ఈ సందర్భంగా గాంధీజీ వాడిన సైకిల్ను గ్రోటె కెర్క్ వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సైకిల్ను భారత ప్రభుత్వం పంపించింది. నెదర్లాండ్స్ వాసులకు సైక్లింగ్ చాలా ఇష్టం. ఇక్కడి సంస్కృతిలో సైకిల్ ఒక భాగం కావటం గమనార్హం. అదేవిధంగా గ్రోటెకెర్క్ వద్ద ఉన్న కోర్జో థియేటర్లో సత్యాగ్రహ పేరుతో ప్రముఖ సంగీత కళాకారుడు ఫిలిప్ గ్లాస్ నేతృత్వంలో ఒపెరా ఉంటుంది. డచ్ భాషలో ప్రమోద్ కుమార్ అనే భారతీయుడు రచించిన ‘గాంధీ- యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛంద కార్యకర్తలు నెదర్లాండ్స్లోని పాఠశాలలకు వెళ్లి గాంధీజీ బోధించిన అహింస, శాంతి, సహనం ప్రాధాన్యతను వివరించనున్నారు. నెదర్లాండ్స్ వాసులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2వ తేదీన చేపట్టే కార్యక్రమాలపై ఫేస్బుక్లో ఒక పేజీ క్రియేట్ చేశామన్నారు. ఆయా కార్యక్రమాలను టాటా స్టీల్ (యూరప్) చైర్మన్ థియే హెన్రార్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీలో ప్రొఫెసర్ వినోద్ సుబ్రమణ్యం, వీయూ వర్సిటీ ఆమ్స్టర్డామ్ రెక్టార్ మాగ్నిఫికస్, మాజీ ఎంపీలు ఆర్.రాంలాల్, తాంజా జద్నాన్సింగ్ ఉన్నారు.