
కాంగ్రెస్ పార్టీలో బలహీన నాయకత్వం: శరద్ పవార్
కాంగ్రెస్ పార్టీపై ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 'చేయి' కాలిన కాంగ్రెస్కు మిత్రపక్షాల నుంచే విమర్శలు ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి శరద్ పవార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలహీనమైన నాయకత్వం ఉందని, బలహీన నాయకత్వాన్ని ప్రజలు ఇష్టపడరని ఆయన అన్నారు.
తాజా ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలని శరద్ పవార్ సూచించారు. ఎన్నికల ఫలితాలపై యూపీఏ పక్షాలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉందన్నారు. ప్రజలు యూపీఏ సర్కార్పై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో తెలుసుకోవాలని శదర్ పవార్ అన్నారు. సమస్యను పరిష్కరించుకుని ముందుకు సాగితేనే వచ్చే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన హితబోధ చేశారు.