చిమ్మ చీకట్లు -
బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే గవర్నర్, మమతా పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందన్నారు. సీఎం మమత హింసను నియంత్రించాని గవర్నర్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో శాంతి నెలకొనేలా మమత పని చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని సీఎం మమత అన్నారు. ప్రస్తుతం నెలకొన్నా పరిస్థితులు ఎన్నికల సంఘం, గవర్నర్ కారణమన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ హయాంలో బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో మమత బెనర్జీ మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక రేపు(గురువారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో పోటీచేసిన మమతా బెనర్జీ తన సమీప బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్లో శాసనమండలి ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఆరో నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే. చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు -
టీఎంసీ హ్యాట్రిక్: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
కోలకత : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి కాలుతోనే బెంగాల్ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దాదాపు 200కు పైగా స్థానాల్లో లీడింగ్లో నిలిచిన టీఎంసీ బీజేపీకి గట్టి షాకే ఇస్తోంది. మరోవైపు బెంగాల్లో దీదీకే మళ్లీ పట్టం అని పదే పదే నొక్కి వక్కాణించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ 100 శాతం నిజమైంది. ఈ సందర్బంగా గతంలో పీకే ట్వీట్లు ఇపుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చాయి. తాజా ఫలితాల సరళి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. మోదీ పాపులర్ వ్యక్తి అయినంత మాత్రానా బీజేపీ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి తీరాలన్న గ్యారంటీ ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీఎంసీకి విజయం ఏకపక్షమే అయిన తీవ్ర పోటీ ఎదురైందన్నారు. ఎన్నికల కమిషన్ పాక్షికం వ్యవహరించి, తమ ప్రచారాన్నిఅడ్డుకుందని, దీంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని పీకే వ్యాఖ్యానించారు. బెంగాల్లో గెలవబోతున్నామంటూ బీజేపీ భారీ ప్రచారాన్ని చేపట్టింది. అయినా ఊహించని విజయాన్ని ప్రజలు టీఎంసీ కిచ్చారంటూ పీకే సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు 294 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ డబుల్ డిజిట్ దాటడం కూడా కష్టమే అంటూ ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21 ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నాయకులు పీకేపై మండిపడుతున్నారు. దీంతో బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారం నిబెట్టుకున్నా.. బీజేపీ సునామీతో ఒక ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనుందని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా ట్వీట్ చేశారు. కాగా గత సంవత్సరకాలంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించినప్పటినుంచి మోదీషా ద్వయం బెంగాల్లో మమతను అధికార పీఠంనుంచి దూరం చేసేందుకు పావులు కదిపారు. కానీ బెంగాల్ ప్రజలు మాత్రం దీదీవైపై మొగ్గారు. అయితే గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకునేదశగా కదులుతోంది. ప్రస్తుతం 74 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఒక స్థానమైనా దక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే. -
మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది
నందిగ్రామ్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైనారిటీలను బుజ్జగించటంలో మునిగిపోయారని, ఆమెకు ఓటు వేసి అధికారంలోకి రానిస్తే బెంగాల్ ఓ మినీ పాకిస్తాన్ అవుతుందని బీజేపీ నాయకుడు సువేధు అధికారి వ్యాఖ్యానించారు. సోమవారం నందిగ్రామ్లోని ఓ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ మమతా బెనర్జీ తరచూ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెబుతుంది. అదే అలవాటుగా మారిపోయి ఇప్పుడు హోలీ రోజున కూడా హోలీ ముబారక్ అంటూ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతోంది. బేగం(బెనర్జీ)కి ఓటు వేయకండి. ఆమెకు ఓటు వేస్తే బెంగాల్ మినీ పాకిస్తాన్ అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఆమె గుళ్ల చుట్టూ తిరుగుతోంది. యోగీ ఆధిత్యనాథ్ యూపీని పాలిస్తున్నట్లుగానే మేము కూడా బెంగాల్ని పాలిస్తాము. గతంలో ఆమె కారులో తిరిగేది. ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతోంది. ఒకప్పుడు రూ. 400 చీర కట్టేది. ఇప్పుడు రూ. 6 వేల చీరకడుతోంది. ఒకప్పుడు అజంతా షూలు వాడేది.. ఇప్పుడు బ్రాండెడ్ షూలు వాడుతోంది. నేను మాత్రం ఏమీ మారలేదు. 2004నుంచి అలానే ఉన్నాను. మీకు బేగం(బెనర్జీ) కావాలో.. మీ కుమారుడు, సోదరుడు, ఓ మిత్రుడు కావాలో తేల్చుకోండి. మమతా గాల్లో వస్తోంది.. గాల్లోనే మాయమవుతుంది’’ అంటూ ఏద్దేవా చేశారు. చదవండి, చదివించండి : 25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు! -
బిడ్డగా ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ వేస్తా: మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నందిగ్రామ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. బుధవారం తాను నామినేషన్ వేయాలనుకుంటున్నానని, మీరు వద్దంటే తాను నామినేషన్ వేయబోనని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను మీ బిడ్డగా పరిగణించి మరోసారి ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ దాఖలు చేస్తానని ఆమె ప్రజలనుద్దేశంచి మాట్లాడారు. కాగా, దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్ను కాదని ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం(మార్చి 10న) నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజు ముందు ఆమె నియోజకవర్గంలో పర్యటించి అక్కడి ప్రజలను ఉద్దేశించి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నీ తానై ముందుకు నడిపిస్తోంది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తనవంతు కృషి చేస్తున్నారు. -
మమతను ఢీకొట్టేందుకు రెడీ..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సిద్ధమవుతున్నారు. ఆయన ఈ నెల 12న నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దీదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సువేందు.. మారిన సమీకరణల కారణంగా బీజేపీ తీర్ధం పుచ్చుకొని, ఏకంగా ఆమెపైనే పోటీకి సిద్ధం కావడంతో అందరి కళ్లు ఈ స్థానంపైనే పడ్డాయి. దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్ను కాదని నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించిన వెంటనే, బీజేపీ వేగంగా పావులు కదిపి ఆమెకు సరితూగే బలమైన అభ్యర్ధిని బరిలో దించింది. దీంతో పోరాటాల పురిటిగడ్డ అయిన నందిగ్రామ్ మరోసారి వార్తల్లోకెక్కింది. -
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
-
దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ మధ్య విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి సీఎం మమతా బెనర్జీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్లో ఆవుల అక్రమ రవాణా, లవ్ జిహాద్లకు అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే అక్రమ వలసదారులను ప్రోత్సహింస్తున్నారని విమర్శించారు. జై శ్రీరాం అనే నినాదాన్ని బెంగాల్లో అనుమంతిచడం లేదని, మతపరమైన సెంటిమెట్ను రాజకీయల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. యూపీలో రామ మందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతి మమతకు బెంగాల్లో ఎదురవుతుందని హెచ్చరించారు. భారతదేశంలో రామునికి వ్యతిరేకంగా ఉండేవాళ్లు రామ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, బీజేపీ అధికారంలోకి వస్తుందని సీఎం యోగి ధీమా వ్యక్తం చేశారు. 294 నియోజకవార్గాలు ఉ్న పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషషయం తెలిసిందే. చదవండి: దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ -
మమత డీలా.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పశ్చిమబెంగాల్లో రాజకీయాలు రంజుగా మారాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బెంగాల్కు కేటాయింపులు జరగడంతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. దీంతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో బీజేపీ జోరు మీద ఉండగా ఎమ్మెల్యేల జంపింగ్తో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీలా పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీని వీడి బీజేపీలోకి చేరారు. మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీతో సహా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ను వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పి సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, సువేందు అధికారి సమక్షంలో దీపక్ హల్దార్ బీజేపీలో చేరారు. ఆయనతో కలిపి మొత్తం 13 మంది తృణమూల్ కాంగ్రెస్ను వీడడంతో మమతా బెనర్జీ డీలా పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ నిరాశలో ఉంది. -
దేశానికి నాలుగు రాజధానులు : మమత
కోల్కతా: దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. (ఆపరేషన్ బెంగాల్.. అంత ఈజీ కాదు!) దేశ్నాయక్ దివాస్గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. మాతృభూమిపై సమానంగా నేతాజీపై ప్రేమ ఉన్నది కొద్ది మందికే అని, కొందరు మాత్రం ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని ఆయన సంబరాలు నిర్వహిస్తున్నారని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. (మమతకు షాక్.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్!) -
దీదీకి షాక్.. బీజేపీలోకి మరో ఎమ్మెల్యే!
కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంతపార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. త్వరలోనే టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే అరిందం భట్టాచార్య బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నాడియా శాంతిపూర్ నియోజకవర్గానికి చెందిన భట్టాచార్య బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియాను కలిశారు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమపార్టీ నేతలు బీజేపీలోకి చేరుతుండటంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై టీఎంసీ పూర్తిగా దృష్టిని సారించింది. (వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) మరోవైపు ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అంచనావేస్తూ, తృణమూల్ కాంగ్రెస్ను ధీటుగా ఢీ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. వీరేగాక ఇంకా 41 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి కైలాష్ విజయవర్గియా ఇటీవల వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. (బెంగాల్పై కాషాయం కన్ను) -
బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ జోస్యం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్న వేళ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి ఊరటనిచ్చే విషయాలు చెప్పారు. ఆయన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 200 సీట్లలో విజయం సాధించి బెంగాల్లో ఈసారి అధికారం చేపడుతామన్న అమిత్ షా పాచికలు పారవని అన్నారు. అక్కడ కనీసం రెండంకెల సీట్లు కూడా కాషాయ పార్టీ గెలుచుకోలేదని పీకే జోస్యం చెప్పారు. బెంగాల్లో బీజేపీ ఇప్పుడున్న దానికన్నా ఏమాంత్రం మెరుగ్గా మారిన తన స్థానాన్ని వదులుకుంటానని సవాల్ విసిరారు. అనుకూల మీడియా ద్వారా బీజేపీ ఊదరగొట్టే ప్రచారాలు చేస్తోందని పీకే ఎద్దేవా చేశారు. అంతేగానీ, అక్కడ కమలం పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. మమతా దీదీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజే పీకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక టీఎంసీ అసమ్మతి నేతలు రవాణాశాఖ మాజీ మంత్రి సువేందు అధికారి, మరో ఎంపీ సునీల్ కుమార్ మోండల్, మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ‘ఇది ఆరంభం మాత్రమే.. తృణమూల్ కాంగ్రెస్లో చివరకు మీరొక్కరే మిగిలుతారు’అని అమిత్ షా ఈ సందర్భంగా మమతాపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ఇదిలాఉండగా.. బెంగాల్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 294. (చదవండి: ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’) -
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా ఆదివారం బోల్పూర్లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ‘ఈ రోడ్ షో మమతా దీదీ పట్ల బెంగాల్ ప్రజలు కోపాన్ని చూపిస్తోంది. ఇలాంటి రోడ్ షో నా జీవితంలో చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల బెంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమ ఈ రోడ్ షో చూపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ పాలన చూశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అయిదేళ్లలో స్వర్ణ బెంగాల్ సాధిస్తాం’ అని అమిత్ షా అన్నారు. అంతకు ముందు ఆయన విశ్వభారతి యూనివర్శిటీని సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ ఫోక్ సింగర్ నివాసంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేశారు. (అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి) కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన విషయం విదితమే. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. (మమతకు వరుస షాక్లు.. స్పీకర్ ట్విస్టు!) -
బెంగాల్ దీదీ.. ఇది ఆరంభమే: అమిత్ షా
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పలువురు టీఎంసీ నేతలను తమ వైపుకు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో టీఎంసీ మంత్రి సువెందు అధికారి శనివారం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మిడ్నాపూర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ర్యాలీలో సువేందు, సుదీప్ ముఖర్జీ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు కాషాయ గూటికి చేరారు. వీరిలో ఆరుగురు టీఎంసీ పార్టీకి చెందినవారే. మరో ఎంపీ సునీల్ మండల్ కూడా షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీలోని విభేదాల కారణంగా టీఎంసీకి గుడ్బై చెప్పిన సువేందు..తన రాజీనామా లేఖలో పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే టీఎంసీ సభ్యునిగా ఇప్పటివరకు తనకు ఇచ్చిన అవకాశాలకు మమతా బెనర్జీకి కృతఙ్ఞతలు తెలిపారు. (మమతకు వరుస షాక్లు.. బీజేపీ సెటైర్లు! ) కాగా సువెందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్ణయించింది. బీజేపీలో చేరిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమరార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకనేతలు పార్టీని వీడటంతో మమతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సహా మిడ్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు మరికొంతమంది టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతోంది. ముకుల్ రాయ్ సహకారంతో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. (కేంద్రంపై మండిపడ్డ మమతా బెనర్జీ ) -
నిప్పుతో చెలగాటం వద్దు మేడం: గవర్నర్
కోల్కతా/న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడి పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ హెచ్చరించగా.. బీజేపీ వాళ్లకు పనేమీ లేదని ఓసారి హోం మంత్రి, మరోసారి చద్దా, నద్దా, ఫద్దా లాంటి వాళ్లు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. ఔట్సైడర్స్ కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన గవర్నర్ జగదీప్ ధంఖర్.. సీఎం మమత వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. ‘మేడం.. దయచేసి కాస్త పద్ధతిగా మాట్లాడండి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి’ అని విజ్ఞప్తి చేశారు. ఇక ఔట్సైడర్స్ పదాన్ని ప్రస్తావిస్తూ.. ‘సీఎం మేడం.. ఇండియా ఒక్కటే. భారతీయులంతా ఒకటే. నిప్పుతో చెలగాటం ఆడవద్దు. ఇన్సైడర్, ఔట్సైడర్ అంటూ విద్వేషాలు రెచ్చగొట్టవద్దు’ అని గవర్నర్ హితవు పలికారు.(చదవండి: నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి) నివేదిక సమర్పించాను: గవర్నర్ ‘జాతీయ రాజకీయ పార్టీ నాయకుడిపై నిన్న దాడి జరిగింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా వారికి సహకరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటివే ఇవన్నీ. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాను. నిన్న జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం. పోలీస్ చీఫ్, చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేశాను. నివేదిక ఇవ్వమని ఆదేశించాను. కానీ వారు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదు. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వాధికారులు అయి ఉండి వారి కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చలేదు. ఈ పరిణామాలు నన్ను షాక్కు గురిచేశాయి. సిగ్గుపడేలా చేశాయి’అని గవర్నర్ జగ్దీప్ ధంఖర్ విలేకరులతో పేర్కొన్నారు. -
బెంగాల్ను గుజరాత్గా ఎందుకు మారుస్తారు?
కోల్కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పట్టించుకోకుండా తన విధులను మర్చిపోయి, మున్సిపల్ ఎన్నికల్లో హోం మంత్రి బిజీగా ఉన్నారని విమర్శించారు. ‘ఇలాంటి హోం మంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంటే, ఆయన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ, ప్రజలతో ఫోటోలు దిగతూ, వారి ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మమత సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు స్పందనగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బెంగాల్లో బయటి వారికి చోటులేదు. కొంతమంది బయటి నుంచి వచ్చినా సరే బెంగాల్ని ప్రేమతో ముందుకు నడిపించడంలో సాయం చేస్తారు. అలాంటి వారే మా స్నేహితులు. అంతేగానీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, కేవలం ఎన్నికల ముందు వచ్చే వారు బెంగాల్కి సంబంధించిన వారు కాదు. వారు ఎప్పటికైనా ఔట్సైడర్స్ గానే ఉంటారు" అని అన్నారు. ఇక రాష్ట్రాన్ని "గుజరాత్ మోడల్"గా తీర్చిదిద్దుతామన్న బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యల నేపథ్యంలో.. "గుజరాత్ గుజరాత్గానే ఉండనివ్వండి. వారు బెంగాల్ను గుజరాత్గా ఎందుకు మార్చాలనుకుంటున్నారు? మత అల్లర్లను సృష్టించి బెంగాల్ను గుజరాత్గా మార్చాల్సిన అవసరం లేదు. ఇది రవీంద్రనాథ్- నజ్రుల్ ఇస్లాం స్థలం. మత అల్లర్లతో కూడిన గుజరాత్ కాదు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్లోగన్’ గుర్తుచేస్తూ, ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్ మాత్రమే బీజేపీకి కావాలన్నారు. కానీ మన దేశం అందరి కోసం ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో వాళ్లు పాల్గొన్నారా? ఆ సమయంలో వారు దేశానికి ద్రోహం తలపెట్టారు’’ అని ముఖ్యమంత్రి మమత పేర్కొన్నారు. రైతులకోసం నేను:మమతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను నిరసిస్తూ వామపక్షాలు సమ్మె చేస్తున్న తరుణంలో తాము రైతులకు అండగా ఉంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తమ పార్టీ వారికి పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే రాష్ట్రంలో వ్యాపారానికి భంగం కలిగించడానికి సీపీఎంను అనుమతించదని స్పష్టం చేశారు. రైతుల పట్ల పోలీసుల చర్యలను తప్పుపడుతూ.. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ బిల్లులు ప్రవేశపెడుతూ వారి జీవానోపాధిని దెబ్బతీస్తుందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాన్ని ‘చట్టవిరుద్ధం ’అని పేర్కొంటూ రైతులు ఆహ్వానిస్తే వారితో కలిసి పోరాడతానని అన్నారు. -
‘ఆ ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తారు’
కోల్కతా: మంత్రి సుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ను వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగద్దల్ ఘాట్ వద్ద శనివారం ఆయన ఛట్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తృణముల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎంపీలు కాషాయం కండువా కప్పుకోవడం ఖాయం. సుభేంధుని టీఎంసీ పార్టీ చాలా అవమానించింది. తన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి వేధించింది. కానీ ప్రజా నాయకులను అలాంటి చర్యలు ఏమీచేయలేవు. (చదవండి: సవాళ్లను స్వీకరించాలి, పోరాడాలి, ఓడించాలి) సుభేందు వంటి ఎంతో మంది నేతల ప్రోద్బలంతో మమతా బెనర్జీ నాయకురాలిగా ఎదిగారు. కానీ ఇప్పుడు గతాన్ని, ఎంతో మంది నేతల త్యాగాన్ని మర్చిపోయి తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం కుర్చీపై కూర్చొబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఏ నాయకులు ఒప్పుకోరు’’అంటూ విమర్శలు గుప్పించారు. అదే విధంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తారని అర్జున్ సింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన కేవలం టీఎంసీ నాయకుడిలా మీడియా ముందు నటిస్తున్నారని, ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుభేందుతో సౌగతా రాయ్ చర్చలు జరుపుతున్నారని, ఒక్కసారి కెమెరా కళ్లు వారిని దాటిపోయినట్లయితే వారు కాషాయ కండువా కప్పుకోవడం తథ్యమని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను సౌగతా రాయ్ వట్టి పుకార్లేనంటూ కొట్టివేయడం గమనార్హం. -
‘కరోనా వస్తే మమత బెనర్జీని కౌగిలించుకుంటా’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కరోనా కేసుల విషయంలో టీఎంసీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ హజ్రా మాట్లాడుతూ, ‘నాకు ఏదో ఒక సమయంలో కరోనా వస్తుంది. నేను అప్పుడు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, ప్రియమైన వారిని కోల్పోతే కలిగే బాధ తెలుస్తాయి’ అని వ్యాఖ్యానించారు. అయితే బెంగాల్లోని బీజేపీ నాయకులు హజ్రా వ్యాఖ్యలపై నోరు మెదపడంలేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బీజేపీకి నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ అన్నారు. ఇదిలా వుండగా మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సిలిగురికి వెళ్లారు. ఉత్తర బెంగాల్లో పరిస్థితులపై మమతా సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు బెంగాల్లో 2.4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 4,721 మంది మరణించారు. చదవండి: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అక్రమ బాంబుల తయారీకి నిలయంగా మారిందని గవర్నర్ జగదీప్ దంఖర్ మమతా బెనర్జీ ప్రభుత్వంపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం కేరళ, పశ్చిమ బెంగాల్కు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉగ్రవాదుల ద్వారా భారత్లో స్థావరం ఏర్పాటు చేయడానికి ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా చేసిన ప్రయాత్నాలకు అడ్డుకట్ట వేయడంలో ఎన్ఐఏ ఆపరేషన్ విఫలమైన అనంతరం గవర్నర్.. దీదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలోని పలు చోట్ల శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 'ప్రజాస్వామ్యాన్ని అస్తవ్యస్తం చేసే అక్రమ బాంబుల తయారీకి రాష్ట్రం నిలయంగా మారింది' ఇది ప్రజాస్వామ్యాన్ని కూల్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటూ గవర్నర్ వరుసగా ట్వీట్స్ చేశారు. যা কিছুই ঘটুক না কেন; In service of WB NIA busts Al-Qaeda module in Murshidabad, WB. DGP on this alarming affairs @MamataOfficial to me “West Bengal police firmly adheres to the path laid down by law. There is no discrimination for or against anyone in an extra legal sense” pic.twitter.com/7DCqPyCaz9 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 19, 2020 ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతూ, రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ తప్పిదాలు చేయడంలో మమతా అధికార పోలీసులు బిజీగా ఉన్నారని గవర్నర్ ఆసహనం వ్యక్తం చేశారన్నారు. పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతల భయంకర క్షీణతకు కారణమవుతున్న రాష్ట్ర ఉన్నతాధికార పోలీసులు వారి జవాబుదారీతనం నుండి తప్పించుకోలేరని' హితవు పలికారు. మరొక ట్వీట్లో పశ్చిమ బెంగాల్ డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి బాధాకరమని, రాష్ట్రంలో జరిగే అక్రమాలు పట్టనట్టుగా చూస్తున్న డీజీపీ నిర్లక్ష్యపు వైఖరి నిజంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. -
ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ
తొమ్మిదేళ్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. ఏడాదిగా పశ్చిమ బెంగాల్ గవర్నరుగా ఉన్నారు జగదీప్ ధన్ఖర్. నాలుగేళ్లు పెద్ద ఆమె కన్నా ఆయన. మమతకు 65. ఆయనకు 69. అయితే మనిషిలో ఆ పెద్దరికం లేదు! ప్రజాదరణ ఉన్న ఆ నాయకురాలికి అధికార పార్టీ ఆదరణ ఉన్న ఈ నాయకుడు ఏడాది కాలంగా అడ్డుపడుతూనే ఉన్నాడు. అడ్డు పడుతున్నందుకు పెద్దరికం లేదనడం కాదు. పదవికి ఉండే పెద్దరికం.. దాన్ని నిలుపుకోవాలి కదా? అది లేదు! సీఎంని వెక్కిరిస్తాడు. వెటకరిస్తాడు. ఆమె తుమ్మితే ఈయన ‘హాచ్చ్’ మని ఇమిటేట్ చేస్తాడు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్న ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ అయిపోయాడు. మమతను ఆయన చికాకు పెట్టడం ఎలా ఉంటుందో చూడండి. తృణమూల్ పార్టీ వాళ్లు నిన్న ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో మమతా బెనర్జీ ‘నీట్’, జేఈఈ విద్యార్థులకు ‘మై హూ నా’ (నేనున్నాను) అని అభయం ఇస్తుంటారు. పరీక్షలను వాయిదా వేయిస్తానని ఆ భరోసా. వెంటనే గవర్నర్ అందుకున్నాడు. ఆ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ ‘మై భీ హూ నా’ (నేను కూడా ఉన్నాను) అని రీట్వీట్ చేశాడు! దేనికి అతడు ఉన్నది అంటే.. పరీక్షల్ని జరిపించడానికి!! గవర్నర్ మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండకూడదు. మమత మాత్రమే తన పని తను చేస్తున్నారు. In this time of constant uncertainty and anxiousness, @BJP4India led govt is pushing our students into further distress. To timely address this burning issue, @MamataOfficial came forward to fight for providing a safe environment to the students. She is truly everyone's leader! pic.twitter.com/3KaoJuEZqx — All India Trinamool Congress (@AITCofficial) August 27, 2020 -
ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు!
కోల్కతా: మమతా బెనర్జీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న ఒక స్కీమ్కు సంబంధించి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రసోడ్ మే ఖాళీ కుక్కుర్( వంటింట్లో ఖాళీ కుక్కర్) అనే పేరుతో ఒక వీడియోను రూపొందించి ఇంటర్నేట్లో షేర్ చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఉచిత రేషన్కు సంబంధించిన పథకాన్ని ప్రచారం చేయడం కోసం ఈ వీడియోను ఉపయోగించుకుంటుంది. దీనికి సంబంధించి టీఎంసీ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ను విడుదల చేసింది. ''రసోడ్ మెయిన్ అబ్ కుకర్ ఖలీ నహీ రహెగా (వంటగదిలో ఇప్పుడు కుక్కర్ ఖాళీగా ఉండదు) ! అని. ఎందుకంటే మమత బెనర్జీ జూన్ 2021 వరకు ఉచితంగా రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 10కోట్ల మంది పేదవారికి దీని వలన లబ్ధి చేకూరుతుందని తెలిపారు. Rasode mein ab Cooker khali nahi rahega !!@MamataOfficial ne June 2021 tak Bengal mein free ration ki ghoshna jo kar di hai 🤩 https://t.co/7WAi6ArDDR — All India Trinamool Congress (@AITCofficial) August 24, 2020 ఈ విషయం గురించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, ‘లాక్డౌన్ విధించిన మూడు నెలల పాటు మేం ప్రతి కుటుంబానికి ఐదు కిలోలు ఉచిత బియ్యం అందించాం. సెప్టెంబర్ వరకు ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యంతో పాటు సమాన మొత్తంలో పిండిని కూడా అందిస్తాం. జూన్ 2021 వరకు మేము ఉచిత రేషన్ అందిస్తాం’ అని మమతా అన్నారు. 'సాథ్ నిభానా సాథియా' లోని 'ప్రెజర్ కుక్కర్' సీన్ ఆధారంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యశ్రాజ్ ముఖతే ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం 'రసోడ్ మే ఖాళీ కుక్కర్' ఇంటర్నెట్లో ట్రెండింగ్గా మారింది. ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ మీమ్స్ రూపొందిస్తున్నారు. చదవండి: ‘అది నా మనస్సాక్షికి విరుద్ధం’ -
మరోసారి కేంద్రానికి మమత విజ్ఞప్తి
కోల్కతా: విద్యార్థుల క్షేమం దృష్ట్యా జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్ఈఈటీ–నీట్), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ)- 2020 పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో పరిస్థితులు చక్కబడేంత వరకు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరులో నీట్, జేఈఈ నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మరోసారి నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాద తీవ్రతను అంచనా వేసి, పరీక్షలు వాయిదా వేయాలి. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం మన బాధ్యత’’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మమత ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ గైడ్లైన్స్పై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సైతం పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆదివారం ప్రధాని మోదీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నీట్, జేఈఈ జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. (జేఈఈ, నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు) ఇక నీట్ ఎగ్జామ్కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్లైన్స్కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్ను అందించి సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
సంపూర్ణ లాక్డౌన్కు దీదీ ప్రభుత్వం పిలుపు
కలకత్తా: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచన వేసేందు రేపటి(శనివారం) నుంచి విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు సంపూర్ణ లాక్డౌన్కు దీదీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు(శనివారం), జులై 29(బుధవారం) లాక్డౌన్ విధించాలని సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ లాక్డౌన్ రోజుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా కార్యకలాపాలు నిరోధించబడతాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం) అంతేగాక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య వ్యక్తులు రోడ్లపైకి రావడాన్ని కూడా నిషేధించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలు, సంరక్షణ కార్యకలాపాలతో పాటు ఆరోగ్య సిబ్బంది రవాణా, ఫార్మసీలకు లాక్డౌన్ రోజుల్లో అనుమతి ఉన్నట్లు స్పష్టం చేసింది. వాటితోపాటు ఇంట్రాస్టేట్, అంతరాష్ట్ర వస్తువుల రవాణ, ఫుడ్ డెలివరీలు ఈ లాక్డౌన్ రోజుల్లో యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 51, 757కు చేరుకోగా 1,255 మంది మరణించారు. (చదవండి: కరోనాను జయించిన 16 నెలల బాలుడు) -
కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం
కోల్కతా : దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కట్టడిలో విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా మమతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాష్ర్టంలో 12మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాకు బలయ్యారని ఆమె పేర్కొన్నారు. (కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత) కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా వైరస్ బారిన పడి మరణిస్తే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని మమతా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ర్టంలో కరోనా కేసులు అధికమవుతున్నందున ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. రానున్న కాలంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆమె పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా 1,589 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,427కు చేరుకుంది. (మంత్రి భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ ) -
కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత
సాక్షి, కోల్కతా: కరోనా మహమ్మారి మరో సీనియర్ అధికారిని పొట్టన పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్పై పోరులో ముందుండి పనిచేసి విశేష సేవలందించిన ప్రభుత్వ అధికారి దేబ్దత్తా రే(38) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తీభవించిన మానవత్వంతో, క్లిష్ట వ్యవహారాలను కూడా సునాయాసంగా పరిష్కరించడంలో ఆమె సునిశిత శైలిని గుర్తు చేసుకుని కన్నీంటి పర్యతమయ్యారు. హూగ్లీ జిల్లా, చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేబ్దత్తా ఇటీవల కోవిడ్ అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్లోని శ్రమజీబీ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. (అధ్వాన్నం: దేశాధినేతలకు డబ్ల్యూహెచ్ఓ అక్షింతలు ) మరోవైపు దత్తా ఆకస్మిక మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. కాగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్లు ఆపాలి!) I, on behalf of the Govt of West Bengal, salute her spirit & the sacrifice she's made in service of the people of #Bengal. Spoke to her husband today & extended my deepest condolences. May the departed soul rest in peace & lord give her family strength to endure this loss. (2/2) — Mamata Banerjee (@MamataOfficial) July 13, 2020 -
అక్కడ లాక్డౌన్ పొడిగింపు: దీదీ
కోల్కత్త: కంటైన్మైంట్ జోన్లలో మరో 7 రోజుపాటు లాక్డౌన్ను పొడిగించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం దీదీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మంగళవారం ఒక్కరోజే 25 మంది కరోనాతో మరణించడంతో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న కంటైన్మైంట్ జోన్ల్లో లాక్డౌన్ను పోడగించాలని నిర్ణయించుకున్నామని మమతా తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందని దీదీ స్పష్టం చేశారు. (14 రోజుల పాటు లాక్డౌన్..!) COVID-19: Lockdown will be imposed in containment zones in West Bengal for 7 days, starting 5 pm Thursday, says CM Mamata Banerjee — Press Trust of India (@PTI_News) July 8, 2020 ఇక గడిచిన 24 గంట్లలో జరిపిన కోవిడ్ పరీక్షల్లో 850 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,837కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,243 క్రియాశీల కేసులు ఉండగా వాటిలో 555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న చోటుచేకున్న 25 కోవిడ్-19 మరణాలతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 807కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
రైళ్లు, విమానాల సర్వీసులను ఆపేయండి : మమతా
కోల్కతా : భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి దేశీయ విమానాలను నడపకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ప్రతీరోజూ ఎక్కువ మొత్తంలో విమానాలను అనుమతించడం ద్వారా కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే ఇతర రాష్ర్టాల నుంచి విమానాల రాకపోకలకు అనుమతించాలని కోరారు.(ఉద్రిక్తతలు సమసేనా..? ) ఇక కోల్కతాలో మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అనిశ్చితి నెలకొంది. ఇంతకుముందు మెట్రో, సబర్బన్ సర్వీసులను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా వైద్యులు,పోలీసులు సహ ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న సిబ్బంది కోసం తిరిగి సేవలను పునః ప్రారంభించే యోచనలో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే వారి రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరలోనే రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీనికి అనుగుణంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, హోం శాఖకు కోల్కతా మెట్రో అధికారి లేఖ రాశారు. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టెలి-మెడిసిన్ సేవలను ప్రారంభించనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీని ద్వారా ఆసుపత్రులకి వెళ్లకుండానే వెద్య సహాయం పొందొచ్చని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్లకుండా ఫోన్ ద్వారా నేరుగా వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో ప్రతి జిల్లాకో ప్రత్యేక టెలిఫోన్ సర్వీసు ఏర్పాటుకానుంది. అంతే కాకుండా దాదాపు 30 మిలియన్ ఫేస్ మాస్కులను పాఠశాల విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వనున్నట్లు మమతా స్పష్టం చేశారు.(ఆ నియామకాలపై కరోనా ప్రభావం తక్కువే..) -
మోదీ సమావేశానికి దీదీకి నో ఎంట్రీ..
కోల్కతా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ(బుధవారం) సాయంత్రం కరోనా సంక్షోభంపై జరగనున్న వీడియో కాన్సిఫెరన్స్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి హజరయ్యే ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కరోనా సంక్షోభంపై 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా హజరు కానున్నట్లు రాష్ట్ర సచివాలయ వర్గాలు నబన్నా తెలిపారు. ('మేము ప్రధాని మోదీని తొలగించాలన్నామా?') సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్పందిస్తూ.. కేంద్ర మరోసారి బెంగాల్ను అవమానించింది. రాష్ట్ర సీఎం మమతను మాట్లాడకుండా చేసేందుకే ఆహ్వానం ఇవ్వలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులను తమ సమస్యలను తెలియజేయడానికి అనుమతించకపోతే వీడియో సమావేశాల పేరిట సమావేశాలు వృధా అని ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. అంఫాన్ తుపాను సమయంలో తీవ్రంగా నష్టపోయిన బెంగాల్కు కేంద్రం కేవలం రూ. 1000కోట్లు మాత్రమే సాయం చేసిందని, ఇంకా కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. (‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’) మమత ఈ విషయాన్ని ప్రస్తావిస్తారనే ఉద్దేశంతోనే ఆమెను రాకుండా అడ్డుకున్నారని టీఎంసీ నాయకులు కేంద్రంపై మండిపడుతున్నారు. బీజేపీయేతర పాలిత ప్రాంతాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇప్పటికే కరోనా వైరస్పై పోరాటం, అంఫాన్ తుపాన్ కారణంగా బెంగాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మమత పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో కూడా మమత అనేక సార్లు కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై బీజేపీ నేత రాహుల్ సిన్హా మాట్లాడుతూ, కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలో లోపాలను వెతకడం టీఎంసీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. బెంగాల్తో పాటు బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకుండా ఆయా రాష్ట్రా ప్రతినిధులు మోదీ సమావేశానికి హజరు కానున్నట్లు సమాచారం. -
'మేము ప్రధాని మోదీని తొలగించాలన్నామా?'
కోల్కతా: ‘ఓవైపు కరోనా, మరోవైపు అంఫన్తో పోరాడుతుంటే కొన్ని పార్టీలు మమ్మల్ని అధికారం నుంచి తొలగించాలని చూస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరం. మేం ఏమైనా ప్రధాని పీఠం నుంచి నరేంద్ర మోదీని తొలగించాలని కోరామా?’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో బీజేపీ రాజకీయాలు చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలు చేసేందుకు ఇది తగిన సమయమేనా అని మమతా సూటిగా ప్రశ్నించారు. మీరంతా గత మూడు నెలలుగా ఏమైపోయారంటూ ప్రశ్నలు సంధించారు. (రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం) తాము క్షేత్రస్థాయిలో పని చేస్తున్నామని, కరోనా వైరస్పై పోరాటంతో పాటు, రాజకీయ కుట్రపైనా బెంగాల్ ప్రభుత్వం గెలుస్తుందని పేర్కొన్నారు. కాగా అంఫన్ తుపాను వల్ల రూ.1 లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, దాన్ని భర్తీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యంగ్యంగా స్పందించారు. విపత్తుల్లో ఆదాయం వెతుక్కునేందుకు ఇదో వ్యూహమని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎమ్లకు ఇదే వ్యాధి ఉండేదని, ఇప్పుడు అది తృణమూల్ కాంగ్రెస్కు పాకిందని విమర్శించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. (నేనింతే : లాక్డౌన్ నిబంధనలు బేఖాతర్) -
‘అమిత్ షా.. మీరే రంగంలోకి దిగొచ్చుగా?’
కోల్కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు, లాక్డౌన్ అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదన్న అమిత్ షా విమర్శలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాక్డౌన్ అమలును పర్యవేక్షించేందుకు అమిత్ షా కేంద్రం బృందాలను కేవలం బెంగాల్కు మాత్రమే పంపించారు. సరే మంచిదే. మా ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని మీరు భావిస్తున్నారు కదా.. అలాంటపప్పుడు మీరే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు’ అని అమిత్ షాను ప్రశ్నించారు దీదీ. అంతేకాక లాక్డౌన్ సమయంలో రైళ్లు, విమనాలు తిరిగేందుకు అనుమతివ్వడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు బెంగాల్కు రావడం పట్ల కూడా మమత ఆందోళన వ్యక్తం చేశారు. (రైల్వేల తీరుపై దీదీ ఫైర్) రాబోయే 24 గంటల్లో, మహారాష్ట్ర మీదుగా బెంగాల్కు 36 శ్రామిక్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘ఇప్పటికే దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాజస్తాన్, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు బెంగాల్ వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నేనేం చేయాలి? అందుకే ప్రధాని మోదీనే స్వయంగా ఇక్కడ పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను’ అన్నారు దీదీ. అయితే ఇంత అకస్మాత్తుగా బెంగాల్కు వలస కూలీల రైళ్లను పంపడం.. తనను కలవరపరిచేందుకు కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టెందుకే బీజేపీ ఇలా చేస్తుందని మమత ఆరోపించారు. కేంద్ర తనను ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నం వల్ల.. బెంగాల్ ప్రజలు నష్టపోతారని తెలిపారు. బీజేపీ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం గురించి కాక వలస రైళ్ల గురించి ప్రణాళికలు చేస్తే బాగుంటుందని మమత సూచించారు.(మమత సర్కారు కీలక నిర్ణయం) -
చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి మృతి
కోల్కతా : లాక్డౌన్ కారణంగా చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. కీమోథెరపీ కోసం ఆసుపత్రుల చూట్టూ తిరగాల్సి వచ్చిందని, సరైన సమయంలో చికిత్స అందక తన కూతురు చనిపోయినట్లు తండ్రి బిస్వజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది క్యాన్సర్ కారణంగా ప్రియాంషి సాహా అనే రెండేళ్ల చిన్నరికి కలకత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్ర్తచికిత్స చేయించారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా కీమో ధెరపీ చేయించాలని వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కీమో థెరపీ చేయలేమంటూ హాస్పిటల్ నిర్వాహకులు చెప్పడంతో గత నెల నుంచి సరిగ్గా వైద్యం అందక ఆరోగ్యం క్షీణించినట్లు ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. కోల్కతాలోని బరాసత్ జిల్లా హాస్పిటల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పలు ఆసుపత్రల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ప్రియాంషి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ.. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని నిర్లక్ష్యం చేయవద్దని, అత్యవసరంగా చికిత్స అవసరం ఉన్న వారి పట్ల వెంటనే స్పందించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. గత పదేళ్లలో బెంగాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఈ పేరును అప్రతిష్ట చేయవద్దని కోరారు. ( ‘వీడియో కాన్ఫరెన్స్లతో మాకు ఒరిగిందేమీ లేదు’ ) -
లాక్డౌన్: మమత సర్కారు కీలక నిర్ణయం
కోల్కతా: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మూడు మాసాల ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ సమీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. దీదీ మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన కల్లోలాన్ని సమర్థవంతంగా అంతం చేయడంతో పాటుగా.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లను ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిపారు. (కేంద్రం తీరుపై మమతా బెనర్జీ అసహనం) ఈ క్రమంలో రెడ్ జోన్ ఏలో లాక్డౌన్ నిబంధనలకు మినహాయింపు లేదన్న మమత.. రెడ్ జోన్ బీలో కొన్ని సడలింపులు ఇస్తామన్నారు. ఇక రెడ్ జోన్ సీలో బీ కంటే మరిన్ని ఎక్కువ మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. సదరు ప్రాంతాలు, ఆయా చోట్ల ఏయే షాపులు తెరవాలో నిర్ణయాంచాల్సిన బాధ్యతను కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు అప్పగించామని మమత తెలిపారు. కాగా గ్రీన్జోన్లలో బస్సులు నడిపేందుకు పశ్చిమ బెంగాల్ సర్కారు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 13 బస్సు సర్వీసులు అందుబాటులోకి రాగా.. ఒక్కో బస్సులో కేవలం 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. (రీస్టార్ట్కి రెడీ అవుదాం) అదే విధంగా గ్రీన్ జోన్లలో జ్యువెల్లరీ, ఎలక్ట్రిక్ వస్తువులు, పెయింట్ స్టోర్లు, చిన్న చిన్న దుకాణాలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఆరింటి దాకా తెరచుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే క్రమంలో.. బీడీ పరిశ్రమను తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే 50 శాతం మందిని మాత్రమే పనిచేసేందుకు కంపెనీలోకి అనుమతించనున్నారు. అదే విధంగా సామాజిక ఎడబాటు పాటిస్తూ సినీ, టీవీ ఇండస్ట్రీ కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే షూటింగ్లు వద్దని, కేవలం ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే చేసుకోవాలని ఆదేశించింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రెస్టారెంట్లు ఇప్పుడే ప్రారంభించే అవకాశమే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
బెంగాల్లో ప్రముఖ వైద్యుడి మృతి
కోల్కతా : ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యలను కూడా మహమ్మరి రోగం వదలట్లేదు. పశ్చిమబెంగాల్లో 60 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యుడు బిప్లాబ్ కాంతిదాస్ గుప్తా ఈ వైరస్ కారణంగా సోమవారం చనిపోయారు. రాష్ర్టంలో కోవిడ్ కారణంగా మరణించిన మొట్టమొదటి వైద్యుడు ఈయనే అని అధికారులు వెల్లడించారు. ఇదివరకే శ్వాసకోస ఇబ్బందులతో భాదపడుతున్నా తన కర్తవ్యాన్ని వీడకుండా రోగులకు వైద్యు సేవలందించారు. కోవిడ్ లక్షణాలతో సాల్ట్ లేక్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో చేరగా, అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ సోమవారం ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. మీరు చేసిన త్యాగం ఎప్పటికీ మరిచిపోం అంటూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. We have lost Dr Biplab Kanti Dasgupta Assistant Director, Health Services, West Bengal in the early hours of today. He was Assistant Director of Health Services, Central Medical Stores. We are deeply pained with his untimely demise. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) April 26, 2020 పశ్చిమ బెంగాల్ వైద్యుల ఫోరం కూడా కాంతిదాస్ గుప్తా మరణానికి సంతాపం తెలిపింది. మరోవైపు వైద్యులకు సరిపడా పీపీఈ కిట్లు ప్రభుత్వం అందిచట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇదే రకమైన నిర్లక్ష్య ధోరణి వహిస్తే మరికొంత మంది వైద్యులు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆరోపించింది. ఇప్పటివరకు బెంగాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 633 ఉండగా, 18 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా వెల్లడించారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు) -
హాస్పిటల్స్లో మొబైల్ ఫోన్లపై బాన్
కోల్కతా : హాస్పిటల్ లోపల మొబైల్ ఫోన్ల వాడకాన్నినిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రోగుల సహాయార్థం ల్యండ్లైన్స్ ఏర్పాటు చేస్తామని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా బుధవారం తెలిపారు. కోల్కతాలోని బాంగూర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులో రెండు మృతదేహాలను గంటల కొద్ది అలాగే వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు మృతదేహాలకు చాలా దగ్గర్లోనే కరోనా రోగులు కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెడ్బాడీస్ని తక్షణమే తీసెకెళ్లాల్సిందిగా బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ కరోనా రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ...వీడియో వైరల్ కావడంతోనే హాస్పిటల్స్ లోపల మొబైల్ ఫోన్లను నిషేదించారని మమతాసర్కార్పై ఆరోపణలు గుప్పించారు. నిజాలను నొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యకు పూణుకున్నట్లు ద్వజమెత్తారు. అంతేకాకుండా ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి..ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మాత్రం దీనిపై స్పందించట్లేదని, కనీసం అది నకిలీ వీడియో అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని పేర్కొన్నారు . దీన్ని బట్టి ఈ వీడియో నిజం అని నమ్మడానికి చాలా ఆస్కారం ఉందని ట్వీట్ చేశారు. What’s very concerning is, inspite of this VDO being super-viral on all platforms, TILL NOW the WB Govt of @MamataOfficial Didi, did not come up with any claim that this is a fake VDO or that the hospital is not Bangur!!That takes us Very Close to believing it is indeed authentic https://t.co/Ec92ByNdgg — Babul Supriyo (@SuPriyoBabul) April 21, 2020 -
ఆ అధికారులను తొలగించండి: గవర్నర్
కోల్కతా: రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ అసహనం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నిబంధనల అమలులో వైఫల్యం చెందుతున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని మమతా బెనర్జీ సర్కారుకు సూచించారు. ‘‘కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు.. విధించిన లాక్డౌన్ను 100 శాతం అమలు చేయడంలో విఫలమైన పోలీసులు, అధికారులను తొలగించాలి. మతపరమైన సమ్మేళనాలు జరగకుండా చూడటంలో వాళ్లు వైఫల్యం చెందారు. లాక్డౌన్ను విజయవంతం చేసేందుకు కేంద్ర బలగాల మోహరింపు అంశాన్ని పరిశీలించాల్సి ఉంది’’అని ఆయన ట్వీట్ చేశారు.(లాక్డౌన్ సడలించే రంగాలు ఇవే..) కాగా రాష్ట్రంలో పలు చోట్ల(మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట) లాక్డౌన్ను పక్కాగా అమలు చేయడం లేదంటూ బీజేపీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి మమత.. కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో నిఘా పెట్టాలంటూ కేంద్రం ప్రత్యేక చొరవ చూపిస్తోందని చురకలు అంటించారు.(ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) ‘‘మతపరమైన వైరస్కు వ్యతిరేకంగా మనం పోరాడటం లేదు. మనుషుల నుంచి మనుషులకు సోకే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటాం. అయితే దానర్థం షాపులు పూర్తిగా మూసివేయమని కాదు. ఆయా చోట్ల పర్యవేక్షణ కొనసాగుతోంది’’అని పేర్కొన్నారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ ఘటన విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘నో కమ్యూనల్ క్వశ్చన్స్’’అని మమత సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెపై విమర్శల వర్షం గుప్పించింది. -
‘తబ్లిగీ జమాత్ కేసులపై స్పష్టత లేదు’
కోల్కతా: మహమ్మారి కరోనా విజృంభణతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న వేళ నిజాముద్దీన్ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వాగ్యుద్ధానికి తెరలేపారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తబ్లిగీ జమాత్కు వెళ్లిన వారి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని బీజేపీ మండిపడగా.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిగీ జమాత్కు హాజరైన వారిలో అత్యధిక మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కార్యక్రమానికి హాజరైన వారందరి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్కు తరలించాలని పేర్కొంది.(కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు) ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ కేసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమధానం దాటవేశారు. అటువంటి ప్రశ్నలు(కమ్యూనల్ క్వశ్చన్లు) అడగకూడదని సూచించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘జమాత్ కేసులు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. కానీ బెంగాల్లో ఎన్ని కొత్త కరోనా కేసులు నమోదయ్యాయోనన్న విషయంపై స్పష్టత లేదు. ఎంత మందిని గుర్తించారు. ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలేమిటి? ఇంతవరకు అప్డేట్ లేదు. ఓటు బ్యాంకు కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారా’’ అని మమతా బెనర్జీ తీరును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Mamata Banerjee when asked for an update on Tablighi cases said, “Don’t ask communal questions.” Jamaat cases have exploded across, but no clarity on the latest numbers in Bengal. How many of them traced and tested. Results? No update at all! Has she made this about vote bank? — Amit Malviya (@amitmalviya) April 7, 2020 -
సభలో సెల్ఫోన్ మోతలు.. స్పీకర్ ఆగ్రహం!
కోల్కత: పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ బీమాన్ బెనర్జీ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి సెల్ఫోన్లు తీసుకొచ్చిన సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ తొలిరోజున ఈ ఘటన వెలుగుచూసింది. ఇటీవల స్వర్గస్థులైన రాజకీయ ప్రముఖులకు సభ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో కొంతమంది సభ్యుల మొబైల్ ఫోన్లు మోగాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొబైల్ ఫోన్లతో హౌజ్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు.. ఫోన్లు తెచ్చివ్వాలని స్పష్టం చేశారు. అయితే, ఒక సభ్యుడు మాత్రమే తన ఫోన్ తీసుకెళ్లి స్పీకర్కు అందించాడు. కాగా, ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల్లో కొందరు సభా నియామాల్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఫోన్ వెంట తెచ్చుకుంటే తమను తిప్పి పంపరు కదా అని భావించే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అన్నారు. సభా మర్యాదల్ని కాపాడాలని హితవు పలికారు. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు.. సంతాప తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన లోక్సభ మాజీ ఎంపీలు కృష్ణా బోస్, తపస్ పాల్, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాగోపాల్ నియోగి, పరిమల్ ఘోష్, వినయ్ దత్తా, ఫుట్బాల్ ఆటగాడు అశోక్ ఛటర్జీకి నివాళులర్పించారు. -
మాజీ మహిళా ఎంపీ కన్నుమూత
కోల్కతా: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ క్రిష్ణబోస్(89) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘‘వయో సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. రెండోసారి స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించాం. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు’’అని క్రిష్టబోస్ తనయుడు సుమాంత్రా బోస్ తెలిపారు. కాగా 1930లో జన్మించిన క్రిష్ణబోస్.. కోల్కతాలోని సిటీ కాలేజీలో దాదాపు నలభై ఏళ్లపాటు లెక్చరర్గా పనిచేశారు. అదే కాలేజీలో ఎనిమిదేళ్ల పాటు ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువు శిశిర్ కుమార్ బోస్ను వివాహం చేసుకున్న ఆమె... 1996లో తొలిసారిగా లోక్సభ ఎంపీగా గెలుపొందారు. మొత్తం మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆమె... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాధవ్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. క్రిష్ణబోస్కు కుమారులు సుగతా బోస్, సుమంత్రా బోస్, కూతురు షర్మిల ఉన్నారు. కాగా అభిమానులు సందర్శనార్థం క్రిష్ణబోస్ భౌతిక కాయాన్ని తొలుత శరత్రోడ్డులోని ఆమె నివాసానికి తరలించారు. అక్కడి నుంచి నేతాజీ భవన్కు పార్థివదేహాన్ని తీసుకువెళ్లిన తర్వాత.. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీ భవన్లో క్రిష్ణబోస్కు నివాళులు అర్పించనున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున క్రిష్ణబోస్ నివాసానికి చేరుకుంటున్నారు. -
కుక్కల్ని కాల్చినట్లు.. కాల్చిపారేస్తున్నారు!
కోల్కతా: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, అసోం, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్లను కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓట్లు వేసిన వాళ్లను కాపాడుకునేందుకే దీదీ ఇలా చేస్తున్నారని విమర్శించారు. నదియా జిల్లాలో ఆదివారం జరిగిన సభకు హాజరైన దిలీప్ ఘోష్ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరులో జరిగిన ఆందోళనల్లో భారీగా ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయన్నారు. రైల్వే, రవాణా ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై లాఠీచార్జీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయలేదన్నారు.(‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’) ‘మీరు ధ్వంసం చేస్తున్న ఆస్తులు ఎవరివి అనుకుంటున్నారు. అవి మీ నాన్నవి కాదు... ప్రభుత్వ ఆస్తులు. పన్ను కడుతున్న ప్రజలవి. మీరు ఇక్కడికి వస్తారు. మా తిండి తింటారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. ఇదేమైనా మీ జాగీరా? మిమ్మల్ని లాఠీలతో చితక్కొడతాం. కాల్చిపడేస్తాం. జైళ్లో పెడతాం అంటూ దిలీప్ ఘోష్ ఆందోళనకారులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా... దేశంలోకి దాదాపు రెండు కోట్ల మంది ముస్లింలు చొరబడ్డారని.. వారిలో కోటి మంది పశ్చిమ బెంగాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. బెంగాలీ హిందువుల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిని మమత రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాగా డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేలా నరేంద్ర మోదీ సర్కారు చట్టం తీసుకవచ్చిన విషయం తెలిసిందే. ఇక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్న విషయం విదితమే. (సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు.. ప్రధానితో మమత) చదవండి: ఆమె తలపై ఉన్నది రక్తమేనా; కంపరంగా ఉంది -
ఏం మాట్లాడుతున్నారో.. మీకైనా తెలుస్తోందా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. ఆమెకైనా తెలుసా అసలు.. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కిషన్రెడ్డి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడటం.. కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కారణంగా మమత భయపడిపోతున్నారన్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మమత ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుసా. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి’ అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా సీసీఏకు దేశ పౌరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలిగించదని.. కాబట్టి ఆందోళనకారులు నిరసన విరమించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు మతాన్ని ఉపయోగించుకుంటున్నారా అంటూ మేధావులు, ప్రతిపక్షాలను ప్రశ్నించారు.(సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) -
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దీదీ మెగార్యాలీ!
కోల్కతా: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్కతాలో మెగార్యాలీని నిర్వహించనున్నారు. రెడ్రోడ్లోని బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జోరాసంకో ఠాకుర్బారి వద్ద ముగుస్తుందని మమత ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. కొల్కతాలోని ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను దిగ్బందనం చేసి అడ్డుకుంటుండంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనల కారణంగా అనేక రైళ్లు ఆలస్యం కాగా.. మరికొన్ని రద్దయ్యాయి. A mega rally will be held today in #Kolkata to protest against unconstitutional #CABBill & #NRC. It will begin at 1pm near the statue of Babasaheb Ambedkar on Red Road & end at Jorasanko Thakurbari.(1/2) — Mamata Banerjee (@MamataOfficial) December 16, 2019 ఇక వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని నిప్పంటించి.. తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్డా, ఉత్తర దినజ్పూర్, ముర్షిదాబాద్, హౌరా, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణ అనే ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ జిల్లాల్లో సవరించిన చట్టంపై ఆందోళనలు తీవ్రతరం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదివారం సీఎం మమతా బెనర్జీ తీరును తప్పుబడుతూ.. పోలీసుల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజా ధనాన్ని.. చట్టానికి వ్యతిరేకంగా టెలివిజన్లలో ప్రచారానికి వృథా చేస్తున్నారని విమర్శించారు. -
‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగాల్లోనే తొలుత ఈ చట్టం అమలు జరిగి తీరుందని వ్యాఖ్యానించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనో అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ఆందోళనకారులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి గల కారణలేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయంతోనే ఆమె ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘మమత ఇదివరకు ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడాన్ని ఆపలేకపోయారు. ఇప్పడు కూడా అంతే.. మమతా బెనర్జీ గానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ చట్టం అమలును అడ్డుకోలేరు. నిజానికి ఈ రాష్ట్రంలో తొలుత పౌరసత్వ సవరణ చట్టం అమలు జరుగుతుంది. అయినా మమతకు అక్రమవలసదారుల పట్ల ఉన్న ప్రేమ.. హిందూ శరణార్థుల పట్ల ఎందుకు లేదో అర్థంకావడం లేదు. అక్రమ వలసదారుల గురించే ఆమె బాధ పడుతున్నారు’ అని దిలీప్ ఘోష్ మమతను విమర్శించారు. ఇక మరో బీజేపీ నేత కైలాశ్ విజయ్వర్గియా సైతం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
ఆ పార్టీ విభేదాలు సృష్టిస్తోంది
కోల్కతా : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏఐఎంఐఎంను అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.అలాగే హిందూ అతివాద శక్తుల పట్ల ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. మమత ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. బెంగాల్లో ముస్లింల పరిస్ధితి అత్యంత దారుణంగా ఉంది. బెంగాల్లో మేం బీజేపీకి 'బీ టీం' అనడం పూర్తిగా అర్థరహితమన్నారు. మమతా బెనర్జీ భయంతోనే అలా మాట్లాడుతున్నారు. బెంగాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఒవైసీ తెలిపారు. -
‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’
కోల్కతా : స్కూల్ టీచర్ బంధు ప్రకాశ్ పాల్(35) కుటుంబం హత్య పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ఆరెస్సెస్ కార్యకర్త అయినందుకు వల్లే బంధు కుటుంబం దారుణ హత్యకు గురైందని బీజేపీ ఆరోపిస్తుండగా... ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ నేరం జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కూలీ ఉత్పల్ బెహరాను అరెస్టు చేశామని.. అతడు నేరం అంగీకరించాడని వెల్లడించారు. బంధు నిర్వహిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఖాతాదారుడైన ఉత్పల్... తన డబ్బులు తనకు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే బంధు కుటుంబాన్ని హతమార్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.06 నుంచి 12.11 ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని.. ఆ సమయంలో బంధు ఇంటి నుంచి ఉత్పల్ బయటికి రావడం తాను చూసినట్లు పాలు అమ్ముకునే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. అంతేగాక ఉత్పల్ ఫోన్కాల్ లిస్టు, ఘటనాస్థలంలో దొరికిన ఆయుధంపై అతడి వేలిముద్రలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఉత్పల్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని పేర్కొన్నారు. తొలుత బంధును మాత్రమే చంపాలనుకున్నానని.. అయితే ఆ సమయంలో అతడి భార్యా పిల్లలు తనని చూస్తే పోలీసులకు చెబుతారనే భయంతోనే వారిని కూడా హత్య చేసినట్లు ఉత్పల్ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.(చదవండి : అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!) ఈ నేపథ్యంలో తమ కుమారుడు అలాంటి వాడు కాదని.. పోలీసులే తనను కేసులో ఇరికించారని ఉత్పల్ తండ్రి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధ పడుతున్నారని... తమకు ఉత్పల్ సంపాదన తప్ప ఇతర జీవనాధారం లేదని అతడి సోదరి వాపోయింది. నిజమైన హంతకులను పట్టుకుని తన సోదరుడిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. కాగా ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ స్పందించారు. మమత సర్కారు అభాసుపాలుకాకుండా పోలీసులు ఓ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ‘కేవలం రూ. 48 వేల కోసం ఓ వ్యక్తి కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడన్నది నేటి కథ. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు పోలీసులు కంటితుడుపు చర్యగా ఓ రోజూవారీ కూలీని అరెస్టు చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థచేత విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. కేవలం 5 నిమిషాల్లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి.. వెంటనే అక్కడి నుంచి పారిపోవడం సాధ్యమయ్యే విషయమేనా అని ప్రశ్నించారు. కాగా ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పలువురు బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ హత్యల వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం, బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య) -
మమతా బెనర్జీ యూటర్న్!
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన మమత.. మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగానే కలవనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధుల విడుదలతో పాటు, రాష్ట్రం పేరును మార్చే విషయాలను ప్రధానితో చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీని అన్ని విషయాల్లో విమర్శించే మమత అకస్మాత్గా మోదీతో భేటీతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి అలాగే జూన్లో జరిగిన నీతిఅయోగ్ సమావేశానికి కూడా మమత గైర్హాజరు అయ్యారు. అయితే మమత ఎవరు ఊహించని విధంగా మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆ తర్వాత రోజే ఆయనతో భేటీ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దీంతో మమత అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు సీపీఐ(యమ్), కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. శారద స్కామ్ విషయంలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు, కొల్కత్తా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని-మమతా భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మమత ప్రధానిని కలవనుండటంతో...దీదీని విమర్శించడాని బీజేపీకి మంచి అస్త్రం దొరికినట్లయింది. సీబీఐ నుంచి తనను తాను కాపాడుకోవడానికి మమత విఫలయత్నం చేస్తున్నారంటూ బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయం పై బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా మాట్లాడుతూ ‘ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె (మమత బెనర్జీ)ఏవిధంగా మాట్లాడారో మనందరికి తెలుసు. సమాఖ్య వ్యవస్థ పట్ల మమతకు గౌరవం లేదు. దేశానికి ప్రధానిగా భావించి అయిన నరేంద్రమోదీని ఆమె ఎప్పుడూ గౌరవించలేదు. అలాంటిది ఇంత అకస్మాత్తుగా మమత ఢీల్లీకి ఎందుకు వెళుతున్నారనేది బహిరంగ రహస్యమే’ అని ఆయన పేర్కొన్నారు. కాగా 2018 మే 25న జరిగిన విశ్వభారతి విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో నరేంద్రమోదీని మమత కలిశారు. -
వైఎస్సార్కు మమతా బెనర్జీ నివాళి
కోల్కతా: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులు అర్పించారు. ఈ మేరకు.. ‘ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయననకు నివాళులు అర్పిస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు. Tribute to YS Rajasekhara Reddy, former Chief Minister of Andhra Pradesh, on his death anniversary @ysjagan অন্ধ্রপ্রদেশের প্রাক্তন মুখ্যমন্ত্রী ওয়াই এস রাজশেখর রেড্ডিকে তাঁর প্রয়াণদিবসে শ্রদ্ধাঞ্জলি — Mamata Banerjee (@MamataOfficial) September 2, 2019 -
మమతానురాగాల ‘టీ’ట్
‘జీవితంలో చిన్న చిన్న పనులు మనకు భలే సంతోషాన్ని ఇస్తాయి’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. దిఘా పట్టణ పర్యటనకు వెళ్లినప్పుడు సమీపంలో దత్తాపూర్ గ్రామంలో అనుకోకుండా ఆమె ఒక టీస్టాల్కి వెళ్లి, ఆ ఓనరు అనుమతి తీసుకుని టీ కాచి, కస్టమర్లకు ఆప్యాయంగా అందించారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టి పై కామెంట్ రాశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్లో దారుణం
కలకత్తా : తను ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వమనడమే ఆమె నేరమైంది. నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా అంటూ ఓ పార్టీ నాయకుడు తన అనుచరులతో కలసి ఆమెను దారుణంగా రేప్ చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తాజాగా తమ పార్టీ కార్యకర్తలకు లంచాలు తీసుకోవద్దని, ఇప్పటికే తీసుకుంటే తిరిగివ్వండని పిలపునిచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరైనా పార్టీ కార్యకర్త లంచం తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి ఇవ్వాలని సూచించారు. మమతా బెనర్జీ పిలుపుతో చాలా మంది పార్టీ కార్యకర్తలు తాము తీసుకున్న లంచాన్ని తిరిగివ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని మైనాగురి ప్రాంతానికి చెందిన ఓ పేద మహిళ ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన తృణమూల్ కార్యకర్త, పంచాయతీ నాయకుడు లంచం డిమాండ్ చేయడంతో రూ.7000 ఇచ్చింది. సంవత్సరం నుంచి ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి విడుదల కాకపోయినా ఆమె అతన్ని నిలదీయలేదు. కానీ తాజాగా మమతా బెనర్జీ తన కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు తన డబ్బులు వస్తాయనే ఆశతో ఆగస్టు 14న వెళ్లి అడిగింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ ఆ ‘నాయకుడు’ ఆమెను దారుణంగా హింసించడమేగాక తన అనుచరులతో కలసి గ్యాంగ్రేప్ చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఈ అంశం తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ‘మమతాజీ మీ కార్యకర్తలు మీ పిలుపుకు బాగా ప్రతిస్పందించారని’ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో తాజా ఘటన మమతకు రాజకీయంగా మరిన్ని తలనొప్పులు తీసుకొచ్చింది. -
బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!
న్యూఢిల్లీ/కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే పలు వర్గాలను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కూడా కాషాయ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. బెంగాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ పార్టీకి చెందిన నేతలు అధిక సంఖ్యలో కమలం గూటికి చేరుకున్నారు. తాజాగా రాజకీయ నాయకులతో పాటు దాదాపు 13 మంది బెంగాల్ ప్రముఖ నటీమణులు ఢిల్లీకి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆధ్వర్యంలో అధికారికంగా పార్టీలో చేరారు. ఈ క్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ...రిషి కౌశిక్, పార్నో మిత్రా, కాంచన మెయిత్రా, రూపా భట్టాచార్య అంజనా బసు, కౌశిక్ చక్రవర్తి వంటి పలువురు టీవీ స్టార్లు పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. బెంగాల్లో ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ ఉద్రిక్తతలు సృష్టిస్తున్న తరుణంలో వీరంతా సాహసం చేసి మరీ బీజేపీలో చేరారన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు వెరవక బీజేపీలో చేరిన నటీమణులకు శిరసు వహించి వందనం సమర్పించాలంటూ ప్రశంసలు కురిపించారు. కాగా సీఎం మమతా బెనర్జీ కూడా లోక్సభ ఎన్నికల్లో సినిమా నటులకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. దీదీ అండలతో లోక్సభ బరిలో దిగిన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ అఖండ విజయం సాధించి పార్లమెంటులో తమ గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తారల చరిష్మాను వాడుకునేందుకు సమాయత్తమవుతోంది. ఇక 2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. -
రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీం!
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీకే టీం రాజకీయాల్లో యువత (పాలిటిక్స్ ఇన్ యూత్) పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతలో రాజకీయ చైతన్యం పెంచే క్రమంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే దిశగా ముందు సాగుతోంది. ఇప్పటికే రోజుకు దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు నాటికి 5 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పీకే టీం ప్రణాళికలు రచిస్తోంది. తమ టార్గెట్ పూర్తైన తర్వాత 15 నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనుంది. ఇక ఈ ట్రెయినింగ్ పూర్తైన తర్వాత యువత తమకు నచ్చిన పార్టీలో చేరే వీలు కల్పించడం విశేషం. మరోవైపు టీఎంసీ కూడా ‘యూత్ ఇన్ పాలిటిక్స్’ పేరిట సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా లోక్సభ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీకి... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇక బెంగాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం, నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యూహకర్తగా ఉంటే గెలుపు తథ్యమనే భావన నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో బెంగాల్లో క్రమేపీ బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు దీదీ పీకే టీంను ఎంచుకున్నట్లు సమాచారం. -
బెంగాల్లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని భట్పారా ప్రాంతంలో చెలరేగిన హింస కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం గుర్తుతెలియని వ్యక్తుల మధ్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతరు ఉన్నతాధికారులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచనల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లలో రాంబాబు షా(17) అనే పానీ పూరీ బండి నడుపుకునే యువకుడు, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలంలో చిన్న సైజు బాంబు విసిరినట్లుగా, కాల్పులు జరిగినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గాస్ ఉపయోగించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం అందింది. ఇదంతా కూడా బెంగాల్లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో డీజీపీ, స్థానిక పోలీస్ స్టేషన్కు సంబంధించి ఒక కొత్త బిల్డింగ్ను ప్రారంభించే ఒక గంట ముందు చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి డీజీపీ కొత్త బిల్డింగ్ను ఓపెనింగ్ చేయకుండా తిరిగి కోల్కత్తాకు బయలుదేరి వెళ్లారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అల్లర్ల నేపథ్యంలో దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. -
డాక్టర్లపై ఎవరు దాడులు చేసినా.. కఠిన శిక్షే
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులపై ఎవరు దాడి చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రులను కోరారు. గతవారం కోల్కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. -
చర్చలకు రండి; కుట్రలో భాగంగానే ఇలా..
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో జూడాల నిరసన మరింత ఉధృతమయ్యింది. గత వారంలో కోల్కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 యేళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందికి ,అనేక మంది జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వారు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మమతకు సూచించారు. ఈ మేరకు జూడాలను చర్చలకు ఆహ్వానించగా వారు తిరస్కరించారు. నిరసనను నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. తాను కోల్కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు జూడాలు తనతో కూడా సరిగా ప్రవర్తించలేదని అయిన వారు చిన్నవారు కావడంతో తాను కూడా అవేమి పట్టించుకోలేదని,వారు తమ పనిని పునఃప్రారంభించడమే తనకు కావాలని మమత అన్నారు. అయితే మమత వ్యాఖ్యలను అనేక మంది తప్పుబడుతున్నారు. ఆసుపత్రిలపై జరిగే మూర్ఖపు దాడులను ప్రోత్సహించకూడదన్నారు. ఈ క్రమంలో జూడాలపై మమత చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు రేపడంతో కేంద్ర మంత్రులు, బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సహా సొంత పార్టీ నేతల నుంచి మమత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జూడాల సమ్మె గురించి చర్చించడానికి తాను మమతకు కాల్ చేశానని..అయితే మమత స్పందించలేదని గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. కాగా మమత తీరుకు నిరసనగా కోల్కతాలోని 300 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. జూడాలకు మద్దతుగా బెంగాల్తో పాటు ఢిల్లీలోని డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా,ఒడిశా, అస్సాం ,త్రిపురలోని డాక్టర్లు వారికి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లోగా జూడాల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. అలా జరగని పక్షంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. దీనిపై స్పందించి ఏడు రోజుల్లో సమాధానమివ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బెంగాల్లో 43 మంది వైద్యుల రాజీనామా
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం బెంగాల్ ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 43 మంది వైద్యులు రాజీనామా చేశారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డాక్టర్లు సమ్మెను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి చెందిన 16 మంది వైద్యులు తమ రాజీనామాను ప్రభుత్వ ఆరోగ్యశాఖకు అందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా భాధ్యతలను నిర్వర్తించలేమని’ డాక్టర్లు లేఖలో పేర్కొన్నారు. వారితో పాటు డార్జిలింగ్లోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి చెందిన 27 మంది వైద్యులు శుక్రవారం రాజీనామాను సమర్పించారు. వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రముఖ ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సాయిబాల్ ముఖర్జీ ,సూపరిండెంట్ కం. వైస్ ప్రిన్సిపాల్ సౌరభ్ ఛటోపద్యాయ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్( డీయంఈ) కి రాజీనామాను సమర్పించారు. అత్యవసర సేవలు మాత్రమే.. ఔట్ పేషెంట్ మరియు అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించాల్సిందిగా డీయంఈ ప్రొఫెసర్ డా. ప్రదీప్ కుమార్ డే అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, డైరెక్టర్లకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో అన్ని ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ప్రైవేటు ఆసుపత్రులలోనూ అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం ఉదయం నిల్ రతన్ సర్కార్ (ఎన్ఆర్ఎస్) మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సహా ఒకటి , రెండు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
‘ఇదేమీ గుజరాత్ కాదు’
కోల్కతా : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బెంగాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే ధ్యేయంగా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలన్న వారి కుట్రలను భగ్నం చేస్తామని పేర్కొన్నారు. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం విమర్శల యుద్ధానికి దిగుతున్నారు. అంతేకాక బెంగాల్లో శాంతి భద్రతలు పరిరక్షించడంలో మమత ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర హోంశాఖ విమర్శించింది. ఈ నేపథ్యంలో సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు బెంగాల్ను మరో గుజరాత్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇదేమీ గుజరాత్ కాదు. ఉత్తరప్రదేశ్లో చిన్న పిల్లలు హత్యకు గురవుతున్నారు. అలాంటివి మా రాష్ట్రంలో ఎంతమాత్రం ఉపేక్షించము. బీజేపీ గెలిచిన తర్వాత బెంగాల్లో అల్లర్లను ప్రోత్సహిస్తోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు కొంతమంది మాపై కుట్రలు చేస్తున్నారు. కానీ మేమెప్పుడూ వారికి తలవంచబోము’ అని బీజేపీ తీరుపై మండిపడ్డారు. అదేవిధంగా మీడియా కూడా ఘర్షణలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘కేవలం ఇద్దరు కార్యకర్తలు మరణిస్తే.. నలుగురు చనిపోయారంటూ మీడియా ప్రసారం చేస్తోంది. అడ్వర్టైజ్మెంట్లకు బీజేపీ డబ్బులు ఇస్తుంది కాబట్టి వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడం సరైంది కాదు’ అని మమత విమర్శలు గుప్పించారు. కాగా ఉత్తర 24 పరగణలో చెలరేగిన అల్లర్లలో తమ పార్టీకి చెందిన ఐదుగురు కార్యకర్తలు మరణించారని బీజేపీ ఆరోపిస్తుండగా..టీఎంసీ మాత్రం కేవలం ఇద్దరు కార్యకర్తలే చనిపోయారనడం గమనార్హం. -
నేను రాను; ప్రధాని మోదీకి దీదీ లేఖ
కోల్కతా : గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకువచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి ఆయోగ్కు ఎటువంటి అధికారాలు లేవని, అందుకే తాను కౌన్సిల్ సమావేశానికి హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ‘దురదృష్టవశాత్తూ.. ప్రణాళిక సంఘం స్థానంలో జనవరి 1, 2015లో నీతీ ఆయోగ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు కట్టబెట్టకుండా నిబంధనలు తెచ్చారు. రాష్ట్రాలకు ఇందులో ఎటువంటి ప్రాధాన్యం ఉండదు. సలహాలు, సూచనలకు మద్దతు లభించదు. కాబట్టి ఇటువంటి సంస్థ సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావు’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు. కాగా జూన్ 15న నీతి ఆయోగ్ కౌన్సిల్ తొలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ పునర్ వ్యవస్థీకరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేరనున్నారు. ప్రధాన మోదీ చైర్మన్గా వ్యవహరించే నీతి ఆయోగ్లో కే సరస్వత్, రమేష్ చాంద్, డాక్టర్ వీకే పాల్ సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ భేటీకి హాజరుకానున్నారు. -
మరి అప్పుడు కూడా అదే చేశారుగా దీదీ!
కోల్కతా : బెంగాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మథురాపూర్ నియోజకవర్గం, డమ్ డమ్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతున్న మమత తీరు సరైందని కాదని విమర్శించారు. ‘ సీపీఐ(ఎమ్) మీకు చేసిన దాని గురించి ఎందుకు మరచిపోతున్నారు. ఈరోజు దీదీ ఎన్నికల సంఘాన్ని, కేంద్ర బలగాలను అకారణంగా దూషిస్తున్నారు. మరి బెంగాల్లో వామపక్ష పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కుంచుకున్నపుడు కూడా ఈసీ, బలగాలు ఇదే విధంగా పనిచేశాయి కదా. అంటే గతంలో వాళ్లు మీకు సహకరించారా. ఇలాంటివి చేశారు కాబట్టే.. ప్రస్తుతం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక మోదీ హటావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్న ప్రతిపక్షాలు గత ఆరు నెలలుగా కనీసం ప్రధాని అభ్యర్థిని కూడా నిర్ణయించలేక చతికిల పడ్డాయని ఎద్దేవా చేశారు. వారు ఓటమిని అంగీకరించారని.. అందుకే అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో తొలిసారి ఆర్టికల్ 324ను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక రోజు ముందే అక్కడ ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేటి సాయంత్రమే అక్కడ ప్రచారం ముగిసింది. ఇక ఈ నెల 19న బెంగాల్లో తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. కాగా మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా రోడ్షోపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి ఘటనపై ఈసీ జోక్యం చేసుకోవాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. -
కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత
కోల్కతా : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోల్కతా ర్యాలీ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ- అధికార తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రచార వేదిక వద్దకు చేరుకున్న తృణమూల్ శ్రేణులు బీజేపీ బ్యానర్లు చించివేశాయి. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అమిత్ షా రోడ్ షో నేపథ్యంలో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. బీజేపీ, తృణమూల్తో పాటు లెఫ్ట్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ- బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు ఇస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సౌత్ 24 పరగణాల్లో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మమతా దీదీ... జై శ్రీరాం అంటూ నేనే కోల్కతాలోనే ఉంటా. మీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి’ అని సవాల్ చేశారు. కాగా అమిత్ షా ర్యాలీతో పాటు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు మమతా సర్కార్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన మంగళవారం నిర్వహించిన రోడ్ షోకు కూడా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. -
అల్లుడొచ్చాడు
మమత వారసుడు అభిషేక్ సాధారణ కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో పోరాట పటిమతో అసాధారణ విజయాలు సాధించిన ఉక్కు మహిళ మమతా బెనర్జీ. రాజకీయాలు, అధికారం ఆమెకు వారసత్వంగా వచ్చినవి కావు. కాంగ్రెస్లో పార్టీ సహచరులతో ఒకపక్క, 34 ఏళ్లు వామపక్ష సర్కారుకు నేతృత్వం వహించిన సీపీఎంతో మరోపక్క ఎడతెగని పోరాటం చేశాక 2011లో మమత అధికారంలోకి వచ్చారు. మార్క్సిస్టులను పశ్చిమ బెంగాల్ అధికార పీఠం ‘రైటర్స్ బిల్డింగ్’ నుంచి కూలదోసి తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవిని ఆమె దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగి సొంత పార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన 14 ఏళ్లలోపే సీఎం అయ్యారు. అత్త అండతో అందలం సీఎం అయిన ఏడాదికే ఆమె తన తమ్ముడు అమిత్ కొడుకు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఒకే ఒక నిర్ణయంతో 2012లో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని చేయగలిగారు. పార్టీలో చేరిన వెంటనే పాతికేళ్ల యువకుడు అభిషేక్కు అంత పెద్ద బాధ్యతను మేనత్త అప్పగించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజధాని కోల్కతా సమీపంలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి అభిషేక్ను తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దింపారు మమత. ఆయన తన తొలి ఎన్నికల పోరులో తన సమీప సీపీఎం ప్రత్యర్థి అబుల్ హస్నత్ను 71 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. లోక్సభ సమావేశాలకు ఆయన హాజరు 28 శాతమే కానీ, పశ్చిమ బెంగాల్లో మేనత్త మమత ప్రాపకంతో అభిషేక్ తన స్థాయికి మించి అధికారం చెలాయిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తి అనే ముద్ర ఇంకా ఆయనకు పడలేదు కానీ, ఆయన మాటను జవదాటే సాహసం పార్టీలో, ప్రభుత్వంలోనూ ఎవరికీ లేదు. 2019 ఎన్నికల్లో మళ్లీ డైమండ్ హార్బర్ నుంచే అభిషేక్ తృణమూల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానంలో చివరి దశలో మే 19న పోలింగ్ జరుగుతున్న కారణంగా ఆయన రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఉధృతంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మేనల్లుడి ప్రైవేటు సైన్యం ప్రభుత్వంలో, పార్టీలో అభిషేక్ పెత్తనం సాగుతుండడంతో సీపీఎం, బీజేపీ ఈ పరిణామంపై విరుచుకుపడుతున్నాయి. ‘ముఖ్యమంత్రి మమత బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రైవేటు సైన్యంలా నడుపుతున్నారు. ఆమె మేనల్లుడు రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు’ అని బీజేపీ నాయకుడు చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయం కుటుంబంతో పోలిస్తే బెనర్జీ కుటుంబం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్లో కుటుంబ పాలనకు కాస్త నెమ్మదిగానే పునాదులు పడుతున్నాయి. తనకు సీఎం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో చాలా వేగంగా తన మేనల్లుడికి పదవులు, అధికారం అప్పగిస్తున్నారు మమత. మేనల్లుడి దూకుడుగా ఎదిగే క్రమంలో తృణమూల్ బలోపేతం కావడానికి కష్టపడిన అనేక మంది సీనియర్ నేతలు పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది. గతంలో తృణమూల్లో రెండో స్థానంలో అధికారం చెలాయించిన నేత ముకుల్ రాయ్ ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అభిషేక్ను అడ్డగోలుగా పైకి తీసుకురావడంతో నొచ్చుకున్న ముకుల్ పార్టీ నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. జనవరిలో కోల్కతాలో ప్రతిపక్ష పార్టీల భారీ రాజకీయ ర్యాలీకి ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలతో అనేక కమిటీలు ఏర్పాటు చేసినా తెర వెనుక ఈ వ్యవహారం నడిపించింది మాత్రం మమత మేనల్లుడే. మమతను భవిష్యత్తులో బీజేపీయేతర కూటమి ప్రధానిగా ప్రజలకు చూపించే ప్రయత్నాన్ని అభిషేక్ విజయవంతంగా పూర్తి చేశారు. తృణమూల్ వారసత్వ రాజకీయాలకు తెర తీసిందన్న ఆరోపణలు ఖండిస్తూ, ‘బీజేపీ మాదిరిగా కుటుంబ రాజకీయాలపై తృణమూల్కు నమ్మకం లేదు. బీజేపీ సీనియర్ నేతలు అమిత్షా, రాజ్నాథ్సింగ్, గోపీనాథ్ ముండే తమ కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చారు’ అంటూ అభిషేక్ వివరించారు. దక్షిణ కోల్కతాలో మమత పెరిగిన ఇంట్లోనే అభిషేక్ పెరిగి పెద్దవాడయ్యారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఆయన ఎంబీఏ (హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్) చదివారు. పాతికేళ్లకే తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకత్వం లభించినా ఇంకా రాజకీయ యుక్తులు, నైపుణ్యాలు నేర్చుకునే దశలోనే అభిషేక్ ఉన్నారు. -
బీజేపీకి షాకిచ్చిన శివసేన!
కోల్కతా : మహారాష్ట్రలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న హిందుత్వ పార్టీ శివసేన మరోసారి మిత్రపక్షానికి గట్టి షాక్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీని సవాల్ చేసింది. మమతా బెనర్జీ ఇలాఖాలో తమ పార్టీ తరఫున 15 మంది అభ్యర్థులను నిలుపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. శివసేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశోక్ సర్కార్ గురువారం మాట్లాడుతూ.. ‘ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలను చేర్చుకుని బెంగాల్ బీజేపీ నాయకులు.. అధికార పార్టీకి షాడోగా మారుతున్నారు. వాళ్లు తృణమూల్తో ఎప్పటికీ యుద్ధం చేయలేరు. అందుకే మేము రంగంలోకి దిగాం. ఈరోజు పశ్చిమబెంగాల్లోని 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం. మరో నాలుగు చోట్ల కూడా పోటీ చేయనున్నాం అని తెలిపారు.(చదవండి : పొత్తు ఫైనల్ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ) ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ని తమ్లూక్, కొంటాయి, మిడ్నాపూర్, ఉత్తర కోల్కతా, పురులియా, బరాక్పూర్, బంకుర, బరాసత్, బిష్ణుపూర్, ఉత్తర మాల్దా, జాదవ్పూర్ తదితర లోక్సభ స్థానాల్లో శివసేన అభ్యర్థులు బరిలో దిగుతారని సర్కార్ ప్రకటించారు. అదేవిధంగా తాను మిడ్నాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. కాగా ఈ స్థానం నుంచి కోల్కతా బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన మనాస్ భునియా పోటీ చేస్తున్నారు. ఇక 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివసేన 18 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే.(చదవండి :దీదీకీ ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత!) కాగా బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటు చేస్తానన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం చురుగ్గా పావులు కదిపింది. అమిత్ షా నేతృత్వంలోని నాయకులు పలువురు టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం శివసేన నిర్ణయంతో బీజేపీకి పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ హిందూ ఓట్లు మాత్రం చీలే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీని ఎదుర్కునేందుకు దీదీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 42 లోక్సభ స్థానాలున్న తమ రాష్ట్రంలో 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం, పలువురు సినీ నటులను అభ్యర్థులను నిలపడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. -
దీదీకీ ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత!
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య నాయకుడు, భత్పరా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు తృణమూల్ బహిష్కృత నేత, బోల్పూర్ ఎమ్మెల్యే అనుపమ్ హజ్రా, సీపీఎం నాయకుడు ఖగేన్ మెర్ము కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం అర్జున్ సింగ్ మాట్లాడుతూ... డబ్బులు ఇస్తేనే తృణమూల్ కాంగ్రెస్లో మనుగడ సాధించవచ్చని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని విమర్శించారు. ‘ నేను 40 ఏళ్లుగా మమతా జీ దగ్గర పనిచేశాను. కానీ బాలాకోట్లో వైమానిక దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో భారత సైన్యం విశ్వసనీయతను ఆమె ప్రశ్నించడం నన్ను కలచివేసింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటూ మాట్లాడుతుంటే మమతా జీ మాత్రం.. మెరుపు దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏమిటని అడగటం నిజంగా దురదృష్టకరం. ఈరోజు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది’ అని అర్జున్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు బిగ్ షాక్..బీజేపీలోకి సోనియా అనుచరుడు! కాగా నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలుపొందిన అర్జున్ సింగ్ ఈసారి లోక్సభ బరిలో దిగాలని ఆశించారు. ఈ మేరకు గతంలో తాను ఓటమి చవిచూసిన.. బారక్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని శాసన సభ స్థానాల్లో పట్టు ఉన్న అర్జున్ సింగ్.. సిట్టింగ్ ఎంపీ దినేశ్ త్రివేదిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూపి.. ఆ స్థానం నుంచి టికెట్ తనకే కేటాయించాలని మమతను కోరారు. అయితే అందుకు నిరాకరించిన మమత ఆ టికెట్ను దినేశ్కు కేటాయించారు. పార్టీ ముఖ్య నేతగా ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన అర్జున్ సింగ్ బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. ఒక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అనుచరుడు టామ్ వడక్కన్ ఇప్పటికే బీజేపీలో చేరగా.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ముఖ్య నేత అర్జున్ సింగ్ కూడా కాషాయ కండువా కప్పుకోవడంతో మరిన్ని చేరికల కోసం అమిత్ షా తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. -
టీఎంసీ అధినేత్రి సంచలన నిర్ణయం
-
మమతా బెనర్జీ సంచలన నిర్ణయం
కోల్కతా : 2019 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ‘మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నాను. మా పార్టీ నుంచి ఈసారి మహిళలు అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నారు. ఈ విషయం మాకెంతో గర్వకారణం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి ముగ్గురు బెంగాలీ నటీమణులు పోటీ చేయనున్నారని మమత తెలిపారు. నుస్రత్ జహాన్, మిమీ చక్రబర్తి, మున్ మున్ సేన్లకు టికెట్ ఖరారు చేసినట్లు ఆమె ప్రకటించారు. అసనోల్ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు పోటీగా మున్ మున్ సేన్ బరిలోకి దిగుతారని మమత పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరిన మౌసమ్ నూర్ మల్దా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్ భార్య రుపాలీ బిస్వాస్ కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని మమత పేర్కొన్నారు. ఇక మిడ్నాపూర్ ఎంపీ సంధ్యా రాయ్, ఇద్రిస్ అలీ, ఉమా సోరెన్ తదితరులు ఈ ఎన్నికల్లో పోటీ చేయరని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా ఒడిషా, అసోం, జార్ఖండ్, అండమాన్ నికోబార్లతో తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతారని ఆమె తెలిపారు. చదవండి : బెంగాల్ పోల్ షెడ్యూల్పై వివాదం కాగా ఇక తమ పార్టీ నుంచి 33 శాతం టికెట్లను మహిళలకు కేటాయిస్తామంటూ బిజూ దళ్ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 42 లోక్సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మమత 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను ఏడు విడతలకు విస్తరించడం, రంజాన్ మాసం సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం వెనక కుట్ర ఉందని మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదలను హతమార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించారంటూ భారత వాయుసేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్పై పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారత వైమానిక దళ పైలట్లకు సలాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... భారత వైమానిక దళాన్ని(ఇండియన్ ఎయిర్ఫోర్స్) అమేజింగ్ ఫైటర్స్గా అభివర్ణించారు. ఈమేరకు..‘ ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్. జై హింద్’ అని ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ‘పాక్ ఉగ్రవాదులపై దాడి చేసి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన పైలట్లకు సెల్యూట్ చేస్తున్నా’ అని ప్రశంసించారు. IAF also means India's Amazing Fighters. Jai Hind — Mamata Banerjee (@MamataOfficial) February 26, 2019 🇮🇳 I salute the pilots of the IAF. 🇮🇳 — Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019 -
మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?
ముష్కరుల దాడిలో అమరులైన 40 మంది జవాన్లను స్మరించుకుంటూ యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోతే.. కొంత మంది మాత్రం ఇందులో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోదీతో జట్టు కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పుల్వామా ఘటనపై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. అనుమానాలు ఉన్నాయి... ఎన్నికలకు ముందు జరిగిన ఉగ్రదాడిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్లుగా పాకిస్తాన్పై చర్యలు తీసుకోని మోదీ ప్రభుత్వం... ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ప్రస్తుతం ఏదో చేస్తామంటూ ఊదరగొడుతోందని ఆమె విమర్శించారు. అంతేకాదు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్పీ దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తామే నిజమైన దేశ భక్తులం అన్నట్లుగా ప్రధాని మోదీ, అమిత్ షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మమత విరుచుకుపడ్డారు. అయితే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే మమత.. తన అభిప్రాయాలకు అనుగుణంగానే పుల్వామా దాడిపై ఈ విధంగా స్పందించారు. నిజానికి భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందనేది మెజారిటీ వర్గాల వాదన. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఏ అరాచకానికైనా మోదీ సమర్థుడే! నాలుగున్నరేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. స్వప్రయోజనాల కోసం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతి నాటి నుంచి ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... పుల్వామా దాడికి ప్రధాని మోదీయే కారణమనే అర్థం వచ్చేలా విమర్శల దాడికి దిగారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశాన్ని తాకట్టు పెడితే సహించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశభక్తి, భద్రతలో టీడీపీ రాజీపడదు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా, భారతదేశ పౌరుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే... ‘ప్రధాని నరేంద్ర మోదీ ఏ అరాచకానికైనా సమర్థుడే. గోద్రాలో రెండు వేల మందిని బలితీసుకున్న నరమేధాన్ని మరువలేము. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆయనను అనుమతించలేదు. విదేశాలు కూడా మోదీని బాయ్కాట్ చేశాయి. బీజేపీ రాజకీయాలతోనే జమ్ము కశ్మీర్లో సంక్షోభం ఏర్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది చూడరాదు’ అంటూ బాబు మాట్లాడటం చూస్తుంటే... ఆయన మాటల్లో దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నం కంటే కూడా.. మోదీపై బురద జల్లే ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది. అప్పుడు తెలియలేదా బాబూ! మోదీతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం పంచుకున్న నాడు గోద్రా విషయం బాబుకు గుర్తురాక పోవడం గమనార్హం. అదే విధంగా సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది చూడరాదని ఆయనే చెప్పారు. అంటే మిగతా రాష్ట్రాల్లో తన లాగే రాజకీయ లబ్ది కోసం ఏమైనా చేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారా అనేది అర్థం కాని విషయం. ఎన్డీయేలో ఉన్నంతవరకు ఆయనకు మోదీ విజన్ ఉన్న నాయకుడిలా కనిపించారు.. విభేదాలు వచ్చిన నాటి నుంచే మోదీ తనకంటే జూనియర్ అనే విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. అయితే అది ఏ ‘విషయం’లోనో మనకు స్పష్టంగా తెలియదు. అయినా తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు... ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషిని చూసి బెంబేలెత్తి పోయిన బాబు... ప్రతిపక్ష పార్టీ ప్రకటించిన పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టే ఈ పెద్దనాయుడు గారు... ప్రస్తుతం ఏకంగా ఉగ్రదాడిపై సంచలన ఆరోపణలు చేయడంలో ఆశ్చర్యం ఏముందిలెండి. అమర జవాన్ల త్యాగం గురించి కూడా రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది. -
బలపడుతున్న రాహుల్, మమతల మైత్రి
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా పోలీసు కమిషనర్పై సీబీఐ దాడి, విదేశీ ఆస్తులకు సంబంధించి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ విచారణ సంఘటనలు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను మరింత దగ్గర చేశాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు మొదటి నుంచి ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నప్పటికీ ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న అంశంలో రాజీ కుదరక ఈ ఇరు పార్టీలు కాస్త దూర దూరంగానే ఉంటూ వచ్చాయి. గత ఆదివారం నాడు సీబీఐకి చెందిన 40 మంది అధికారులు కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసాన్ని ముట్టడించడం, అందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేపట్టడం తెల్సిందే. ఈ వార్త తెల్సిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మమతకు ఫోన్ చేసి పార్టీ మద్దతును ప్రకటించారు. రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు బ్రిటన్లో అక్రమంగా ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు నిన్న, నేడు ఆయన్ని విచారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మమతకు కూడా స్పందించి రాహుల్కు మద్దతుగా నిలిచారు. వాద్రాకు కేవలం షోకాజ్ నోటీసు జారీ చేసి విచారణ పేరుతో హంగామా చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘మనమంతా ఐక్యంగా ఉన్నంత కాలం మనల్ని ఎవరు, ఏం చేయలేరు’ అని ఆమె బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బీజేపీకే పాస్ సీబీఐ హైతో హమారే పాస్ ఘట్బంధన్ హై’ అని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటించిన అఖిలేష్ యాదవ్, మాయావతిలు సంయుక్తంగా నినదించారు. వారు కూడా ఇప్పుడు వాద్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అఖిలేష్, మాయావతిలపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రతిపక్షాలు లక్ష్యంగా సీబీఐ దాడులు జరిగితే ఆ పార్టీలు కకావికలంగా విచ్ఛిన్నం అవుతాయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. కానీ ఈ సీబీఐ దాడుల కారణంగా విపక్షాల మధ్య ఐక్యత మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. -
ముందు మీరు గెలవండి.. మోదీకి సవాల్
కోల్కత్తా: ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్లో గెలవాలని కలలుకనే బదులు ముందు మీ సొంత లోక్సభ స్థానమైన వారణాసిలో గెలవండి. బెంగాల్లో మీకు స్థానంలేదు. మరికొన్ని నెలల్లో మీ పాలన ముగుస్తుంది’’ అంటూ మోదీపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. శనివారం బెంగాల్ని దుర్గాపూర్ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. మమతపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారం కల్ల అని జోస్యం చెప్పారు. బెంగాల్లో బీజేపీకి నేతలెవ్వరూ లేరని, అందుకే పక్క రాష్ట్రం నేతలను తీసుకువస్తున్నారని మమత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గురించి మీ దగ్గర నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. బెంగాల్ సంస్కృతిపై, ప్రజలపై బీజేపీకి సరైన అవగహన లేదన్నారు. అలాగే కేంద్రహోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తన సొంత స్థానంలో గెలిచేందుకు ప్రయత్నించాలని హితవుపలికారు. -
రైతు సాయం మాకొద్దు: మమత కీలక నిర్ణయం
-
రైతు సాయం మాకొద్దు: మమత కీలక నిర్ణయం
కోల్కత్తా: లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019పై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిచారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీకొట్టిందని, వాటి పేర్లునే మార్చి కొత్తగా ప్రకటించారని ఆమె మండిపడ్డారు. కేంద్రం ఇస్తామన్న రైతు సాయం తమకు వద్దని, అరకొర సాయం తమకు అవసరంలేదని మమత తేల్చిచెప్పారు. ఐదెకరాలు గల రైతులకు ప్రతిఏటా ఆరువేల రైతు సాయంను అందిస్తామని కేంద్రం బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. సమాఖ్య వ్యవస్థను బీజేపీ నేతలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మమత విమర్శించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నందునే కేంద్రం ఈ ప్రజాకర్ష బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అన్నారు. దీన్ని ఎన్డీయే ఎన్నికల వ్యూహంగా ఆమె వర్ణించారు. మోదీ ప్రభుత్వానికి కాలం తీరిందని, ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ చెల్లదని వ్యాఖ్యానించారు. -
మమతకు శత్రుఘ్నసిన్హా ఝలక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ అసంతృప్త నాయకుడు శత్రుఘ్నసిన్హా ఝలక్ ఇచ్చారు. ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకరించలేదు. మమత ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలతో కలిసి కోల్కతాలో విపక్ష ర్యాలీకి ఆయన హాజరయ్యారు. (మమతా బెనర్జీ మెగా ర్యాలీ) ‘వాస్తవంగా చెప్పాల్సివస్తే మమతా బెనర్జీ జాతీయ నాయకురాలు. రాజకీయాల్లో తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆమె ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేయడానికి మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఇచ్చిన మాటపై నిలబడగలగాలి. తర్వాతి ప్రధానమంత్రి ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నా పని కాద’ని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. సొంత పార్టీపై తరచుగా విమర్శలు చేస్తున్న సిన్హా.. తాను బీజేపీ ఎంపీగా ఇక్కడకు రాలేదని చెప్పారు. యశ్వంత్ సిన్హా నాయకత్వంలో ఏర్పాటైన రాష్ట్ర మంచ్ తరపున ర్యాలీకి హాజరైనట్టు వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం వివాదంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. -
‘ఆయన ఆంగ్లంలో మాట్లాడలేరు’
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో విమర్శల దాడికి దిగారు. ప్రధాని కనీసం ఒక వాక్యం కూడా ఆంగ్లంలో సరిగా మాట్లాడలేరని, ఆయన ఆంగ్లంలో మాట్లాడే సమయంలో నిరంతరం టెలీప్రాంప్టర్ వైపు చూస్తుంటారని దీదీ వ్యాఖ్యానించారు. ఈ విషయం మీడియా సహా చాలామందికి తెలుసునన్నారు. ప్రధాని మోదీ స్క్రీన్ వైపు చూస్తూ తనకు ఆంగ్లంలో ప్రావీణ్యమున్నట్లు అక్కడ రాసిన ప్రసంగాన్ని చదివేస్తారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయం చేస్తున్నారంటూ ఆ పథకం నుంచి వైదొలుగుతున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించే క్రమంలో ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేశారు. -
భారత్లో లౌకికవాదం ఇంకెక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ విభజన సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల్లో లక్షలాది ప్రజలు మరణించినప్పుటికీ భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాంగానికే కట్టుబడి పనిచేశారు. ఏ మతాన్ని ప్రోత్సహించక పోవడం, ఏ మతం పట్ల వివక్ష చూపక పోవడం, సర్వమతాలను సమాన దృష్టితో ప్రభుత్వం చూడడమే భారత లౌకిక వాదం. అయితే 1980 దశకం నుంచి ఈ భారత లౌకిక వాదం బలహీన పడుతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారికంగా దీపావళి వేడుకలను నిర్వహించగా, అయోధ్యలో తమ ప్రభుత్వమే రామాలయాన్ని నిర్మిస్తుందని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నాడు అధికార హోదాలో కాలికాదేవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారత దేశానిది లౌకిక రాజ్యాంగమని ఏమాత్రం చెప్పుకోవడానికి, గర్వపడడానికి వీల్లేదు. దేశంలో లౌకికవాద పునాదులను కదిలిస్తూ కేవలం హిందూ మతం నుంచి మరో మతంలోకి మార్పిడులను అడ్డుకునేందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక చట్టాలను తీసుకొచ్చారు. గోవధ నిషేధ చట్టాలను తీసుకొచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లౌకికవాదానికి పట్టం కడతారన్న నమ్మకం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఎన్నికల రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. -
దీదీ మార్ఫింగ్ ఫొటోలు.. బీజేపీ నేత అరెస్టు
కోల్కతా : బ్రహ్మచారి ముఖ్యమంత్రులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. మిడ్నాపూర్కు చెందిన బబుయా ఘోష్.. మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ల ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. వారిరువురు సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించడంతో పాటుగా వాటికి ఓ పేపర్ ఆర్టికల్ను జత చేశాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టికల్లో ఏముందంటే.. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీల మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన బబుయా.. ‘సరైన వయసులో పెళ్లి కాని ఓ ‘అబ్బాయి’ పిచ్చిగా ప్రవర్తిస్తాడని తెలుసు. అయితే సరైన వయసులో పెళ్లి కాని అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది’ కదా అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా ఇటువంటి ఫొటోలను సృష్టించడం బబుయాకు కొత్తేం కాదని.. గతంలో కూడా ఇలాగే ప్రముఖులను కించపరిచే విధంగా పలు పోస్టింగ్లు పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. బబుయా ఘోష్ పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటో -
కేరళకు రూ. పది కోట్లు సాయం ప్రకటించిన దీదీ
సాక్షి, కోల్కతా : వరదలతో తల్లడిల్లిన కేరళకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ పదికోట్ల సాయం ప్రకటించింది. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు ఈ సంక్షోభ సమయంలో అండగా నిలిచేందుకు రూ పది కోట్ల సాయం అందించాలని తాము నిర్ణయించామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వెల్లడించారు. కేరళ సీఎం సహాయ నిధికి ఈ మొత్తం అందిస్తామని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కనీవినీ ఎరుగని ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు కేరళకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విధాలా సాయపడుతుందని స్పష్టం చేశారు. కేరళలో త్వరలోనే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తాము ప్రార్ధిస్తున్నామన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరదలను ఎదుర్కొంటున్న వారికి భగవంతుడు అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు. -
మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం విలేకరులతో మాట్లాడిన మాకెన్... బెంగాల్లో మమతా బెనర్జీ, సీపీఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉండే అధికారాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. బహుశా అది ఆ నలుగురికి(మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు) తెలియదేమో’ అంటూ మాకెన్ వ్యాఖ్యానించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే... కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయంటూ మాకెన్ విమర్శించారు. ‘అయినా ప్రభుత్వ అధికారులు(ఐఏఎస్లను ఉద్దేశించి) తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి వెనకడుగు వేయరు. కానీ ప్రభుత్వం వారిచేత అక్రమ పనులు చేయించాలనుకున్నపుడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదంటే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా రాజకీయం చేయడం ఏమాత్రం బాగాలేదు. అధికారులు ఏ పార్టీకి చెందిన వారు కారన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. అజయ్ మాకెన్ వ్యాఖ్యలను బట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. -
మమత కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు ఔట్
కోల్కతా : తన కేబినెట్లోని ముగ్గురు మంత్రులను బాధ్యతల నుంచి తొలగించినట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చురామణి మహతో, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జేమ్స్ కుజుర్, అబానీ జోర్దార్లను కేబినెట్ పదవుల నుంచి తప్పించినట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్నందున పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వీరిని సేవలను వాడుకుంటామని చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులు.. ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ.. కొన్నిచోట్ల బీజేపీకి ఓట్ల శాతం పెరగటం మమతను కలవరపెడుతోందని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే 2019 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ వ్యవస్థాపక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు, పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించేందుకు ఆ ముగ్గురిని మంత్రి బాధ్యతల నుంచి తప్పించారు. మీరేమీ బాధపడొద్దు... కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులను తొలగించిన నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మమత విలేకరులతో మాట్లాడారు. తొలగించిన మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ అంశం పూర్తిగా మా పరిధిలో ఉండేదే. మాకున్న అధికారంతో ఏమి చేయాలో మేము నిర్ణయించుకుంటాం. ఈ విషయమై మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ’ మమత సమాధానమిచ్చారు. -
మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
అగర్తల: బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మతి చెడిందని.. పిచ్చాసుపత్రిలో చేరాలంటూ విప్లవ్ వ్యాఖ్యానించారు. ‘మమతా బెనర్జీకి మతి చెడినట్లుంది. ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆమె మాటలు తెలివితక్కువగా ఉన్నాయి’అని విప్లవ్ పేర్కొన్నారు. అంతేకాదు గుళ్లూ, గోపురాలు సందర్శిస్తే ఆమె మానసిక స్థితి బాగుపడొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ ఇంటర్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బీజేపీవంటి జాతీయ పార్టీ త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో విజయం సాధించడంలో గొప్పేముందని.. అవి మున్సిపల్ ఎన్నికలు’ అని పేర్కొన్నారు. దీంతో విప్లవ్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. కాగా, త్రిపురలో రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ 35 సీట్లను కైవసం చేసుకుంది. -
మమతా బెనర్జీకి ఎందుకంత భయం ?
సాక్షి, కోల్కతా : ‘ఈ సారి మొహర్రమ్, దుర్గామాత నిమజ్జనం ఒకే రోజున వచ్చినందున మొహర్రమ్ జరిగే రోజున 24గంటలను మినహాయించి, ఆ మరుసటి రోజు నుంచి నాలుగవ తేదీ వరకు దుర్గా మాత విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం తగదని జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హారిష్ టాండన్లతో కూడిన కోల్కతా హైకోర్టు ద్విసభ్య బెంచి కొట్టివేసింది. రాష్ట్రంలో మత కలహాలు జరిగితే అందుకు తనను బాధ్యురాలిని చేయరాదని కూడా మమతా బెనర్జీ కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు. వాస్తవానికి దుర్గామాత నిమజ్జనం, మొహర్రమ్లు ఒకే రోజున రాలేదు. సెప్టెంబర్ 30వ తేదీన దుర్గామాత తుది పూజ లేదా నిమజ్జన కార్యక్రమంకాగా, ఆగస్టు ఒకటిన మొహర్రం వచ్చింది. మొహర్రం రోజున ఏకాదశి కూడా. బెంగాల్ సంస్కతి ప్రకారం ఆ రోజున, అంటే ఏకాదశి రోజున దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయరు. సాధారణంగా నిమజ్జనం రోజున, అంటే సెప్టెంబర్ 30వ తేదీనే నిమజ్జన కార్యక్రమం ముగిసిపోవాలి. గతంలో అలాగే జరిగేది. ఈ రెండు, మూడేళ్లుగా పోటాపోటీగా ఎత్తయిన విగ్రహాలను ఏర్పాటు చేయడం, అట్టహాసంగా వేడుకలను జరపడం మొదలవడంతో ఆ మరుసటి రోజు ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. బహుశ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే మొహర్రమ్ రోజున నిమజ్జనం జరపరాదని, అటూ ముస్లింల ప్రదర్శనలు, ఇటు హిందువుల ప్రదర్శనలు కొనసాగడంవల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగవచ్చని మమతా బెనర్జీ ఆందోళన చెంది ఉంటారు. కోల్కతా సంప్రదాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాదశి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించరు. మొహర్రం రోజున మాతం ప్రదర్శనలు జరిపే షియాలే పశ్చిమ బెంగాల్లో చాలా తక్కువ. కోల్కతా, మరికొన్ని పట్టణాల్లో తప్పించి ఎక్కడా ప్రదర్శనలే జరగవు. అలాంటప్పుడు మమతా బెనర్జీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. శ్రీరామ నవమి రోజున బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఆయుధాలు ధరించి బెంగాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిపారు. దుర్గామాత నిమజ్జనం రోజున కూడా ఆయుధాలతో ప్రదర్శనలు జరపుతామని బీజేపీ హెచ్చరించింది. అందుకని మమతా బెనర్జీ భయపడుతున్నారా? ఇలా భయపడుతుంటే భయపెట్టే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. 1982, 1983 సంవత్సరాల్లో కూడా దశమినాడు దుర్గా నిమజ్జనం, ఏకాదశి నాడు మొహర్రమ్ వచ్చాయి. అప్పుటి వామపక్ష ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ రెండు వర్గాల కార్యక్రమాలు శాంతియుతంగా ముగిశాయి. -
కాజోల్కు మమత మద్దతు
సౌత్ డినజ్పూర్ : బీఫ్ తింటున్నానని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టి ఇబ్బందులపాలైన ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మద్దతుగా నిలిచారు. బుధవారం నాడిక్కడ ఆమె మాట్లాడుతూ‘ నేను ఆ నటి పేరు చెప్పను. కానీ ఆమె షారుక్ ఖాన్తో చాలా సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె బీఫ్ తింటున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆన్లైన్లో ఆమెను తీవ్రంగా వేధించడమే కాకుండా అవమానించారు. చివరికి తాను తిన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చేవరకూ పరిస్థితి వచ్చింది’ అని మమత తెలిపారు. దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మమత, కొందరు వ్యక్తులు ఇతరులు ఏం తినాలో నిర్దేశిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కాజోల్ బీఫ్ తింటున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో మత విశ్వాసాలను అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని కాజోల్ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, ట్వీట్టర్లలో బీఫ్ ఫోటోలను తొలగించింది. -
‘దాస్కు ఈమధ్యే పెళ్లి.. మేం అండగా ఉంటాం’
కూచ్బేహార్: మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాను కేకే దాస్ కుటుంబాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ‘సుకుమా జిల్లాలో మావోయిస్టులు చేసిన దాడిలో చనిపోయిన 25మంది సీఆర్పీఫ్ జవాన్లలో ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారున్నారు. వారిలో ఇద్దరు కూచ్ బేహార్ ప్రాంతం వారు. మరోకరు నోయిడా జిల్లాకు చెందినవారు. వీరి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సహాయం చేయాలని మేం నిర్ణయించుకున్నాం. వాటి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తాం’ అని ఆమె ప్రకటించారు. ‘27 ఏళ్ల కేకే దాస్ ఇటీవలె వివాహం చేసుకున్నాడు. అందరి కుటుంబాలకు అండగా మేముంటాం’ అని మమత చెప్పారు. -
'మోదీది రాజకీయ కక్ష'
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ అరెస్టు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలని మండిపడ్డారు. బుధవారం ఆయన ఈ మేరకు ట్విట్టర్లో బీజేపీపై దాడి చేశారు. 'ఇది మోదీ కక్ష సాధింపు రాజకీయం. ఆయన ప్రవేశ పెట్టిన పెద్ద నోట్ల రద్దును ఎవరు వ్యతిరేకించినా ఆయన భరించలేరు' ఆయన ట్వీట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడంతోపాటు ఆ పార్టీతో కలిసిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
‘ఆమె డబ్బంతా చిత్తయిందని ఏడుస్తోంది’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం దుమ్మెత్తిపోశాయి. పెద్ద నోట్ల రద్దు విషయంపై ఆమె చేస్తున్న ఆందోళన వెనుక వేరే ఉద్దేశం ఉందన్నాయి. నారదా, శారదా కుంభకోణం ద్వారా వెనుకేసుకున్న డబ్బంతా చిత్తుకాగితాల మాదిరిగా మారిపోవడంతోనే ఆమె ఆందోళన బాట పట్టారని పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దును ప్రకటన వెలువడిన దగ్గర నుంచే మమత వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తొలుత నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పిన ఆమె అనంతరం కొద్ది రోజులపాటు ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే ఆమె పలు నిరసనల ర్యాలీలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పెద్ద నోట్ల రద్దును ఖండిస్తూ ఢిల్లీలో కేజ్రీవాల్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక సభలో కూడా ఆమె పాల్గొని మోదీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే, ఆమె చేస్తున్న హడావుడిని తప్పుబడుతూ తాజాగా ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. కుంభకోణాల్లో నిందితులైనవారా తనను తప్పుబట్టేదని పరోక్షంగా శారదా స్కాంను ఉద్దేశించి అన్నారు. సోమవారం కాంగ్రెస్, సీపీఎం లు కూడా అదే వరుసలో చేరి పెద్ద నోట్లపై సామాన్యుల తరుపున తెగ పోరాడుతున్న మభ్యపెడుతున్న మమత ముందు నారదా, శారదా స్కామ్లలో నిందితులైన ఆమె పార్టీ నేతలు ఎలాంటి తప్పుచేయనివారిగా బయటకు రావాలని డిమాండ్ చేశారు. ‘ సమస్య ఉన్న నీళ్లలో మమత చేపలుపట్టాలనుకుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో నిజంగా ఇబ్బందులు పడుతున్న వారిపట్ల ఆమె మొసలి కన్నీరు కార్చడం ఆపాలి. నిజంగా ఆమె సామాన్యుడి గురించి బాధపడితే అదే సామాన్యుల సొమ్మును దోచుకున్న వారి దగ్గర నుంచి తిరిగి ఎందుకు ఆ మొత్తం రాబట్టడం లేదు? ఆమె సొంత పార్టీకి చెందిన ఎంపీలే ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్నారు. కుంభకోణాల్లో ఉన్నవారు నల్లధనం, పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడొద్దు. చిట్ ఫండ్స్ ద్వారా అక్రమ సొమ్ములు వచ్చిపడ్డాయి. వాస్తవానికి అవన్నీ చెల్లని చిత్తుకాగితాల్లాగ మారేసరికి ఆమె మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ఆరోపించారు. -
పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల
కోల్కతా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఒక సీఎంను ఆయన సొంత రాష్ట్రంలోనే అరెస్టు చేసిన సందర్భం మునుపెన్నడూ జరగలేదని, ఇలాంటివి ఆహ్వానించదగిన పరిణామాలు కావని మమత పేర్కొన్నారు. (మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా) వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని అమలు చేయడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న రిటైర్డ్ జవాను రామ్ క్రిషన్ గ్రెవాలే కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఆర్కే పురం స్టేషన్ కు తరలించారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. మాజీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా పోలీసులు ఇదే రీతిగా అరెస్టు చేశారు. (రాహుల్ గాంధీని నిర్భంధించిన పోలీసులు) -
ఈ ముగ్గురూ పెళ్లికాని ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీలకు సంతోషం, మరికొన్ని పార్టీలకు బాధను మిగిల్చాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డులు సృష్టించినవారు, చరిత్ర తిరగరాసినవారు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం కూడా ఉంది. కొత్తగా ప్రమాణం చేయనున్న ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు అవివాహితులే..! తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత, మమతా బెనర్జీలు అవివాహితులన్న విషయం తెలిసిందే. అసోంకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లి చేసుకోలేదు. విద్యార్థి దశ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన 52 ఏళ్ల సోనోవాల్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకింతం చేశారు. అసోం ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అసోంలో బీజేపీ తొలిసారి మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైదొలగబోతున్న ఎన్సీఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగసామి (66) కూడా అవివాహితుడే. పుదుచ్చేరిలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కేరళకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి విజయన్ మాత్రం వివాహితుడే. -
బెంగాల్లో మమత.. కేరళలో ఎల్డీఎఫ్
న్యూఢిల్లీ: ఎగ్జిట్పోల్స్ అంచనా వేసినట్టే పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్, కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, తొలి నుంచి టీఎంసీ హవా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, టీఎంసీ 211 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష లెఫ్ట్ కూటమి కేవలం 70 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీజేపీ 9 చోట్ల ముందంజలో ఉంది. మూడుదశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతకు ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. కేరళలోనూ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ ఎల్డీఎఫ్ కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో నిలిచింది. 140 సీట్లున్న కేరళలో ఎల్డీఎఫ్ 83 స్థానాల్లో, అధికార యూడీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో బీజేపీ తొలిసారి బోణీ చేసే అవకాశముంది. ప్రస్తుతం బీజేపీ ఓ చోట ముందంజలో ఉంది. -
యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్: మోదీ
మదరిహట్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్కతా ఫ్లై ఓవర్ దుర్ఘటన యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని.. అది యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని మదరిహట్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్టాడుతూ.. 'ఫ్లై ఓవర్ కూలిన వెంటనే ఎవరైనా సరే సహాయకార్యక్రమాల గురించి, ప్రజలను రక్షించడం గురించి ఆలోచిస్తారు. కానీ, మమతా బెనర్జీ మాత్రం ఘటన జరిగిన వెంటనే ఈ కాంట్రాక్టు తమ హయాంలో ఇచ్చింది కాదని.. అంతకుముందు లెఫ్ట్ పార్టీలు ఇచ్చాయని స్టేట్మెంట్లు ఇచ్చారు' అని విమర్శించారు. అంతపెద్ద ట్రాజెడీ సమయంలో సైతం దీదీ బ్లేమ్ గేమ్ ఆడారని మోదీ అన్నారు. ఢిల్లీలో రాష్ట్రాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు నిర్వహించినా దీదీ గైర్హాజరు అవుతారని దానికి కారణం ఆ కార్యక్రమాలు నిర్వహించేది మోదీ కావడమేనని ఆయన అన్నారు. మోదీ మీటింగ్లు ఏర్పాటు చేస్తే హాజరుకాకుండా ఉండే దీదీ.. ఢిల్లీకి వస్తే మాత్రం సోనియా గాంధీని కలువడం మాత్రం మరచిపోరని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు లెఫ్ట్, తృణముల్ కాంగ్రెస్ లకు అధికారం ఇచ్చి ప్రజలు చాలా కాలం ఎదురు చూశారని.. అయితే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే వారికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని మోదీ అన్నారు. -
'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'
కోల్కతా: ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. తమ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోదని చెప్పారు. ఏం తినాలనేది నిర్ణయించుకునేది ప్రజలే తప్ప ప్రభుత్వ పరంగా నిర్ణయించలేమని, నిర్ణయించకూడదని అన్నారు. ఎవరు ఏం తినాలో వారి స్వయం నిర్ణయం అని చెప్పారు. సోమవారం మైనారిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే తాను తన రాష్ట్రంలో విభజించి పాలన చేయనని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పారు. -
కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిన మమత
-
నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు!
కుటుంబ సభ్యుల నమ్మకం * వారిపై భారత ప్రభుత్వం నిఘా.. నేతాజీ రహస్య ఫైళ్ల బహిర్గతంతో వెలుగులోకి * ఫైళ్లను బయటపెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. కోల్కతా: సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదా? ఆ ఏడాది తర్వాత కొన్నేళ్లు ఆయన జీవించే ఉన్నాడా? ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ప్రశ్నలకు నేతాజీ రహస్య ఫైళ్లు అవుననే జవాబు చెబుతున్నాయి! నేతాజీ ‘అదృశ్యం’ తర్వాత ఆయన కుటుంబ సభ్యులపై భారత ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలూ నిజమేనంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను శుక్రవారం బహిర్గతం చేసింది. వాటిలోని వివరాల ప్రకారం.. * నేతాజీ 1945 తర్వాత బతికే ఉన్నట్లు ఆయన అన్న శరత్చంద్ర బోస్ కొడుకు ఎస్కే బోస్ రాసిన ఉత్తరం ఓ ఫైల్లో ఉంది. ఆయన 1949 డిసెంబర్ 12న లండన్ నుంచి కోల్కతాలోని తన తండ్రికి రాసిన లేఖలో ఈమేరకు పేర్కొన్నారు. ‘నేతాజీ రేడియోలో మాట్లాడనున్నట్లు నాకు సమాచారం అందింది. ఆయన ఎప్పుడు మాట్లాడతారో పెకింగ్ రేడియో తెలిపింది. హాంకాంగ్ ఆఫీసు ఆ ప్రసంగాన్ని వినడానికి ప్రయత్నించింది కానీ, ఏమీ వినపడలేదు’ అని రాశారు. ప్రభుత్వ ఆదేశాలపై ఈ లేఖను కోల్కతా పోలీసు నిఘా వర్గాలు మధ్యలో అడ్డుకున్నాయి. * శరత్ బోస్కు స్విట్జర్లాండ్ పాత్రికేయురాలు లిల్లీ అబెగ్ 1949 నవంబర్ 1రాసిన లేఖలో ‘సుభాష్ పెకింగ్లో ఉన్నట్లు యునెటైడ్ ప్రెస్ తెలిపింది’ అని తెలిపారు. శరత్ అదే ఏడాది డిసెంబర్ 28న అబెగ్కు రాసిన లేఖలో.. ‘నా సోదరుడు(సుభాష్) జీవించే ఉన్నట్లు మీకు 1946లో జపాన్ వర్గాలు చెప్పి ఉంటే నా నమ్మకం మరింత బలపడినట్లే’ అని పేర్కొన్నారు. శరత్ రాసిన, అందుకున్న ఉత్తరాలను ఆయన నివసించిన కోల్కతాలోని ఎల్గిన్ రోడ్డు పోస్టాఫీసులో, నగరంలోని జనరల్ పోస్టాఫీసులో అడ్డుకుని తనిఖీ చేశారు. * ఫైళ్లను పరిశీలించిన నేతాజీ కుటుంబ సభ్యుడు చంద్రబోస్ తెలిపిన ప్రకారం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైల్లో కవరు మాత్రమే ఉంది. అందులో పత్రాలు గల్లంతయ్యాయి.కేంద్రం దగ్గరి ఫైళ్లనూ బయటపెట్టాలి: మమత నేతాజీకి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం, ప్రభుత్వ లాకర్లలో ఉన్న 64 రహస్య ఫైళ్లను శుక్రవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ మ్యూజియంలో బహిర్గతం చేశారు. 12,744 పేజీలున్న ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బయటపెట్టారు. ఫైళ్ల డీవీడీలను నగర పోలీస్ కమిషనర్ ఎస్కే పురకాయస్థ నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు. నేతాజీకి సంబంధించి కేంద్ర వద్ద ఉన్న ఫైళ్లనూ బయటపెట్టాలని మమత డిమాండ్ చేశారు. నేతాజీ కుటుంబ సభ్యులూ ఈ డిమాండ్ చేశారు. ఫైళ్ల బహిర్గతం వల్ల విదేశాలతో సంబంధాలు దెబ్బతినవా అని మమతను విలేకర్లు అడగ్గా, మనది స్వతంత్ర దేశం అని అన్నారు. తర్వాత ట్విటర్లో స్పందిస్తూ.. ‘ఇది చారిత్రకదినం. కేంద్రం వద్ద కూడా 130 ఫైళ్లు ఉన్నాయి. వాటిని బయటపెడితే నిజం తెలుస్తుంది. నిజాన్ని తొక్కిపెట్టలేరు’ అని అన్నారు. ప్రస్తుతం మ్యూజియంలో ప్రదర్శిస్తున్న ఫైళ్లను సోమవారం ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. కాగా, తమ కుటుంబంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నేతాజీ కుటుంబసభ్యుడు చంద్రబోస్ ప్రశ్నించారు. తన తండ్రి అమియ నాథ్ బోస్పై నిఘా కోసం 14 మంది అధికారులను నియమించినట్లు ఓ ఫైల్లో ఉందన్నారు. నేతాజీ సన్నిహితులై నకాంగ్రెస్ నేతలపై, నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులపైనా నిఘా ఉంచారన్నారు. మరోపక్క.. తమ వద్ద ఉన్న ఫైళ్లను ఎప్పుడు బయటపెడతామో చెప్పడం కష్టమని కేంద్రం పేర్కొంది. -
'ఇంతకీ ఆ ఫైళ్లలో ఉన్నది రహస్యాలేనా?'
ఇప్పుడు జాతీయ మీడియాతో సహా పలు రాష్ట్రాల మీడియాలో ఒకటే చర్చ. సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 64 ఫైళ్లలో ఎలాంటి వివరాలు ఉన్నాయో అని. ఈ ఫైళ్ల ద్వారా యావత్ భారత ప్రజానీకానికి నేతాజీ మరణంపై ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయా అంటే మరోసారి ఆలోచించుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అలా నివృత్తే అయితే.. ఒక్క జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా బెంగాల్ వాకిట్లో వచ్చివాలేది. ప్రభుత్వ పెద్దలు, ఉద్యోగస్తులు, విద్యావేత్తల, విద్యార్థుల నుంచి స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రత్యక్షంగా తెలిసి ఉన్న సామాన్య ప్రజానీకం కూడా టీవీలకు అతుక్కుపోయి ఉండేంది. ఎందుకంటే నేతాజీ మరణం ఇప్పటికీ ఓ ఆసక్తి.. ఓ మలుపు.. ఓ సంచలనం.. అన్నింటికిమించి ప్రస్తుతం ఓ రహస్యం. అసలు నేతాజీ ఎలా మరణించారు? దేశంలో చాలా మందిని వేధించే ప్రశ్న ఇదే. దశాబ్దాలుగా ఇది రహస్యంగా ఉండిపోయింది. నేతాజీ మరణానికి ముందు, మరణం తర్వాత పరిణామాలు.... నేతాజీ కుటుంబీకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయనే అంశాలు దశాబ్దాలుగా నిగూఢ పత్రాల్లో దాగుండి పోయాయి. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలంటూ కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా చాలా మంది ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. విదేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే సాకులతో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టలేదు. ఇక జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఒకే రకంగా వ్యవహరించాయి. అధికారంలోకి రాకముందు బోస్ ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ.. పాలనా పగ్గాలు చేతబట్టగానే మాట మార్చింది. బీజేపీ కూడా మరోసారి అదే పల్లవిని ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో... బోస్కు సంబంధించిన రహస్య పత్రాలు బయటకు రావడం కష్టమేమో అనుకుంటున్న సమయంలో ఫైర్ బ్రాండ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫైళ్లను బహిర్గతం చేశారు. చెప్పినట్లుగానే కోల్కతాలో ఉన్న పోలీస్ మ్యూజియంలో నేతాజీ ఫైళ్లను అందుబాటులో ఉంచారు. అయితే, వాటికి నిజంగా రహస్యపత్రాలనే గుర్తింపు ఇవ్వొచ్చా అనే విషయం మాత్రం ఆ దస్త్రాల్లో ఏముందనే విషయం తెలిస్తే తప్ప నిర్ణయానికి రాలేము. ఇంతకీ నేతాజీ ఎప్పుడు మరణించారు..? తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలోనే బోస్ మరణించారనే వార్త నిజమేనా..? 1947 తర్వాత కూడా బోస్ బతికే ఉన్నారా? ఇవన్నీ ప్రజలను వేధించే ప్రశ్నలే. తైవాన్ ప్రమాదంలో బోస్ చనిపోలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారనే వాదన బలంగా ఉంది. 1964 వరకు బోస్ బతికే ఉన్నారని, మారువేషంలో సంచరిస్తూ దేశంలోకి అడుగుపెట్టారని బోస్ మద్ధతుదారులు చెప్పేమాట. ఈ వాదనకు అమెరికా రహస్య పత్రం బలం చేకూరుస్తోంది. జాతి పిత మహాత్మాగాంధీ చనిపోక ముందు కూడా బోస్ మరణ వార్తను నమ్మలేదు. బోస్ చనిపోయారని తాను అనుకోవడం లేదని, ఆయన బతికే ఉన్నారని చెప్పారు. తాను ప్రస్తుతం రష్యాలో ఉన్నానని, భారత్కు రావాలనుకుంటున్నానని ఓ లేఖను కూడా నాడు నెహ్రూకు బోస్ లేఖ రాశారని, ఆ లేఖ గురించి తెలిసిన తర్వాతే గాంధీ మహాత్ముడు ఆయన మరణించలేదని వ్యాఖ్యానించినట్లు కూడా తెలిసింది. ఇక, నేతాజీకి సంబంధించి1960లో అమెరికా నిఘా వర్గాలు తయారు చేసిన పత్రాల ప్రకారం....1964 ఫిబ్రవరిలో నేతాజీ భారత్లోకి అడుగ పెట్టారు. రష్యా నుంచి చైనా మీదుగా ప్రయాణించి భారత్ చేరుకున్నారని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఆ సమయానికి నేతాజీ 67 ఏళ్ల వయసు ఉంటుందని నిఘా వర్గాల అంచనా. ఈ వివరాలు కూడా బెంగాల్ సర్కారు విడుదల చేసిన పత్రాల్లో ఉంటాయని తెలుస్తోంది. నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్వేగంగా స్పందించారు. ఇది చారిత్రక ఘట్టమని ఆమె అభివర్ణించారు -
ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు: మమతా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు, కాకపోతే నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రాలను కేంద్ర సంప్రదించాలని ఆమె సూచించారు. రాష్ట్రాలను సంప్రదించుకుండా కేంద్రం ఏకపక్షంగా దర్యాప్తు చేపడితే లాభముండదని మమతా అన్నారు. -
మోడీకి మద్దతు ఇవ్వం: మాయావతి
వారణాసి: బీజేపీ కూటమికి తమ పార్టీ దూరమని బహుజన సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఆమె తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఊహించినంతగా ఫలితాలు రావన్న విషయం నరేంద్ర మోడీకి తెలిసిపోయిందన్నారు. దీంతో జయలలిత, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ చెబుతున్నారని అన్నారు. జయ, ములాయం, మమత... మోడీకి మద్దతు ఇచ్చే అవకాశముందన్నారు. తాము మాత్రం బీజేపీకి లేదా మోడీకి మద్దతు ఇవ్వబోమని మాయావతి స్పష్టం చేశారు.