UPA
-
Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
-
మోదీవి పచ్చి అబద్ధాలు: ఖర్గే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు. ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు. -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
UPA కథ కంచికి.. పేరు మార్చుకోనున్న విపక్ష కూటమి!
ఏడు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న యునైటెడ్ ప్రొగెసివ్ అలయన్స్(UPA) (ఐక్య ప్రగతిశీల కూటమి) పేరు మార్చుకోబోతోందా?. బీజేపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో మరో పేరుతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బెంగళూరు(కర్ణాటక) తాజ్ వెస్ట్ఎండ్ హోటల్ వేదిక సోమ, మంగళవారాల్లో జరగబోయే విపక్ష భేటీలో ఈ నిర్ణయమూ ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమికి కొత్త పేరు ఉండాలనే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా టీఎంసీ, ఆమ్ఆద్మీ పార్టీలు పేరు మార్పుపై ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పేరును మంగళవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004-14 మధ్య రెండుసార్లు యూపీఏ కూటమి అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇది కొనసాగుతోంది. సోనియా గాంధీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు బెంగళూరు బాట పట్టారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఖర్గే ప్రసంగంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. 24 పార్టీల నేతలు ఈ రెండురోజుల కీలక భేటీకి హాజరు కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఈ భేటీని నిర్వహిస్తున్నాయి. కామన్ మినిమమ్ ప్రొగ్రామ్తో పాటు రాష్ట్రాల వారీగా సీట్ షేరింగ్ గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే.. సీఎంపీ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ర్యాలీలు, నిరసనలు, సదస్సుల నిర్వహణతో పాటు ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను సైతం విపక్ష నూతన కూటమి తెలియజేసే ఛాన్స్ ఉంది. యూపీఏ ప్రస్థానం ఇలా.. ► 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో.. ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ కూటమి ఏర్పాటు అనివార్యమైంది. ► అప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి 181 సీట్లు గెల్చుకోగా.. యూపీఏ సంఖ్యాబలం 218కి చేరింది. ► అప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలంలేని యూపీఏ బయటి పార్టీల మద్దతును కూడదీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ► లెఫ్ట్ ఫ్రంట్కు చెందిన 59 మంది ఎంపీలు, సమాజ్వాదీ పార్టీకి చెందిన 39 ఎంపీలు, బహుజన్ సమాజ్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు.. యూపీఏలో చేరకుండానే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ► గతంలో.. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే కూటమి, పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందూ వీపీ సింగ్, చంద్రశేఖర్ల నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వాలు పాటించిన విధానాన్నే యూపీఏ పాటించి అధికారం చేపట్టింది. ► 2009-14 మధ్య కూడా.. యూపీఏ 2 కూటమి అధికారంలో కొనసాగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి 262 సీట్లు గెల్చుకోగా.. అందులో కాంగ్రెస్ 206 స్థానాలు దక్కించుకుంది. అయితే.. అప్పటికే కుంభకోణాలు యూపీఏ-2ను కుదిపేయడం ప్రారంభించాయి. ► అటుపై పలు రాజకీయ సమీకణాలు, ఇతరత్రా పరిణామాలు కూటమిని ఘోరంగా దెబ్బతీశాయి. 2014లో లోక్సభ ఎన్నికల్లో కేవలం 60 సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది యూపీఏ కూటమి. అందులో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారం కైవసం దక్కించుకుంది. ► 2015-19 నడుమ.. యూపీఏ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. యూపీఏ కూటమి బలహీనపడుతూ వచ్చింది. ► ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఏకంగా 91 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అందునా కాంగ్రెస్ 52 స్థానాలను దక్కించకుంది. తద్వారా లోక్సభలో ప్రతిపక్ష హోదా(10 శాతం సీట్లు గెలిచి తీరాలి) కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ► ఆ తర్వాత కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లడంతో.. యూపీఏ ఘోరంగా కుదేలు అయ్యింది. ► 2020 నుంచి యూపీఏలో మరిన్ని పార్టీలూ చేరుతూ వచ్చాయి. అయినప్పటికీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో కూటమికి చేదు అనుభవమే ఎదురవుతూ వస్తోంది. ► అయితే తాజాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఘన విజయం సాధించింది యూపీఏను లీడ్ చేస్తున్న కాంగ్రెస్. ఈ ఉత్సహాంతో యూపీఏను సంస్కరించి.. కొత్త పేరుతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సమాచారం. -
'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు. రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు. సీనియర్లు ఖండించాలి.. రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్రెడ్డి వంటి సీనియర్ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. యూపీఏనే నయం.. మోదీ సర్కార్ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్ బర్గ్ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
యూపీఏ, ఎన్డీఏ.. తేడా అదే.. మోదీ ఏం చెప్పారంటే?
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఏ, ఎన్డీఏ పాలన మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ ప్రభుత్వం స్థిరమైనదని, విధానాల రూపకల్పన, పరిపాలనతో స్థిరత్వం తీసుకొచ్చిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో బీజేపీ శనివారం నిర్వహించిన యువ సంకల్ప్ ర్యాలీకీ మోదీ వర్చువల్గా హాజరై ఈమేరకు మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా తాను సభకు ప్రత్యక్షంగా రాలేకపోయినట్లు చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే సుపరిపాలన విషయంలో అస్థిరత ఉండేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే ప్రపంచ దేశాలు భారత్పై సందేహాస్పదంగా ఉండేవన్నారు. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో స్థిరత్వం వచ్చిందన్నారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారేవని, కానీ బీజేపీ స్థిరమైన పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తమకే పట్టంగట్టారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి స్థిరత్వం ముఖ్యమని ప్రజలు గుర్తించారని చెప్పారు. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజారిటీకి 42 సీట్లు అవసరం. విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆ పార్టీ పని చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు. ముందు రోజు రాంచీకి వచ్చిన ఎమ్మెల్యేలు.. బలపరీక్ష నేపథ్యంలో అధికార యూపీఏకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్గఢ్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. ఆగస్ట్ 30 నుంచీ వీరు రాయ్పూర్లోని ఓ విలాసవంతమైన రిసార్టులో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే. చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్లోని దేవ్ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. దేవ్ఘర్ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్ ఫ్లైట్ క్లియరెన్స్కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎయిర్పోర్టు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. చదవండి: నితీశ్కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్లో ఎవరికీ లేదు -
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు
Live Updates: ►ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు ►జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు ►మార్గెరెట్ అల్వాకు 182 ఓట్లు ► చెల్లని ఓట్లు 15 ►పోలైన ఓట్లు 725 ► 92.9 శాతం పోలింగ్ ►ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 725 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నారు. రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ► ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ► పార్లమెంట్ హౌస్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. Discharged my absolute privilege as well as constitutional responsibility. Voted in the #VicePresidentialElection in the Parliament House. pic.twitter.com/exlafU8nYs— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరామ్ రమేశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓటేశారు. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ, బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటింగ్లో పాల్గొన్నారు. BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | AAP MPs Harbhajan Singh and Sanjay Singh, DMK MP Kanimozhi and BJP MP Ravi Kishan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/SPs5bcSEl7— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union ministers Nitin Gadkari and Dharmendra Pradhan cast votes for the Vice Presidential election at Parliament pic.twitter.com/Z5irlDxbWm— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘ్వాల్, వీ మురళీధరన్ ఓటు వేశారు. Delhi | Union Ministers Gajendra Singh Shekhawat, Arjun Ram Meghwal and V Muraleedharan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/2roDcox6yi— ANI (@ANI) August 6, 2022 ► కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union Home Minister Amit Shah casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/eH75fIzcRe— ANI (@ANI) August 6, 2022 ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్పై వచ్చి ఓటు వేశారు. Delhi | Former Prime Minister and Congress MP Dr Manmohan Singh arrives at the Parliament to cast his vote for the Vice Presidential election. pic.twitter.com/OK0GsY5npL— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ► ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్లో సీనియర్ నాయకురాలు . రాజస్థాన్ గవర్నర్గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్దీప్ రాజస్థాన్కు చెందిన జాట్ నాయకుడు. ► మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. ► జేడీయూ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ► టీఎంసీకి లోక్సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ► తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది. ► నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ► పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతమార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. పార్లమెంటు హౌస్లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. -
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్నాథ్కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్నాథ్ కోవింద్ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
యూపీఏ చైర్మన్గిరీపై ఆసక్తి లేదు
పుణె: బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. యూపీఏ కూటమికి చైర్మన్గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని ఆదివారం మీడియాతో అన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్ను దూరంగా ఉంచలేమన్నారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం. అందుకే బీజేపీ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కాంగ్రెస్ను కలుపుకుని పోవడం తప్పనిసరి. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక్క పార్టీయే ఉంటే రష్యాలో పుతిన్ నాయకత్వంలా ఉంటుంది’’ అన్నారు. హిందువులే గాక ఇతర మతస్తులు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యేలా కశ్మీరీ ఫైల్స్ సినిమాను చిత్రీకరించారని విమర్శించారు. ‘‘పాక్ అనుకూల వర్గం అప్పట్లో కశ్మీర్ లోయలో హిందువులతోపాటు ముస్లింలపైనా అరాచకాలకు పాల్పడింది. కాపాడాల్సిన నాటి ప్రభుత్వం హిందువులను రాష్ట్రం వదిలి పొమ్మంది’’ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడిపైనే గాక నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులపైనా పడుతోందని పవార్ విమర్శించారు. -
మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు. తప్పని పరిస్థితిలోనే... మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు ఉండదు మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్కు ఈ వైల్డ్కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
బెంగాల్ బెబ్బులి జాతీయ స్వప్నం
‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్ పవార్తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్పై మమత బాణాలు సంధించడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్ శాఖ నిట్టనిలువునా చీలింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా వచ్చి తృణమూల్ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్ తన్వార్, యూపీలో లలితేశ్ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్లో సుస్మితా దేవ్– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే. అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్ బరిలోకి దిగింది. ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్తో దోస్తీ మార్చిన తృణమూల్ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది. కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్ బయట తృణమూల్ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది. అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. -
దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ
ముంబై: ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ (యూపీఏ) లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబై పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవార్తో బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము పలు కీలక అంశాలపై చర్చించామని, భావ సారుప్యత ఉన్న అన్ని పార్టీలు ఏకమైతే బీజేపీకి ప్రత్యామ్నయ కూటమిగా ఏర్పడి ఓడించవచ్చని పేర్కొన్నారు. చదవండి: చనిపోయిన రైతులకు సాయం చేయలేం: కేంద్రం భాగసామ్య కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారనే విషయం చర్చకు రాలేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీలు కలిసికట్టు ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని తెలిపారు. శరద్ పవార్ను యూపీఏ చైర్పర్సన్గా ప్రకటించాలా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్(యూపీఏ) ఉందా? ఇప్పుడైతే దేశంలో యూపీఏ లేదని అన్నారు. యూపీఏ చైర్పర్సన్ కూర్చుకొని అక్కడ ఆయన ఏం చేస్తారు?అని అన్నారు. చదవండి: ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్! జుకర్బర్గ్ ప్రమేయం లేదు, కానీ.. అయతే, తాము మరో ప్రత్యామ్నయ భాగాస్వామ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంగళవారం మమతా శివసేన నేతలు సంజయ్రౌత్, సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక మమతా బేనర్జీ 2024 ఎన్నికల్లో పలు పార్టీలను ఏకంచేసి బీజేపీ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నసంగతి తెలిసిందే. -
భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు!
సాక్షి,ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి (84) కన్నుమూయడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటని పలువురు రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు తమ సంతాపం తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వామి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన న్యాయానికి, మానవత్వానికి అర్హుడు అంటూ స్టాన్ మృతిపై సంతాపం తెలిపారు. స్వామి మరణం విచారకరం. గొప్ప మానవతావాది, దేవుడిలాంటి ఆయన పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. ఒక భారతీయుగా చాలా బాధపడుతున్నానంటూ కాంగ్రెస్ ఎంపీ,సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?నిర్దోషిని, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించిన స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. స్వామి మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో అత్యంత అణగారినవారి కోసం జీవితాంతంపోరాడిన వ్యక్తి కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరమని ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం తీరని అపఖ్యాతికి గురవుతోందన్నారు. ఇంకా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ , సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులు ట్విటర్ ద్వారా స్వామి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యశాలి, ఉద్యమకారుడు స్వామికి మరణం లేదని, ఆయన తమ హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటారని దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేశారు. ఆ మహామనిషి రక్తంతో తమ చేతులను తడుపుకున్న మోదీ షాలను జాతి ఎప్పటికీ విస్మరించదంటూ మండిపడ్డారు. దారుణ ఉపా చట్టం ఆయనను బలి తీసుకుంది. త్వరలో విచారణ మొదలు కానుందనే ఆశ విఫలం కావడంతో న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ మూగబోయారంటూ ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ట్వీట్ చేశారు. నోరెత్తిన వారినందరినీ "ఉగ్రవాదులు" గా ప్రభుత్వం ముద్ర వేస్తోందంటూ ఘాటుగా విమర్శించారు. కాగా కరోనా బారిన పడి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా ఉదయం కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 84 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ స్థిరంగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్న స్వామిని జైల్లో నిర్బంధించి, బెయిల్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుందని బీజేపీ సర్కార్పై పలువురు సామాజిక సంఘ నేతలు మండిపడుతున్నారు. Heartfelt condolences on the passing of Father Stan Swamy. He deserved justice and humaneness. — Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021 Sad to learn of Fr #StanSwamy's passing. A humanitarian & man of God whom our government could not treat with humanity. Deeply saddened as an Indian. RIP. https://t.co/aOB6T0iHU9 — Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2021 Stan Smith (84) passes away The system sucks UAPA No bail Little hope of early trial Others too languish in jail Lawyers , Academics , Social Activists ....raise their voices for the voiceless They too are now “voiceless” The State calls them “ terrorists” — Kapil Sibal (@KapilSibal) July 5, 2021 Fr Stan Swamy shall never die. He will live in our hearts as a hero, the brave dissenter who stood against the fascist Modi government at the cost of his life. Modi & Shah have Fr. Stan Swamy's blood on their hands. The country will never forgive them. #StanSwamy — Jignesh Mevani (@jigneshmevani80) July 5, 2021 Deeply saddened by the passing of Fr. Stan Swamy. Unjustifiable that a man who fought all through his life for our society's most downtrodden, had to die in custody. Such travesty of justice should have no place in our democracy. Heartfelt condolences! — Pinarayi Vijayan (@vijayanpinarayi) July 5, 2021 -
డీఎంకే–కాంగ్రెస్ కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది. ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు. డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్సీసీ అ«ధ్యక్షులు కేఎస్ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు. ఈ పరిస్థితులను రాహుల్గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్ను కలుపుకుని పోయేందుకు కమల్హాసన్ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు. -
ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ : యూపీఏ(యునైడెట్ ప్రోగ్రెసివ్ అలియాన్సెస్) అధ్యక్షుడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. అయితే శివసేన మాత్రం శరద్ పవార్వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై కూడా పవార్ స్పందించారు. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని స్పష్టం చేశారు. ( మరో బాంబు పేల్చిన నితీష్ కుమార్..) దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ యూపీఏ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఎన్నికవుతారని నేననుకోవటం లేదు. రెండు పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకుని అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూపీఏ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరుగుతుంది, ప్రధాని అభ్యర్థి ఎన్నిక కాదు’’ అని అన్నారు. -
‘శరద్ పవార్ అధ్యక్షుడిగా ఎంపికైతే సంతోషం’
సాక్షి, ముంబై: యూపీఏ కూటమి చైర్పర్సన్ అభ్యర్ధి మార్పుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీఏ చైర్మన్గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిమమించబడితే సంతోషంగా ఆహ్వనిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిల్లో కాంగ్రెస్ ప్రతిపక్షాలతో జతకట్టడమే చాలా ఉత్తమైన మార్గమని అన్నారు. పవార్ యూపీఏ చైర్ పర్సన్ బరిలో ఉంటే తాము పూర్తి మద్దతిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడు లేనంతంగా సంక్షోభంలో ఉందని, యూపీఏ కూటమి బలపడాలంటే దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రౌత్ పేర్కొన్నారు. కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు శివసేన అధికార ప్రతినిధి మహేష్ స్పందిస్తూ.. శరద్ పవార్ యూపీఏ నాయకత్వం వహిస్తారన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలను దారి మళ్లించడానికి స్వార్ధ ప్రయోజనాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శివసేన పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్యంతో మహరాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్పర్సన్గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్పర్సన్గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్ చెల్లెలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్ కూడా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన కొడుక్కి టికెట్ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం. చిదంబరం, కమల్నాథ్ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్ కొడుకు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాజా లోక్సభ ఎన్నికల్లో భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు.. సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్ మినహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఉత్తరాది ఆధిపత్యం ప్రమాదకరం
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ కొనసాగుతున్న అంతరాలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు ప్రాంతాలమధ్య ఉన్న మత, సామాజికపరమైన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. భాష, సంస్కృతి విషయంలో ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవంతంగా రుద్దే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉత్తరాది ఆధిపత్య ధోరణి తారస్థాయికి చేరింది. అయితే దక్షిణ భారత దేశాన్ని చిన్నచూపు చూడటంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దొందూ దొందే కావడం గమనార్హం. ‘‘భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఎంతో వైవిధ్యం ఉన్నది. ఉత్తర దేశం మూఢనమ్మకాలతో మునిగి ఉంటే, దక్షిణ ప్రాంతం హేతు దృక్పథంతో ఉన్నది. ఉత్తరం ఛాందసవాదంలో ఉంటే, దక్షిణం ప్రగతిశీలమైన బాటలో ఉన్నది. విద్య విషయంలో దక్షిణం ముందడుగు వేస్తుంటే, ఉత్తరభారతం వెనుకబడి ఉంది. సాంస్కృతిక పరంగా దక్షిణం ఆధుని కతను సంతరించుకుంటే, ఉత్తరం ప్రాచీన దశలోనే ఉంది’’ ఇవి 1955 లోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ నోటివెంట దొర్లిన అక్షర సత్యాలు. భాషా ప్రయుక్తరాష్ట్రాల విషయమై రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ సంఘానికి అందజేసిన నివేదికలోని అంశమిది. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎన్నో ఇతర అంశాలను ప్రభా వితం చేస్తుందని అంబేడ్కర్ అంత ముందుగానే ఆలోచించగలిగారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపైన ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఇది ప్రజాస్వామిక దృక్పథానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అంబేడ్కర్ చెప్పిన మాటలు ఈ నాటికీ అక్షరసత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తు న్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఈ అంతరాలు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మీద ఎంతో ప్రభా వాన్ని కలిగిస్తున్నాయి. ఒకరకంగా ఉత్తర భారతదేశంలో మొలకెత్తిన తిరోగమన భావజాలాలన్నింటినీ దక్షిణాదిపై రుద్దుతున్నట్టు చరిత్ర రుజువుచేస్తోంది. ముఖ్యంగా మతపరమైన, సామాజికపరమైన వైవి«ధ్యా లను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఒక ఘర్షణ వాతావర ణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దక్షిణాది మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనుసరించిన విధా నాలు దక్షిణాదిని కలవరపరుస్తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవం తంగా రుద్దే పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్రపరిణామాలకు దారితీస్తుందనడా నికి అనేక ఉదాహరణలున్నాయి. ఉత్తరాదిలో ఒక వర్గం ఆలోచనలను, దేశం మొత్తం ఆచరించాలనే ధోరణిని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఒక మతం ప్రాతిపదికగా దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ప్రభుత్వ విధానాలను దక్షిణ భారత దేశం ఏనాడూ ఆమోదించలేదు. కారణం ఈ నేలకున్న చారిత్రక చైతన్య లక్షణం కావచ్చు. లేదంటే ఈ ప్రాంతంలో ఉద్భవించిన అనేకానేక ఉద్య మాలు కావచ్చు. ఈ ప్రాంతాన్ని ఇవే నిత్యచైతన్యస్రవంతిలో ఓలలాడేలా చేశాయి. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ ఇక్కడ చోటు తక్కువనే చెప్పాలి. దక్షిణాదిలో సాగిన కుల వ్యతిరేక పోరాటాలూ, సాంఘిక సంస్కరణో ద్యమాలూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపథంలో నడిపాయి. హిందూ మతంలోని మూఢవిశ్వాసాలనూ, కుల అణచివేతనూ, వివక్షనూ ఈ ఉద్యమాలు తిప్పికొట్టాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఆయో తీదాస్, రామస్వామి నాయకన్, కేరళ అయ్యంకాలి, ఆనాటి హైదరా బాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామ స్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని అందించారు. అయితే సరిగ్గా ఈ చైతన్యమే ఉత్తరాదిలో కొరవడిందని ఆనాడు అంబేడ్కర్ స్పష్టం చేశారు. సరిగ్గా అదే నేడు అడుగడుగునా రుజువ వుతూ వస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక సూత్రం. కానీ బీజేపీ, దాని నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వ శక్తులూ హిందూ మత రక్షణకు బదులుగా, ఇతర మతాలను ధ్వంసం చేయాలనుకోవడం మనకు ఇటీవలికాలంలో అత్యంత ఆందో ళన కలిగించిన అంశం. ఇతర మతాల ప్రజల ఆహారపుటలవాట్ల మీద గోమాంసం పేరుతో వందల మందిపై దాడిచేయడం, కొందరిని హత్య చేయడం మొదలెట్టి దేశమంతటా ఇటువంటి దాడులు జరపాలని భావించారు. కానీ అదిసాధ్యం కాలేదు. దక్షిణ భారతీయులు హిందువు లైనప్పటికీ ఇతర మతాల ఆచార వ్యవహారాలను తక్కువగా చూడలేదు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం మీద దాడిచేయాలనుకోలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఒకే అంశంపై ఉన్న వ్యత్యాసాన్ని వరల్డ్ వాల్యూ సర్వే బయటపెట్టింది. దీని ప్రకారం హిందూ మతం ఒక్కటే అనుసరిం చదగినదని ఉత్తరాది అధికంగా భావిస్తే, దక్షిణాదిలో దానిని అంగీక రించే వాళ్ళ శాతం తక్కువ. అదేవిధంగా అన్ని మతాలూ సమానమనే భావనలో కానీ, ఇరుగుపొరుగు వాళ్ళు ఇతర మతస్థులు ఉండకూడదనే విషయంలోగానీ, రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ముఖ్యంగా ముస్లింల పట్ల అవలంబిస్తున్న వైఖరిలో రెండు ప్రాంతాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని, ఈ సర్వే వెల్లడించింది. ఇటీవల ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హిందూ మతం, హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా దక్షిణ, ఉత్తర ప్రాంతాల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ హిందూ మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూనే, ముస్లిం ప్రజల సంక్షే మంపై దేశంలో ఏ ప్రభుత్వం చూపించని శ్రద్ధను కనబరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకోసం అమలుచేస్తున్నది. అంతేకాకుండా 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాల లను ముస్లింల కోసం నిర్వహిస్తున్నదంటే ఇది దక్షిణ భారతదేశం అవలంభిస్తున్న మత సహనానికి నిదర్శనం. అట్లాగే కర్నాటక, కేరళ, తమిళనాడులలో తెలంగాణలో లాగా ఇంత ప్రాధాన్యత ఇవ్వకపో యినా, ద్వేషభావం కలిగించలేదు. దీనికి విరుద్ధమైన వైఖరిని బీజేపీ ఉత్తరప్రదేశ్లో అనుసరిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇటీవల లోక్సభ ఎన్నికల్లోగానీ, ముస్లింలను కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా పోటీకి నిలపలేకపోయింది. ఎందుకంటే అక్కడి హిందు వుల్లో కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడానికి, ఇతర హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను రాజకీయం చేశారు. చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరభారతదేశ ప్రజాస్వామిక వ్యతి రేక ధోరణిని బాబాసాహెబ్ అంబేడ్కర్ గతంలోనే ఉదహరించారు. యావద్దేశానికి హిందీ అధికార భాషగా ఉండాలనే విషయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో సభ్యులు 78–78 అనే సంఖ్యతో సమం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం తమ పార్టీ సభ్యులతో చర్చలు జరిపి ఒప్పించి, వ్యతిరేకించే వారిలో ఒకరిని సభకు హాజరుకాకుండా చూడడంవల్ల 78–77 తేడాతో హిందీ భాష అధికార భాష కాగలిగింది. రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఉత్తర భారత దేశంపైన ఆధారపడే స్థితిని కల్పించారు. లోక్సభలో ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో ఉండడం వల్ల ఇప్పటికే పీ.వీ.నరసింçహారావు మినహా మరే దక్షిణ భారత నేత కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగలేక పోయారు. దేవెగౌడ కొద్దికాలమే ప్రధాని పదవిలో ఉండగలిగారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉత్తర భారతీయులే ఎక్కువగా అధిష్టించారు. రాష్ట్రపతి పాలనగానీ, ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే ప్రక్రియ కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరిగిందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగానే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందని భావించక తప్పదు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పడి, తెలుగు ఆత్మగౌరవమనే ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నినదిస్తే, స్పందించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమడక పోవడంవల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసర మైంది. తమిళనాడులో ఢిల్లీని ఎదిరించే రాజకీయాలతోనే అక్కడి పార్టీలైన డీఎంకే, అన్నాడిఎంకే పనిచేస్తున్నాయి. కర్నాటకలో కూడా జెడీఎస్ ఒక ప్రాంతీయ పార్టీగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో అవమానానికి గురవుతున్నారు. దేవెగౌడ ఒక సమయంలో ప్రత్యక్షంగా నాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చెప్పడం సందర్భోచితం అని భావిస్తున్నాను. ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీ ఒక నియంతల కుటీరం. అది రాజ కీయంగానూ, నివాసపరంగానూ, సమాజపరంగానూ రాజధానిగా సరిపోదు. దక్షిణాది నాయకులంటే, అక్కడి రాజకీయనాయకత్వానికి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం కూడా చాలా చులకనగా చూస్తారు’’ అని వాపోయారు. ఇటువంటి సందర్భాలు దక్షిణాది నాయ కులందరికీ అనుభవమే తప్ప అబద్ధం కాదు. ఇటీవల ఈ ఆధిపత్య ధోరణి, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు మరింత ఎక్కువైందని స్పష్ట మౌతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధుల నుంచి పూర్తిగా దాటవేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేరళ రాష్ట్రంలో ఘోరమైన వరదలు వచ్చి, వేల కోట్ల నష్టం వాటిల్లి, వంద లాది మంది మృత్యువాత పడితే ఆదుకోవడంలో చూపిన అలక్ష్యం ఎవ రినైనా కుంగదీయకపోదు. ఒకవైపు సామాజిక, సాంస్కృ తిక అంత రాలూ, రెండో వైపు వివక్ష, నియంతృత్వ పోకడలు భవి ష్యత్లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింత అగా«థాన్ని సృష్టించక మానవు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ విలువలను పాలకులూ ప్రజలూ పాటిస్తే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
నేడు ఢిల్లీలో యూపీఏ పక్షాల భేటీ
-
ఎగ్జిట్ పోల్స్ : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో అందరిలో ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అధికార పగ్గాలు దక్కుతాయని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలు వీలైనన్ని చోట్ల కూటమి కట్టినా,యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపినా ఎన్డీయేకు విస్పష్ట మొగ్గు కనిపిస్తోందని స్పష్టం చేశాయి.2014 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే కాషాయ ప్రభ కాస్త మసకబారినా లోక్సభలో బీజేపీనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మిత్రుల తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. మీడియా సంస్థ ఎన్డీయే యూపీఏ ఇతరులు టైమ్స్నౌ 306 132 104 రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ 287 128 127 రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్ 315 124 113 న్యూస్ ఎక్స్ 242 162 136 న్యూస్ నేషన్ 282-290 118-126 130-138 ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ 300 127 115 టుడేస్ చాణక్య 340 70 133 వీడీపీ అసోసియేట్స్ 333 115 94 యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ లేకపోవడం బీజేపీకి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఇక టైమ్స్నౌ ఎన్డీయేకు 306 స్ధానాలు, యూపీఏకు 132 స్ధానాలు, ఇతరులకు 104 స్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్ సీ ఓటర్ ఎన్డీయేకు 287 , యూపీఏకు 128 స్ధానాలు, ఇతరులకు 127 స్ధానాలు లభిస్తాయని పేర్కొంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 315 స్ధానాలు, యూపీఏకు 124 స్ధానాలు, ఇతరులకు 113 స్ధానాలు రావచ్చని అంచనా వేశాయి. మరోవైపు న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 298 స్ధానాలు, యూపీఏకు 118 స్ధానాలు, ఇతరులకు 126 స్ధానాలు లభించనున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయేకు స్ధానాలు, యూపీఏకు స్ధానాలు, ఇతరులకు స్ధానాలు దక్కనున్నాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్లో ఎన్డీయేకు 300, యూపీఏకు 127, ఇతరులకు 115 స్ధానాలు రావచ్చని అంచనా వేసింది. -
లైవ్ అప్డేట్స్ : వీడీపీ సర్వేలో ఫ్యాన్కు భారీ మెజారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్సభ ఎన్నికలు ముగిశాయి. లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. దీంతో లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ వైఎస్సార్సీపీకి విస్పష్టమైన మెజారిటీ లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 44శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 111 నుంచి 121 సీట్లు సాధిస్తుందని, అధికార టీడీపీ 39.10 ఓట్లతో 54 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 10. 6 శాతం ఓట్లతో జనసేన సున్నా నుంచి నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే స్పష్టంచేసింది. ఉత్తరాదిలో తిరుగులేని మోదీ వివిధ సర్వే సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్లో మరోసారి దీదీ కొనసాగనుందని స్పష్టమైంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ఛరిష్మాకు తిరుగులేదని స్పష్టమైంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే వివిధ మీడియా సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన సర్వే ఫలితాలివి.. టైమ్స్ నౌ- వీఎమ్మార్ సర్వే ప్రకారం.. ఉత్తరప్రదేశ్.. మొత్తం 80 సీట్లు : బీజేపీ - 56, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ - 20 సీట్లు, కాంగ్రెస్- 2 రాజస్థాన్.. మొత్తం 25 సీట్లు: బీజేపీ - 21, కాంగ్రెస్ - 4 న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్.. మొత్తం సీట్లు 42: తృణమూల్ కాంగ్రెస్ 25 - 28, బీజేపీ 3 -7, ఇతరులు 5 -7 కర్ణాటక.. మొత్తం సీట్లు 28: బీజేపీ 21-23, కాంగ్రెస్-జేడీఎస్ 5-3 ఇండియా టుడే యాక్సిస్ సర్వే ప్రకారం.. మహారాష్ట్ర.. మొత్తం సీట్లు 48: బీజేపీ 38 - 42, కాంగ్రెస్-ఎన్సీపీ 6 - 10 గుజరాత్.. మొత్తం సీట్లు 26 : బీజేపీ 20 - 26, కాంగ్రెస్ 0-6 ఇండియా టీవీ సర్వే ప్రకారం.. ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ క్లీన్స్వీప్ (చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే) న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్దే పైచేయి అని ఈ సర్వే పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు 12-14 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ సర్వేలో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లోక్సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది. టైమ్స్నౌ - వీఎమ్మార్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపీఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్-18 చానెల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు రాగా, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది. -
ఆఖరి దశలో నువ్వా? నేనా?
ఏడో దశ లోక్సభ ఎన్నికలు పాలకపక్షమైన బీజేపీకి, ప్రతిపక్షాలకు కూడా కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ దశలో అనుకూల పరిస్థితి ఉందని కొందరు చెబుతుంటే, బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని రాజకీయ పండితులు మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ పూర్తయ్యే 542 సీట్లలో బీజేపీ సహా ఎన్డీఏకు 240 వరకూ వస్తాయని, కాంగ్రెస్కు వంద మించవని ఓ పక్కఅంచనాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకుగాని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు గాని మెజారిటీకి దగ్గరగా సీట్లు రాని పక్షంలో ఏ కూటమికీ చెందని ప్రాంతీయపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కిందటి లోక్సభ ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2017లో జేడీయూ, ఆర్జేడీ కూటమి సర్కారు రాజీనామా చేశాక మళ్లీ నితీశ్కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారులో జేడీయూతో బీజేపీ, ఎల్జేపీ చేతులు కలిపాయి. యూపీలో 13 సీట్లూ కీలకమే! ఇక్కడ ఆఖరి దశ పోలింగ్ జరిగే 13 సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది. మీర్జాపూర్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ విజయం సాధించారు. కిందటేడాది గోరఖ్పూర్ ఉప ఎన్నికలో సమాజ్వాదీపార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ 13 సీట్లలో 8 చోట్ల మాయావతి నేతృత్వంలోని బహుజన్సమాజ్ పార్టీ(బీఎస్పీ) రెండో స్థానంలో నిలవగా, ఎస్పీ మూడు స్థానాల్లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కాంగ్రెస్, ఆప్ చెరొక స్థానంలో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన దశల్లో మాదిరిగానే ఎస్పీ, బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో కలిసి పోటీచేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరు సాగిస్తోంది. ఈ దశలో పోలింగ్ జరిగే సీట్లలో ప్రధాని మోదీ రెండోసారి పోటీచేస్తున్న వారణాసి మళ్లీ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎస్పీ గట్టి అభ్యర్థులను బరిలో నిలపలేదు. మోదీ మెజారిటీ పెంచడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్లో రెండు చోట్ల హోరాహోరీ చివరి దశలో పోలింగ్ జరిగే బిహార్లోని 8 నియోజకవర్గాలు: పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా, జెహానాబాద్, కర్కట్, బుక్సర్, సాసారామ్, నలందాలో బీజేపీ కిందటిసారి తన పూర్వ మిత్రపక్షమైన రాష్ట్రీయలోక్సమతా పార్టీ(ఆరెలెస్పీ)తో కలిపి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఐదు, ఆరెలెస్పీకి రెండు దక్కాయి. జేడీయూ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆర్ఎల్ఎస్పీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కూటమిలో చేరింది. 2014లో బీజేపీ టికెట్పై పోటీచేసిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పట్నా సాహిబ్ బరిలోకి దిగారు. ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో పాటలీపుత్రలో ఓడిపోయిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి(ఆర్జేడీ) మళ్లీ పోటీచేస్తున్నారు. గతంలో ఆమెను ఓడించిన ఆర్జేడీ మాజీ నేత రామ్కపాల్ యాదవ్ బీజేపీ టికెట్పై రెండోసారి పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్రామ్ కూతురు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మళ్లీ సాసారామ్ నుంచి పోటీకి దిగారు. 2014లో ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఛేదీ పాస్వాన్ ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సీఎం నితీశ్కుమార్ సొంతూరు కల్యాణ్బీఘా ఉన్న నలందా స్థానంలో మాత్రమే ఆయన పార్టీ గెలిచింది. కిందటిసారి పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ మళ్లీ పోటీచేస్తుండగా, ఆయనకు మారిన పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంది. ఆయనకు ఆర్జేడీ కూటమిలోని హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) అభ్యర్థి అశోక్ కుమార్ ఆజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ–జేడీయూ కూటమి, మహా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. మధ్యప్రదేశ్లో ఎనిమిదీ బీజేపీ గెలిచిన సీట్లే ఈ రాష్ట్రంలో చివరి దశలో పోలింగ్ జరిగే 8 సీట్లు: దేవాస్, ఉజ్జయినీ, మంద్సోర్, రత్లామ్, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖండ్వా. 2014లో ఈ ఎనిమిది స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీట్లన్నీ మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. 2015లో రత్లామ్(ఎస్టీ) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కిందటేడాది చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 66 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 21 సీట్లు కైవసం చేసుకున్నాయి. దళితులు, ఆదివాసీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని సీట్లలో రెండింటిని ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ స్థానమైన దేవాస్లో ప్రపంచ ప్రఖ్యాత కబీర్ దోహాల గాయకుడు ప్రహ్లాద్సింగ్ టిపానియా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన టిపానియా ఎన్నికల ప్రచారంలో తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ స్థానాలైన ఖండ్వా, ఇండోర్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖండ్వాలో కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ నేత అరుణ్ యాదవ్(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్నారు. ఇండోర్ నుంచి గతంలో వరుసగా 8 సార్లు గెలిచిన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీలో లేరు. మంద్సోర్ నుంచి 2009లో గెలిచిన యువజన కాంగ్రెస్ మాజీ నేత మీనాక్షీ నటరాజన్(కాంగ్రెస్) మూడోసారి బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బెంగాల్లో భీకర పోరు 2014లో మొత్తం 9 స్థానాలనూ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కోల్కతా దక్షిణ్, కోల్కతా ఉత్తర్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ దశ ఎన్నికల ప్రచారాన్ని తృణమూల్, బీజేపీ దూకుడుగా నిర్వహించాయి. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 21 కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మోదీ–అమిత్షా ద్వయం బెంగాల్లో తృణమూల్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటూ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దమ్దమ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ తృణమూల్ సభ్యుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీలో ఉన్నారు. చివరి దశలోని అన్ని సీట్లలోనూ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. పంజాబ్లో కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి రాష్ట్రంలోని 13 లోక్సభ స్థానాల్లో 2014లో ఆప్ 4 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అకాలీ–బీజేపీ కూటమి ఐదు, కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, అకాలీదళ్–బీజేపీ కూటమి మధ్యనే ఉంది. అకాలీ మాజీ డెప్యూటీ సీఎం, మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్పూర్ నుంచి, సుఖ్బీర్ భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బఠిండా నుంచి, కేంద్ర మాజీ మంత్రి హర్దీప్సింగ్ పురీ(బీజేపీ)అమత్సర్ నుంచి పోటీకి దిగారు. పదేళ్ల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అకాలీదళ్ కనీసం మూడు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది. వేడెక్కిన హిమాచల్ మొత్తం 4 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాం గ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో నాలుగు సీట్లనూ(సిమ్లా, మండీ, హమీర్పూర్, కాంగ్ఢా) బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. బీజేపీ పాలనలోని హిమాచల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నేత సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్శర్మ మండీ నుంచి పోటీచేస్తుండగా, మాజీ సీఎం ప్రేమ్కుమార్ ధూమల్ కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఝార్ఖండ్లో ఆదివాసీ సీట్లు రెండు ఈ రాష్ట్రంలోని 14 సీట్లలో చివరి 3 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ జరుగుతోంది. రాజ్మహల్, దూమ్కా ఆదివాసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు. మూడో సీటు గొడ్డా జనరల్ నియోజకవర్గం. 2014లో ఎస్టీ సీట్లు రెండింటిని మాజీ సీఎం శిబూ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. గొడ్డాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా బీజేపీ–ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి అన్ని సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, ఆర్జేడీతో పాటు తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని జేవీఎం(పీ) చేరింది. కూటమి తనకు కేటాయించని ఒక సీటులో ఆర్జేడీ పోటీకి దిగింది. చండీగఢ్లో కిరణ్ ఖేర్ ఎదురీత? 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో విజయం సాధించిన సినీనటి కిరణ్ ఖేర్(బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఓటర్లలో, పార్టీ కార్యకర్తల్లో ఆమెపై అసంతృప్తి కారణంగా ఆమె గెలుపునకు బాగా కష్టపడాల్సి వస్తోంది. 2019లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఆమెపై కాంగ్రెస్ పాత ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి పవన్కుమార్ బన్సల్ పోటీచేస్తున్నారు. ఆప్ తరఫున బలమైన అభ్యర్థి హర్మోహన్ ధవన్ బరిలోకి దిగారు. కిందటిసారి తన ప్రత్యర్థులిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో కిరణ్ 69 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో నాలుగుసార్లు చండీగఢ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సల్పై కూడా వ్యతిరేకత ఉంది. -
రంగస్థలంలో హేమాహేమీలు
ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది. -
ఎన్డీయే 240 రనౌట్.. యూపీఏ 150 ఆలౌట్
లోక్సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీయే అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చు. యూపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్కువంద సీట్లు దాటవని, యూపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది పలువురి అభిప్రాయం. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా. బీజేపీ, కాంగ్రెస్ను కాదని ‘ప్రత్యామ్నాయ’ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకో లేదా కూటమికో స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశమే కనిపించడం లేదు. ఐదు దశల ఎన్నికల (424 లోక్సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్) సరళిని పరిశీలించిన ప్రముఖ జర్నలిస్టులు, విశ్లేషకులు, ప్రజల నాడిని అంచనా వేసే నిపుణులు దాదాపుగా ఇదే చెబుతున్నారు. మొదటి దశ పోలింగ్కు ముందు వెలువడిన సర్వేల అంచనాలకు, ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత పరిణామాలకు తేడా బాగా కనిపిస్తోందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నా రు. ఎన్డీయే కూటమి మెజారిటీ సాధిస్తుందని అనేక సర్వే సంస్థలు పేర్కొనగా, మెజారిటీకి కొద్ది దూరంలో ఆ కూటమి ఆగిపోతుందని ఒకట్రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే, 5 దశల్లో 424 లోక్సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, నిపుణులు ప్రీ–పోల్ అంచనాలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా లేవంటున్నారు. లోక్సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. అదే విధంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీఏ అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎటొచ్చీ ఎన్డీయే 240 సీట్ల దగ్గరే ఆగిపోతుందన్నదే సట్టా బజారులో జరుగుతున్న ప్రచారం. మొదటి దశ నుంచి ఐదో దశ పోలింగ్ ముగిసేదాకా ఓటింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్టులు, ప్రఖ్యాత విశ్లేషకులు, సర్వే పండితులు సైతం ఏ కూటమికీ మెజారిటీ రాకపోవచ్చంటున్నారు. ఎన్డీయే మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్కు వంద సీట్లు దాటవని, యుపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది వారి అభిప్రాయం. కేంద్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కు సమానదూరంలో ఉన్న ఇతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలను కాదని ఢిల్లీలో ప్రత్యామ్నాయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తెరవెనుక మంత్రాంగం ముమ్మరమైంది. రెండు కూటముల్లో ఉన్న భాగస్వామ్య పార్టీలను బయటకు తీసుకొచ్చి వారి సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయి. పసిగట్టిన బీజేపీ.. కాంగ్రెస్పై దూకుడు! పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు, తర్వాతి పరిస్థితుల్లో మార్పును పసిగట్టిన బీజేపీ 4దశల పోలింగ్ తరువాత ప్రతిపక్షాలపై విమర్శల దాడి పెంచింది. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ హయాంలో అవినీతి కుంభకోణాలను తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ ప్రధానమంత్రుల వ్యక్తిగత వ్యవహారశైలిపైనా నేరుగా మోదీ విమర్శలకు దిగడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. బీజేపీ–కాంగ్రెస్ మాత్రమే పోటీ పడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందన్న వార్తలే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. అలాగని.. యుపీయే అధికారంలోకి వచ్చేంత బలమైన పవనాలు కూడా దేశంలో ఎక్కడా లేవని చెబుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజారిటీ సాధించడంలో కీలకంగా ఉన్న ఉత్తరప్రదేశ్లోనూ.. ఈసారి సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నది పోల్ పండితుల అంచనా. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 35 సీట్లు వరకు మాత్రమే రావచ్చన్నది తాజా అంచనా. అదే జరిగితే ఆ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీకి 36 సీట్లు తగ్గుతాయి. అదే విధంగా ఎన్డీయే కూటమికి మెజారిటీ రావడానికి దోహదపడ్డ రాష్ట్రాల్లోనూ ఈసారి కొంత మేర సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొద్ది మేర సీట్లు గెలుచుకున్నా బీజేపీ బలం తగ్గినట్టే. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీకి మునుపటి కంటే 15 నుంచి 20 సీట్లు తగ్గుతాయని తాజా అంచనా. ఢిల్లీలో బీజేపీ తన సొంత బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య బెడిసికొట్టిన పొత్తు కమలదళానికి ఉపయోగపడే అవకాశముంది. ఉత్తరప్రదేశ్తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో తక్కువయ్యే సీట్లలో కొన్నింటినైనా.. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి సాధించాలనేది బీజేపీ నేతల ప్రయత్నం. దానిలో భాగంగానే మోదీ బెంగాల్పై ఎక్కువగా దృష్టి సారించారు. యూపీ తరువాత అత్యధిక సార్లు మోదీ, అమిత్షాలు ప్రచారం చేసిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. ఇక్కడ బీజేపీ 2014 ఎన్నికల్లో 2 సీట్లు సాధించగా ఈసారి 10–12 సీట్లు దక్కించుకోవచ్చన్నది పరిశీలకుల అంచనా. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న ఒడిశాలో ఆరేడు సీట్లు దక్కొచ్చని అంటున్నారు. బీజేపీకి దక్షిణాదితో ఇక్కట్లే తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ దక్షిణాదిన బాగా బలహీనపడింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెద్దగా లాభించే అవకాశాలే లేవు. జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ కర్నాటకలో గతంలో బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కేరళలో అయితే బీజేపీ ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీకి.. ఈసారి ఒకటి లేదా రెండు స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దక్షిణాదిన బీజేపీ దాదాపుగా పాతబలాన్నే నిలబెట్టుకోనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఆధిక్యతను కలుపుకున్నా ఎన్డీఏ కూటమి 240 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. యుపీఏకు కొరవడిన నాయకత్వం ఎన్డీయేకు తాము ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ప్రజలను ఒప్పించలేకపోయింది. 2014 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ పార్టీ కొంత బలపడ్డప్పటికీ ఆ పార్టీకి 100 సీట్లు దాటవని, కూటమికి వచ్చే మొత్తం సీట్లు 150 లోపేనని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నిపుణులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ 16 సీట్లు గెలుచుకుంటుందని, తమిళనాడులో డీఎంకే ఫ్రంట్తో కలిసి 30కి పైగా స్థానాలు దక్కించుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఇక ఉత్తరాదిన గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో హస్తగతం చేసుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో.. ఒక్క ఛత్తీస్గఢ్లోనే ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని విశ్లేషకులు చెపుతున్నారు. మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్సీపీ)తో జత కట్టిన కాంగ్రెస్ కూటమికి 10–15 సీట్లు లభించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుందని, బిహార్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. దక్షిణాది, ఉత్తరాదిన కలిపి ఆ పార్టీ 100 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని సట్టా బజారు అంచనా వేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్, టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్ప్ (ఎన్సీ) ఇతర చిన్నా చితక పార్టీలను కలుపుకుంటే 150 స్థానాలకు మించి రావన్నది తాజా అంచనా. కొత్త భాగస్వాముల కోసం వెతుకులాట ఎన్డీయే 240 సీట్లకు పరిమితం అవుతుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త భాగస్వాముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు.. కొందరు ప్రాంతీయ పార్టీల నేతలతో తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు కొన్నింటిని తమవైపునకు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే, మెజారిటీకి 120 కంటే ఎక్కువ సీట్ల దూరంలో ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్తో జత కట్టేందుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఆసక్తి చూపకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పైపెచ్చు రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా ఒప్పుకోబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాహుల్ నాయకత్వానికి ఆమోదం తెలుపకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్కు కలిసివచ్చే మిత్రులు ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాహుల్, మోదీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. ములాయంసింగ్ యాదవ్ కూడా మోదీనే సమర్థిస్తారన్న ప్రచారం ఉంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తరువాత అతిపెద్ద పార్టీలుగా అవతరించనున్న తృణమూల్, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్, డీఎంకే (ప్రస్తుతం యుపీయేలో ఉంది), జనతాదళ్ యునైటెడ్ (ప్రస్తుతం ఎన్డీయేలో ఉంది) వంటి పార్టీలతో పాటు వామపక్షాలను కలుపుకుని పోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి విజయన్తో జరిపిన సమావేశం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో సమావేశం కోసం చేసిన ప్రయత్నం ఇలాంటి ఆలోచనలకు తెరలేపింది. అటు ఎన్డీయే, ఇటు యుపీయేతో సంబంధం లేని పార్టీలు 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వే పండితులు అంచనా వేస్తున్నారు. తృణమూల్, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలు 120–135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సట్టా బజార్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఎన్డీయే మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోతే ఈ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు వచ్చి చేరే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఎన్డీయేకు 250 దాటితే ఈ పక్షాల్లోనే కొన్ని పార్టీలు షరతులతో కూడిన మద్దతిచ్చే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. అప్పుడు ఈ పార్టీలు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశముంటుంది. రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రాలకు నిధుల మంజూరు విషయంలో వివక్షను విడనాడాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ఈ డిమాండ్ను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన వారికే ఆయన మద్దతిస్తానని స్పష్టంచేశారు. దీంతో ఎన్డీయే మెజారిటీకి 20–30 సీట్ల మధ్య ఆగిపోతే దేశంలో అందరి చూపు ఈ పక్షాల వైపే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. -
పోటీ పసందు ఎవరో బిహార్ బంధు
బిహార్లో ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలు అమలు చేస్తూ అవతలి వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈసారి ఎన్డీయే, యూపీఏ.. రెండే కూటములు బరిలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి బిహార్ సీఎం నితీశ్కుమార్ పరిపాలన, ప్రధాని మోదీ ఇమేజ్పై ఆధారపడితే, యూపీఏ కూటమి నితీశ్ కప్పదాటు వైఖరిని, కుల సమీకరణ లెక్కలనే అస్త్రాలుగా మార్చుకుంది. ‘ఇవాళ రేపు బిహార్లో మారుమూల పల్లెకు కూడా కరెంట్ ఉంది. ఇక లాంతర్ (లాలూప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ గుర్తు) అవసరం ఎవరికుంది?’ – బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సూటి ప్రశ్న ‘అందితే జుట్టు. అందకపోతే కాళ్లు. నితీశ్ కుమార్ విధానమే అది. కొన్నేళ్లుగా ఆయన బట్టలు మార్చినంత సులువుగా కూటముల్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో జత కట్టారో అసలు ఆయనకైనా తెలుసా?’’ – జైలు నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కౌంటర్. రంగులు మారిన రాజకీయం 2014 ఎన్నికల్లో బీజేపీ.. రామ్విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొంది. 40 లోక్సభ స్థానాల్లో 31 గెలుచుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేసి ఏడు స్థానాల్లో నెగ్గాయి. ఇక వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నితీశ్కుమార్ (జేడీయూ) రెండు స్థానాలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏడాదికే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటముల రంగు మారాయి. ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్ మహాగఠ్ బంధన్గా చేతులు కలిపాయి. బీజేపీ.. ఎల్జేపీ, ఆర్ఎస్ఎస్పీ, జేడీ (యూ)లో చీలిక వర్గమైన మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోచీ (సెక్యులర్) కలిసి పోటీ చేశాయి. యూపీఏ కూటమి మొత్తం 243 స్థానాలకు 178 సీట్లను గెలుచుకుంది. 41 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీయే కూటమి 34 శాతం ఓట్లతో 58 సీట్లు సాధించింది. నితీశ్కుమార్ ముఖ్యమంత్రిగా, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కానీ కూటమి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో జేడీ (యూ), ఆర్జేడీ మధ్య చిచ్చు ఏర్పడింది. ప్రభుత్వం కొనసాగలేకపోయింది. బీజేపీ మద్దతుతో మళ్లీ నితీశ్కుమార్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో మోదీని విమర్శించిన నితీశ్ ఈసారి కలిసి వేదిక పంచుకుంటూ కేంద్రం పాలనను ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నిచోట్లా ముఖాముఖీ పోటీ బిహార్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముఖాముఖి పోరాటమే నెలకొంది. ఎన్డీయే, మహాగఠ్ బంధన్ మధ్య పోరు నెలకొంది. ఎన్డీయే (బీజేపీ, జేడీ–యూ, ఎల్జేపీ)– మహాగఠ్ బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ) మధ్య 40 లోక్సభ స్థానాల్లో ముఖాముఖి పోరు నెలకొంది. వామపక్షాలు ఉనికి కోసం కొన్ని లోక్సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బెగూసరాయ్ మినహా మరెక్కడా కమ్యూనిస్టుల ప్రభావం లేదు. మహాగఠ్ బంధన్లో సీట్ల సర్దుబాటు కారణంగా ఆర్జేడీ ఈసారి 19 సీట్లలోనే పోటీ చేస్తోంది. ఇప్పటివరకు ఆర్జేడీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదు. కాంగ్రెస్కు తొమ్మిది సీట్లు కేటాయించడం ఆ కూటమికి మైనస్ కావచ్చని అంచనా. నితీశ్ వర్సెస్ తేజస్వి ఈసారి లోక్సభ ఎన్నికలు నితీశ్ కుమార్ వర్సెస్ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి మధ్య యుద్ధంలా మారాయి. నితీశ్కు ఓబీసీ వర్గాల్లో ఇప్పటికీ గట్టి పట్టుంది. ఇక లాలూ చిన్న కుమారుడు తేజస్వి చురుగ్గా పని చేస్తున్నారు. ఓబీసీ ఓటర్లలో యాదవులంతా ఇప్పటికే ఆర్జేడీకి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వారినీ తమ గూటికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుద్యోగం అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కాగా, ఈసారి సర్వేలన్నీ మోదీ ఇమేజ్, నితీశ్ పాలనకు బిహారీ జనం జైకొడతారని అంచనా వేస్తున్నాయి. కుల సమీకరణలు, రంగులు మారే రాజకీయాల కంటే దేశ భద్రత, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారుతాయని అంటున్నాయి. ఇక కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్ పాలనపై బిహార్లో 43 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సీఎస్డీఎస్–లోక్నీతి సర్వే చెబుతోంది. లాలూ లేని ఎన్నికలు దాణా కేసులో జైలు పాలైన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఆయన ఎన్నికల బరిలో ఉంటే, ప్రచారంలో పాల్గొంటే ఆ మజాయే వేరు. తన హాస్య చతురతతో ప్రత్యర్థి పార్టీలనూ నవ్విస్తారు. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్లో లాలూ ఉంటారని ఒకప్పుడు సరదాగా చెప్పిన ఆయన తాను ఎన్నికల బరిలో లేని లోటు తెలియకుండా జైలు నుంచి కూడా ప్రకటనలు ఇస్తున్నారు. మోదీ సభలకు వచ్చే జనాన్ని చూసి ‘నేనలా సరదాగా నడుచుకుంటూ పాన్ షాప్కే వెళితే నా చుట్టూ అంతమంది గుమిగూడతారు’ అంటూ సెటైర్లు వేశారు. ఓటర్లు లాలూని మిస్ అవుతున్నప్పటికీ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా మారుతున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు దేశ భద్రత బిహార్ ఎన్నికల్లో దేశ భద్రత అనేది కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరీ ఘటన తర్వాత పాక్పై సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్పై దాడులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ అణచివేయడం వంటి చర్యలపై ఓటర్లలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. పాక్ నక్కజిత్తుల్ని తిప్పికొడుతున్న మోదీకి మరో చాన్స్ ఇవ్వొచ్చని గయ పట్టణంలో అభిషేక్ కుమార్ అనే ఓటరు వ్యాఖ్యానించారు. అయితే సాసారాం నియోజకవర్గానికి చెందిన రవిదాస్ అనే ఓటరు మాత్రం ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఇలాంటివేవీ పనిచేయవని, కులాలే ఎన్నికల్ని శాసిస్తాయని అంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఏసీ గదుల్లో కూర్చునే వారు దేశ భద్రతపై లెక్చర్లు దంచుతారేమో కానీ సామాన్యులకు అవేవీ పట్టవని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశం కాబోతోంది. ఎందుకంటే బిహార్లో అగ్రవర్ణాలు 15 శాతం వరకు ఉన్నారు. వారంతా రిజర్వేషన్లపై హర్షం ప్రకటించారు. ఓబీసీ ఓటర్లపై ఆధారపడుతున్న యూపీఏ కూటమి దీనిని సమర్థంగా తిప్పికొట్టలేక పోతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేయడంలో విఫలమవుతోంది. నిరుద్యోగం, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రంలో ఈ రెండు అంశాలే ప్రచారాస్త్రం కానున్నాయి. యూపీఏ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ గత ఎన్నికల్లో బిహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు. దీనిపై యూపీఏ గట్టిగానే నిలదీస్తోంది. ఏ కూటమి వ్యూహాలేమిటి? యూపీఏ మేథమేటిక్స్ మహాగఠ్ బంధన్లో మొత్తం ఆరు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ.. ఇవన్నీ కుల సమీకరణలు, వాటి అంకెలు, లెక్కలపై ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగాయి. రాష్ట్ర జనాభాలో 17 నుంచి 18 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, ఆర్జేడీకి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక యాదవులు ఓట్లు 16 నుంచి 17 శాతం వరకు ఉంటాయి. సంప్రదాయంగా వాళ్ల మద్దతు ఆర్జేడీ వైపే. జనాభాలో 4 శాతం ఉన్న కొయిరి ఓటర్లు ఆర్ఎల్ఎస్పీ వైపే మొగ్గుతాయి. యూపీఏ కుల సమీకరణలకి ఇది ఊతమిచ్చేలా ఉంది. జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ కూడా యూపీఏలో భాగస్వామి కావడంతో దళిత ఓటర్లు యూపీఏ వైపు మొగ్గు చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ కుల సమీకరణలు కాకుండా అభివృద్ధి అంశంలో నితీశ్పై అస్త్రాలు సంధించడానికి ఏమీ లేక రోజుకొక కూటమి మార్చే ఊసరవెల్లిగానే నితీశ్ను యూపీఏ పక్షాలు ఏకి పారేస్తున్నాయి. ఇక బిహార్లో నిరుద్యోగం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను కూడా యూపీఏ ప్రచారంలో లేవనెత్తుతూ ఎన్డీయేని ఇరుకున పెట్టే వ్యూహాలను రచిస్తున్నాయి. ఎన్డీయే కెమిస్ట్రీ రాష్ట్రంలో కులసమీకరణలతో పాటుగా ఎన్డీయే అభివృద్ధి మంత్రాన్ని కూడా జపిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ, నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉజ్వల పథకం, టాయిలెట్ల నిర్మాణం వంటివి ప్రజల్లో ఆదరణ పొందాయి. ఇక బిహార్ అగ్రకులాల ఓట్లు 14 నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఇవి సాధారణంగా బీజేపీకే పడతాయి. ఇక కుర్మీ ఓట్లు 4–5 శాతం ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ ఓటర్లంతా ఆయన వెంట నడుస్తారు. గత లోక్సభ ఎన్నికల్లో జేడీ (యూ) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ కాదు. కానీ ఈసారి ఎన్డీయేతో చేతులు కలపడంతో కూటమి బలోపేతమైంది. ఇక రామ్విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్జనశక్తి పార్టీ శక్తిని తక్కువగా అంచనా వేయలేం. జనంలో కరిష్మా కలిగి, ఓటర్లను ప్రభావితం చేయడంలో జీతాన్ రామ్ మాంఝీ కంటే శక్తిమంతమైన నాయకుడు పాశ్వాన్. దీంతో దళిత ఓటర్లు చాలామంది ఎన్డీయే వైపు కూడా నడిచే అవకాశం ఉంది. ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశం. నితీశ్కుమార్ తరచూ కూటములు మారుస్తారన్న పేరైతే ఉంది కానీ, వెనుకబడిన బిహార్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్మిన నాయకుడు. అవినీతి, బంధుప్రీతి లేకుండా సుపరిపాలన అందించడంలో నితీశ్ది ప్రత్యేక స్థానం. మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వెలుగులు పూయించారు. రోడ్లు, తాగునీటి æ సౌకర్యాలు కల్పించారు. నేరాలను అదుపు చేశారు. అందుకే కులాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. మోదీ ఇమేజ్ కూడా కలిసి వచ్చి ఎన్డీయే జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
లూటీని అడ్డుకున్నందుకే ఏకమయ్యారు
న్యూఢిల్లీ: ప్రజాధనం దోపిడీని అడ్డుకున్నందుకే ప్రతిపక్షాలు ఏకమై తనను దూషిస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 8 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘న్యూస్ 18 నెట్వర్క్’ రైజింగ్ ఇండియా సమిట్లో ప్రధాని ప్రసంగించారు. ‘జన్ధన్ యోజన, ఆధార్ లింకింగ్ వంటి కార్యక్రమాలతో దాదాపు రూ.1.10లక్షల కోట్లను పక్క దారి పట్టకుండా మేం ఆపగలిగాం. దీంతో ప్రతిపక్షాల్లో ఉన్న ఆ నేతలంతా ఇప్పుడు ఏకమయ్యారు. దోచుకునేందుకు గల అన్ని దారులు మూసుకుపోవడంతో నన్ను దూషించడం మొదలుపెట్టారు’అని ఆరోపించారు. తనకు, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని జాతి హితం, రాజకీయాలకు జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ఉద్యోగావకాశాలు కల్పించకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేగంగా ఉద్యోగ కల్పన జరుగుతోందని అన్నారు. అయితే, ఎన్డీఏ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందంటోన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా ఉద్యోగాలు లేకపోవడం సాధ్యమా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పేదరికం బాగా తగ్గింది. కీలక మౌలిక వసతులైన రోడ్డు, రైల్వే మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటప్పుడు దేశంలో ఉద్యోగాలు లేకపోవడం ఎలా సాధ్యం’ అని ఆయన ప్రశ్నించారు. 2012–18 సంవత్సరాల్లో 67 లక్షల ఉద్యోగాలను కల్పించగా గత ఏడాదిలోనే 9 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా. నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు. వాళ్లను కూడా మీరు నమ్మరా? ఈ రాష్ట్రాలు భారత్లోవి కావా? ఉద్యోగాలు కల్పిస్తుండగా నిరుద్యోగిత ఎలా పెరుగుతుంది?’ అని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో 6 లక్షల మంది నిపుణులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. వీరు మరికొన్ని లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. రవాణా రంగం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల కార్లు విక్రయించారు. ప్రధాన్మంత్రి ముద్రా యోజన కింద వ్యాపారాలు చేసుకునేందుకు రికార్డు స్థాయిలో 4 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు లేకుండా ఇంతమంది రుణాలు తీసుకోవడం సాధ్యమేనా? 2017–19 సంవత్సరాల్లో ఈపీఎఫ్వో(ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ)లో 5 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. కోట్లాది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో కంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయని అర్థం’ అని ప్రధాని అన్నారు. -
ఇదీ రఫేల్పై కాగ్ నివేదిక
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు: ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు. సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్ఏఎల్లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది. గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది. -
ధర 2.86 శాతం తక్కువే
న్యూఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎట్టకేలకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బుధవారం పార్లమెంటుకు చేరింది. రఫేల్ విమానాల కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగానే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రఫేల్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఉన్న ‘భారత్లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక’ అంశాన్ని కాగ్ ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. యుద్ధ విమానాల పూర్తి, స్పష్టమైన ధరలను కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనలేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న ధర కన్నా తమ ప్రభుత్వం రఫేల్ విమానాలను కొంటున్న ధర 9 శాతం తక్కువగా ఉందంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించగా, తాజాగా కాగ్ మాత్రం అది 2.86 శాతమే తక్కువని స్పష్టం చేయడం గమనార్హం. ఆ ప్యాకేజీకి 6.54 శాతం ఎక్కువ ధర రఫేల్ ధరల వివరాలను సంపూర్ణంగా బయటపెట్టకపోయినప్పటికీ, ఇంజనీరింగ్ సహాయక ప్యాకేజీ, వాయుసేనకు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ వరకు చూస్తే ప్రస్తుత ధర గతం కన్నా 6.54 శాతం ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2007లో కుదుర్చుకున్న ధరలతో పోలిస్తే శిక్షణా వ్యయం కూడా ప్రస్తుతం 2.68 శాతం పెరిగిందంది. రఫేల్ విమానాల్లో భారత్ కోరిన సౌకర్యాలు తదితరాల్లో మాత్రం యూపీఏ ధర కన్నా ఎన్డీయే ధరలు 17.08 శాతం తక్కువగా ఉన్నాయంది. ఆయుధాల ప్యాకేజీ కూడా గతం కన్నా ప్రస్తుతం 1.05 శాతం తక్కువకే వచ్చిందని తన 157 పేజీల నివేదికలో కాగ్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే యూపీఏ కన్నా ఏన్డీయే కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ఒక్కో విమానాన్ని రూ. 520 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోందని గతం నుంచీ ఆరోపిస్తోంది. డసో పోటీ సంస్థ యూరోపియన్ ఏరోనాటిక్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ (ఈఏడీఎస్) విమానాల ధరపై 20 శాతం తగ్గింపు ఇస్తామనడంపై ప్రభుత్వ స్పందనను కూడా కాగ్ రాజీవ్ మహర్షి ఈ నివేదికలో ప్రస్తావించారు. 20 శాతం తగ్గింపును ఆ కంపెనీ భారత్ అడగకుండానే ఇచ్చిందనీ, అలాగే ఈఏడీఎస్ ప్రతిపాదనల్లో వాస్తవిక వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని ఎంపిక చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు కాగ్ నివేదిక తెలిపింది. లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనా? ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని లోపాలనూ కాగ్ తన నివేదికలో ప్రస్తావించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి హామీ/పూచీ తీసుకోకుండా కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనే మోదీ ప్రభుత్వం సరిపెట్టుకుందనీ, దీనివల్ల రఫేల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్కు లబ్ధి చేకూరిందని కాగ్ తెలిపారు. 2007లో కుదిరిన ఒప్పందం ప్రకారమైతే ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా ఉందనీ, ప్రస్తుత ఒప్పందంలో అలాంటిదేమీ లేదని కాగ్ నివేదిక వెల్లడించింది. ‘ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి పూచీకత్తు లేకుండా లెటర్ ఆఫ్ కంఫర్ట్తో సరిపెట్టుకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో డసో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్కు తలనొప్పి తప్పదు. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ముందుగా భారత్ మధ్యవర్తిత్వం ద్వారా డసోతోనే చర్చలు జరపాలి. ఈ చర్చల ఫలితం భారత్కు అనుకూలంగా ఉంటే, ఇందులో వచ్చిన తీర్పును/పరిష్కారాన్ని అనుసరించేందుకు కూడా డసో విముఖత చూపితే భారత్ మళ్లీ అందుబాటులో ఉన్న అన్ని న్యాయ పరిష్కారాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డసో తరఫున ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్కు డబ్బు తిరిగి చెల్లిస్తుంది’ అని నివేదిక వివరించింది. అబద్ధాలని తేలిపోయింది: జైట్లీ కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు రఫేల్పై చెబుతన్నవన్నీ అబద్ధాలేనని కాగ్ నివేదికతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆఫ్సెట్ భాగస్వామి ప్రస్తావనే లేని నివేదిక రఫేల్ వివాదంలో కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఆఫ్ ఎంపిక గురించే. డసో భారత్లో తనకు ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాకుండా రిలయన్స్ డిఫెన్స్ను ఎంపిక చేసుకుందనీ, ఈ రంగంలో ఏ అనుభవం లేని కొత్త కంపెనీ రిలయన్స్ డిఫెన్స్కు ఈ అవకాశం దక్కడానికి మోదీ ప్రభుత్వ అవినీతే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాగ్ నివేదికలో మాత్రం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక అంశం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. ఆ కాగితమంత విలువ కూడా లేదు: రాహుల్ రఫేల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు జరిపిన చర్చల సమయంలో వచ్చిన అసమ్మతి గురించి అసలు ఈ నివేదికలో కాగ్ ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ముద్రించిన కాగితాలకు ఉన్నంత విలువ కూడా అందులో పేర్కొన్న అంశాలకు లేదని విమర్శించారు. ‘కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి మోదీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ధర, మరింత వేగంగా సరఫరా. కానీ ఈ ఆ రెండు వాదనలూ అవాస్తవాలేనని ద హిందూ పత్రిక తాజా కథనంతో తేలిపోయింది. కేవలం రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకీ రూ. 30 వేల కోట్లు అక్రమంగా ఇచ్చేందుకే ఈ కొత్త ఒప్పందం జరిగింది’ అని రాహుల్ మరోసారి ఆరోపించారు. రఫేల్ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, సోనియా తదితరులు పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు. -
మ్యాజిక్ ఫిగర్కు ఎన్డీఏ దూరం
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలవనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 252, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. జనవరి నెలలో ఆంగ్ల వార్తాచానెల్ ‘టెమ్స్ నౌ’.. వీఎంఆర్ సంస్థతో కలిసి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. గతంలో ఇండియాటుడే, రిపబ్లిక్ చానెళ్లు ప్రకటించిన సర్వేల తరహాలోనే ఈ సర్వే సైతం ‘ఇతరులకు’ కీలక స్థానం కల్పించింది. మొత్తం 543 సీట్లలో మెజారిటీ మార్కు 272కి 20 సీట్ల దూరంలో ఎన్డీయే నిలవడం విశేషం. యూపీఏకు కేవలం 147 సీట్లు రానున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు సాధించిన 144 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్కు 96 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 2014లో ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, అందులో మెజారిటీ మార్కు 272ను మించి 282 సీట్లు బీజేపీ గెల్చుకున్నవే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కొంత పుంజుకున్నా.. సెంచరీ స్థానాలకు కొంత దూరంగానే నిలుస్తుందని సర్వే తేల్చింది. ఇతరుల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తమతమ రాష్ట్రాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 32 సీట్లను తృణమూల్ కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సీట్లలో అత్యధికంగా 23 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటాయంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), 5 స్థానాలను కాంగ్రెస్, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలుచుకుంటాయంది. ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 21 సీట్లలో 13 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, బీజేడీ 8 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక్కడ 2014లో బీజేడీ 20 సీట్లు గెలుచుకుంది. 2019లో ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– వీఎంఆర్ సర్వే పేర్కొంది. యూపీలో.. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. 2014లో వేర్వేరుగా పోటీ చేసి ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ బోణీ చేయకపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో యూపీలో ఎన్డీయే 73 సీట్లు గెలుచుకుంది. ఇతర కీలక రాష్ట్రాల్లో.. రాజస్తాన్లో బీజేపీ గతంలో మొత్తం 25 సీట్లను గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 17కి తగ్గుతుందని, 8 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2014లో గుజరాత్లోని మొత్తం 26 సీట్లను క్లీన్స్వీప్ చేసిన బీజేపీ ఈ సారిఅందులోనుంచి రెండు సీట్లను కాంగ్రెస్కు కోల్పోనుంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్లు చెరో 14 సీట్లు గెలుచుకుంటాయి. మధ్యప్రదేశ్లోని 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్ 6 గెలుచుకోనున్నాయి. 2014లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43 (2014 కన్నా ఒక సీటు ఎక్కువ), యూపీఏ 5 గెలుచుకుంటాయి. బిహార్లో(40) గత ఎన్నికల్లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 25 కి పరిమితమవుతుంది. యూపీఏ బలం 15కి పెరుగుతుంది. మొత్తం సీట్లు: 543 ఎన్డీఏ: 252 యూపీఏ: 147 ఇతరులు: 144 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1), అండమాన్ నికోబార్ దీవులు (1) లోక్సభ స్థానాలను ఎన్డీయే పార్టీలు, అటు చండీగఢ్ (1) స్థానాన్ని యూపీఏ గెలుస్తుంది. లక్షద్వీప్ (1)లో ఎన్సీపీ, సిక్కింలో ఉన్న ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకుంటారు. పుదుచ్చేరిలోనూ ఒక లోక్సభ సీటు ఉన్నప్పటికీ దాని గురించి సర్వే నివేదికలో ప్రస్తావించలేదు. -
2019 హంగ్!
-
రానున్నది ‘హంగ్’!
న్యూఢిల్లీ: మరో మూణ్నెళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ అధికార ఎన్డీయే కూటమికి చేదువార్త. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయనీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ కూటమి 99 సీట్లు కోల్పోనుందని తేలింది. అటు యూపీఏ కూటమి కూడా ఎన్డీయే కన్నా తక్కువ సీట్లే గెలుస్తుందనీ, అయితే గతంతో పోలిస్తే ఈ కూటమికి 106 సీట్లు అధికంగా, 166 సీట్లు వస్తాయని సర్వే అంటోంది. రెండు కూటముల్లో దేనికీ సాధారణ ఆధిక్యం (272 సీట్లు) రాదు కాబట్టి పార్లమెంటులో హంగ్ తప్పదని ఎంవోటీఎన్ సర్వే జోస్యం చెబుతోంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 202 స్థానాలు, కాంగ్రెస్కు 96 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్డీయే, యూపీఏల్లో ఏ కూటమిలోనూ లేని ఇతర పార్టీలకు మాత్రం దాదాపు గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లే ఇప్పుడూ వచ్చే అవకాశముందంది. ఆ పార్టీలన్నీ కలిపి 140 సీట్ల వరకు గెలుస్తాయనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీటి మద్దతు తప్పనిసరని సర్వే పేర్కొంది. అంటే దాదాపు 100 సీట్లు ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి చేజారి యూపీఏ ఖాతాలో చేరనున్నాయి. ప్రస్తుతం ఇరు కూటముల్లోనూ లేని ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి, తృణమూల్, పీడీపీలు యూపీఏలో చేరితే ఆ కూటమికి అధికారం వస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలవగా, ఎన్డీయే కూటమికి కలిపి 336 సీట్లు వచ్చాయి. ఎన్డీయేకు తగ్గనున్న ఓట్ల శాతం సీట్లతోపాటు ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం కూడా తగ్గనుందని ఎంవోటీఎన్ సర్వే అంటోంది. ఎన్డీయేకు 35 శాతం, యూపీయేకు 33 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో బీజేపీకి కాస్త ఉపశమనం కలిగించే అంశమేదైనా ఉందంటే.. యూపీఏ కన్నా ఆ కూటమికి ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తుండటమే. ఈ అంచనాలన్నీ ఎన్డీయే, యూపీఏల్లో ప్రస్తుతం ఉన్న పార్టీల ఆధారంగా లెక్కించినవే. ఎన్నికల ముందు కూటముల్లో మార్పులు జరిగితే తామ అంచనాలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉందని సర్వే స్పష్టం చేసింది. ఏ కూటమిలో ఏ పార్టీలు.. ఎన్డీయే: బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఆలిండియా రంగస్వామి కాంగ్రెస్, అప్నాదళ్, బోడో పీపుల్స్ ఫ్రంట్, జేడీ(యూ), ఎల్జేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆర్పీఐ(ఏ), శిరోమణి అకాలీ దళ్, సిక్కిం డెమోక్రటిక్ పార్టీ యూపీఏ: కాంగ్రెస్, డీఎంకే, జేడీ(ఎస్), కేరళ కాంగ్రెస్ (మణి), ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం. ఇతరులు: వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, శివసేన, టీడీపీ, ఏఐఎంఐఎం, అన్నాడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), ఆప్, ఏజీపీ, ఫార్వర్డ్ బ్లాక్, తృణమూల్, బీజేడీ, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, ఐఎన్ఎల్డీ, పీడీపీ, ఎంఎన్ఎస్, ఎన్ఎల్పీ, ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి. సర్వే జరిగిందిలా.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఏపీ, తెలంగాణ, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, యూపీ సహా 19 రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 97 లోక్సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది.ఓ ప్రశ్నావళిని రూపొందించి దాని ఆధారంగా ప్రజలను ర్యాండమ్గా ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో 69 శాతం గ్రామీణ, 31 శాతం పట్టణ వాసులు పాల్గొన్నారు. ఈ సర్వేతో పాటు యూపీలోని 20 లోక్సభ స్థానాల్లో 1,103 ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రశ్నావళిని స్థానిక భాషల్లోకి అనువాదంచేసి అందించారు. ఈ సర్వేను 2018, డిసెంబర్ 28 నుంచి 2019, జనవరి 8 మధ్యకాలంలో నిర్వహించారు. ఈ సర్వేలో 19 రాష్ట్రాలకు చెందిన 13,179 మంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రెండు ప్రముఖ ఆంగ్ల వార్త చానెళ్లు ఎన్నికల ఫలితాలపై అంచనాలను వెలువరించాయి. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో కార్వీతో కలిసి ఇండియా టుడే టీవీ, ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో సీ ఓటర్తో కలిసి రిపబ్లిక్ టీవీ.. దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాధించే సీట్ల సంఖ్యలో స్వల్ప తేడాలున్నా.. రెండు సంస్థలు రానున్నది హంగేనని తేల్చాయి. ఎన్డీయే 2014 కన్నా 99 సీట్లు కోల్పోయి 237 స్థానాలు గెలుచుకుంటుందని ఇండియాటుడే.. 103 స్థానాలు కోల్పోయి 233 సీట్లను గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ తేల్చాయి. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గతం కన్నా 106 సీట్లు పెంచుకుని 166 వద్ద నిలుస్తుందని ఇండియాటుడే.. 60 నుంచి 167 స్థానాలకు దూసుకుపోతుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేశాయి. రెండు సంస్థలు కూడా రెండు కూటములకు చెందని ఇతర పార్టీలే కీలకమని తేల్చిచెబుతున్నాయి. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీలు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 16 టీఆర్ఎస్, 1 ఏఐఎంఐఎం గెలుచుకోనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సీట్లలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 19 సీట్లలో, టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ఎన్డీయేకు మైనస్.. యూపీయేకు ప్లస్ కోల్కతాలో తృణమూల్ నేతృత్వంలో విపక్షాల మెగా ర్యాలీ, యూపీలో కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ–బీఎస్పీ కూటమి ఏర్పాటు, క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనం తదితరాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనావేస్తూ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ ఉమ్మడిగా జరిపిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. పలు మిత్ర పక్షాలు దూరం కావడంతో గతంతో పోలిస్తే ఎన్డీయేకు ఈసారి 103 స్థానాలు తగ్గే అవకాశాలున్నాయి. ఒక్క యూపీలోనే ఎస్పీ–బీఎస్పీ దెబ్బకు 45 సీట్లు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన విపక్షం కాంగ్రెస్ గొప్పగా పుంజుకుని 160కి పైగా సీట్లు దక్కించుకోవచ్చు. హంగ్ ఏర్పడే నేపథ్యంలో 140 సీట్లు కైవసం చేసుకునే ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల పార్టీలు టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లే. దక్షిణాదిలోనే యూపీయే మిగతా అన్ని చోట్లా ఎన్డీయేకే ఆధిక్యం ఎంవోటీఎన్ సర్వే ప్రాంతాలవారీ ఫలితాలను చూస్తే ఒక్క దక్షిణాదిలో తప్ప ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికే అధిక ఓట్లు, సీట్లు వస్తున్నాయి. ఉత్తర భారతం: ఈ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, హరియాణ, ఢిల్లీ, పంజాబ్లలో ఎంవోటీఎన్ సర్వే జరిగింది. ఇక్కడ ఎన్డీయేకు 40% ఓట్లు, 66 సీట్లు వస్తాయనీ, అటు యూపీఏకు కేవలం 23% ఓట్లు, 20 సీట్లు సర్వే తెలిపింది. ఇక ఇతర పార్టీలకు 37% ఓట్లు, 65 సీట్లు వస్తాయంది. యూపీఏ కన్నా ఇతర పార్టీలకే ఇక్కడ అధిక సీట్లు రానున్నాయి. పశ్చిమ భారతం: గుజరాత్, మహారాష్ట్రలతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లను కూడా ఈ సర్వే పశ్చిమ ప్రాంతంగా పేర్కొంది. ఇక్కడ ఇతరుల పాత్ర పెద్దగా ఉందనీ, యూపీఏ కన్నా ఎన్డీయేకు ఓట్ల శాతం కొంచెం ఎక్కువగా ఉంటున్నప్పటికీ సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఎన్డీయేకు 46% ఓట్లు, 76 సీట్లు, యూపీఏకు 42% ఓట్లు, 40 సీట్లు, ఇతరులకు 12 శాతం ఓట్లు తప్ప సీట్లేవీ రావని సర్వే అంటోంది. తూర్పు భారతం: బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్ల్లో సర్వే జరిగింది. ఇక్కడా ఎన్డీయేదే పై చేయి. ఎన్డీయే కూటమికి 37% ఓట్లు, 69 సీట్లు, యూపీఏకు 25% ఓట్లు, 28 సీట్లు, ఇతర పార్టీలకు 38% ఓట్లు, 45 సీట్లు వస్తాయని ఎంవోటీఎన్ సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు బలపడినట్లుగా సర్వే తెలిపింది. దక్షిణ భారతం: యూపీఏకు ఆధిక్యం ఉన్న ప్రాంతం ఇదొక్కటే. అదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీ 18 శాతం ఓట్లతో 26 సీట్లు సాధిస్తుందనీ, ఇతర పార్టీలు 39 శాతం ఓట్లు తెచ్చుకుని 30 సీట్లు గెలుస్తాయని సర్వే తెలిపింది. యూపీఏకు 43 శాతం ఓట్లు, 78 సీట్లు వస్తాయంది. -
‘యూపీఏ-3 ఏర్పాటు చేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. తమతో కలిసి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, వాటి మద్దతుతో కే్ంద్రంలో యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.బీజేపీ కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించిందని, ఈసారి 160 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని థరూర్ జోస్యం చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఇదివరకే ప్రకటించిన విషయాన్ని థరూర్ గుర్తుచేశారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల మోదీపాలనలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అచ్ఛేదీన్ అంటూ ప్రజలను మోసం చేసిన మోదీకి మరోసారి అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడుతున్నాయని శశిథరూర్ పేర్కొన్నారు. -
కొత్త సంవత్సరంలో ప్రధాని ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాలకు సంబంధించి 2018 సంవత్సరం అసంతృప్తిగానే ముగిసిపోయింది. 2019 సంవత్సరంలోకి అడుగుపెట్టే నాటికి పాలకపక్ష భారతీయ జనతా పార్టీ కొంత పతనమైంది. కాంగ్రెస్ పార్టీ కొంత బలం పుంజుకున్నా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 ఏళ్లకు కూడా పెద్దగా ఎదిగినట్లు కనిపించడం లేదు. దేశ ప్రయోజనాలకన్నా స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దేశ యవనికపై మంచుపొర కప్పేసినట్లు భవిష్యత్ రాజకీయాలు అస్పష్టంగానే ఉన్నాయి. 2013లో ఇదే కాలానికి రాజకీయ వాతావరణం ఎండలో చలికాచుకున్నట్లు వెచ్చగా, అతి స్పష్టంగా కనిపించింది. కొత్త సంవత్సరంలో ఏ పార్టీ కేక్ కట్ చేస్తుందో దాదాపు తేలిపోయింది. ఇప్పడు ఆ సీన్ గల్లంతయింది. అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించిన రాజకీయ నాయకులు అలసిపోయారు. వారి ప్రసంగాలను వినీ వినీ ప్రజలకు బోరుకొట్టింది. నాటి ఎన్నికల వేడిని నేటికీ కొనసాగించేందుకు మీడియా ఒక్కటే పడరాని పాట్లు పడుతోంది. రోజువారి రాజకీయ విశ్లేషనల పేరిట టీఆర్పీ రేట్ల కోసం టీవీ ఛానళ్లు కుస్తీ పడుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలం ఇటీవలి రాజకీయ చరిత్రలో ఉద్రేకపూరిత ఉద్విగ్నమైనదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక ఘర్షణలు, సామాజిక సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గడచిన సంవత్సరం మూక హత్యలు, మూఢ నమ్మకాలు పెరిగాయి. అన్నింటికంటే నకిలీ వార్తల చెలామణి పెద్ద నోట్ల రద్దుకంటే సంచలనం సృష్టించాయి. 2018 సంవత్సరంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే వేడెక్కించాయి. ఆ ఎన్నికలు పాలకపక్ష బీజేపీని దాదాపు మోకాళ్లపై నిలబెట్టాయి. బ్రాహ్మణిజాన్ని వంట పట్టించుకున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఫలితాలను చేపట్టబోయే అధ్యక్ష పదవికి ప్రతిఫలంగా అందించారు. అప్పటినుంచి రాహుల్ గాంధీ ‘వన్ మేన్ మిషన్’ లా రాజకీయ రంగంలో పరుగు మొదలు పెట్టారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదన్న రాజకీయ వాతావరణంలో ‘ఎవరైనా ఫర్వాలేదు, మోదీ తప్ప’ అన్న పరిస్థితిని తీసుకొచ్చారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రధాన మంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు. మరోమారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు తెరపైకి రావచ్చు. కార్యకర్తలే పునాదిగా ఎదిగిన బీజేపీ–ఆరెస్సెస్ల క్రమశిక్షణకు భిన్నంగా ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతున్న నరేంద్రమోదీ పట్ల పాలకపక్షంలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. గతంలో ఊహించినట్లుగా పాలకపక్ష ఎన్డీయే, కాంగ్రెస్ నేతత్వంలో మహా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ అఖండ విజయంతో బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. మహా కూటమికి బదులుగా పలు చిరుకూటములు ఏర్పడవచ్చు. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సమసిపోయిన నేటి రాజకీయాల్లో రాజకీయ శత్రువంటూ లేకుండా పోయారుకనుక ఏమైనా జరగవచ్చు! రాజకీయ వాతావరణం పట్ల స్పష్టత రావాలంటే మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం వాతావరణం గురించి వర్ణించాలంటే బిజినెస్లో చెప్పే ‘వీయూసీఏ’ (అస్పష్టత, అనిశ్చిత, సంక్లిష్టత, సంధిగ్ధత)లా ఉంది. -
‘తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా’
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన మహనీయురాలు సోని యాగాంధీ అని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి కొనియాడారు. ఆదివారం గాంధీభవన్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సోని యాగాంధీకి భారత ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో చైర్పర్సన్గా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి అందించాలనే జాతీయ ఉపాధిహామీ పథకం, ఆకలి చావుల నివారణకు ఆహార భద్రతా చట్టం, ప్రజలకు ప్రభుత్వాల మధ్య పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచారహక్కు చట్టం తీసుకువచ్చారని వివరించారు. సమాజంలోని ప్రతి పేదవారికి చదువు అందించాలని విద్యాహక్కు చట్టాలతో పాటు, మరెన్నో చారిత్రాత్మక చట్టాలను చేయడంలో సోనియాగాంధీ కృషి మరవలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి ,అధికార ప్రతి నిధులు నిరంజన్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. ఏఐసీసీలో సోనియా జన్మదిన వేడుకలు సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 72వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి, యాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు వారు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమె సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియాగాంధీదే కీలక పాత్ర అని పొంగులేటి పేర్కొన్నారు. -
రఫేల్ 'వార్'.. రాజకీయ యుద్ధం!
ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. రఫేల్ ఒప్పందం వివరాలు బయటకు తీసుకురావాలా ? వద్దా అనే అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు బయటకు వస్తే పరిస్థితి ఎలా మారు తుంది ? సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ? ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ వేడిని రగులుస్తోంది? ధర.. దడ దడ రఫేల్ ఒప్పందానికి బీజం 2000 సంవత్సరం వాజ్పేయి హయాంలో పడినప్పటికీ యూపీఏ హయాంలోనే ఒక కొలిక్కి వచ్చింది. 2007లో యూపీఏ ఈ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చివరికి 2011లో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఒక్కో విమానానికి దాదాపుగా రూ.526 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాకుండానే ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. ఆ తర్వాత భారత్లో కూడా ఎన్నికలు జరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం పరుగులు తీసింది. 126కి బదులుగా 36 విమానాల కొనుగోలుకే కేంద్రం ఒప్పందం ఖరారు చేసుకుంది. అయితే ధర విషయంలో గోప్యత పాటించింది. ఈ ఒప్పందం వివరాలు, విమానం ధరల్ని బయటపెడితే శత్రుదేశాలకు ఆయుధాలు, పరికరాల వివరాలు తెలిసిపోయి దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ వాటి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు రూ.12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంది. కానీ 36 విమానాలకే రూ.59 వేల కోట్లు చెల్లించడానికి ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు రూ.1,638 కోట్లు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2016 విదేశీ మారకద్రవ్య మార్పిడి లెక్క ప్రకారం ఒక్కో యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని, అయితే పూర్తిస్థాయి ఆయుధాలు, ఏవియానిక్స్తో కూడిన ధరను వెల్లడిస్తే దేశ భద్రతకే ప్రమాదం అంటూ దాటవేశారు. ఇక పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్కో యుద్ధ విమానం ధర 15.5 కోట్ల యూరో(దాదాపు రూ.1275 కోట్లు)లు ఉండేదని, ఇప్పుడు ఏకంగా 40 శాతం పెరిగిపోయి 27 కోట్ల యూరోలకు (దాదాపు రూ.2,219 కోట్లు) చేరుకుందని వాదించారు. ఇలా ఇరుపక్షాల మ«ధ్య రఫేల్ ధరల యుద్ధం రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది. ఆఫ్సెట్ కంపెనీ చేతులెత్తేస్తే? అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని గట్టెక్కించడానికే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆఫ్సెట్ ఒప్పందానికి అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2008లో రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకే రఫేల్ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అప్పగించాల్సి ఉంది. కానీ మోదీ హయాంలో సీన్ మారింది. ముఖేశ్ ఆర్ఏటీఎల్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. అనిల్ రాత్రికి రాత్రి రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ ఆర్డీఎల్ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను కాదని మరీ ఆర్డీఎల్కు కాంట్రాక్ట్ అప్పగించడమేంటని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి నిలదీస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వాదనల సమయంలో న్యాయమూర్తులు ఈ అంశంపైనే ప్రభుత్వ లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చలేకపోతే, విమానాల తయారీ చేపట్టలేకపోతే ఏం జరుగుతుంది? దేశ ప్రయోజనాల సంగతేంటి? అని న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే ఆఫ్సెట్ కంపెనీని ఒప్పందం నుంచి తప్పించవచ్చని దసో ఏవియేషన్కు జరిమానాలు కూడా విధించవచ్చని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ చేతుల్లో ఏమీ ఉండదా ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిందేనని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం భారత్కు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’కు కుదిరిన ఒప్పందం మాత్రమే. యుద్ధ విమానాల సరఫరాలో ఏమైనా తేడాలొచ్చినా, దసో ఏవియేషన్ యుద్ధ విమానాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోయినా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు వహించదు. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఇవ్వాల్సిన సార్వభౌమ హామీ(సావరీన్ గ్యారంటీ) ఫ్రాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా రక్షణ శాఖ ఏమీ పట్టకుండా ఒప్పందంపై ముందుకు వెళితే న్యాయశాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ సర్కార్ కంఫర్ట్ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇంచుమించుగా సావరీన్ గ్యారంటీతో సమానమని కేంద్రం పేర్కొంటోంది. కానీ భవిష్యత్లో ఇబ్బందులు ఎదురైతే ఆ లేఖకు చట్టబద్ధత ఉండదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అది చెల్లుబాటుకాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ఆత్మరక్షణలో కేంద్రం అదే ఒప్పందం, అవే విమానాలు కానీ యూపీఏ నుంచి ఎన్డీయే హయాం వచ్చేసరికి ఎన్నో తేడాలు. ధర రెట్టింపు అయిందంటూ ఆరోపణలు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను పక్కన పెట్టారంటూ విమర్శలు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే దేశ ప్రయోజనాలను కాలరాశారంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు దీటైన జవాబులివ్వలేక కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కేంద్ర మంత్రులు చేసిన వాదనలన్నీ తప్పుడువేనని ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉండటంతో కేంద్రం ఇరుకున పడిపోతోంది. విమానం ధరలు వెల్లడిస్తామని తొలుత ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మాటమార్చి దేశ ప్రయోజనాల దృష్ట్యా గోప్యత తప్పదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను కాదని, అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిఫెన్స్ను సర్వీసు ప్రొవైడర్లుగా ఎందుకు ఎంపిక చేశారన్నదానికి, అది తమ పరిధిలో లేదని దసో ఏవియేషనే ఆ నిర్ణయం తీసుకుందని కేంద్రం వాదిస్తోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ రిలయెన్స్ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని బహిరంగంగానే చెప్పడంతో బీజేపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. హాల్కి యుద్ధ విమానాలు చేసే సామర్థ్యమే లేదంటూ నిర్మలా సీతారామన్ వాదించడంపై రాజకీయంగా రచ్చ జరిగింది. ఆ తర్వాత హాల్ మాజీ చైర్పర్సన్ సువర్ణ సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలనే తాము తయారు చేశామని ఈ బాధ్యతను అప్పగించినా చేసేవాళ్లమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కేంద్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. దీన్ని ఆయుధంగా చేసుకొని రాహుల్ హాల్ సిబ్బందితో సమావేశమై నైతిక మద్దతుని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఆ తర్వాత కోర్టులో కూడా న్యాయమూర్తుల నుంచి కేంద్రం గట్టి ప్రశ్నల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదన్న విషయంపై కూడా ఇప్పడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద రఫేల్ ఒప్పందం అవకతవకలు కోర్టుకి చేరడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలన్న నిర్ణయం కోర్టు తీసుకుంటే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రఫేల్ యుద్ధంలో కేంద్రంపై పైచేయి సాధించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సమయానికి ఈ ఒప్పందంలో లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి తమకే లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉంది. యూపీఏ డీల్.. 2007 మధ్యతరహా బహుముఖ యుద్ధ విమానాలు(ఎంఎంఆర్సీఏ) కొను గోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆగస్టు 28, 2007 ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల సంస్థ దసో ఏవియేషన్ బిడ్ వేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన మిగ్–35, స్వీడన్సాబ్ జాస్–39 గ్రిపెన్, అమెరికా మార్టిన్ ఎఫ్–16, యూరో ఫైటర్ టైఫూన్ వంటి సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. సెప్టెంబర్ 4, 2008 రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరితే దసో ఏవియేషన్, ఆర్ఏటీఎల్ సంయుక్తంగా యుద్ధ విమానాల తయారీ చేపట్టాలని ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మే 2011 భారత వాయుసేన చేసిన షార్ట్ లిస్ట్లో రఫేల్, యూరోఫైటర్ జెట్స్ నిలిచాయి. జనవరి 2012 బిడ్లను పరిశీలిస్తే దసో ఏవియేషన్ తక్కువ ధరని కోట్ చేసింది. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను అప్పటికప్పుడు పంపడానికి, మిగిలిన వాటిని దసో సహకారంతో హాల్ తయారు చేయాలని అంగీకారానికి వచ్చాయి. మార్చి 13, 2014 రఫేల్ ధరలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దసో–హాల్ మధ్య పని విభజన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఒక అవగాహనకు రాలేకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లుగా చెబుతోంది. ఎన్డీయే డీల్.. మార్చి 28, 2015 అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10, 2015 ప్రధాని నరేంద్ర మోదీ పారిస్కు వెళ్లి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. జూన్ 2015 126 యుద్ధ విమానాల టెండర్లను రక్షణ శాఖ అధికారికంగా వెనక్కి తీసుకుంది. డిసెంబర్, 2015 అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలన్ సహచరి, నటి అయిన జూలీ గయె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. రఫేల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసం క్విడ్ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 2016 ఫ్రాన్స్ అధ్యక్షుడి హోదాలో ఫ్రాన్సిస్ హోలన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఫేల్ ఒప్పందంపై ఇరుపక్షాలు సంత కాలు చేశాయి. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. అక్టోబర్ 3, 2016 అనిల్ అంబానీ ఆర్డీఎల్, దసో ఏవియేషన్ జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్ ఒప్పందం విలువలో 50% పెట్టుబడుల్ని భారత్లో తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. ఫిబ్రవరి 2017 దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఎల్) అన్న పేరుతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు. -
నేను అబద్ధం చెప్పలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం మరో మలుపు తిరిగింది. ఎన్డీయే హయాంలో కుదిరిన ఒప్పందం ‘క్లీన్డీల్’ అని ఫ్రెంచ్ తయారీ కంపెనీ డసో సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. గత యూపీఏతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎరిక్ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయంగా సున్నితమైన ఈ ఒప్పందానికి సంబంధించిన పలు విషయాల్ని ఎరిక్ బహిర్గతం చేశారు. సీఈఓ స్థానంలో ఉన్న తాను కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అబద్ధాలు చెప్పడంలేదని అన్నారు. ఎరిక్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఎరిక్ కట్టుకథలు చెబుతున్నారన్న కాంగ్రెస్.. నిష్పాక్షిక విచారణతోనే నిజాలు బయటికొస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ దుష్ప్రచారం ఎరిక్ వ్యాఖ్యలతో బట్టబయలైందని బీజేపీ తిప్పికొట్టింది. బేరసారాలతో తగ్గిన ధర: ‘ఎన్డీయే కొనే 36 విమానాలు యూపీఏ ఆర్డర్ ఇచ్చిన 18 విమానాలకు రెండు రెట్లు. దీని ప్రకారం ధర కూడా రెట్టింపు కావాలి. అంతర ప్రభుత్వ ఒప్పందం కావడంతో బేర సారాల అనంతరం ధరను 9 శాతం తగ్గించాం. ‘ఫ్లై అవే’ విధానంలో కొనుగోలుచేస్తున్నందున ఎన్డీయే ఒప్పందంలోని 36 విమానాల ధర.. యూపీఏ కుదుర్చుకున్న 126 విమానాల కన్నా తక్కువే’ అని ఎరిక్ తెలిపారు. యూపీఏ ఒప్పందంలో భాగంగా భారత్లో తయారుచేయాల్సిన విమానాలు ఏ రకమైనవి, ధరల మార్పులు తదితరాలను ఆయన వెల్లడించలేదు. రిలయన్స్ ఒక్కటే కాదు.. ఆఫ్సెట్ నిబంధనలు పాటించేందుకు తాము రిలయన్స్ డిఫెన్స్తో పాటు పలు ఇతర సంస్థల్ని కూడా భాగస్వామ్య సంస్థలుగా ఎంచుకున్నామని ఎరిక్ తెలిపారు. ‘ఈ మేరకు మొత్తం 30 కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నాం. ఒప్పందం మేరకు మొత్తం ఆఫ్సెట్ వ్యయంలో 40 శాతాన్ని ఈ కంపెనీలతో కలసి పంచుకుంటాం. అందులో రిలయన్స్ డిఫెన్స్ వాటా 10 శాతమే. మిగిలినదంతా డసో, ఆ కంపెనీల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందంలో భాగం’ అని ఎరిక్ వెల్లడించారు. రిలయన్స్ డిఫెన్స్లో డసో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని, కానీ 50:50 నిష్పత్తిలో రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తాయని తెలిపారు. దీని మొత్తం విలువ రూ.800 కోట్లు ఉండొచ్చన్నారు. యూపీఏ అలా.. ఎన్డీయే ఇలా..: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 126 విమానాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన యూపీఏ.. అందులో 18 విమానాల్ని ‘ఆఫ్ షెల్ఫ్’(అవసరాలతో నిమిత్తం లేకుండా అప్పటికే తయారైనవి) విధానంలో సేకరించడానికి అంగీకరించింది. మిగిలిన వాటిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో స్వదేశంలోనే తయారుచేయించాలని ఒప్పందం చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ ఒప్పం దాన్ని రద్దుచేసి, 36 విమానాల్ని ‘ఫ్లై అవే’(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) షరతుతో కొనుగోలుచేసేందుకు తాజా డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. -
యూపీఏలో చేరుతున్న టీడీపీకి స్వాగతం!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్ముందు కాంగ్రెస్తో అంటకాగుతారని బాహాటంగా వెల్లడైంది. యూపీఏలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని పీటీఐ ఇంటర్వ్యూలో మొయిలీ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలపడం మంచి సంకేతమని, తెలుగుదేశం పార్టీతో మాకు మంచి అవగాహన ఉందని మొయిలీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్తో టీడీపీ పొత్తుకు దిగడంపై తెలుగు రాష్ట్రాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్తో చంద్రబాబు చేతులుకలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీతో తమ పార్టీ పొత్తు భవిష్యత్లోనూ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ బాహాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు పొత్తుకు పాకులాడటం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
రాఫెల్ రగడ..
-
రాఫెల్పై రచ్చ రచ్చ..!
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాఫెల్ రాజుకుంటోంది. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తాజాగా పేల్చిన బాంబుతో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాల్లో విమానాలు తయారు చేసే కంపెనీలకే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, డసో ఏవియేషన్ కంపెనీ ఇష్టం ప్రకారమే భాగస్వామి ఎంపిక ఉంటుందని అంటోంది. అసలు ఏమిటీ ఒప్పందం ? కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణలు, లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్నలేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ? ఇరు పార్టీల మధ్య రాఫెల్ పరిణామాలు ఎందుకు వివాదాన్ని లేవనెత్తాయి ? యూపీఏ హయాంలో ఏం జరిగింది ? 126 మధ్య తరహా రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారత్లో తయారు చేయాలని 2012లో కేంద్రప్రభుత్వం, విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ. 526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్డీయే హయాంలో ఏం జరిగింది ? ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్తో చర్చలు జరిపారు.126కి బదులుగా 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధర విషయంలో మాత్రం గోప్యత పాటించింది. ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే 59 వేల కోట్లకు రాఫెల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో విమానం కొనుగోలుకయ్యే ఖర్చు 1670 కోట్లు. ఇక యుద్ధ విమానాల తయారీకి భారత్ భాగస్వామిగా హెచ్ఏఎల్కు బదులుగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ను సర్వీస్ ప్రొవైడర్లుగా చేర్చింది. హాల్ను తప్పించడం యూపీఏ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను రాఫెల్ యుద్ధ విమానాల తయారీ భాగస్వామిగా నియమిస్తే, దానిని తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తిన అంశం. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసమే హెచ్ఏఎల్ను తప్పించారంటూ దాడికి దిగుతూ వచ్చింది. హాల్కి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం లేనే లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురు దాడి చేశారు. అయితే హెచ్ఏఎల్ మాజీ చైర్ పర్సన్ టి. సువర్ణరాజు యుద్ధ విమానాలు చేసే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సుఖోయ్–30 విమానాలను తాము తయారు చేశామని, డసో ఏవియేషన్ తయారు చేసిన మిగ్–2000 విమానాల నిర్వహణ కూడా తామే చేస్తున్నామంటూ టి.ఎస్ రాజు మీడియా ఇంటర్వూ్యల్లో పేర్కొన్నారు. అయిదేళ్లుగా సాంకేతిక బృందానికి తాను నాయకత్వం వహించానని, రాఫెల్ విమానాలను కూడా తాము తయారు చేయగలిగి ఉండేవాళ్లమని రాజు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని రుజువైందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి పెరిగింది. వివాదం ఎలా ముదిరింది? రాఫెల్ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని, దేశ ప్రయోజనాలు కాలరాస్తూ అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని కాం గ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదట్నుంచీ ఆరో పణలు చేస్తున్నారు. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ? విమానాల తయారీ భాగస్వామిగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)ను ఎందుకు తప్పించారు ? విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ను భాగస్వామిగా చేయాల్సిన అవసరమేంటి ? ఈ మూడు అంశాల చుట్టూ వివాదం తిరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉండటంతో రాజకీయం రంగులు మారుతోంది. రాఫెల్ అంటే.. రెండు ఇంజిన్లు కలిగిన బహుముఖ యుద్ధవిమానాలను ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. రాఫెల్ పేరుతో తయారు చేసే ఈ యుద్ధవిమానాలు అత్యంత సమర్థంగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్, కేంద్రం వాదప్రతివాదాలు జరిగిందిలా.. రాఫెల్ ఒప్పందంపై మొదట్నుంచి ఎన్డీయే ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వస్తోంది. యూపీఏ చర్చించిన దాని కంటే తమ ఒప్పందమే ఉత్తమమైనదని యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు 12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెబుతోంది. ఫ్రాన్స్, భారత్ మధ్య 2008లో కుదిరిన అవగాహన మేరకు ఈ ఒప్పందంలో అంశాలు బయటకు వెల్లడించలేమని అంటోంది. అయితే ఆ ఒప్పందం కుదిరిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న కాంగ్రెస్కు చెందిన ఏకే ఆంటోని బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు వెల్లడి చేయకూడదనే ఉంది తప్ప, ధర కాదని అంటున్నారు. అలాంటప్పుడు రాఫెల్ యుద్ధ విమానం ధరలపై గోప్యత పాటించాల్సిన అవసరమేముందన్నది ఆయన వాదన. యూపీఏ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే ఎన్డీయే ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు వెచ్చిస్తోందని, అందుకే బీజేపీ నోరు మెదపడం లేదన్నది కాంగ్రెస్ వాదన. రిలయన్స్ డిఫెన్స్ చేరడం ఒక వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం దేశ భద్రతనే పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2015, ఏప్రిల్ 10న రాఫెల్ ఒప్పందం కుదిరిందని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే, దానికి సరిగ్గా 12 రోజులు ముందే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటైందన్నది కాంగ్రెస్ ఆరోపణ. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ భారత్కు వచ్చిన సమయంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలన్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. విమానాల తయారీ రంగంలో 70 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హాల్ను కాదని విమాన తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వల్ల దేశ భద్రతే ముప్పులో పడిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణల్నింటినీ తిప్పికొట్టిన కేంద్రం రిలయన్స్ డిఫెన్స్ను సర్వీసు ప్రొవైడర్లుగా తాము ఎంపిక చేయలేదని, డసో ఏవియేషన్ కంపెనీయే ఎంపిక చేసుకుందని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ రిలయన్స్ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వం తమకు సూచించిందని వెల్లడించడంతో కాంగ్రెస్ చేతికి ఒక పెద్ద ఆయుధం దొరికినట్టయింది. కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలకు ఎన్డీయే ప్రభుత్వం సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, ఎన్టీయే మంత్రులు చెబుతున్నదానికి విరుద్ధమైన ప్రకటనలు అవతల పక్షం నుంచి వస్తూ ఉండడంతో రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. -
‘ఈ శతాబ్దపు అతి పెద్ద స్కాం’
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్తో చేసుకున్న రాఫెల్ ఒప్పందం 21వ శతాబ్దపు అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ జాతీయ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో చర్చించకుండా, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా తన ఇష్టానుసారంగా రాఫెల్ డీల్ చేశారని ఆరోపించారు. రాఫెల్ డీల్ గురించి అజాద్ చెప్పిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నోరు మెదపని ప్రధాని ‘దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నిస్తున్నా రాఫెల్ పై సమాదానం లేదు. లోక్సభ, రాజ్యసభలో ఎక్కడైనా నో అన్సర్. గతంలో ఏ ప్రధానియైనా ఆరోపణలు వస్తే వాటిపై స్పందించారు. కానీ తొలిసారి ఈ ప్రధాని మాత్రం నోరు మెదపటం లేదు. హైదరబాద్ నా రెండవ ఇళ్లు. అందుకే ఇక్కడ మీడియాతో రాఫెల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు వివరిస్తున్నా. చైనా బలపడుతోంది, పాకిస్తాన్ మరింత వైరుధ్యం పెంచుకొంటోంది. ఈ రెండు ప్రమాదమే అందుకే యూపీఏ హయాంలో డిఫెన్స్ కౌన్సిల్ ఆయుదాలకొనుగోలు చేయాలని తెలిపింది. అందులో 126 యుద్ద విమానాల అవసరం అని తెలపగా టెండర్లకు 6 కంపెనీలు పాల్గొన్నాయి. 8 రెడీ గా ఉన్నవి, 108 మన దేశంలో తయారుచేసేలా ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం జరిగింది. మేము ఒక్కో విమానానికి 523 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. 108 యుద్ద విమానాలు మన దేశంలో తయారు చేసేలా హిందుస్తాన్ ఏరో నాట్స్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2015 లో మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ మీడియాతో విమానాల కొనుగోళ్లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే తర్వాత తేలిందేంటంటే పాత అగ్రీమెంట్ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అది డిఫెన్స్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇతరులెవరికీ తెలియదు. కేవలం మన ప్రధాని ఫ్రాన్స్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలియదు. మేం 523 కోట్లకు చేసిన డీల్ సేమ్ అదే విమానానికి 1670 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. హిందుస్తాన్ ఏయిర్ క్రాఫ్ట్ తో ఉన్న అగ్రిమెంట్ సైతం రద్దు చేసి మరో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. యూపీఏ హయాంలో లక్ష రూపాయలు అవినీతి జరిగినా పెద్ద అంశమే.. డిఫెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన 127 విమానాల కొనుగోలును అప్పుటి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఎవరినీ సంప్రదించకుండా మోడీ ఎలా వాటిని 36 చాలు అని నిర్ణయిస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం ప్రకటించేంత వరకు దానిపై ప్రధాని సంతకం కూడా జరగలేదు. 36 యుద్దవిమానాలకు అధనంగా 41 వేల కోట్లు చెల్లించారు. 21 వ శతాబ్దంలో ఇది అత్యంత పెద్ద స్కాం. 4060 పైగా విమానాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, హెచ్ఈఎల్ కంపెనీని కాదని కనీసం రిజిస్ట్రేషన్ కూడా జరగని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. టెండర్ దక్కిన తర్వాతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీఏ హయాంలో లక్ష రూపాయాల అవినీతి చాలా పెద్ద అంశం.. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 25 వేల కోట్ల పై కూడా లెక్క లేకుండా పోయింది. వాళ్ల పొట్టలు పెద్దవి అందుకే బాగా తింటున్నారు’అంటూ నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిపై ఆజాద్ నిప్పులు చెరిగారు. -
ఎన్పీఏల పాపం యూపీఏదే..
ముంబై: మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా పేరుకుపోవడానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో విచక్షణారహితంగా రుణాలివ్వడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, ఆ తర్వాత అడ్డగోలుగా రుణాలివ్వడం జరిగిందని, వాటి ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధిక స్థాయిలో జీడీపీ వృద్ధిని చూపించుకుందని ఆయన విమర్శించారు. ‘ప్రతీ సంవత్సరం 28 లేదా 31 శాతం మేర రుణ వృద్ధిని ఆధారంగా చూపించి అధిక జీడీపీ రేటు సాధించామని చెప్పుకున్నారంటే... రాబోయే రోజుల్లో చరిత్ర దాన్ని కచ్చితంగా విచక్షణారహిత రుణాల వృద్ధిగానే పరిగణిస్తుంది. ఇది భవిష్యత్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్డీయే హయాంలో అధిక వృద్ధి గణాంకాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీలకు బ్యాంకర్లు కూడా కారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. లాభసాటి కాని ప్రాజెక్టులకు కూడా యూపీఏ హయాంలో బ్యాంకర్లు రుణాలిచ్చారని, అవి సమస్యాత్మకంగా మారినా కూడా పట్టించుకోకుండా తోడ్పాటు అందించడం కొనసాగించారని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొండిబాకీల రికవరీల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోందన్నారు. -
‘యూపీఏ’ రుణాలవల్లే అధోగతి!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియంత్రణలేని ద్రవ్యలోటు, నిర్లక్ష్యంతో బ్యాంకు రుణాల జారీ వంటివి ఆర్థిక క్షీణతకు దారితీశాయని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే రాజీవ్గాంధీ హయాంలో 10 శాతం వృద్ధి రుణాల వల్లేనని, ఇదే 1990–92 కాలంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దారితీసిందని, రుణ చెల్లింపుల కోసం బంగారం నిల్వలను విదేశాలకు తరలించి గట్టెక్కాల్సి వచ్చిందని వివరించారు. జీడీపీ వృద్ధికి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (ఎన్ఎస్సీ) విడుదల చేసిన గణాంకాలపై కుమార్ స్పందించారు. ఈ గణాంకాల ప్రకారం... మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2006–07లో నమోదైన జీడీపీ వృద్ధి రేటు 10.08 శాతం అన్నది... సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన 1991 తర్వాత అత్యధిక వృద్ధి రేటు. కాగా, కేంద్రంలో మోదీ సర్కారు నాలుగేళ్ల పాలనలో నమోదైన వృద్ధి రేటు అంతకుపూర్వం యూపీఏ సర్కారు చివరి నాలుగేళ్ల పాలనకంటే ఎక్కువే ఉందంటూ రాజీవ్కుమార్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎన్ఎస్సీ 2011–12 బేస్ ఆధారంగా వేసిన జీడీపీ వృద్ధి అంచనాలు అనధికారికమైనవిగా పేర్కొన్నారు. ‘‘అయినప్పటికీ ఈ వాస్తవ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2009–2011, అంతకుముందు సంవత్సరాల్లో అధిక వృద్ధి రేటు అన్నది అదుపులో లేని ద్రవ్యలోటు, వాణిజ్య బ్యాంకుల రుణాల వల్లే. అందుకే అది నిలబడలేదు. ఇదే యూపీఏ–2 సర్కారు చివరి మూడేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి, వృద్ధి అనూహ్యంగా తగ్గిపోయేందుకు కారణాలు’’ అని కుమార్ వివరించారు. 2013 ఏడాది మే–ఆగస్టు మధ్య నాలుగు నెలల్లోనే రూపాయి మారకం 25 శాతం పడిపోయినట్టు గుర్తు చేశారు. స్థిరమైన అధిక, సమ్మిళిత వృద్ధి భవిష్యత్తులో సాకారమయ్యేందుకు మోదీ సర్కారు నాలుగేళ్ల కాలంలో బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. ఇక వాజ్పేయి పాలనలో చేపట్టిన సంస్కరణలతో 2003–04లో వృద్ధి రేటు 8 శాతానికి పెరిగిందని, ఈ చర్యల వల్లే తర్వాతి యూపీఏ కాలంలో వృద్ధి రేటు పెరిగేందుకు దోహదపడినట్టు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ చెప్పారు. బ్యాక్సిరీస్ జీడీపీ గణాంకాలు అధికారికం కాదు: కేంద్రం బ్యాక్ సిరీస్ జీడీపీ గణాంకాలపై వివాదం నేపథ్యంలో అవి అధికారిక గణాంకాలు కాదని కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు విభాగం(ఎమ్వోఎస్పీఐ) పేర్కొంది. అధికారిక గణాంకాలను తర్వాత విడుదల చేయనున్నట్లు తెలిపింది. జీడీపీకి సంబంధించి నేషనల్ స్టాటిస్టిక్ కమిషన్ (ఎన్ఎస్సీ) గణాంకాల ప్రకారం 2006–07లో నమోదైన 10.08% వృద్ధి.. 1991 తర్వాత అధిక వృద్ధి రేటుగా తెలుస్తోంది. దీంతో ఇవి అధికారిక గణాంకాలు కావంటూ ఎమ్వోఎస్పీఐ పేర్కొంది. ఎన్ఎస్సీ సైతం బ్యాక్ కాస్టింగ్ జీడీపీ సిరీస్ విధానానికి సంబంధించి పని కొనసాగుతోందని స్పష్టం చేసింది. -
ఎన్డీయే అభ్యర్థిదే విజయం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా అధికార పక్షం అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ గురువారం సునాయాసంగా విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్కు 101 ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న కురియన్ గత నెల పదవీ విరమణ పొందారు. హరివంశ్ను మోదీ పొగుడుతూ ‘ఇప్పుడంతా హరి/దేవుడి చేతుల్లో ఉంది. ప్రతిపక్ష, విపక్షమనే తేడాలేకుండా ఆయన సభ్యులందరిపై కరుణతో ఉంటారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాజ్యసభ నాయకుడు జైట్లీ, విపక్ష నేత ఆజాద్లు హరివంశ్పై ప్రశంసలు కురిపించారు. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జైట్లీ తొలిసారిగా గురువారమే సభకు వచ్చారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేడీయూ సభ్యుడు రామ్ ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) సభ్యుడు రాందాస్ అథవాలే బలపరిచారు. ఎన్నిక అనంతరం హరివంశ్ సభాధ్యక్షుడి స్థానంలో కాసేపు కూర్చోగా సభ్యులంతా చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హరివంశ్ మాట్లాడుతూ సభా గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాననీ, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీలు తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సభ భోజన విరామం కోసం వాయిదా పడింది. రెండుసార్లు ఓటింగ్ తొలిసారి ఓటింగ్లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఓటింగ్ సమయంలో హరివంశ్కు 122 ఓట్లు, హరిప్రసాద్కు 98 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 222గా తేలింది. అయితే రెండోసారి ఓటింగ్ జరిగాకా మాత్రం హరివంశ్కు 125 ఓట్లు, హరిప్రసాద్కు 101 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో హరివంశ్ గెలుపొందారు. సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 244 కాగా, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన మొత్తం 97 మంది సభ్యులూ హాజరై ఓటు వేశారు. బీజేడీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడంతో హరివంశ్ చాలా సులభంగా గెలుపొందారు. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీల్లో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున 9 మంది, అలాగే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, పీడీపీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడొకరు.. మొత్తం 16 మంది గైర్హాజరై బీజేపీ సునాయాస విజయానికి కారకులయ్యారు. వీరంతా సభకు వచ్చి విపక్ష అభ్యర్థికి ఓటు వేసి ఉంటే కనీసం ఎన్డీయే కూటమి గట్టి పోటీని ఎదుర్కొని ఉండేది. ఈ 16 మంది గైర్హాజరుతో ఓటింగ్ సమయంలో సభలో 228 మంది సభ్యులు మిగిలారు. దీంతో అభ్యర్థి గెలవడానికి 115 ఓట్లు అవసరమయ్యాయి. ఇద్దరు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనలేదు. ఆటగాళ్లకంటే అంపైర్లకే సమస్యలెక్కువ: మోదీ హరివంశ్ ఎన్నిక అనంతరం మోదీ సరదాగా మాట్లాడుతూ ‘ప్రస్తుతం సభలో పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్ల (సభ్యులు) కంటే అంపైర్ల (చైర్మన్, డిప్యూటీ చైర్మన్)కే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా ఉన్నాయి’ అని అన్నారు. ‘హరివంశ్ నాలుగు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు కూడా ముందుకొచ్చింది. కానీ ఆ కొలువును ఆయన తిరస్కరించారు. ఎన్నిక ఫలితం అందరికీ ముందుగానే తెలిసినదైనప్పటికీ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరపాల్సి వచ్చింది. ఫరవాలేదు. కొత్త సభ్యులకు సభలో ఓటు ఎలా వేయాలో తెలిసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నిక సజావుగా సాగినందుకు విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్కు, వెంకయ్యకు, సభ్యులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఎంపీ.. అప్పుడే డిప్యూటీ చైర్మన్ ఎంపీగా తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ ఆ పదవిలో ఉండగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనుండటం గమనార్హం. 62 ఏళ్ల హరివంశ్ తొలినాళ్లలో ప్రభుత్వోద్యోగాన్ని కాదని పాత్రికేయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. బిహార్లోని బల్లియా జిల్లాకు చెందిన హరివంశ్.. ప్రముఖ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ సొంత ప్రాంతానికి చెందిన వారే. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్కు సలహాదారుగానూ కొన్నాళ్లు పనిచేసిన హరివంశ్.. ఆయన పదవి నుంచి దిగిపోయిన అనంతరం మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వెళ్లారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివారు. హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. హిందీలో పలు పుస్తకాలు రాశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. బీజేపీకి కొత్త మిత్రులు! కాంగ్రెస్కు భంగపాటు న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కాంగ్రెస్ మరోసారి భంగపడగా, బీజేపీకి కొత్త మిత్రులు దొరికారు. వాస్తవానికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీలో నిలపాలని అనుకోలేదు. విపక్ష పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టినా తాము మద్దతిస్తామంది. కానీ విపక్ష కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఓడిపోతామని తెలిసినా తమ ఎంపీని నిలబెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్ది. పైపెచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆప్లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్ కోరితే తాము మద్దతిస్తామని ఆప్ స్పష్టం చేసినప్పటికీ, రాహుల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బీజేపీ కొత్తగా టీఆర్ఎస్, బీజేడీల మద్దతు పొందింది. మద్దతు కోసం స్వయంగా మోదీ బీజేడీ అధినేత బిజూ పట్నాయక్కు ఫోన్ చేసి∙ఒప్పించారు. బీజేపీతో భేదాభిప్రాయాలున్నట్లుగా కనిపించిన శివసేన, అకాలీదళ్లు కూడా ఇప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో 10 నెలలు మాత్రమే ఉండగా ఇటీవల ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుండగా, కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకుంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు. -
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
‘ఏపీ ప్రత్యేక హోదాపైనే రాహుల్ తొలి సంతకం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు. యూపీఏతోనే ఏపీ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను సమానంగా వ్యతిరేకిస్తున్నామన్న ఉమెన్ చాందీ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. అయితే పార్టీ అజెండా, పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని విడిచి వెళ్లినవారు తిరిగి వస్తే తప్పక స్వాగతిస్తామని తెలిపారు. -
రైతు రక్షకుడే రాజు
తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ళు నిండి అయిదో సంవత్స రంలో అడుగుపెడుతున్న శుభసందర్భంలో చెప్పుకోదగిన సకారాత్మకమైన పరిణామాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం సాగిన సుదీర్ఘమైన ఉద్యమానికి సమర్థ నాయకత్వం వహించి, అనితరసాధ్యమైన రాజకీయ చాతు ర్యం ప్రదర్శించి, లక్ష్యం సాధించడమే కాకుండా కొత్త రాష్ట్రా నికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పగ్గాలు చేపట్టి చరిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. దీక్షాదక్షతలు, తెలివితేటలు, చొరవతో పాటు అదృష్టం కలిసి రావడంతో ఆయన కత్తికి ఎదురు లేకుండా జైత్రయాత్ర సాగి స్తున్నారు. కాంగ్రెస్తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోరాడి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం, హైదరా బాద్ మునిసిపల్ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం, హైదరాబాద్లో పదేళ్ళు దర్జాగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆదరాబాదరాగా అమరావతి పంపించడం కేసీఆర్ విజయాలలో కొన్ని. ఒక ముఖ్యమంత్రి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను అంచనా వేయడంలో రెండు పద్ధతులు పాటించడం ఆనవా యితీ. ఒకటి, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో ఎన్నింటిని, ఎంత బాగా అమలు చేశారనే ప్రాతిపదికగా పరిశీలించడం. రెండు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేదా ప్రభుత్వాల తీరుతెన్నులతో పోల్చి ఒక ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం స్థానం ఏమిటో నిర్ణయించడం. రైతుపైనే దృష్టి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో ప్రస్తావిం చని అంశాలూ అమలు చేస్తున్నది. ఇటీవల ఎక్కువగా ప్రచా రంలో ఉన్న పథకం రైతుబంధు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్ప టికీ రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టకపోవడం అంద రికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి ఇది జాతీయ సమస్య. అన్నదాతను ఆదుకోవడానికి తగినంత కృషి జరగ లేదన్నది వాస్తవం. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామి నాధన్ కమిషన్ చేసిన సిఫార్సులను కమిషన్ను నియమిం చిన యూపీఏ సర్కార్ పట్టించుకోలేదు. తాము చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీ కూడా అధికారంలోకి వచ్చాక చేయ డం లేదు. రాష్ట్రం నాలుగేళ్ళ సంబురాలు జరుపుకుంటున్న సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచారాంశాలలో ప్రధా నంగా ప్రస్తావించేవి రైతులోకానికి చేసిన వాగ్దానాలే. ప్రతి ఎకరానికి ఖరీఫ్, రబీ పంటలకు నాలుగు వేల రూపాయల వంతున ఏడాదికి రూ. 8 వేలు సాయం అందించే సంక్షేమ కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. అనారోగ్యం వల్ల లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా చెల్లించే విధంగా ప్రతిరైతుకూ బీమా సౌకర్యం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా బాండ్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని అంటున్నారు. 24 గంటల విద్యుచ్ఛక్తి సరఫరా కొన్ని మాసాలుగా అమలు జరుగు తోంది. రైతుకు ఎన్ని వరాలు ప్రసాదించినా సొంత కాళ్ళ పైన నిలబడే పరిస్థితులు కల్పించే వరకూ అతడికి నిజమైన రక్షణ లేదు. ఎన్డీఏ ప్రభుత్వం నిరుడు ఆహారధాన్యాల ఎంఎస్పి ప్రకటించినప్పుడు లెక్కలు సరిగా లేవంటూ స్వామినాధన్ ఆక్షేపించారు. సేద్యానికి పెట్టిన ఖర్చు, వ్యవ సాయక్షేత్రంలో పని చేసిన కుటుంబసభ్యుల వేతనాలు కలిపి మొత్తం ఖర్చుగా లెక్కవేయాలని (ఏ2 ప్లస్ ఎఫ్ఎల్– ఫ్యామిలీ లేబర్) ఒక సూత్రం చెబుతున్నది. ఈ ఖర్చులకు భూమి కౌలు కింద చెల్లించే మొత్తం కూడా కలపాలని (కాంప్రెహెన్సీవ్ మెజర్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్–సీ2) మరో సూత్రం చెబుతుంది. ఆ విధంగా లెక్కకట్టి దానిపైన 50 శాతం లాభం వేసి ఎంఎస్పి నిర్ణయించాలని సిఫార్సు. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సూత్రాన్ని పరిగణనలోకి తీసు కొని మద్దతు ధర నిర్ణయించడంతో రైతులకు గిట్టుబాటు కాలేదు. కేంద్రం మద్దతు ధర నిర్ణయించిన వెంటనే ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు. రైతుల నుంచి ఎంఎస్పి కంటే తక్కువ ధరకు దళారులు కొన్న తర్వాత ఎంఎస్పి చెల్లించి వారి నుంచి ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన సందర్భాలు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి. మార్కెట్లో రైతుకు దగా జరగకుండా ప్రభుత్వం నిరోధించాలి. అదే విధంగా ఎకరానికి నాలుగు వేల రూపా యల సాయంపైన కూడా విమర్శలు ఉన్నాయి. నాలుగైదు ఎకరాల లోపు కమతం ఉన్న రైతు తన పొలం తాను దున్ను కుంటే ఎకరానికి నాలుగు వేలు కాదు పది వేలు ఇచ్చినా నష్టం లేదు. ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటూ హైదరా బాద్లో నివసిస్తున్న భూముల యజమానులకు రైతుబంధు పథకం అనవసరం. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్రెడ్డికి దాదాపు రెండు లక్షల సాయం ఎందుకు? ఆయన చెక్కు వాపసు చేశారు. అది వేరే విషయం. ఆ విధంగా ఎంత మంది చేస్తారు? హైదరాబాద్లో ఉంటున్నవారి భూము లను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న కౌలురైతుకు సాయం చేస్తే అర్థవంతంగా ఉండేది. కౌలు రైతులే శక్తికి మించిన పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. యజమాను లకు కౌలు మొత్తం చెల్లిస్తున్నారు. బ్యాంకు రుణం సదు పాయం లేక ప్రైవేటు వడ్డీవ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. అప్పులపాలవుతున్నారు. కౌలు రైతు ఇంటికి వడ్డీవ్యాపారి వెళ్ళి భార్యాపిల్లల ఎదుట అనరాని మాటలంటే అవమానభారంతో పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులే అధికం. వారిని ఆదుకోవడానికి ఏదైనా పథకం ఆలోచిస్తే కేసీఆర్ చరితార్థుడయ్యేవారు. వ్యవసాయ సంక్షో భానికి దేశంలో ఎవ్వరూ పరిష్కారం కనుక్కోలేకపోతు న్నారు. భూమి రికార్డులు సరి చేయించడం, రైతులకు పాస్ పుస్తకాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలు స్వాగతించవల సినవే. రైతుల బతుకులు పూర్తిగా బాగుపడాలంటే స్వామి నాధన్ కమిషన్ సిఫార్సులలో ఏ పంట పండించే రైతుకు ఏ సూత్రం లాభదాయకమో దానిని నిజాయితీగా అమలు చేయాలి. సేద్యం విషయంలో వ్యవసాయ విస్తరణాధికా రులు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే విధంగా నియం త్రించి, మార్కెట్ వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించి, పంటకు లాభసాటి ధర లభించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. వ్యవసాయ రంగం క్రమంగా శక్తి పుంజుకుంటుంది. ఆ పని కేసీఆర్ చేయగలిగితే ఆయన దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. సంక్షేమరాజ్యం రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదా యంలో 20 శాతం వృద్ధి ఉంది. జీఎస్టీ ద్వారా కేంద్రం నుంచి అందే మొత్తం కూడా క్రమంగా పెరుగుతోంది. ఐటీ, ఇతర సేవారంగంలోని వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. అందుకే సాలీనా సంక్షేమంపైన రూ. 40 వేల కోట్లు, నీటిపారుదల రంగంపైన రూ. 37 వేల కోట్లు ప్రభు త్వం ఖర్చు చేయగలుగుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజె క్టులను ప్రారంభించడం అభినందనీయం. ఉద్యమ ఆకాం క్షలు నెరవేరడానికి తోడ్పతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం లోనే అత్యంత క్లిష్టమైనది. ఒకానొక ఇంజనీరింగ్ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుపైన చూపెడుతున్న శ్రద్ధ అవిభక్త మహ బూబ్నగర్ జిల్లాలో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన పెట్టడంలేదనే విమర్శ ఉంది. తెలంగాణ ప్రాంతం, ప్రజలు, కులాలు, వృత్తుల వంటి సమస్త అంశాలూ కేసీఆర్కు క్షుణ్ణంగా తెలుసు కనుక వివిధ వృత్తులవారికి సాయం చేసే పలు పథకాలు చేపట్టారు. సంక్షేమరంగంలో చాలా పథ కాలు అమలు చేస్తున్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్ పరుష పదజాలంతో బెదిరిపోయిన సీమాంధ్ర సంతతివారి భయాలు ఈ నాలుగేళ్ళలో తొలగిపోయాయి. అది మంచి పరిణామం. ఇందుకు కూడా కేసీఆర్నే అభినందించాలి. ప్రశంసించవలసిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ విమ ర్శించవలసిన విధానాలు సైతం లేకపోలేదు. ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపడం ఊహించని పరిణామం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ఎత్తివేయడం అప్రజాస్వామికం. శాసనసభలో మెజారిటీ ఉన్నా విపక్షంనుంచి ఫిరాయింపు లను ప్రోత్సహించడం ఆక్షేపణీయం. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకు బేడీలు వేయడం తప్పు. పోయిన బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్కి శాసనసభ్యులందరినీ సస్పెండ్ చేయడం కఠినమైన చర్య. సచివాలయానికి వెళ్ళకుండా ప్రగతిభవన్ నుంచే పరిపాలన సాగించడం ఎందుకో ప్రజ లకు అర్థం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసు కున్నది. శాంతిభద్రతలు మెరుగుపడినాయి. కానీ కొన్ని నేరాలపైన దర్యాప్తు సాగుతున్నదో, ఆగిపోయిందో, ఆగి పోతే ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నయీం కేసు ఏమైందో, కోట్లకు ఓటు కేసులో దర్యాప్తు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో, భూకుం భకోణాలపైన గట్టిచర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రలు చేస్తు న్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ నెలకొల్పారు. వారికి లభిస్తున్న స్పందన టీఆర్ఎస్కు ఆందోళన కలిగిస్తున్న దాఖలా లేదు. టీఆర్ఎస్ అధినేత, ఇతర నాయకులు 2019లో తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. ప్రజల మనస్సులో ఏమున్నదో తెలుసుకోవడం అంత తేలిక కాదు. 2004లో ‘ఇండియాషైనింగ్’ (భారత్ వెలుగుతోంది) ఇతి వృత్తంగా సాగిన ప్రచారార్భటి కారణంగా వాజపేయి నాయ కత్వంలోని ఎన్డీఏ గెలవడం తథ్యమని చాలామంది భావిం చాం. కానీ కాంగ్రెస్ గెలిచి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. దక్షిణాది అధ్వానం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే కేసీఆర్ తానే దేశంలో నంబర్ ఒన్ సీఎం అని చెప్పుకుంటే ఆక్షేపిం చనక్కరలేదు. ముఖ్యంగా దక్షిణాదిలో పరిస్థితి అధ్వానం. తమిళనాడులో జయలలిత మరణం అనంతరం రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో బాబు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. నాలుగేళ్ళలో చేసింది చూపించడానికి ఒక్కటీ లేదు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఇప్పుడే కుదుటపడుతున్నాయి. ఐటీ రంగం నుంచి తెలంగాణ కంటే చాలా అధికంగా కర్ణాటకకు ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమరంగంలో తెలంగాణ (తల సరి) ఖర్చు చేసినంతగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగానే ఉంది. రాష్ట్రంలో రథం ఒడి దుడుకులు లేకుండా నడుస్తున్న కారణంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలనే ఉబ లాటంతో పావులు కదుపుతున్నారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాణం ఎంత వరకూ ఎటువైపు సాగుతుందో స్పష్టత లేదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి కనుక 1996–98 నాటి అనిశ్చిత పరిస్థితులలో నేషనల్ ఫ్రంట్ సమన్వయకర్తగా చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పగలిగారు. 2004లో, 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీలను వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రసాదించగలిగారు. ఆంధ్రప్రదేశ్లో 25, తెలం గాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు ముఖ్యమంత్రులకు మునుపటి ఆదరణ లభించడం కష్టం. 80 స్థానాలు కలిగిన యూపీలో అఖిలేశ్, మాయావతి, 42 సీట్లున్న పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ మర్యాదగా మాట్లాడుతారు కానీ వారు అంతిమంగా ఇచ్చే గౌరవం సంఖ్యాబలానికి తగ్గట్టే ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ల ప్రమేయం లేకుండా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై అంతగా మాట్లాడిన దేవెగౌడ చివరికి కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేశారు. ఉద్యమకాలంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిన కేసీఆర్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ కలవకుండా, తనకు అవస రమైనవారితో మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకుం టున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు సైతం ముఖ్యమంత్రిని కలవలేకపోవడం, మనసు విప్పి మాట్లాడలేకపోవడం మంచి వాతావరణం కాదు. వైఖరి మార్చుకుంటే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. పూర్తి అవగాహనతో నిర్ణయాలు చేయడం వల్ల కేసీఆర్కీ, తెలంగాణ ప్రజలకూ మేలు జరుగుతుంది. - కె. రామచంద్రమూర్తి -
కాంగ్రెస్కు వత్తాసు పలకడానికే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడానికే సీపీఎం మహాసభలు పెట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన సీపీఎంకు కాంగ్రెస్ అవినీతికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. యూపీఏ హయంలో 11లక్షల కోట్ల కుంభకోణాల చోటుచేసుకున్నాయని విమర్శించారు. పేదల పక్షాన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమని సీపీఎం పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్తో సీపీఎం లోపాయికారి ఒప్పందం పెట్టుకోవాలని సభలో రాజకీయ తీర్మానం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. సీపీఎం మహాసభలో కార్మికుల, పేదల గురించి అసలు చర్చే లేదని విమర్శించారు. మతోన్మాద మజ్లిస్, ముస్లింలీగ్తో పొత్తుపెట్టుకున్న సీపీఎం లౌకికవాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. -
‘అధిష్టానానికి చంద్రబాబుతో జాగ్రత్త అని చెప్పాం’
సాక్షి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాదని, జాగ్రతగా ఉండాలని అధిష్టానాన్ని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జతకట్టే ప్రసక్తే లేదని వట్టి వసంతకుమార్ స్పష్టం చేశారు. పోలవరం, పట్టిసీమతో పాటు ఇతర పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్లీనరీలోనే తొలిసారిగా తీర్మానించామని తెలిపారు. -
కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ
అవలోకనం ఎందుకనో మన మార్కెట్ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి. ‘హంగ్ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్ మార్కెట్ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్ బడ్జెట్’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు. ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్ నైనన్ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్ హయాంలో సాధించిన పర్సంటైల్ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3. నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్సభ అమరికతో దీనికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్ విశ్లేషకులు, బిజి నెస్ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
యూపీఏ, ఎన్డీఏ తప్ప ఏ ఫ్రంట్ నిలవదు
మిర్యాలగూడ: దేశంలో యూపీఏ, ఎన్డీఏ కూటములు తప్ప ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా నిలవదని సీఎల్పీనేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా యూపీఏ లేదా ఎన్డీఏ కూటమిలో ఉండాల్సిందేనని, ఇది కాదని కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కాలక్రమంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని తెలిపారు. గెలవటానికి సరిపడా ఓట్లు లేవని తెలిసినా పోటీలో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉందని, రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేస్తే సుప్రీంకోర్టులో ఆధారాలతో కేసు వేయవచ్చునని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్లో ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగునీరివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. -
‘యూపీఏ హయాంలోనే బ్యాంకుల పతనం’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్ల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పతనానికి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. యూపీఏ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా రుణాలు జారీచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖలను మార్చారని చెప్పుకొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీరునూ ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ జోక్యంతో బ్యాంకింగ్ వ్యవస్థ అప్పట్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే నీరవ్ మోదీ కుంభకోణం వంటి బ్యాంకింగ్ స్కామ్లు చోటుచేసుకున్నాయన్నారు. యూపీఏ చేపట్టిన బంగారు దిగుమతుల పథకం లోపభూయిష్టంగా తయారై గీతాంజలి సహా ఏడు ప్రయివేటు జ్యూవెలరీ కంపెనీలకు మేలు చేసిందని అప్పటి ఆర్థిక మంత్రి పీ . చిదంబరం తీరును ఆక్షేపించారు. బ్యాంకు రికార్డుల్లో సరైన సమాచారం నిక్షిప్తం చేసేందుకు యూపీఏ అనుమతించలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో రుణాలు పెద్ద ఎత్తున జారీ చేసినా వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదని అన్నారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన 80:20 స్కీమ్లో లాభపడిందెవరో కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గీతాంజలి ఇతర కంపెనీల తరపున లాబీయింగ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. రాహుల్ ఇటలీ నుంచి తిరిగివచ్చాక తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. -
నీరవ్తో రాహుల్, సింఘ్వీలకు సంబంధాలు!
న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ అండ్ కో విదేశాలకు చెక్కేయగా.. మరోవైపు ఈ పాపానికి బాధ్యులు మీరంటే మీరంటూ బీజేపీ, కాంగ్రెస్లు పరస్పర విమర్శల్లో మునిగితేలాయి. ఈ కుంభకోణం యూపీఏ హయాంలోనే జరిగిందని, అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించగా.. దేశానికి కాపలాదారుగా ఉన్న మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదను దోచుకుని దొంగలు పరారవుతున్నారని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. మరోవైపు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దేశ వ్యాప్తంగా సోదాలు కొనసాగించి రూ. 25 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,674 కోట్ల ఆస్తులు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. నీరవ్ను పట్టుకుని తీరుతాం: సీతారామన్ నీరవ్ మోదీ కేసులో కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను శనివారం బీజేపీ రంగంలోకి దింపింది. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎన్డీయే హయాంలో బయటకొస్తుంటే.. మోదీ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోవచ్చు. అయితే అతనిపై ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. నీరవ్ను పట్టుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. అసలు పాపమంతా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై.. రెట్టింపుగా విస్తరించిందని సీతారామన్ ఆరోపించారు. మోసగాళ్లు దేశం వదిలి పారిపోయేందుకు కుట్ర చేయకుండా.. వారిని పట్టుకుంటున్నామని చెప్పారు. ఎన్డీఏ హయాంలో ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారు కదా! అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పారిపోయారు అంటే వారిని మేం పట్టుకోబోమని అర్థం కాదు. వారిపై చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. తప్పకుండా పట్టుకుని తీరుతాం’ అని చెప్పారు. నీరవ్ మోదీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారని సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య డైరెక్టర్గా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్కు చెందిన ఆస్తిని.. నీరవ్ నడుపుతున్న ‘ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్’ లీజుకు తీసుకుందని ఆమె తెలిపారు. గీతాంజలి జెమ్స్ ఆర్థిక వ్యవహారాలపై 2013లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అలహాబాద్ బ్యాంకు ప్రభుత్వ డైరెక్టర్ను రాజీనామా చేయాలని కోరారని, అతని అభ్యంతరాల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. 2017లోనే కుంభకోణం: కపిల్ సిబల్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణానికి బీజేపీదే బాధ్యతని, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థీకృతం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రధాని, ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు నాశనం చేశారని, మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదతో దొంగలు పారిపోతున్నారని విమర్శించారు. సీబీఐ రెండో ఎఫ్ఐఆర్లో నిందితుడికి జారీ చేసిన అన్ని ‘లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్(ఎల్వోయూ)’లపై 2017లోనే సంతకం చేసినట్లు ఉందని, కుంభకోణాన్ని అడ్డుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీరవ్, చోక్సీలతో తమ కుటుంబానికి సంబంధాలపై బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తోసిపుచ్చారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్కి చెందిన కమలా మిల్స్ను నీరవ్ కంపెనీ లీజుకు తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీతారామన్, ఆమె సహచరులపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తానని సింఘ్వీ హెచ్చరించారు. ‘అంతా నోట్ల రద్దు వల్లే’ ప్రధానిపై రాహుల్ ఆరోపణలు కొనసాగించారు. ‘నీరవ్ కేసులో ఏం జరిగిందో ప్రధాని చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి’ అని రాహుల్ అన్నారు. నీరవ్తో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయన్న బీజేపీ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. ‘నోట్ల రద్దుతో ఇదంతా మొదలైంది. ప్రజాధనాన్ని సేకరించి మోదీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టారు. నీరవ్ రూ. 20 వేల కోట్ల ప్రజాధనంతో దేశం నుంచి పరారయ్యారు’ అని విమర్శించారు. 21చోట్ల సోదాలు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) అధికారుల్ని సీబీఐ అరెస్టు చేసింది. రిటైర్డ్ డిప్యూటీ మేనేజరు గోకుల్ నాథ్ శెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్తో పాటు నీరవ్ తరఫున హామీదారుగా ఉన్న హేమంత్ భట్ను అదుపులోకి తీసుకుంది. వీరిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో మరింత మంది పీఎన్బీ అధికారుల ప్రమేయం ఉండవచ్చని సీబీఐ కోర్టుకు తెలిపింది. రూ. 280 కోట్ల మోసం జరిగిందని, ఇది రూ. 6 వేల కోట్ల వరకూ ఉండవచ్చని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ శనివారం గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీ, ఇతరులకు చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని అటాచ్ చేసింది. ‘పీఎంఓతో కలిసి పనిచేస్తున్నాం’ ఈ కుంభకోణాన్ని పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంతో కలిసి పనిచేస్తున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. పీఎంఓ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆర్థిక శాఖ అమలు చేస్తుంది’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శుక్లా తెలిపారు. పీఎన్బీ కేసులో తమ బ్యాంకు వాటా రూ. 2,636 కోట్లు ఉందని యూకో బ్యాంకు తెలిపింది. పీఎన్బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ల ఆధారంగా హాంకాంగ్ బ్రాంచీ ఆ మేర రుణాలిచ్చిందని స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలిపింది. నీరవ్కు ద్వంద్వ పౌరసత్వం! నీరవ్ మోదీ పాస్పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసినా.. అతనికి ద్వంద్వ పౌరసత్వాలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నీరవ్, అతని సోదరుడు నిశాల్లు బెల్జియంలో పుట్టి పెరిగారు. నిఘా వర్గాల కథనం మేరకు నీరవ్ భారతదేశ పాస్పోర్టును వదులుకుని బెల్జియం పాస్పోర్టును సంపాదించినట్లు తెలుస్తోంది. నీరవ్ మాత్రం తాను భారతీయ పౌరుడినేనని గతంలో పేర్కొన్నాడు. గుజరాత్కు చెందిన అతను ఫైర్స్టార్ డైమండ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూలులో చేరి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2015లో న్యూయార్క్లో నీరవ్ స్టోర్ను ప్రారంభించారు. -
విభేదాలు పక్కనపెడదాం..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో గురువారం ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహ రచన, ఐక్యత సాధించడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాదిరిగా 17 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తాజా భేటీ జరిగింది. బీఎస్పీ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. విభేదాలు పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం ఐకమత్యంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. పార్లమెంట్ లోపలా, బయటా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహం అనుసరించాలన్నారు. పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ జాతీయ ప్రయోజనాలకొచ్చే సరికి మాత్రం ఒకే వైఖరి అవలంబించాలన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు. భేటీ ముగిసిన తరువాత కాంగ్రె స్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఏడు పార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటు... ట్రిపుల్ తలాక్ బిల్లు, సుప్రీంకోర్టు అంతర్గత సంక్షోభం, ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన మత ఘర్షణలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏడు పార్టీలకు చెందిన నాయకులతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం కొనసాగేందుకు ఈ కమిటీ కృషిచేస్తుంది. సమావేశానికి హాజరైన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ తరఫున జయ్ ప్రకాశ్ నారాయణ్ యాదవ్, తృణమూల్ నాయకుడు డెరెక్ ఒబ్రియాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఎస్పీ నాయకుడు రామ్గోపాల్ తదితరులు ఉన్నారు. -
మోదీ హయాంలో తగ్గిన ఉగ్రవాద చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టాయి. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంతో పోలిస్తే.. మోదీ పాలనలో భారీ స్థాయిలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే విషయాన్ని గణాంకాలు కూడా నిరూపిస్తున్నాయి. మన్మోహన్ హయాంలోని 2010 నుంచి 2013 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్లో మొత్తం 1218 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. అదే మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2017 మధ్యకాలంలో 1094 ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ భద్రతా బలగాలు.. 580 మంది ఉగ్రవాదును హతమార్చాయి. అదే మన్మోహన్ హాయంలో చివరి నాలుగేళ్లలో 471 మంది టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాద ఘటనల్లో కశ్మీరీ పౌరుల మృతుల సంఖ్య కూడా యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పాలనలోనే తక్కువగా నమోదయ్యాయి. యూపీఏ చివరి నాలుగేళ్లలో వంద మంది పౌరులు మృతి చెందారు. ఇదే ఎన్డీఏ పాలనలో 92 మంది చనిపోయారు. -
పెద్దల సభలో బీజేపీ హవా
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాది భారతీయ జనతాపార్టీకి కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తొలిసారి పెద్దలసభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య ఈ ఏడాది 67కు చేరనుంది. ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే.. ఈ బలం 98కి చేరుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి రాజ్యసభను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారి దిగువ స్థానంలోకి రానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రాష్ట్రాలనుంచి ఈ ఏడాది బీజేపీ భారీగా పెద్దల సభకు సభ్యులను పంపనుంది. పతనం దిశగా కాంగ్రెస్ గత మూడేళ్లుగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. అయితే తాజాగా గుజరాత్లో తన సంఖ్యా బలం పెంచుకోవడం కాంగ్రెస్కు ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ 5 రాజ్యసభ సీట్లను కోల్పోనుంది. ఇతర పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం రీత్యా లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు మరో రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మరో ఇద్దరిని పెద్దల సభకు పంపనుంది. దీంతో టీఆర్ఎస్ మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఐదుకు చేరనుంది. ఇక సమాజ్ వాదీ పార్టీ ఐదు స్థానాలను బీజేపీకి అప్పగించనుంది. -
‘సోనియా రాజకీయాల్లో కొనసాగుతారు’
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రిటైర్మెంట్పై వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నారని.. రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల్ ట్విటర్లో తెలిపారు. ‘‘సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్ అవుతున్నారు. రాజకీయాలనుంచి కాదని’’ ఆయన ట్వీట్ చేశారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు. శీతాకాల సమావేశాలకు హాజరయిన సోనియా గాంధీ తిరిగి వెళుతూ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ‘నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటాను’ అని ప్రకటించారు. అంతేకాక మూడేళ్లేగా రాహుల్ గాంధీ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. Would sincerely request friends in the media to not rely upon innuendos. Smt. Sonia Gandhi has retired as President of Indian National Congress and not from politics. Her blessings, wisdom and innate commitment to Congress ideology shall always be our guiding light. — Randeep S Surjewala (@rssurjewala) December 15, 2017 -
రాహుల్ గాంధీకి ధనోవా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అక్రమాలపై మాటలయుద్ధం పతాక స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర ధనోవా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. యూపీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకన్నా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని ఆయన అన్నారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనాలు కల్పించారని రాహుల్గాంధీ గురువారం నాడు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదని ధనోవా పేర్కొన్నారు. అంతేకాక యూపీఏ హయాంలో తీసుకున్న మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఎంఆర్సీఏ) కొనుగోలు ఒప్పందాలకన్నా.. ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ధనోవా స్పష్టం చేశారు. -
రామ్నాథ్ కోవింద్ ఘన విజయం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్నాథ్ కోవింద్కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్పై ఘన విజయం సాధించారు. కోవింద్కు 65.65, మీరాకుమార్కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్నాథ్కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కోవింద్ ప్రొఫెల్... వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్ 1945 అక్టోబర్ ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్లో జన్మించారు. కామర్స్లో డిగ్రీ పూర్తిచేసి... కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్ సర్వీసెస్కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్ రాకపోవడంతో... న్యాయవాదిగా స్థిరపడిపోయారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్గా పనిచేశారు రామ్నాథ్ కోవింద్. రెండుచోట్లా కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్గా సేవలందించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్ పరివార్లో చేరారు రామ్నాథ్ కోవింద్. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్లోని తన పాత ఇంటిని ఆర్ఎస్ఎస్కే రాసిచ్చారు. 1991లో బీజేపీలో చేరిన కోవింద్... బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి ఎగువసభకు ఎంపికైన కోవింద్... రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందంచారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ ఎంపీగా... పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా, ఒక కమిటీకి ఛైర్మన్గానూ పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహించి.. 2002లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు. 2015 ఆగస్టు 16న బీహార్ గవర్నర్గా నియమితలైన కోవింద్... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు. రామ్నాథ్ కోవింద్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఏపీలో ఓట్లన్నీ కోవింద్కే, ఆధిక్యమెంత!?
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్లో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరౌండ్లో అరుణాచల్ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ పూర్తయింది. రామ్నాథ్కు 4,79,585, మీరాకుమార్కు 2,04,594 ఓట్లు విలువ రాగా, ఏపీలో మాత్రం రామ్నాథ్కే ఓట్లన్నీ పోలయ్యాయి. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. ఎన్టీయేకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కోవింద్ సునాయసంగా రాష్ట్రపతి కాబోతున్నారని తెలుస్తోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్. ఈ పోలింగ్లో ఎన్డీయే అభ్యర్థి కోవింద్కు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. కోవింద్కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం, అనూహ్యం జరిగితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ విజయం సాధించవచ్చునని అంటున్నారు. -
లెక్కింపు షురూ: కోవింద్ ఆధిక్యమెంత!?
-
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే
-
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 11 గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి, లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. తొలుత పార్లమెంటు హౌస్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. -
మీరా కుమారే ప్రధాన మంత్రి అయితే...
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టిన దళిత విద్యావేత్త రామ్నాథ్ కోవింద్కు ఎక్కువ శాతం ఓట్లు ఉండడమే అందుకు కారణం. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ నేటిలాగే ఏకమై మీరా కుమారినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడది అసంబద్ధంగాను, అర్థరహితంగాను, నైరూప్య చిత్రంగాను అనిపించవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్కు మద్దతుగా కాంగ్రెస్ నాయకత్వంలో 17 పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రతపక్షం తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆది నుంచి కాంగ్రెస్ వెంటబడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలకపక్షంవైపు మొగ్గుచూపారు. ముందుగానే మీరా కుమార్ పేరును ప్రతిపాదించి ఉన్నట్లయితే నితీష్ కుమార్ ప్రతిపక్షం వెంట వచ్చేవారే. తొందరపడి ఆయన బీహార్ గవర్నర్గా ఉన్న వ్యక్తి, అందులోనూ దళితుడన్న భావంతో కోవింద్కు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకునే రకం కాదుకనుక ఆయన తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వద్ధి రేటు 7.8 నుంచి 6.1 శాతానికి పడిపోవడం, గోవధ నిషేధం తదితర పరిణామాలు పాలకపక్షానికి దళితులను, ముస్లింలను దూరం చేశాయి. ఈ రెండు వర్గాలే కలసి ఉత్తరప్రదేశ్ జనాభాలో 34 శాతం మంది ఉన్నారు. యూపీలో దళితులంతా ఒక్క మాయావతి వెనకాలే కాకుండా వివిధ గ్రూపుల కింద ఏకమవుతున్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిచ్చిన మహారాష్ట్రకు చెందిన మహర్లు గోవధ నిషేధం కారణంగా బౌద్ధ మతంలోకి మారిపోయారు. జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా గుజరాతీలోని మార్వీడీలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంతకాలం మోదీకి హారతులు పట్టిన వారే. కానీ జీఎస్టీ తమ తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యతా రాగం వినిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ఎన్డీయేను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాల వ్యూహం. ఈ వ్యూహం నెరవేరాలంటే మోదీ లాంటి నాయకుడిని ఢీకొనే సమర్థుడైన నాయకత్వం కావాలి. నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ నాయకుడిగా తాను ప్రతిపక్షంలో ఎదగాలన్న ఆలోచనతోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టాలని పోరారు. ఇప్పుడు ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలేవీ గుర్తించడం లేవు. అలా ఎదుగుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్గా, విదేశీ దౌత్యవేత్తగా సమర్థంగా విధులు నిర్వహించిన రాజకీయానుభవమే కాకుండా మీరా కుమార్కు ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. పైగా దళిత నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే కనుక ఆ పార్టీనే మీరా కుమార్ను బరిలోకి దించితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ‘గాంధీ–నెహ్రూ’ వారసత్వ పాలనను పక్కన పెట్టాల్సిందే. 1991లో అలా చేయడం వల్లనే పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాగలిగారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పుత్రరత్నాన్ని పక్కన పెడితే మరింత బలంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోదఫా ఎన్నికల్లో పుత్ర రత్నానికి పట్టాభిషేకం చేసే అవకాశం రావచ్చు. ప్రస్తుతానికి బంతి సోనియా గాంధీ చేతుల్లోనే ఉంది. ––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
పావురం ఛాతి ఉంటే అన్ఫిట్...
న్యూఢిల్లీ: భారత దేశంలో 1914 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ పదవికి అర్హులు కావాలంటే తళతళలాడే తెల్లటి పలు వరుస ఉండాలి. అందుకు క్రమం తప్పకుండా బ్రెష్ చేసుకునే అలవాటు ఉండాలి. ముందుకు ఎముక పొడుచుకు వచ్చినట్లుగా పావురం ఛాతి లాంటి ఛాతి ఉండకూడదు. మోకాళ్లు తగిలేలా తాకుడు కాళ్లు ఉండరాదు. బల్లబరుపు పాదాలు ఉండకూడదు. పాదం బొటనవేలు కిందక వంగి ఉండరాదు. 1878 నాటి భారత ఖజానా చట్టం ప్రకారం పది రూపాయలకంటే ఖరీదైనా ఏ వస్తువు ఏ వ్యక్తి కలిగి ఉన్నా దానికి రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి. అలా లేకపోతే ఏడాది జైలు శిక్ష తప్పదు. 1934 ఎయిర్క్రాఫ్ట్ చట్టం ప్రకారం విమానాలతోపాటు గాల్లో పతంగులు ఎగరేసేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజల ఇళ్లపైకి, పొలాలపైకి ఎలాంటి కరపత్రాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల పోలీసుల బాధ్యత. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ప్రచారోద్యమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిబంధన. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ వలసపోయిన ప్రజలకు ఎప్పుడైనా బెంగాల్, అస్సాం, పంజాబ్ కోర్టులను ఉపయోగించుకునే హక్కు ఉంది. గంగా నదిలో ఒక ఒడ్డు నుంచి రెండో ఒడ్డుకు ప్రయాణికులను తీసుకెళ్లే పడవలు రెండు అణాలకు మించి టోల్ టాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అణాలే లేవు. 21 ఏళ్లలోపు యువకులు చదవకూడని లేదా హానికరమైన విషయాన్ని ప్రచురించరాదని 1956 నాటి యువకుల హానికర ప్రచురుణ చట్టం తెలియజేస్తోంది. అప్రదిష్టకరమైన ప్రదర్శనలను నిషేధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని 1876 నాటి డ్రామటిక్ పర్ఫార్మెన్స్ చట్టం తెలియజేస్తోంది. భారత కోర్టులిచ్చే ఏ తీర్పునైనా సమీక్షించే అధికారం బ్రిటిష్ రాణికి ఉంది. ఎప్పుడో కాలంతీరి పోయిన ఇలాంటి చట్టాల్లో 1200 చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రద్దు చేసింది. మరో 1824 చట్టాలను రద్దు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే కాలంతీరి పోయిన చట్టాలను గుర్తించి వాటిని రద్దు చేయడానికి తన కార్యాలయంలోని కార్యదర్శి ఆర్. రామానుజం అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే లక్ష్యంతో 1998లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కాలం తీరిపోయిన చట్టాలను గుర్తించింది. అయితే వాటిని రద్దు చేసే ప్రక్రియ కొనసాగలేదు. ఇప్పటి రామానుజం కమిటీ కూడా అప్పటి కమిటీ సమీక్షలను పునర్ సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాలంతీరి పోయిన 1200 చట్టాలను రద్దు చేయగా, ఇప్పటి ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే ఏకంగా 1300 చట్టాలను రద్దు చేసింది. దీనికి రాజ్యసభబో మెజారిటీ కలిగిన యూపీఏ కూటమి కూడా సహకరించింది. -
ఎయిర్ ఇండియాపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ ల విమానాల కోనుగోలు ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఒప్పందాన్ని గత యూపీఏ ప్రభుత్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కెబినెట్ ఆమోదించింది. ఇప్పటికే బొగ్గు, టెలికాం సెక్టార్లో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ తాజాగా 111 విమానాల కోనుగోలులో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర విమానాయనశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టాలని జనవరిలోనే సుప్రీం కోర్డు సూచించింది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ అవతవకలు జరిగాయని తేలడంతో సోమవారం మూడు కేసులు నమోదు చేసింది. రూ. 70 వేల కోట్లతో విమానాలు కొనుగోలు చేయడంతో జాతీయ విమానాయ సంస్థ ఆర్ధికంగా నష్టపోయిందని, ఈ వ్యవహారం ప్రయివేటు సంస్థలకు లాభాదాయకంగా ఉందని దర్యాప్తు బృందం పేర్కొంది. 2005 లో యూపీఏ ప్రభుత్వం బోయింగ్ కంపెనీ నుంచి ఎయిర్ ఇండియా 68 విమానాలు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఒక సంవత్సరం అనంతరం ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2007 లో ఈ రెండు జాతీయ విమానయ సంస్థలు వీలీనమై ఎయిర్ ఇండియాగా సేవలందిస్తున్నాయి. -
నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు
యూపీఏ, ఎన్డీయేలపై మాల్యా ట్వీట్లు న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా ఎగవేతదారులపై ప్రభుత్వ కఠిన చర్యల మీద స్పందించారు. భీకరంగా పోట్లాడుకుంటున్న యూపీఏ, ఎన్డీయే కూటములు తనను ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు మీడియా వేదికగా మారిందంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘ఎన్డీఏ వర్సెస్ యూపీఏ పోటీ నడుస్తోంది. రెండు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి. మీడియాను చక్కగా పిచ్లాగా వాడుకుంటున్నారు. నన్ను ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు. దురదృష్టవశాత్తు.. ఈ మ్యాచ్లో రిఫరీలే లేరు’ అంటూ మాల్యా పేర్కొన్నారు. రుణాలు ఎగవేసిన వారు దేశం విడిచి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఆయన ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు తన కేసులో సీబీఐ తీరుపై కూడా మాల్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీబీఐ ఆరోపణలు షాకింగ్గా ఉన్నాయి. అన్నీ అబద్ధాలు, అపోహలే. ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా కూడా వ్యాపారం, ఆర్థికాంశాల గురించి పోలీసులకేం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. మాల్యాకి చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ. 9,000 కోట్లు బ్యాంకులకు ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో మాల్యా గతేడాది మార్చి 2న బ్రిటన్కు పరారయ్యారు. -
సర్జికల్ స్ట్రైక్స్ జరపడం మంచిదే
-
మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం!
సావో పాలో/న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణాన్ని మరువకముందే మరో భారీ రక్షణ కుంభకోణం దేశ రాజకీయాల్ని అతలాకుతలం చేసే అవకాశం కనిపిస్తోంది. భారత్, సౌదీ అరేబియాతో జెట్ విమాన అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రెజిల్ కంపెనీ ఎంబ్రెయర్ భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ దర్యాప్తు సంస్థలు, అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నాయి. 2008లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మూడు ఈఎంబీ-145 జెట్ విమానాలు కొనుగోలుకు ఎంబ్రెయర్తో 208 మిలియన్ డాలర్ల (రూ. 1,391 కోట్ల)తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం కోసం దళారీగా వ్యవహరించిన బ్రిటన్కు చెందిన డిఫెన్స్ ఏజెంటు సంస్థకు భారీగా కమిషన్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భారత రక్షణ వ్యవస్థ ప్రకారం దళారీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేసి ఒప్పందం కుదుర్చుకోవడం నిషేధం. డీఆర్డీవో ప్రాజెక్టు అయిన ఏఈడబ్ల్యూఅండ్ సీ (గగనతల ముందస్తు హెచ్చరికలు, నియంత్రణ వ్యవస్థ) ర్యాడర్కు అనుసంధానం చేసేందుకు ఈఎంబీ-145 యుద్ధవిమానాలు కొనుగోలు చేశారు. రూ. 2,520 కోట్లతో డీఆర్డీవో ఈ ప్రాజెక్టు చేపట్టగా.. పలు మార్పులతో తయారుచేసిన మొదటి విమానం 2011లో, మిగతా రెండు విమానాలు ఆతర్వాత భారత్ చేరాయి. బ్రెజిల్ యుద్ధవిమానాల తయారీ సంస్థ ఎంబ్రెయర్తో ఒప్పందం విషయంలో అక్రమాలు జరిగిన విషయం డీఆర్డీవోకు తెలియదని రక్షణమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. -
గవర్నర్గా శంకరమూర్తి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్కు చెందిన కే రోశయ్యను తమిళనాడు గవర్నర్గా నియమించారు. సహజంగా కేంద్రంలో మరోపార్టీ అధికారంలోకి రాగానే గవర్నర్ల సీటుకు కాలం చెల్లుతుంది. గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమో లేదా కేంద్రమే తొలగించడమో రాజకీయాల్లో సహజం. అయితే ముఖ్యమంత్రి జయలలితతో సత్సంబంధాలు, వివాదరహితుడు కావడంతో రోశయ్య మరో రెండేళ్లు కొనసాగి మొత్తం ఐదేళ్లపాటూ పూర్తికాలం గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టులో రోశయ్య బాధ్యతలు చేపట్టగా ఈనెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పదవుల కోసం క్యూకట్టిన వారిని సంతృప్తిపరచాల్సిన ఆవశ్యకత కేంద్రానికి ఏర్పడింది. దీంతో కొత్త గవర్నర్గా ఎవరు వస్తారనే అంశం ఇటీవల తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాదివారా, దక్షిణాది వ్యక్తా అనే కోణంలో రెండుగా విభజించి విశ్లేషించుకోవడం ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం మిత్రపక్షం కావడంతో ఆ పార్టీకి చెందిన ఒక పేరు పెద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈలోగా కేంద్రంతో తెలుగుదేశానికి సంబంధాలు చెడడంతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఆనందీబెన్ పేరు కూడా కొన్నాళ్లు చలామణి అయింది. బీజేపీ సీనియర్ నేత టీహెచ్ శంకరమూర్తిని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్షా పిలిచి త్వరలో మీకు పెద్ద కొత్త పదవి రాబోతోంది, సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ పదవి ఉత్తరాదిలో కాకుండా దక్షిణాదిలో ఉండేలా చూడాలని శంకరమూర్తి కోరినట్లు సమాచారం. దక్షిణాదికి సంబంధించి తమిళనాడు గవర్నర్ స్థానం ఖాళీ అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ ఒక్కరే గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా గవర్నర్గా నియమించే అవకాశం ఉందని కూడా వినపడుతోంది. అయితే తమిళనాడు గవర్నర్గా నియమించేందుకే అమిత్షా నిర్ణయించినట్లు సమాచారం. -
బీజేపీ, టీఆర్ఎస్ కలసిపోయినట్టే : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, మహేశ్కుమార్గౌడ్ తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 26 నెలల తర్వాత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం వల్ల ఒరిగిందేమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్, బీజేపీ కలసి ప్రయాణం చేస్తాయనే సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా ఇచ్చారని చెప్పారు. పొత్తుకోసం రెండు పార్టీలు తహతహలాడిపోతున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీని కేసీఆర్, సీఎం కేసీఆర్ను మోదీ పరస్పరం పొగుడుకున్నారని అన్నారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేశారని ఉత్తమ్ ఆరోపించారు. గోదావరి నదీజలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. యూపీఏ హయాంలో మంజూరైన పథకాలను, సగానికన్నా ఎక్కువగా పూర్తిచేసిన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారని వివరించారు. తెలంగాణలోనూ దళితులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. దళితుల గురించి అనుచితంగా మాట్లాడి, అవమానించిన బీజేపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ ఇప్పటిదాకా ఏ చర్యలనూ తీసుకోలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచడం, పోలీసుస్టేషన్లకు పంపడం అప్రజాస్వామికమని ఉత్తమ్ అన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ సమన్వయ సమావేశం, రైతు సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, అక్రమాలపై 17న పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. -
అగస్టా కంటే పెద్ద కుంభకోణం!
న్యూఢిల్లీ: దేశంలో దుమారం రేపుతోన్న అగస్టా కుంభకోణంకు సంబంధించి విచారణ జరుగుతుండగా.. యూపీఏ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం బయటపడింది. దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ నౌకల తయారీలో ఈ స్కామ్ జరగడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అంతర్గత విచారణకు ఆదేశించారు. 2009లో రెండు కొత్త నావల్ ట్యాంకర్ల కోసం యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ట్యాంకర్లను తయారుచేసి ఇచ్చేందుకు రష్యా, కొరియా, ఇటలీలు బిడ్ లు దాఖలు చేశాయి. వీటిలో రష్యా మిలటరీ గ్రేడ్ స్టీల్ తో తయారుచేసి అందిస్తామని తెలపగా.. తమకు ఆ రకం స్టీల్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో రష్యా డీల్ నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో పోటీలో నిలిచిన రెండింటిలో ఇటాలియన్ కంపెనీ ' ఫిన్కాంటైరీ ' డీల్ ను చేజిక్కించుకుంది. 2010లో 'కాగ్' ట్యాంకర్ల డీల్ లో లోపాలు ఉన్నట్లు, కంపెనీకి లాభం చేకూరేట్లు డీల్ ను ఇచ్చినట్లు పేర్కొంది. అక్కడితో ఆగిపోయిన ఈ విషయం తాజాగా ఓ రిటైర్డ్ నావల్ అధికారి వేసిన పిటిషన్ తో మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొత్త ట్యాంకర్లు ఎందుకోసం? దేశ అతిపెద్ద విమాన రవాణా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకురావాల్సి ఉండగా.. నౌక రక్షణ కోసం ఈ రెండు ట్యాంకర్లను 2009, 2011లలో భారతీయ స్ఫెసికేషన్స్ తో అత్యంత వేగంగా భారతీయ నావికాదళంలోకి తీసుకున్నారు. విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకువస్తున్న తరుణంలో రెండింటిలో ఒక ట్యాంకర్ బీటలు వారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటాలియన్ కంపెనీకే ఆ డీల్ ను ఇవ్వడానికి గల కారణాలను, డీల్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగ్ ఆరోపణలు, నేవీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
రెండు విడతలుగా 'నీట్' పరీక్ష
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్షను రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ నీట్ను అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. మే 1, జూన్ 24న నీట్ పరీక్ష నిర్వహించి, ఆగస్టు 17న ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సిలింగ్ పూర్తి చేసి అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభించాలని సూచన చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే నీట్ అమలు కానుంది. కాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎంసెట్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారాన్ని తీసుకుంటామని, అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురి కావద్దని ఆయన సూచించారు. -
‘నీట్’కు ప్రాణప్రతిష్ట!
వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో ఇకపై ఒకే ఉమ్మడి ప్రవేశపరీక్ష ఉండబోతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ లోగడ ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన 2-1 మెజారిటీ తీర్పును వెనక్కి తీసుకుంటు న్నట్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. ఈ తాజా నిర్ణయంతో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ప్రాణప్రతిష్ట చేసినట్టయింది. పాత తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తుది నిర్ణయం తీసుకునే వరకూ ‘నీట్’ అమల్లో ఉంటుందని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. అయితే ధర్మాసనం ‘నీట్’ మంచిచెడ్డల జోలికి పోలేదు. గతంలో ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరకుండానే తీర్పు వెలువడిందన్న కారణాన్ని చూపి మాత్రమే వెనక్కు తీసుకుంది. యూపీఏ హయాంలో మొగ్గతొడిగిన ‘నీట్’పై ఆది నుంచీ విద్యార్థుల్లో అనేక అనుమానాలున్నాయి. పలు రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకా ముందూ చూడకుండా దీనికి అంగీకారం తెలపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. 2013లో ఒకపక్క ఎంసెట్, మరోపక్క నీట్ నిర్వహించడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఎంసెట్ రాయాలా...నీట్ రాస్తే సరిపోతుందా అనేది తేల్చుకోలేకపోయారు. చివరకు ఎంసెట్ ఆధారంగానే వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలు చేపట్టవచ్చునని అప్పట్లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి ‘నీట్’ రూపుదిద్దుకోవడానికి సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తీర్పు ప్రధాన కారణం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న అనేకానేక పరీక్షలు అవినీతికి తావిస్తున్నాయని, ఎన్నో అవకతవకలు చోటుచేసుకుంటున్నా యని సుప్రీంకోర్టు భావించింది. ప్రతిభావంతులకు ఏ కళాశాలలోనూ ప్రవేశం లభించని స్థితి ఉండగా...డబ్బు, పలుకుబడి ఉన్నవారు దొడ్డిదారిన సీట్లు సంపా దిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకత ఉండేలా, అందరికీ సమానావ కాశాలు లభించేలా ఒకే ఉమ్మడి పరీక్ష రూపొందించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. పర్యవసానంగా ‘నీట్’ ఉనికిలోకి వచ్చింది. వైద్య విద్యా ప్రవేశాలకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్న మాట వాస్తవమే. అందువల్ల వీటి కోసం సంసిద్ధం కావడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారుతున్నది. అయితే అంతమాత్రాన ‘నీట్’ను సర్వరోగ నివారిణిగా భావించలేం. పాత సమస్యలు పోయినా దీంతో కొత్త సమస్యలు ఏర్పడే ప్రమాదం వచ్చిపడింది. ఇందుకు అందరికంటే ముందు ఎంసీఐనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ తప్పుబట్టాలి. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ అమలులో ఉన్నదనిగానీ, రాష్ట్రాల మనోభావాలను గౌరవించాలనిగానీ ఎంసీఐ అనుకోలేదు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలుండాలన్న డిమాండుకు అది తొలుత అంగీకరించలేదు. గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టడంవల్ల చివరకు దిగొచ్చింది. అయితే దానికొక మెలిక పెట్టింది. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమేగానీ...ఆ భాషల్లో జవాబులు రాసే విద్యార్ధులు జాతీయ స్థాయి కోటాకు అనర్హులవుతారని నిబంధన విధిం చింది. అదే సమయంలో హిందీ భాషలో పరీక్ష రాసే విద్యార్ధులు మాత్రం జాతీయ కోటాలో సీట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. మరోపక్క ప్రమా ణాలరీత్యా నాసిరకంగా ఉండే ఈ జాతీయ స్థాయి పరీక్షలో తాము పాలుపంచు కోబోమని ఎయిమ్స్ వంటి ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు నిక్కచ్చిగా చెప్పాయి. ఒకే ఉమ్మడి పరీక్ష ఉండాలన్న ఉద్దేశం కాస్తా వీటి మొరాయింపుతో మూలన బడినట్టయింది. ‘నీట్’లో ఉండే ఇతర లోటుపాట్లు ఇంతకన్నా భయంకరమైనవి. వృత్తి విద్యా కోర్సుల్ని సాధించడానికి ప్రయత్నించే లక్షలాదిమంది విద్యార్ధుల్లో అంతరాల దొంతరలుంటాయి. ఆర్ధిక స్థోమత బాగున్నవారికీ, అది సరిగా లేనివారికీ తేడా లుంటాయి. ఢిల్లీలో చదువుకున్న విద్యార్ధికీ...నాగాలాండ్లో చదువుకున్న విద్యార్ధికీ ఒకే రకమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండవు. ఒక రాష్ట్రంలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుంటాయి. ఎంతో వెనకబడినవీ ఉంటాయి. ఇలాంటి వారంతా జాతీయస్థాయి పరీక్షలో పోటీ పడాలంటే సామాన్యమైన విషయం కాదు. వీటికితోడు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్సీ సిలబస్ విద్యార్ధులకు ‘నీట్’ అనుకూలంగా ఉంటుంది తప్ప...ప్రాంతీయ భాషల్లో చదువుకున్నవారికి కొరు కుడు పడదు. ‘నీట్’ ద్వారా సీట్ల కేటాయింపు జరిగితే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికేతర విద్యార్ధుల సంఖ్య పెరగడమే కాదు...స్థానికుల్లో కూడా ఉన్నత వర్గాలవారే అధికంగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా సమాజంలో వైద్యులు కావాలనుకున్నవారందరికీ ఇది సమానావకాశాలు ఇస్తుందన్న నమ్మకం లేదు. అలాంటపుడు ‘నీట్’ మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందన్న సంగతిని గుర్తిం చాలి. రకరకాల సెట్లతో సమస్యలున్నమాట...ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమా లకు పాల్పడుతున్న మాట వాస్తవమైనా వాటిని అరికట్టడానికి వేరే తోవలు వెదకాలి. ఒక రాష్ట్రం నిర్వహించే సెట్ను వేరే రాష్ట్రం గుర్తించి తమ సీట్లలో కొంత శాతాన్ని కేటాయిస్తే ఈ సమస్య కొంతవరకూ తీరుతుంది. అలాగే ప్రైవేటు, మైనారిటీ కళాశాలలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించవచ్చు. ఈ ఏడాదే ‘నీట్’ నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించినా తగిన వ్యవధి లేదు గనుక ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. కనీసం వచ్చే విద్యా సంవత్సరం లోపు అయినా ‘నీట్’ లోటుపాట్లపై సమగ్రమైన చర్చ జరిగి మెరుగైన విధానం రూపొందితే విద్యార్ధులకు మేలు కలుగుతుంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో విద్యను బలవంతంగా ఉమ్మడి జాబితాలో చేర్చడంవల్ల ఎంతో నష్టం జరిగింది. దాన్ని ‘నీట్’ మరింత దిగజార్చకూడదు. -
'ఆ బిల్లు యూపీఏ బేబి'
గువాహటి: కావాలనే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఈ బిల్లు పాసయితే ఆ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్రమోదీ ఖాతాలోకి వెళ్లిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెప్పారు. గురువారం ఆయన గువాహటిలో జీఎస్టీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. 'దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని నమ్ముతోంది. అదేమిటంటే జీఎస్టీ బిల్లు పాసయితే ఆ ఖ్యాతి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని' అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు పాసవకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. అసలు ఒకప్పుడు యూపీఏకు ఈ బిల్లు పుత్రికలాంటిదని, చాలామంచి చట్టం అని అభివర్ణించారు. -
పార్లమెంటు తీరు ఇంతేనా?!
పార్లమెంటును సజావుగా నడపడంలో యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ఎన్డీయే సర్కారు కూడా విఫలమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో సహా ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయి. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉండగా...చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సవరణ బిల్లు, ఆర్బిట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో పెట్టే బిల్లు సహా మొత్తంగా 67 బిల్లులు ఉభయసభల ముందుకూ రావాల్సి ఉంది. మరోపక్క రైతుల ఆత్మహత్యలు, అధిక ధరలు, ప్రకృతి విపత్తులవంటి ఎన్నో ముఖ్యాంశాలపై చర్చించాల్సి ఉంది. ఈ తరుణంలో హఠాత్తుగా ఊడిపడిన ‘నేషనల్ హెరాల్డ్’ వివాదం పార్లమెంటును ముందుకు కదలనివ్వలేదు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సీబీఐ చేసిన దాడి ఉభయ సభల్లో కల్లోలాన్ని సృష్టించింది. దానికి కొనసాగింపుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ చేసిన ఆరోపణలు, అందుకు కాంగ్రెస్ వత్తాసునివ్వడం మరికొంత సమయాన్ని మింగేశాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు తెస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని పెను సంక్షోభాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 23తో సమావేశాల గడువు ముగిబోతున్నది. సెలవుల్ని మినహాయిస్తే పార్లమెంటు సాగేది మరో నాలుగు రోజులు మాత్రమే. పాలక పక్షం పరిణతితో వ్యవహరిస్తే వీటిలో చాలా వివాదాలు నివారించదగ్గవే. ‘నేషనల్ హెరాల్డ్’ కేసు విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎవరూ అంగీకరించలేదు. న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అనవసరంగా పార్లమెంటుకు ఈడ్చుకొచ్చిందన్న అభిప్రాయమే సాధారణ పౌరుల్లో వ్యక్తమైంది. ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన దాడి మాటల యుద్ధానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని పిరికిపంద, ఉన్మాది అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. సీబీఐ దాడి లక్ష్యం రాజేంద్ర కుమార్ కాదనీ, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైలు కోసమే ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా సీబీఐ వ్యవహరించిన తీరు మాత్రం సరిగా లేదనే చెప్పాలి. అవసరమనుకున్నచోట సోదాలు నిర్వహించేందుకు కేసును దర్యాప్తు చేసే అధికారికి సర్వాధికారాలున్నాయి. అందుకు ప్రభుత్వ ముందస్తు అనుమతిగానీ, ఆఖరికి తన ఉన్నతాధికారి అనుమతిగానీ అవసరం లేదు. అవినీతి కేసుల్లో మెరుపుదాడులే ఫలితాన్నిస్తాయి తప్ప ముందుగా చెప్పి వెళ్తే ఉపయోగం ఉండదని కేంద్రం చెప్పిందీ నిజమే కావొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారిపై ఉన్న ఆరోపణల విషయంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాల సంగతిని మర్చిపోకూడదు. మూడో అంతస్తులో ఉన్న రాజేంద్రకుమార్ కార్యాలయాన్ని మాత్రమే సోదా చేశామని సీబీఐ సంజాయిషీ ఇస్తోంది. కానీ దానికి చేర్చి ఉన్న తన కార్యాలయంలో కూడా సోదాలు చేశారని కేజ్రీవాల్ అంటున్నారు. మూడో అంతస్తు మొత్తాన్ని సీల్ చేసి, సీఎం ఆఫీసుకు దారితీసే మార్గాన్ని కూడా అడ్డుకుని సోదాలు నిర్వహించకపోయి ఉంటే ఇలాంటి ఆరోపణలకు తావుండేది కాదు. పైగా ఢిల్లీ ప్రభుత్వానికీ, కేంద్రానికీ మధ్య ఇప్పటికే ఎన్నో అంశాల్లో తగాదాలొచ్చాయి. ఈ చరిత్రంతా అక్కడే కొలువుదీరిన సీబీఐకి తెలియదనుకోలేం. కనుక దాడులు చేయడానికి కొద్ది సమయం ముందైనా కేజ్రీవాల్కు వర్తమానం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పోనీ తనదేమైనా ఘన చరిత్ర అయివుంటే...ముందూ మునుపూ తటస్థంగా, నిక్కచ్చిగా వ్యవహరించిన నేపథ్యం ఉంటే వేరు. యూపీఏ పాలనాకాలమంతా విపక్షాలన్నీ దాన్ని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే పిలిచేవి. సాక్షాత్తూ సుప్రీంకోర్టే అనేక సందర్భాల్లో సీబీఐ డెరైక్టర్లుగా ఉన్నవారికి అక్షింతలేసింది. ఇలా ఎన్నిమార్లు మందలించినా దారికి రాకపోవడంతో చివరకు సహనం నశించి ‘పంజరంలో చిలుక’తో కూడా పోలిక తెచ్చింది. ఇప్పుడు ఆ పాత్రలోనే ప్రస్తుత దాడి నిర్వహించిందని విపక్షాలు ఆరోపిస్తుంటే సీబీఐ సమాధానం చెప్పుకోగలదా? మధ్యప్రదేశ్ వ్యాపం కేసు మొదలుకొని వివిధ కేసుల విషయంలో ఇంత చురుగ్గా ఎందుకు కదలడం లేదంటే ఏం చెబుతుంది? సీబీఐకి విశ్వసనీయత అనేది ఉంటే ప్రస్తుత దాడి ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. సీబీఐ దాడి తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఆప్ నేతలు పార్లమెంటు వెలుపలా, లోపలా విరుచుకుపడుతున్నారు. డీడీసీఏ వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం నియమించిన కమిటీ ఆ సంగతిని నిగ్గు తేల్చిందంటున్నారు. మరి ఇన్ని నెలలుగా ఆయనపై ఢిల్లీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలెందుకు చేయలేదో, కనీసం ఆ స్కాంను ఎందుకు బయటపెట్టలేదో ఆప్ నేతలు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చేస్తున్న హడావుడిని చూస్తే స్వల్పకాలంలోనే ఆప్ కూడా ఒక సాధారణ రాజకీయ పక్షంగా మారిపోయిందని అర్ధమవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం విషయంలో వ్యవహరించిన తీరుపైనే పార్లమెంటు రెండు రోజుల సమయం హరించుకుపోతే అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం దీనికి తోడైంది. పార్లమెంటు సాగుతుండగా ఇలాంటి వివాదాలన్నీ తెచ్చుకోవడం క్షేమం కాదని ఎన్డీఏ పెద్దలకు అర్ధమైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు సోనియా, మన్మోహన్లను ప్రధాని తన ఇంటికి ఆహ్వానించి చర్చించినప్పుడు ఈ సమావేశాలు సజావుగా సాగుతాయన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది. తీరా ఒకదాని వెనకొక వివాదం వచ్చి పడి సమావేశాలను చాపచుట్టేసే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు తీరు ఇలాగే సాగితే జనం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకొచ్చేది ఎప్పుడు? పరిష్కారం లభించేదెప్పుడు? అన్ని పార్టీలూ ఆలోచించాలి. -
కాంగ్రెస్కు కలిసొచ్చేనా!
శ్రేణుల్లో కరువైన సమన్వయం అధికార పార్టీ వ్యతిరేక ఓటు పైనే ఆశలు వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేనా! అన్న ప్రచారం నగరంలో విస్తృతంగా సాగుతోంది. అధికార పార్టీ హామీలు ఇచ్చి అమలులో చేస్తున్న జాప్యంతో వ్యతిరేక ఓట్లు భారీగా పడతాయని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అభ్యర్థి మార్పు, జిల్లాలో ఉన్న గ్రూపులు, స్థానిక నాయకత్వంలో సమన్వయ లోపం పార్టీ అభ్యర్థికి శాపంగా మారనున్నారుు. తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినందున సార్వత్రిక ఎన్నికల్లో తామే గెలుస్తామని, తొలి సీఎంగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే పగ్గాలు చేపడతారన్న ఆశ పడ్డ కాంగ్రెస్ నేతలు భంగపడ్డారు. నేతల మధ్య సమన్వయం లేక పలు చోట్ల పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యూ రు. ఇదే పరిస్థితి ఉప ఎన్నికలో పునరావృ తం కావొద్దని మాజీ ఎంపీకే టిక్కెట్ ఇప్పించడంలో మాజీలు విజయం సాధిం చారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియూగాంధీకి బహుమతి ఇవ్వాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగారుు. అ రుుతే మాజీ ఎంపీ కుటుంబం లో జరిగిన విషాదకర ఘటనలతో పోటీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందు కు అప్పటికప్పుడు స్థానికులెవరూ కొత్తవారు ధైర్యం చేయలేకపోయూరు. లోక్సభ లో తెలంగా ణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాట్లాడిన, సోని యూకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పీసీసీ పోటికి దింపిం ది. సర్వే రాక తో పార్టీలో కొన్ని శ్రేణులు అసంతృప్తి వ్య క్తం చేసినా పీసీసీ నేతల బుజ్జగింపులతో ప్రచారానికి సై అన్నారు. ఆర్థికపరమైన విషయూలు స్థానికులకు అప్పగిస్తే తడిసి మోపెడవుతుందని భావించిన సర్వే ని యోజకవర్గ బాధ్యతలను తనకు అనుకూలమైన వారికి అప్పగించినట్లు తెలిసింది. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారిం ది. నామినేషన్ నాటి నుంచి ఆర్థిక వ్యవహారాలు చూసిన వారు ఇతర ప్రాంతాలకు చెందడంతో వారు జిల్లా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ దగ్గర పడటంతో బూత్ల నిర్వహణకు డబ్బులు కేటారుుంచేందుకు కసరత్తు చేశా రు. కానీ వచ్చిన నిధులను బాధ్యతలు నిర్వహించిన నేతలు తీసుకొని పోవడంతో అసలు విషయం బయటపడింది. పోలింగ్ ఖర్చుల సంగతేమిటంటూ పలువురు ప్ర శ్నించడంతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే దాం ట్లో తక్కువ ఇస్తే వ్యతిరేక ఓట్లు రావని స్థానిక నాయకులు వాపోతున్నారు. దీంతో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా వేరుుంచుకోవడంలో కాం గ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నారుు. బూత్లవారీగా ఇచ్చే డబ్బులు తగ్గించడంతో ఆయూ గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమకు అక్కరలేదని అలకతో వెళ్లినట్లు తెలిసింది. వీరందరిని మళ్లీ పిలిపించి సమన్వయం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నట్లు సమాచారం. -
గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ నుంచి మరో బుల్లెట్ వెలువడింది. ఎవరెవరు తనను కలిసింది, ఎక్కడ సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న లలిత్ మోదీ తాజాగా మరో కీలక విషయం వెల్లడించారు. తాను బీజేపీ నేతలను మాత్రమే కలవలేదని, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ టచ్లో ఉన్నానని లలిత్ తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె-అల్లుడు ప్రియాంక రాబర్ట్వాధ్రాలను తాను కలుసుకున్నానని లలిత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తో కూడా తాను భేటీ అయ్యానని లలిత్ తెలిపారు. గత ఏడాది లండన్లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఆనాటి సమావేశం గురించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. తాను వారిని రెస్టారెంట్ లో కలుసుకున్నప్పుడు గాంధీ కుటుంబీకులతో పాటు టిమ్మీ సర్నా ఉన్నాడని, అతడితో తన కాంటాక్ట్ నంబర్ ఉందన్నాడు. అతడికి కాల్ చేస్తే నేను ఏ విధంగా స్పందించానన్నది తెలుస్తుందని రెండో ట్వీట్ లలో మోదీ పేర్కొన్నాడు. కాగా లలిత్ మోదీకి వీసా పత్రాలకు సాయం చేశారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 1/3 Happy to meet the Gandhi Family http://t.co/43iiC6mL9w in London. I had run into Robert and Priyanka separately pic.twitter.com/JTnaE6eX1A — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 2/3 in a resturant - they were with Timmy Sarna. He has my no. They can call me. Will tell them what I feel about pic.twitter.com/uz4SBMayXS — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 3/3 them exactly. Will mince no words. Will make no deal. But tell them witch hunt will now make them realize I was -
మళ్లీ బంధం!
డీఎంకే, కాంగ్రెస్ల బంధం మళ్లీ చిగురించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్టీల అధినేతలు మళ్లీ దగ్గరవుతుండడంతో రెండు పార్టీల శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ కూటమికి వస్తుందన్న ధీమాను డీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, చెన్నై : కేంద్రంలో యూపీఏ డీఎంకే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో ఈ బంధం కొనసాగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం మంది కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. డీఎంకే హవాకు కేంద్రంలో హద్దేలేదని చెప్పవచ్చు. తమ బంధం గట్టిదని ఇరు పార్టీల నాయకులు జబ్బలు చరిచి మరీ చెప్పుకున్నారు. అయితే 2జీ స్పెక్ట్రమ్ బండారం వెలుగులోకి రావడం, డీఎంకే మంత్రులు కేసుల్లో ఇరుక్కోవడంతో వీరి బంధం పటాపంచెలయ్యే పరిస్థితులు బయలు దేరాయి. ఈ కేసులు ఓ సాకుగా ఉన్నా, ఈలం తమిళులకు అండగా యూపీఏ సర్కారు ఐక్యరాజ్య సమితిలో నిలవలేదన్న సాకును చూపిస్తూ ఆ కూటమి నుంచి డీఎంకే అధినేత ఎం కరుణానిధి వైదొలిగారు. తదనంతరం కాంగ్రెస్, డీఎంకేలు ప్రత్యర్థులుగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో దిగిన ఈ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. వీడని బంధం: డిపాజిట్లు గల్లంతు కావడంతో గుణపాఠం నేర్చిన ఇరు పార్టీల వర్గాలు విడివిడిగా ఉండిసాధించడం కన్నా, ఒక గొడుగు నీడన పయనించడం ద్వారానే లాభం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు అద్దంపట్టే రీతిలో పొగడ్తల పన్నీరు రాష్ట్ర పార్టీ వర్గాల్లో సాగుతూ వస్తున్నాయి. ఇక, డీఎంకే అంటే గిట్టని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం ఇటీవల తన ధోరణి మార్చుకున్నట్టున్నారు. గతంలో పలు మార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్, మర్యాద, మాట వరసకైనా డీఎంకే అధినేత కరుణానిధిని కలిసిన సందర్భాలు లేవు. ఈ పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి రాబోతున్న రాహుల్ కరుణానిధిని కలుసుకునేందుకు వ్యూహ రచనచేసి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, కరుణానిధి జన్మదినాన్ని పురస్కరించుకుని తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇక, కరుణానిధి ఇంటి శుభాకార్య వేడుకకు సైతం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుభాకాంక్షల లేఖపంపించడం విశేషం. అదే సమయంలో కాంగ్రెస్కు దగ్గరయ్యే విధంగా కరుణానిధి అడుగులు వేసే పనిలో పడ్డారు. రాష్ట్రంలోని ఆ పార్టీ వర్గాల్ని అక్కున చేర్చుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఇంట ఏదేని కార్యక్రమం జరిగితే, అందుకు డీఎంకే వర్గాలను పంపిస్తున్నారు. సత్యమూర్తి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమాలకు సైతం డీఎంకే వర్గాలు హాజరవుతుండడం గమనించాల్సిన విషయం. ఇక, రాహుల్ గాంధీ శుక్రవారం తన బర్తడేను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరుణానిధి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఉండడం, అందుకు రాహుల్ పలు మార్లు కృతజ్ఞతలు తెలిపినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తెలిపిన శుభాకాంక్షలుకు రాహుల్ కృతజ్ఞతులు తెలిపండంతో ఇరు పార్టీల మధ్య మళ్లీ బంధం చిగురించబోతుందన్న ప్రచారం బయలు దేరింది. డీఎంకేతో బంధం అన్నది అటు కాంగ్రెస్ వర్గాలకూ ఆనందమే. అదే సమయంలో ఇటీవల మళ్లీ పురుడు పోసుకున్న జీకే వాసన్ నేతృత్వంలో టీఎంసీ అన్నాడీఎంకే పక్షాన నిలబడని పక్షంలో, ఆ బలాన్ని సరి చేసుకునేందుకు వీలుగానే కాంగ్రెస్ను అక్కన చేర్చుకునే పనిలో కరుణానిధి పడ్డట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఈ సారి అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధి రానున్న ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేసి తీరుతారన్న ధీమాను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
అత్తెసరు మార్కుల అమాత్యులు
జాతిహితం వచ్చిన చిక్కేమిటంటే, పెట్రోలియం శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరి, సరిగ్గా యూపీఏలో రక్షణ శాఖలో అవినీతిని నిరోధించడానికి ఏకే ఆంటోనీ అనుసరించిన పద్ధతిలాగే ఉంది. తన చుట్టూ గిరిగీసుకున్నారు, ఇప్పటికీ ఏమీ చేయలేదు. కాబట్టి ఎక్కడా తప్పు జరగదు. కొత్త పెట్టుబడులు, షేల్ గ్యాస్, కొత్త తవ్వకాలు అంతా ఆంటోనీ వ్యవహారమే. నరేంద్ర మోదీ తొలి సంవత్సరం పాలన గురించి ప్రతి భారతీయుడు నిర్ది ష్టమైన అభిప్రాయం ఏర్పరచుకున్నట్టు కనిపిస్తున్న ఈ తరణంలో, ఆయన మంత్రిమండలి సభ్యుల మీదకు దృష్టి మరల్చి, అత్తెసరు మార్కుల ఊసులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నందుకు నన్ను మన్నించాలి. ఎందుకంటే, అతడి పేరు మాహి కావచ్చు లేదా మోదీ కావచ్చు, తన బృందం మాదిరిగానే కెప్టెన్ కూడా అంతిమంగా ఉత్తముడే అయి ఉంటాడు. నా పనిని తక్కువ సంక్లిష్టం చేసుకోవడానికి 66 మంది శక్తిమంతులైన మంత్రులతో కూడిన మోదీ మంత్రి వర్గంలో 10 మందికి రేటింగ్ ఇవ్వడానికే పరిమితమవుతున్నాను. వీరు చాలా ముఖ్యమైనవారు, జనం దృష్టిలో ఉండేవారు, వార్తా స్రష్టలు కూడా. ఈ పదు గురిలో ప్రతి వారు తమ తమ స్థాయిలో నిజమైన టాప్ టెన్లో ఒకరే. వారు నిర్వహించిన మంత్రిత్వశాఖల లక్షణం, ప్రాధాన్యం; పార్టీలో వారికున్న సీని యారిటీ ముఖ్యమే గానీ, అయితే అవే రేటింగ్ ఇవ్వడానికి అనివార్యంగా తీసుకోవలసిన నిర్దిష్టమైన కారణాలు మాత్రం కాదు. కాబట్టి మనకి చాలా తక్కువగా మాత్రమే తెలిసిన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం-ఆరోగ్య మం త్రిత్వశాఖలనీ, బీరేందర్సింగ్, రాధామోహన్ సింగ్, జేపీ నడ్డా వంటివారిని గురించి అంచనా వేయడం లేదు. మళ్లీ ఒక్కసారి, మనం పది మందినే (వీరితో పాటు గౌరవం పంచుకుంటున్న వారితో కలిపి నిజానికి 12 మంది) ఎంచుకున్న కారణంగా వీరి రేటింగ్ను ఆరోహణక్రమంలో 1 నుంచి 10 వరకు చూడాలి. 1. మానవవనరుల అభివృద్ధి, స్మృతీ ఇరానీ: దాదాపు రెండు దశాబ్దాలుగా అమలువుతున్న 57 ఏళ్ల సగటు వయసు అనే నిబంధనకు అతీతంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు. మీడియాకు సన్నిహితురాలిగా మెలగుతారు. చక్కగా మాట్లాడతారు. నేటి భారతీయ యువత, రాబోయే యువతరం జనాభా కూడా లాభసాటి అయినదే గానీ, విపత్తు కాదని చాటే ప్రధాన బాధ్యతను మోస్తున్న మంత్రిత్వ శాఖకు ఆమె సరైన వ్యక్తి. ఆమె 12 మాసాల పాలనలో చాలా విజయాలు ఉన్నాయి. అధికారికంగా ఉండాల్సిన విద్యార్హత లేదన్న కారణంగానూ, హోలీ యేల్ సంస్థ ఇచ్చిన పట్టాను అగౌరవ పరచడానికీతనను లక్ష్యంగా చేసుకొని జరిగిన ప్రయత్నాలను ఆమె పటాపంచలు చేశారు. అయితే, ప్రధాని తరు వాత మంత్రిమండలిలో హిందీలోగానీ, ఇంగ్లిష్లోగానీ అనర్గళంగా మాట్లాడ గలిగిన రెండో మంత్రి ఆమేనని తేలడానికి ఈ ఉదంతం ఉపకరించింది. ఢిల్లీకి ఉత్తరాన ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ దినేశ్సింగ్, దక్షిణాన ఐఐటీ డెరైక్టర్ ఆర్కే షేవగాంకర్ కూడా స్మృతీ ఇరానీ విజయాలలో భాగమే. కానీ, దురదృష్టవశాత్తు ఢిల్లీకి తూర్పుపడమరలలో ఇలాంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థలేవీ మనకు లేవు. ఐఐటీ అధిపతుల ఎంపిక పద్ధతిని ఆమె మార్చేశారని ప్రముఖ అణు శాస్త్రవేత్త, ముంబై ఐఐటీ చైర్మన్ అనిల్ కాకొద్కర్ హుందాగా సూచించారు. ఎన్సీఈఆర్టీ అధిపతి వెళ్లిపోయారు. ఇంకొందరూ ఆయన బాటపట్టవచ్చు. హెచ్ఆర్డీ శాఖను వివాదం చేసే పనిని కొనసాగిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఆ రకంగా చూస్తే వివాదాలను కొనసాగిస్తూ ఆమె ఎన్డీయే పాలిట జైరాం రమేశ్ కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. 2. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన, ఉమా భారతి: మంత్రిగా ఆమె చేసిందేమీ లేదు. అయినా స్మృతీ ఇరానీ కంటె రెండు స్థానాల పైన రేటింగ్కు అర్హురాలవుతారు. ఇందుకు పెద్ద కారణమేమీ లేదు. ఆమె వాస్తవంగా ఎలాంటి చేటూ చేయలేదు. కొత్త వివాదాలూ లేవదీయనూలేదు. నిజానికి కుర్రకారు పాత హిందీ సినిమాలలో మాదిరిగా తడిసీ తడియనట్టు ఉండే బట్టలతో గంగా ప్రవాహంలో కౌగిలించుకోవడం, కిందికి వెళ్లే ప్రవా హాన్ని మోదుతూ అరుచుకోవడం వంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడ కుండా నిషేధించాలంటూ వీహెచ్పీ తాజాగా ఇచ్చిన పిలుపునకు ఆమె స్పం దించకుండా సంయమనం పాటించడం హర్షించదగినదే. అందుకైనా ఆమె కచ్చితంగా పదిలో రెండో స్థానం పొందుతారు. 3.మైనారిటీ వ్యవహారాలు, నజ్మా హెప్తుల్లా: మనకున్న ప్రముఖులలో చాలా అనుభవం కలిగి ఉన్నప్పటికీ, ఇటీవలి కాషాయంబధారి అయిన నజ్మా, ప్రస్తుత మంత్రి మండలిలో ఉన్న నలుగురు లేదా ఐదుగురు (మైనారి టీలను మీరు ఎలా నిర్వచిస్తారు అనే అంశం మీద ఇది ఆధారపడి ఉంది) మైనారిటీలలో ఒకరైన ఆమె మంత్రిత్వశాఖను ఒకటి కంటే ఎక్కువ మార్గాల లోనే మానవీకరిస్తున్నారు. ఇంత తక్కువ మంది మైనారిటీలు ఇంతకు ముం దు ఏ మంత్రివర్గంలోనూ లేరు. ఆమె చేసినది కూడా చాలా తక్కువ. మన పాత ప్రపంచంలోని పాఠశాలల్లో మాదిరిగా అత్తెసరు మార్కులు తెచ్చుకు న్నారు. ఇందుకు కారణం ఏమిటంటే, ఆమె వార్తల్లో కనిపించడం లేదు. మైనారిటీల కోసం మాట్లాడలేదు. అలా అని, బుజ్జగింపు ధోరణిలా కనిపించే హజ్ రాయితీ, మదర్సాల కంప్యూటరీకరణ వంటి అంశాలను ఉపసంహ రించలేదు. 4. పెట్రోలు, సహజవాయువు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), ధర్మేంద్ర ప్రధాన్: గడచిన రెండు దశాబ్దాలుగా మన మంత్రిత్వశాఖలలో అత్యంత వివాదాస్పదంగా ఉన్న ఈ శాఖను బట్టి, సాపేక్షంగా చూస్తే ఆయన అంత ప్రముఖుడని అనిపించడు. ప్రతిష్ట, అవినీతి రహితునిగా ఉన్న పేరు, విశ్వాస పాత్రతలను బట్టి యూపీఏ హయాంలో వీరప్ప మొయిలీ, జైపాల్ రెడ్డి, మురళీదేవ్రా, మణిశంకర్ అయ్యర్ (వరసక్రమంలో వెనక నుంచి) వంటి వారు నిర్వహించిన ఈ శాఖను ప్రధాన్కు అప్పగించారు. ఆయన తన ప్రధాని పెట్టుకున్న ఆశలను పూర్తిగా నెరవేర్చగలిగారు. ఆయన మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించిన కార్పొరేట్ లాబీలను, దళారులను చెల్లాచెదురు చేశారు. కార్పొరేట్ గూఢచర్యం ఆరోపణతో వారిలో కొందరు క్రిమినల్ కేసు లను కూడా ఎదుర్కొంటున్నారు. చమురు ధరలకు సంబంధించి యూపీఏ ప్రవేశపెట్టిన విధానాన్ని కొనసాగించడంలో కూడా ప్రధాన్ తన ప్రధానికి యథోచితంగా సహకరించారు. మోదీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజ యాలలో ఒకటైన ఎల్పీజీని ప్రత్యక్ష ప్రయోజన బదలీ పరిధిలోకి చేర్చడంలో కూడా ఆయన తనవంతు సాయం చేశారు. కానీ వచ్చిన చిక్కేమిటంటే, పెట్రోలియం శాఖలో అవినీతిని నిరోధిం చడానికి ఆయన అనుసరిస్తున్న వైఖరి, సరిగ్గా యూపీఏలో రక్షణ శాఖలో అవి నీతిని నిరోధించడానికి ఏకే ఆంటోనీ అనుసరించిన పద్ధతిలాగే ఉంది. తన చుట్టూ గిరిగీసుకున్నారు, ఇప్పటికీ ఏమీ చేయలేదు. కాబట్టి ఎక్కడా తప్పు జరగదు. కొత్త పెట్టుబడులు, షేల్ గ్యాస్, కొత్త తవ్వకాలు అంతా ఆంటోనీ వ్యవహారమే. 5. హోం, రాజ్నాథ్ సింగ్; రవాణా, జాతీయ రహదారులు, నౌకా యానం, నితిన్ గడ్కరీ: రాజ్నాథ్సింగ్ చాలావరకు పత్రికల వారికి దూరంగా ఉంటున్నారు. అయితే మహారాణా ప్రతాప్ వర్సెస్ అక్బర్కు సంబంధించిన చరిత్ర గురించి ఆయన అభిప్రాయంతో మనకు పనిలేదు. అయితే గట్టి రాజ కీయ ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వశాఖలలో ఒకటైన హోంశాఖకు ఆయన నాయకత్వం ప్రతిభావంతంగానే ఉంది. జమ్మూ కశ్మీర్లో బీజేపీ-పీడీపీ సంకీర్ణం విజయవంతంగా సాగడాన్ని బట్టి ఇప్పటికి ఆయన పాస్ మార్కులు సంపాదించుకున్నట్టే. ఆయన తరువాత ఎదుర్కొనే పరీక్ష, ఢిల్లీ. గడ్కరీ, ఎన్డీయే ప్రభుత్వానికి ఎంతో ప్రీతిపాత్రమైన, ఆమోదయోగ్య మైన ఈ కమ్యూనికేటర్, రోజు ఒక్కంటికి జరుగుతున్న రోడ్డు నిర్మాణం గురించి అతిశయోక్తులు వల్లించకుండా నిభాయించుకుని ఉంటే, అంతకంటే మంచిమార్కులు తెచ్చుకునేవారు. నిజానికి జాతీయ రహదారుల పథకాన్ని యూపీఏ కుక్కలు చింపిన విస్తరి చేసింది. దానిని కాస్త దారిలో పెట్టాలని ఎవరు భావించినా కనీసం సంవత్సరం పడుతుంది. చాలా మంది కాంట్రా క్టర్లు దివాలా తీశారు. లేదా పత్తా లేకుండాపోయారు. భూమి సేకరణ లేక పోవడం, ఇంకా మట్టి, ఇటుకలు వంటివాటిని యూపీఏ ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకోవడం ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. మొదట గడ్కరీ తన ఇబ్బంది గురించి ఇంకాస్త బాగా వివరించగలిగే స్థితిలో ఉండాలి. 6. విద్యుత్, బొగ్గు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), పీయూష్ గోయెల్: బొగ్గు రంగంలో ఉన్న విధానపరమైన గందరగోళాన్ని తొలగించే పనిని చక్కగా నిర్వహించిన ఈ యువమంత్రికి ప్రథమశ్రేణి లభిస్తుంది. ప్రధాని ప్రతిష్టాత్మకంగా భావించే పధకాలలో ఒకటైన సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో ఆయన చూపిన ప్రతిభ కూడా యువమంత్రికి ప్రతిష్టను తెచ్చిపెట్టేదే. అయితే, ‘మితిమీరిన’ విద్యుత్, (గ్రిడ్లో చాలా ఉంది. కానీ ఎవరూ కొనుగోలు చేయాలని అనుకోవడం లేదు) ‘అతి కోతలు’ అన్న పరిహాసపూరిత ఆభాసలో ఎందుకు నేటికీ భారత్ తరుచూ చిక్కుకుంటోంది? అందుకు కారణం, దేశంలో విద్యుత్ ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తమైనాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న- బొగ్గుగనుల యజమానుల నుంచి, ఉత్పత్తిదారులు, వారి నుంచి పంపిణీదారులు; వీరి నుంచి బ్యాంకర్ల వరకు అందరి పరిస్థితి ఇదే. ఇది రాజకీయ ఆర్థిక వ్యవస్థ కంటే చాలా విస్తృతమైనది. నిజం చెప్పుకోవాలంటే, యువమంత్రి పరిధికి మించినది. కానీ జయంత్ సిన్హా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ల కలసి ఈ యువమంత్రి బీజేపీకి కావలసిన రేపటితరం బృందాన్ని నిర్మిస్తారు. 7. రక్షణ, మనోహర్ పారికర్; రైల్వే, సురేశ్ ప్రభు: సాపేక్షంగా చూస్తే పారి కర్ ఈ శాఖలో తక్కువ కాలమే పనిచేశారు. అయినా సౌత్ బ్లాక్కు ఆయన తాజాదనంతో పాటు, కొంత క్రమ రాహిత్యాన్ని కూడా తెచ్చారు. ఒక ఉగ్రవా దిని పట్టుకోవడానికి ఇంకో ఉగ్రవాదికే సాధ్యం వంటి ప్రకటనలు ఇస్తేనేమి, అలాంటి మాటలు వివాదాస్పదమైతేనేం, ఆంటోనీ సృష్టించిన ఎనిమిదేళ్ల నిశ్శబ్దం తరువాత ఈ శాఖకు అందుబాటులో ఉండే, తన మనసులో ఉన్నదే మిటో బయటకు చెప్పే ఒక మంత్రి రావడం అద్భుతమే. విలువైన ఆయన చదువుకు కానుకగా (ఐఐటీ, ముంబై), నిజాయితీపరునిగా ఆయనకు ఉన్న ప్రతిష్టలతో పారికర్కు ఆ పదవి లభించింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దదైన సైన్యాన్ని నిర్వహించడం ఒక్కటే కాదు, ఆ పదవి ద్వారా ఆయన నిర్వహించవలసిన చాలా ముఖ్య కార్యకలాపాలు ఇంకా ఉన్నాయన్న సంగ తిని ఆయన ఆవిష్కరించాలి. సైనిక వ్యవహారాలలో విప్లవం (రివల్యూషన్ ఇన్ మిలటరీ ఎఫైర్స్) మీద చర్చల దగ్గర నుంచి, సైన్యం ఉపయోగం గురిం చీ, రక్షణ,నియంత్రణలను గురించి మొత్తం సిద్ధాంతం తయారైంది. ఎటొచ్చీ ఇప్పుడు భారత్కు ఆ అంశాలలో కరతలామలకమైన పట్టు ఉన్న ఒక రక్షా మంత్రి కావాలి. తను ఎంతో అభిమానించే మంత్రిత్వ శాఖకు మోదీ ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి సురేశ్ ప్రభు. ఆయన కూడా నిస్సంకోచంగా బాధ్యతలు స్వీకరించారు. మొదటిసారి రైల్వే బడ్జెట్ కొత్త రైళ్లను ప్రతిపాదించలేదు. పాత, ప్రజాకర్షక లక్షణాలను మార్చుకోలేదు. ఆయన పని చాలా విస్తృతమైనది. అందుకు ఆయనకు కొంత సమయం, సహనం కూడా కావాలి. 8. ఆర్థికశాఖ, అరుణ్ జైట్లీ: మంత్రిమండలిలో అత్యంత ప్రాధాన్యం కలి గిన రెండో సభ్యునిగా అరుణ్ జైట్లీ తన ప్రధానికి బాగానే సేవలు అందిం చారు. కొన్ని అంకెలతో పేచీ రాబోతున్నప్పటికీ ఆయన బడ్జెట్ పురోగ మనదృష్టి కలిగినదే. ఆయన వ్యాపారవేత్తలకు, మీడియాకు (ఆయన సమా చార, ప్రసారశాఖ మంత్రి కూడా) అందుబాటులో ఉంటారు. చెప్పిందే చెబుతూ, సూటిగా చెప్పవలసింది చెబుతారు. అయితే పాత పునరావృత పన్ను విధాన నిబంధనను ఎందుకు తొలగించలేకపోతున్నారో మాత్రం చెప్ప రు. పన్నుల బీభత్సం గురించి భయపెడుతున్న మ్యాట్-ఫీ అంశాన్ని ఎం దుకు పరిశీలించరో కూడా వివరించరు. 9. విదేశీ వ్యవహారాలు, సుష్మా స్వరాజ్: ఎంతో మాట్లాడవలసిన మంత్రి త్వశాఖలో ఉండి మౌనంగా ఉన్న మంత్రి. అయితే విదేశాంగ విధానం మీద ప్రధాని సరికొత్త అభిప్రాయాలను గురించి కొన్ని వేదికల మీద మాత్రం ఆమె గట్టిగానే మాట్లాడారు. ఆమె విదేశీ వ్యవహారాల కార్యాలయాన్ని బాగా నిర్వహించారు. మానవీయ కోణానికి అవకాశం ఇచ్చారు. ఎమెన్ నుంచి భారతీయులు నిరాశతో సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశాలకు కూడా స్పందించారు. అందుకే ఇండియా టుడే తాజా సంచిక నిర్వహించిన పోల్స్ ప్రకారం ఆమె ఉత్తమమంత్రి స్థానం గెలుచుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం పార్లమెంటులో భూమి సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అన్ని పార్టీలతో కలసి ఆమె నిర్వహించిన పాత్ర చెప్పుకోదగినది. 10. గణాంకాలు (సహాయ మంత్రి, ఇండిపెండెంట్ చార్జి), విదేశీ వ్యవహా రాలు (సహాయ మంత్రి) రిటైర్డ్ జనరల్ వీకే సింగ్: ఇండిపెండెంట్ మంత్రిగా ఆయన నిర్వహించిన ఆసక్తికర అంశాలు ఏమిటో ఇంకా మనకు తెలియవలసి ఉన్నా, ఆయనే మన టాపర్. ఆయనకు ప్రత్యేకంగా రెండు లక్ష్యాలను నిర్దేశిం చారు. ఎమెన్లో ఏకాకులైన భారతీయులను తరలించడం అందులో ఒకటి. దానిని ఆయన అత్యంత శ్రద్ధతో, నిబద్ధతతో నిర్వహించారు. రెండోది- మీడి యాను గందరగోళం చేయడం. మొదటిదానిలాగే దీనిని కూడా చాలా అభి రుచితో, ఒంటి చేత్తో నిర్వహించారు. ప్రధాని బహిరంగంగా ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి ఆయన ఒక్కరే. విశాల్ భరద్వాజ్ ‘సి’ అనే పదాన్ని తెచ్చినట్టు, ఆయన ‘పి’ అనే పదాన్ని మన ఉపన్యాసాలకు అందించారు. ఆయనకు రేటింగ్ను నిర్ణయించడం చాలా సీరియస్ అంశమే. అదెందుకో కూడా నేను నొక్కి చెప్పాలి. నేను ఆయ న్ను సమర్థిస్తున్నప్పుడు (పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా వీకే సింగ్ ఆ దేశ హైకమిషన్ కార్యాలయానికి హుందాగా, విధ్యుక్తధర్మంతో వెళ్లిన పుడు నేను ఇలాగే సమర్ధించాను) లక్షలాది ఆయన అభిమానుల ముందు మరుగుజ్జనయిపోతాను. ఏమైనా 10/10 మంది భిన్నభిన్న ఫలితాలు సాధి స్తారేమో వేచి చూద్దాం. శేఖర్ గుప్తా shekhargupta653@gmail.com -
‘గుజరాత్’ సేద్యం.. పెద్దల భోజ్యం
రెండోమాట ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. నరేంద్ర మోదీ పదే పదే ప్రచారం చేసుకున్న ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ లో బడుగు బలహీన వర్గాలకు చోటుండదు. అది బహుజనులతో కూడిన సమాజాన్ని చీల్చే ‘అభివృద్ధి’ నమూనా. కీలక రంగాలలో కేంద్రీకరించాల్సిన అభివృద్ధిని మోదీ ‘గుజరాత్ నమూనా’ నిర్వీర్యం చేస్తుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలూ, వివిధ సర్వేలూ, సాధికార గణాంకాలే ఇందుకు సాక్ష్యం. అతుల్ సూద్, కల యర్సన్: ప్రసిద్ధ విశ్లేషకులు (13-6-2014) గుజరాత్ అభివృద్ధి నమూనా వందిమాగధ ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గా న్ని పెంచే నమూనా. కొద్దిమంది చేతులలో సంపద కేంద్రీకరణకు దోహదం చేసే నమూనా. గుజరాత్లో పరిశ్రమాభివృద్ధి జరగలేదని నేనడం లేదు. కాని, రూ.30,000 కోట్ల వెచ్చించిన నూనెశుద్ధి కర్మాగారం, కేవలం 400 మం దికి ఉపాధి కల్పిస్తే ఒరిగేదెంత? ఈ అభివృద్ధి నమూనా వల్ల సామాజిక న్యాయం లేదా సమానత్వం సిద్ధించడం కల్ల. క్రిస్తీ ఫెర్నాండెజ్ (మోదీ సీఎంగా పనిచేసిన కాలంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి) 20-5-2015న చేసిన వ్యాఖ్య ఎన్నికల ప్రణాళికల పేరుతో రాజకీయ పక్షాలు చేసే బాసలన్నీ ఆచర ణలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇది ప్రజల అనుభవం. అబ ద్ధాల అంకయ్యలకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఇలా వచ్చిందే. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి ఒక సంవత్సరం గడిచిన సందర్భం ఇది. సినిమా వందరోజులు ఆడితే చాలునని కొందరు దర్శక నిర్మాతలు ఈ రోజులలో కోరుకుంటూ ఆత్మతృప్తి పొందుతున్నట్టే, బీజేపీ నాయకులు కూడా ఏడాది పాలనకే ఆత్మ సంతృప్తి చెందవలసిన ఆవశ్యకత వచ్చింది. అయితే వారి ఆత్మతృప్తిని మనం కాదనలేం. ఆ హక్కు మనకు లేదు. అప్పటిదాకా ఏలిన పార్టీల నిర్వాకంతో విసిగి వేసారిపోవడం వల్ల కావచ్చు. వాగ్ధాటితో నేతలు తమను నమ్మించడం వల్ల కావచ్చు. ప్రజలు దింపుడు కల్లం ఆశతో ఓట్లు వేస్తున్నారు. మోసపోతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇదంతా నిరూపితమవుతున్న దశలో మనం ఉన్నాం. యూపీఏ, ఎన్డీయే పాలక వ్యవస్థలు ఆ దశలో భాగాలే. వాటి మధ్య ఆచరణలో వ్యత్యా సాలు తక్కువ. యూపీఏ హయాంలోనూ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక విధానాలు యథేచ్ఛగా అమలైనాయి. అటల్ బిహారీ వాజపేయి కాలం నుంచి, నేటి పరివార్ కూటమి ఏలుబడి వరకు జరిగినదీ, జరుగుతున్నదీ అదే. దేశ విదే శీ గుత్త పెట్టుబడులకు అనుకూలంగా వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలు జరుగుతూనే వచ్చాయి. 1894 నాటి భూసేకరణ చట్టానికి యూపీఏ సవరణ తెచ్చింది. ఆహార భద్రతకు ఆధారంగా ఉన్న పంట భూములను తాకకుండా, ప్రభుత్వ భూములను పరిశ్రమాభివృద్ధికి వినియోగించేటట్టు జాగ్రత్తలు తీసుకోవడం ఆ సవరణ ఉద్దేశం. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. గుజరాత్ నమూనా ఇంతకీ గ్రామీణ గుజరాత్లో ఈ అభివృద్ధి నమూనా కింద ఎలాంటి సాగు జరుగుతున్నదో గమనించడానికి రెండు ఉదాహరణలు చాలు. ఈ రెండు ఉదాహరణలు (ఫొటోలు చూస్తే తెలుస్తుంది) మోదీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనిది ఒకటి కాగా, రెండవది చివరి మూడేళ్ల కాలానికి చెందినది. మొదటిది: అహ్మదాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని కాయ్లా అనే గ్రామంలో పత్తి విత్తనాలు చల్లుకోవ డానికి ఒక గుజరాత్ కుటుంబం తన సభ్యులతోనే కాడి పట్టించవలసి వచ్చింది. ఆధునిక యంత్రాలకు నోచుకోకపోవడమే కాదు, కనీసం ఎడ్లతో కూడా కాకుండా వారే (2011) దుక్కి దున్నుకోవలసివచ్చింది. హిందూ గ్రూప్నకు చెందిన ‘ఫ్రంట్లైన్’ ఏప్రిల్ 14, 2014లో ఈ ఫొటోను ప్రచు రించింది. మోదీ చెబుతున్న అభివృద్ధి నమూనాలో చోటు లేని గ్రామీణ రైతు కుటుంబాలు దానికి బయటే ఉండిపోయిన సంగతిని ఈ ఫొటో చెబుతోంది. రెండవ ఫొటో.. అహ్మదాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలోని లక్తార్ తాలూ కాలోని వాద్లా గ్రామానికి చెందిన చిత్రం(ఫ్రంట్లైన్, 13-6-2014). ఆధు నిక యంత్రాలు కాని, ఎద్దులు కాని లేకుండా పురాతన నాగలితోనే రైతు కుటుంబం పొలం దున్నుకుంటోంది. మోదీ దేశాన్ని నమ్మిస్తూ వస్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనాకు ఇవి సాక్ష్యాలా? లేక వక్రభాష్యాలా? భూసేకరణ చట్టంలో యూపీఏ తీసుకువచ్చిన సవరణ మీద మోదీ ప్రతిపాదించిన సవరణ దగ్గరకు మళ్లీ ఒక్కసారి వద్దాం. 2013 చట్టం ప్రకారం భూములను సేకరించడానికి నూటికి 70 నుంచి 80 మంది రైతుల స్వచ్ఛంద అనుమతి అవసరం. ఆ సేకరణ మూలంగా సామాజిక జీవనం మీద పడే ప్రభావాన్ని గురించి సర్వే జరగాలి. జనాభిప్రాయం తెలుసుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే నిరాకరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను ఒకటికి రెండుసార్లు ప్రవేశపెట్టింది. కాబట్టి ఇచ్చిన ఆర్డినెన్స్ను గానీ, రైతాంగ వ్యతిరేక సవరణ లను గానీ ఉపసంహరించుకోవడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ఇంకా వెలుగుచూడని ఈ ఆర్డినెన్స్/బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చి రైతుల మీద సవారీ చేయడం మొదలుపెట్టారు. రాణ్ ఆఫ్ కచ్ రైతుల అనుభవం 1965 నాటి ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన 5,000 మంది పంజాబీ, హరియాణా రైతుల శ్రమ కూడా 2010లో, అంటే మోదీ హయాం లోనే దగా పడింది. ఈ అంశం మీద సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం నడు స్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ యుద్ధం సమయంలో ఆ రైతులు గుజ రాత్కు వలస వచ్చి రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో స్థిరపడవలసి వచ్చింది. యుద్ధంతో నిర్వాసితులైన ఆ రైతులనూ, మిగిలిన సైనికులనూ ఆ సరి హద్దులో స్థిరపడవలసిందిగా నాటి ప్రధాని సాక్షాత్తు లాల్ బహదూర్ శాస్త్రి కోరారు. అప్పటికి అదంతా ఊసర క్షేత్రం. పైగా పొరుగునే ఉన్న పాకిస్తాన్ చొరబాట్లకు అది ఆలవాలం. బండరాళ్ల నేల. ఆ రైతులే ట్రాక్టర్లతో, పశువుల సాయంతో నేలను సరి చేసుకున్నారు. 400 అడుగులు వెడితే గాని నీరు రాదు. వర్షాలు కురిసే ప్రాంతం కాదు. అలాంటి నేల మీద పత్తి, వేరుశెనగ, గోధుమ, మామిడి, ఖర్జూరం వంటి పంటలు పండించే సరికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇంత కష్టపడినా, వచ్చి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారు స్థిర నివాసం ఏర్పరుచుకున్న నిర్వాసితులుగానే పరిగణనలో ఉన్నారు. వారే అభివృద్ధి చేసుకున్న భూమి మీద వారు రుణం పొందలేరు. అమ్మలేరు. కాలక్రమంలో వారి ఉనికికే ఎసరు పెడుతూ గుజరాత్ ప్రభుత్వం రాణ్ ఆఫ్ కచ్ రైతులు ఖాళీ చేయాలని కచ్ జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. 2010లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నట్టు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంలో వారు మోదీని కలుసుకోవడానికి యత్నించి కూడా విఫలమ య్యారు. ‘మేమంతా భారతీయ రైతులమే. గుజరాత్లో బతుకుతూ ఇక్కడి వారి కోసం భూములు సాగుచేస్తున్నాం. మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, మాతో భూమిని వెంటబెట్టుకుని పోలేం.’ అని చెప్పినా ఎవరూ కరగలేదు. ఈ వివాదం గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. ముగ్గురు న్యాయమూర్తులు ఐదురోజులు రైతుల గోడు విన్నారు. తరువాత,‘కచ్లో రైతులకు మాత్రమే సొంత భూమి ఉండాలి’ అని తీర్పు చెప్పారు. కానీ గుజరాతీ రైతులకే భూములు ఉండాలని అని చెప్పలేదు. ‘వారు పంజాబీ రైతులు అయితే వారికి కచ్ భూముల మీద హక్కు ఉంది అని కూడా స్పష్టం చేసింది. రైతులే కేసు గెలిచారు. కానీ భూమి దక్కలేదు. మోదీ ప్రభుత్వం ఈ కేసును సుప్రీం కోర్టుకు (2012, జూలై 9) లాగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఈ రోజుకీ రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒక మేడిపండు. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మోదీ.. అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడండి!
కాంగ్రెస్ ఎద్దేవా న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారంటూ ప్రధాని మోదీ చేసిన అరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘బాధ్యతాయుత పదవిలో ఉన్నారు.. కనీసం అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడండి’ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ మోదీకి వ్యంగ్యంగా సూచించారు. ‘కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చింది సోనియాగాంధీనే కనుక ప్రజలకు అవసరమైన విధానాలు, పథకాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆమె కోరడం సహజమే. అంతేకానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ విషయంలో ఆమె జోక్యం చేసుకున్నారన్నది పచ్చి అబద్ధం’ అన్నారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ, రైతులకు రుణమాఫీ.. ఇవన్నీ సోనియా గాంధీ సూచనల మేరకే వచ్చాయని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ ఇంకా జీర్ణించుకోలేదన్న మోదీ వ్యాఖ్యపై స్పందిస్తూ.. ‘ఓటమి జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నాకు తెలియదు. అలా అయితే, జనసంఘ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఈ సమస్య ఉండి ఉండాలి’ అని చురకంటించారు. -
‘బొగ్గు గనుల కేటాయింపులో నిర్ణయం మన్మోహన్దే’
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుపై నిర్ణయాలను ఆ శాఖ మంత్రి హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా బుధవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా గుప్తా కేవలం సిఫారసులే చేశారని గుప్తా న్యాయవాది కోర్టుకు నివేదించారు. జార్ఖండ్లోని రాజ్హరా నార్త్బ్లాక్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ బుధవారం చార్జిషీటు దాఖలు చేసిన సందర్భంలో కోర్టులో వాదనలు జరిగాయి. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే..
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రజల దృష్టిని అనవసర అంశాలపైకి మళ్లించేందుకు అవినీతి అంశంపై ఆధారపడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ముసుగులో సంక్షేమ రాజ్య నిర్మాణం మొత్తాన్నీ ధ్వంసం చేస్తున్నారని తప్పుపట్టారు. తీవ్ర వివక్ష, మతతత్వంతో కూడిన అభిప్రాయాన్ని ప్రచారం చేసేందుకు చరిత్రను నిరంతరం తిరగరాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ బుధవారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తన సహజ స్వభావానికి భిన్నంగా అనూహ్య రీతిలో మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలతో దాడికి దిగారు. ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను ప్రశ్నించారు. ‘గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్థిక పునరుద్ధరణ బలహీనంగా ఉంది. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలకు ముప్పు పొంచివుంది. అసమ్మతిని అణచివేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. గర్వకారణమైన సమ్మిళిత సాంస్కృతిక సంపద గల భారత్ నిజమైన బహుళత్వ, స్వేచ్ఛాయుత, లౌకిక ప్రజాస్వామ్యంగా వికసించేలా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడిందన్నారు. తమ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చాలా పథకాలను కొత్త పేర్లతో మోదీ సర్కారు ప్రవేశపెడుతోందని ఎద్దేవా చేశారు. ‘ఎన్డీయే సర్కారు చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త తయారీ విధానమేనన్నారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు... ‘‘నాకు సంబంధించినంత వరకూ.. నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా ధనవంతులు అయ్యేందుకు నేను ప్రభుత్వ అధికారాన్ని ఎన్నడూ వినియోగించలేదు’’ అని మన్మోహన్ స్పష్టంచేశారు. 2జీ స్పెక్ట్రమ్ టెలికాం లెసైన్సుల కేటాయింపుల్లో సహకరించకపోతే హాని తలపెడతామని నాటి ప్రధాని మన్మోహన్ తనను హెచ్చరించారంటూ ట్రాయ్ మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపణల నేపధ్యంలో మన్మోహన్ పై విధంగా స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ సర్కారు యూపీఏ పాలన అవనితీమయమని, విధానపక్షవాతం ఉండేదని అవాస్తవాలను ప్రచారం చేస్తోందని తప్పుపట్టారు. మోదీతో మన్మోహన్ భేటీ... మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన మన్మోహన్ కొన్ని గంటల తర్వాత మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ‘డాక్టర్ మన్మోహన్సింగ్ గారిని కలవటం ఎంతో సంతోషంగా ఉంది. 7 రేస్ కోర్స్ రోడ్కు ఆయనను మరోసారి ఆహ్వానించా ను. మా భేటీ బాగా జరిగింది’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మోదీ, మన్మోహన్ ఆర్థిక, విదేశాంగ అంశాలపై చర్చించారని కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ తెలిపారు. -
నాడు అధికారమంతా ఆమెదే!
యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా సోనియా రాజ్యాంగ వ్యవస్థలను పక్కనబెట్టి పెత్తనం చేశారు {పధాని మోదీ నిశిత ఆరోపణలు {పోగ్రెస్కు వ్యతిరేక పదం కాంగ్రెస్ ఏడాదిగా స్కామ్ల్లేవు; ఇవి అచ్ఛేదిన్ కావా? న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి కార్యాలయంపై వాస్తవ అధికారాలను ఆమే చెలాయించారని ఆరోపించారు. పార్లమెంట్లో ఎన్డీయే ప్రభుత్వం అహంకార పూరిత మొండితనం ప్రదర్శిస్తోందని, ఒకే వ్యక్తి కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వం ఇదని సోనియా చేసిన ఆరోపణలను మోదీ తిప్పి కొట్టారు. ‘‘రాజ్యాంగేతర శక్తులే నిజమైన అధికారం చెలాయించిన గత ప్రభుత్వ హయాం నాటి విషయాన్ని ఆమె ప్రస్తావించారు కాబోలు. ఇప్పుడు అధికారం రాజ్యాంగబద్ధ శక్తుల చేతుల్లో మాత్రమే ఉందన్నది నిజం. ‘రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు.. రాజ్యాంగేతర శక్తుల మాట వినట్లేదు’ అనేదే మాపై ఆమె ఆరోపణ అయితే.. ఆమెకు మా క్షమాపణలు’’ అంటూ చురకలంటించారు. ప్రతిపక్ష నేత సోనియాపై మోదీ ప్రత్యక్షంగా, తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించడం అధికారంలోకి వచ్చాక బహుశా ఇదే తొలిసారి. సోనియా, రాహుల్లపై నిశిత విమర్శలతో పాటు పలు అంశాలపై ఆయన బుధవారం పీటీఐ వార్తాసంస్థకుఇంటర్వ్యూ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణలు సహా వివిధ అంశాలపై మోదీ సమాధానాలు ఆయన మాటల్లోనే.. అధికారమంతా పీఎంఓలో ఉందనడంపై ‘రాజ్యాంగేతర అధికార కేంద్రాలు రాజ్యాంగబద్ధ వ్యవస్థైన ప్రధాని కార్యాలయం(పీఎంఓ) పై అధికారం చెలాయించిన సమయంలో ఈ ప్రశ్న మీరు వారినడిగుంటే బావుండేది. ప్రధాని, పీఎంఓ.. ఈ రెండు రాజ్యాంగం వెలుపలి అధికార కేంద్రాలు కావు. అవి రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మేం అధికారంలోకి వచ్చాక శాఖలవారీగా అధికారాలను బదలాయించాం. దాంతో గతంలో కేబినెట్టో లేక ప్రధానమంత్రో తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు శాఖల స్థాయిలోనే తీసుకునే పరిస్థితి నెలకొంది. మంత్రిత్వశాఖల ఆర్థిక స్వాతంత్య్రాన్ని మూడురెట్లు పెంచాం. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చాం. ప్రభుత్వ విధానాల్లో మేమేం మార్పులు చేయలేదు. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలో వారే తీసుకునేలా వ్యవస్థలో మార్పు తెచ్చాం’ వ్యవసాయ సంక్షోభంపై.. ‘చాన్నాళ్లుగా ఈ ఆందోళనకర సమస్యను ఎదుర్కొంటున్నాం. రాజకీయ లబ్ది కోసం ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం కాదు. అన్నదాతల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయబోదని నేను రైతులకు హామీ ఇస్తున్నా. రైతులకు సంతృప్తి, భద్రత కలిగించేందుకు అవసరమైన సూచనలివ్వమని నేను అన్ని పార్టీలను కోరాను. మైనారిటీలపై దాడులపై.. ‘ఈ దేశంలో ఏ వ్యక్తిపై కానీ, సంస్థపై కానీ ఎవరైనా సరే నేరపూరిత చర్యకు పాల్పడటాన్ని కచ్చితంగా ఖండించాల్సిందే. అలా దాడులకు దిగేవారికి చట్టప్రకారం కచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏ మతంపై, లేదా వర్గంపై వివక్ష చూపడాన్ని, హింసకు పాల్పడటాన్ని సహించబోమని గతంలోనూ చెప్పా. మళ్లీ చెబుతున్నా’ ఎన్జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలపై ‘గత ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల ఆధారంగానే తప్పులకు పాల్పడిన స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకున్నాం. చట్ట వ్యతిరేకంగా ఏ చర్యా చేపట్టలేదు. దేశభక్తుడైన ఏ భారతీయుడూ మా చర్యను తప్పుబట్టడు’ భవిష్యత్ కార్యాచరణ..‘ఇకపై రైతులు, పట్టణ పేదలు, మహిళలు, నిరుద్యోగిత.. ఈ అంశాలపై దృష్టి పెడతాం. ఈ ఏడాదిలో మేం చేపట్టిన కార్యక్రమాలను గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయికి తీసుకువెళ్తాం’ అధికార వ్యవస్థపై..‘మేం పాలన చేపట్టేనాటికి అధికార వ్యవస్థ నైతికస్థైర్యం కోల్పోయి ఉంది. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. వారిలో విశ్వాసం నెలకొల్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేబినెట్ వ్యవస్థా రాజ్యాంగేతర శక్తులు, మంత్రుల్లో గ్రూపులతో నిస్పృహలో ఉంది. ఆ పరిస్థితిని మార్చి ఉత్సాహ వాతావరణం నెలకొల్పాం. అధికార కేంద్రాల గురించి.. ‘మేం అధికారంలోకి వచ్చే సమయానికి ఢిల్లీలో అధికార కార్యాలయాలన్నీ లాబీయిస్టులతో నిండిపోయి ఉన్నాయి. ఆ వ్యవస్థను నిర్మూలించేందుకు చాలా సమయమే పట్టింది. కానీ సుపరిపాలనకు అది చాలా అవసరం’. వరుస విదేశీ పర్యటనలపై.. ‘పొరుగుదేశం నేపాల్కు 17 ఏళ్ల పాటు ఏ ఒక్క ప్రధానీ వెళ్లకపోవడం సరైన విధానం కాదు. మనది పెద్ద దేశమైనంత మాత్రాన అహంకారంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న వాతావరణం వేరు. డబ్ల్యూటీవో లాంటి అంతర్జాతీయ సంస్థల సదస్సుల్లో జరిగే ఒప్పందాలను మనమూ ఆమోదించక తప్పని పరిస్థితి.ఆ సదస్సుల్లో మనం పాల్గొనకపోతే మన వాదన వినిపించే అవకాశ ముండదు. అంతర్జాతీయీకరణ చెందిన ఉగ్రవాదం ఏ చిన్న దేశం నుంచైనా మొదలుకావచ్చు. నా విదేశీ పర్యటనలను విమర్శిస్తోంది విపక్ష నేతలు మాత్రమే. ఇటీవలి సర్వేల్లో ప్రజలంతా నా విదేశాంగ విధానానికే పట్టం కట్టారు’ భూ సేకరణ బిల్లుపై.. ‘రాజకీయ బురద జల్లుడు కార్యక్రమంలోకి నేను దిగదల్చుకోలేదు. భూ సేకరణ అనేది నిజానికి రాష్ట్రాల పరిధిలోని అంశం. భూములపై అన్ని హక్కులు రాష్ట్రాలకే ఉంటాయి. కేంద్రానికి భూమితో అవసరం లేదు. 120 ఏళ్ల భూ సేకరణ చట్టానికి గత ప్రభుత్వం కనీసం 120 నిమిషాలు కూడా పార్లమెంట్లో చర్చ జరపకుండానే సవరణలు చేసింది. రైతులకు ఉపయోగకరమేనని భావించి మేమూ అప్పుడు మద్దతిచ్చాం. తర్వాత రాష్ట్రాల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తప్పులు సరిచేయడంలో అహంభావంతో వ్యవహరించడం సరికాదు. అందుకే గత ప్రభుత్వ తప్పుల్ని సవరిస్తూ మళ్లీ బిల్లును రూపొందించాం. మా ప్రతిపాదనలను రాజకీయాలను పక్కనబెట్టి పరిశీలించినవారు మాకు పూర్తి మద్దతిస్తారు. గ్రామం, రైతు, పేద.. వీరికి ఉపయోగపడే సూచనలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు భూ సేకరణ చట్టంలో సవరణలు అవసరమని కోరిన పార్టీలే.. ఇప్పుడు ఆ బిల్లును వ్యతిరేకించడం నాకు అర్థంకాని విషయం’ సూటు, బూటు విమర్శలపై.. ‘ఏడాది గడచినా లోక్సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని కాంగ్రెస్ ఇంకా మర్చిపోలేకపోతోంది. వాళ్ల పాపాలు, తప్పులకు జనం వారిని శిక్షించారు. ఓటమి నుంచైనా వారు గుణపాఠం నేర్చుకుంటారనుకున్నాం. ఇంగ్లిష్లో ‘ప్రొ’కు వ్యతిరేకపదం ‘కాన్’. ప్రోగ్రెస్కు వ్యతిరేకపదం కాంగ్రెస్ అని గతంలో మేమన్న మాట నిజమని వారి వైఖరితో మళ్లీ స్పష్టమైంది’ ‘అచ్ఛే దిన్’పై.. ‘ఏడాదిగా ఒక్క అవినీతి స్కామూ లేదు. ఇవి అచ్ఛే దిన్(మంచిరోజులు)కావా? 21వ శతాబ్ది భారత్దే కావాలి. కానీ 2004- 2014 మధ్య తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆలోచనలు భారత్ను బాగా దెబ్బతీశాయి’ -
ఆ బిల్లు ‘రియాలిటీ’ ఏమిటి?
- స్థిరాస్తి బిల్లుపై రాహుల్ ఆందోళన.. కేవలం రాజకీయమేనా? - యూపీఏ తెచ్చిన బిల్లుకు ఎన్డీఏ సర్కారు సవరణలు సరైనవేనా? న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు తీసుకువచ్చిన స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) బిల్లు కొనుగోలుదారుడి కన్నా నిర్మాణదారుడికే (బిల్డర్కే) ప్రయోజనం కలిగిస్తుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ.. మధ్య తరగతి పట్టణ గృహ కొనుగోలుదారు కష్టాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో పారదర్శకత నిబంధనలను తొలగించిందని.. మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యేందుకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ నెల 5వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించగా.. బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపించాలని విపక్షాలు పట్టుపట్టటం.. ప్రభుత్వం అందుకు అంగీకరించి ఆ కమిటీకి పంపించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థిరాస్తి బిల్లులోని అంశాలు, బీజేపీ చేసిన సవరణలు, వాటిపై ఆందోళనలు, రాజకీయాల వివరాలివీ... బిల్లు ఏమిటి..? ఏం చేస్తుంది..? ప్రతి రాష్ట్రంలో నియంత్రణ సంస్థలను నెలకొల్పటం ద్వారా స్థిరాస్తి ప్రాజెక్టులను పర్యవేక్షించటం లక్ష్యంగా స్థిరాస్తి (నియంత్రణ, అభివృద్ధి) బిల్లును యూపీఏ ప్రభుత్వం 2013 ఆగస్టు 14న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్డర్లు వినియోగదారులతో లావాదేవీలు జరిపేటపుడు నిర్దిష్ట ప్రమాణీకృత నిబంధనలను పాటించేలా చూడటం ఈ సంస్థల లక్ష్యం. తొలి బిల్లు లోని కొన్ని ముఖ్య నిబంధనలివీ... - స్థిరాస్తి ప్రాజెక్టులను నియంత్రణ సంస్థ వద్ద రిజిస్టరు చేయాలి. లేదంటే బిల్డర్లు స్థిరాస్తులను విక్రయించజాలరు. - బిల్డర్లు ప్రాజెక్టు లేఔట్ ప్రణాళిక, షెడ్యూలు, విస్తీర్ణం వివరాలను నియంత్రణ సంస్థకు వెల్లడించాలి. - కొనుగోలుదార్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచి.. దానిని కేవలం నిర్మాణానికి మాత్రమే వినియోగించాలి. యూపీఏ ప్రభుత్వం దీనిని 70 శాతంగా నిర్ణయించింది. ఇది.. బిల్డర్లు ఒక ప్రాజెక్టు పేరుతో డబ్బు తీసుకుని, ఆ మొత్తాన్ని వేరొక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టటాన్ని నిరోధిస్తుంది. రాష్ట్రాలు కావాలనుకుంటే దీనిని తగ్గించుకోవచ్చని పేర్కొంది. ఈ బిల్లు ఎందుకు అవసరమైంది..? జనం తమ డబ్బును పెట్టుబడులుగా పెడుతున్న ప్రధాన రంగం స్థిరాస్తి రంగం. నిజానికి దేశంలో నల్లధనం వినియోగించటానికి ఈ రంగం తేలికైనది, అతి పెద్దది కూడా. అయినా స్థిరాస్తి రంగంపై నియంత్రణ లేదు. అధిక విలువ గల ఆస్తుల కన్నా.. అతి చిన్న పెట్టుబడి రంగాలైన కంపెనీల్లో షేర్లు, బీమా వంటి రంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. దేశంలో కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తిని కొనుగోలు చేయటం కన్నా.. బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించటానికి ఎక్కువ పత్రాలు, వివరాల నమోదు అవసరమవుతాయని నిపుణులు చెప్తున్నారు. స్థిరాస్తి కొనుగోలుకు నేరుగా డబ్బు చెల్లించేటపుడు పర్యవేక్షణా ఉండదు. నల్లధనం ఉన్నవారికి ఈ పెట్టుబడులు ప్రయోజనం. కానీ.. మధ్యతరగతి వేతన జీవిని.. నియంత్రణ లేని రంగంతో వ్యవహరించటం దెబ్బతీస్తోంది. ఎన్డీఏ చేసిన సవరణలు ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం ఈ స్థిరాస్తి బిల్లుకు ఏకంగా 118 సవరణలు చేసింది. ఈ సవరణల్లో సమస్యాత్మకమైనవి... - ప్రబ్యాంకు ఖాతాలో ఉంచి, నిర్మాణ ఖర్చుకు మాత్రమే వినియోగించటానికి పక్కన పెట్టాల్సిన కొనుగోలుదారుడి సొమ్ము శాతాన్ని 70 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. - తొలి బిల్లులో ‘కార్పెట్ ఏరియా’కు స్పష్టమైన నిర్వచనం ఉంది. బీజేపీ తెచ్చిన బిల్లులో ‘కార్పెట్ ఏరియా’ నిర్వచనాన్ని.. జాతీయ నిర్మాణ నియమావళి (నేషనల్ బిల్డింగ్ కోడ్)లో ఉపయోగించిన విధంగా ‘రెంటబుల్ ఏరియా’ నిర్వచనంగా చూపారు. ఈ నియమావళిని ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే సవరించవచ్చు. దీనివల్ల.. ఆ తర్వాత కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా ఉండేలా త్వరగా మార్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. - తొలి బిల్లులోని నిబంధనల ప్రకారం.. బిల్డరు ప్రాజెక్టు ప్రణాళికకు నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందిన తర్వాత దానిని మార్చటానికి అవకాశం లేదు. కొత్త బిల్లు.. బిల్డరు ప్రాజెక్టు ప్లాన్కు ‘స్వల్ప మార్పులు’ చేసుకోవటానికి అవకాశం అందిస్తోంది. - ఆలస్యమైన ప్రాజెక్టులు.. ‘పూర్తయినట్లు ధృవీకరణ పత్రం, అనుమతులు’ తదితర కారణాల వల్ల ఆలస్యమైనట్లయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొత్త బిల్లు అవకాశమిస్తోంది. -
పెట్రో మంటలు
పెట్రో, డీజిల్ ధరల పెంపుపై సర్వత్రా వ్యతిరేకత బయలుదేరింది. వెనక్కు తీసుకోవాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చమురు కంపెనీల తీరుపై జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపు తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ⇒ రాజకీయ పక్షాల ఆగ్రహం ⇒ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ ⇒ సంబంధం లేదన్న పొన్ రాధాకృష్ణన్ ⇒ పెంపును నిరసిస్తూ ఆందోళనలు సాక్షి, చెన్నై : యూపీఏ హయాంలో పెట్రోల్, డీజిల్తో పాటుగా అన్ని రకాల ధరల మోత ప్రజల జీవితాల్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. యూపీఏ పతనంతో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వంతోనూ ప్రజలకు ఒరిగింది శూన్యమే. తమ జీవితాల్లో మార్పులు వస్తాయని, ధరలు దిగి వస్తాయన్న ప్రజల ఆశలు అడియాశలు అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెట్రోల్ డీజిల్ ధరలపై ఇటీవల కాలంగా కనీవిని రీతిలో ధరల మోత మోగించడం సర్వత్రా ఆగ్రహాన్ని రేపుతున్నది. పెట్రోల్పై రూ. 4.18, డిజిల్పై 2.55 పెంచి రాత్రికి రాత్రే అమల్లోకి తీసుకురావడంతో యూపీఏ పాలనను ఎన్డీఏ గుర్తుకు తెస్తున్నదని చెప్పవచ్చు. చమురు సంస్థలు తీసుకున్న ఈ పెంపు నిర్ణయంతో అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు మరింత మండే అవకాశాలు నెలకొన్నాయి. దీంతో రాజకీయ పక్షాలు ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని చోట్ల పెంపును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. నేతల ఆగ్రహం: పెట్రో, డీజిల్ ధరల పెంపును అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తీవ్రంగా ఖండించారు. పేద, మధ్య తరగతి వర్గాలు అనేక కష్టాలు పడుతున్న సమయంలో ఇలా ధరల్ని పెంచడం భావ్య మా అని ప్రశ్నించారు. యూపీఏ బాటలో నే కొత్త ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టం అవుతోందన్నారు. అంతర్జాతీ మార్కెట్లో ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ , అమాంతంగా ధరల్ని పెంచడాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరల నిర్ణయాధికారం చమురు కంపెనీల చేతిలోకి వెళ్లాయని, ఇప్పుడు ఆ పద్ధతిని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా పట్టించుకోక పోవడం శోచనీయమని విమర్శించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పీఎంకే నేత రాందాసు, యువజన నేత అన్భుమణి, ఎండీఎంకే నేత వైగో, ఎస్ఎంకే నేత శరత్కుమార్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, టీఎంసీ నేత జీకే వాసన్, టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లా, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తదితరులు తమ ప్రకటనల్లో ధరల పెంపును వ్యతిరేకించారు. ధరల్ని ఇష్టానుసారంగా పెంచుతూ పోతుంటే, ఆ భారం ప్రజల మీద పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికా రు. పెంపును వెనక్కు తీసుకోకుంటే, ఆం దోళనలకు దిగుతామని హెచ్చరించారు. -
మురికి చేసి పెట్టారు!
యూపీఏపై మోదీ ధ్వజం కెనడాలో కాంగ్రెస్పై విమర్శలు దేశాన్ని శుభ్రం చేయాల్సి ఉంది ‘స్కామ్ ఇండియా’ను ‘స్కిల్డ్ ఇండియా’గా మార్చాలి టొరంటో/న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ను వదల్లేదు. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ పాలనను కెనడాలోనూ ఎండగట్టారు. ‘దేశాన్ని ఎంత మురికి చేయాలో అంత చేసి వెళ్లిపోయారు. ఇప్పుడిక నేను దాన్ని శుభ్రం చేయాలి’ అంటూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. కెనడాలోని టొరంటోలో గురువారం భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో మోదీతో పాటు కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ దంపతులు కూడా హాజరయ్యారు. హార్పర్ భార్య ముదురు నీలంరంగు చీర ధరించి రావడం విశేషం. ఖేం చొ?: ‘ఖేం చొ(గుజరాతీలో ఎలా ఉన్నారు?)’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీకి సభికుల నుంచి భారీగా స్పందన లభించింది. ‘భారత్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది.. ఆ సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఒకటే మందు’ అని మోదీ అనగానే.. ‘మోదీ.. మోదీ’ అంటూ సభికులు కేకలు ప్రారంభించారు. ‘ఆ పరిష్కారం మోదీ కాదు.. అభివృద్ధి. ప్రగతి మాత్రమే భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలదు’ అని సమాధానమిచ్చారు. అమెరికాలోని మేడిసన్ స్క్వేర్ కార్యక్రమాన్ని గుర్తుకుతెచ్చేలా భారీగా హాజరైన సభికులు మోదీ మాటలకు హర్షాతిరేకాలతో స్పందించారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ.. ‘దేశంలో మురికి పేరుకుపోయింది. దాన్నంతా శుభ్రం చేయాలి. స్కామ్ ఇండియాగా పేరుగాంచిన భారత్ను నైపుణ్య భారత్(స్కిల్డ్ ఇండియా)గా మార్చాల్సి ఉంది’ అన్నారు. ‘కిత్నా బదల్గయా ఇన్సాన్’ అనే బాలీవుడ్ పాటను ఉటంకిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల ఆలోచనల్లో మార్పొచ్చిందని, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పగలిగామని చెప్పారు. ‘ఈ విమానాలయు గంలో భారత్ నుంచి కెనడా రావడానికి 15-20 గంటలు పడ్తుంది. అయినా 42ఏళ్లుగా ఒక్క ప్రధానీ కెనడా పర్యటనకు రాలేదు’ అన్నారు. మోదీ పర్యటన చరిత్రాత్మకమని హార్పర్ పేర్కొన్నారు. దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నారు: కాంగ్రెస్ కెనడాలో మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. విదేశాల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, అవి ప్రధాని స్థాయికి తగ్గట్లుగా అవి లేవని విమర్శించింది. ఎన్నికల ప్రచార హ్యాంగోవర్ నుంచి మోదీ ఇంకా బయటపడినట్లు లేదని గురువారం కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. దేశాన్ని విదేశాల్లో నవ్వులపాలు చేస్తున్నారని మరో అధికార ప్రతినిధి సంజయ్ ఝా ఆక్షేపించారు. ‘మోదీ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని మరో నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘కనిష్క’ మృతులకు నివాళి 1985లో కనిష్క విమానాన్ని పేల్చివేసిన ఘటనలో మృతిచెందిన 329 మందికి మోదీ, స్టీఫెన్ హార్పర్ నివాళులర్పించారు. టొరంటోలోని హంబర్ బే పార్క్లోని ఎయిర్ ఇండియా స్మారక కేంద్రం వద్ద మృతుల బంధువులు పలువురితో మాట్లాడారు. అనంతరం మోదీ వాంకూవర్ వెళ్లారు. మోదీకి కెనడా కోర్టు సమన్లు! న్యూయార్క్: 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి కెనడా లోని ఒంటారియో కోర్టు సమన్లు జారీ చేసిందని, అయితే ఆ ఉత్తర్వులను కెనడా అటార్నీ జనరల్ నిలిపేశారని గురువారం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ సంస్థ ఆరోపించింది. విదేశాల్లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి.. కెనడాకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని విచారించడానికి అవకాశం కల్పించే చట్టం ఒకటి కెనడాలో అమల్లో ఉంది. -
ఖర్చీఫ్ల్లా బొగ్గుగనులిచ్చేశారు
ప్యారీస్: విదేశాల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ హయాంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆ ప్రభుత్వం దేశంలోని ఎంతో విలువైన బొగ్గు గనులను చేతిరుమాళ్ల(హ్యాండ్ కర్చీఫ్), పెన్నుల మాదిరిగా ఇష్టమొచ్చినట్లు ఇచ్చేసిందని ఆరోపించారు. దీనివల్ల భారత ఖజానా లక్షల కోట్లలో గండి పడిందని చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్లోని భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'మీరు ఈ విషయం (బొగ్గు గనుల కేటాయింపులు) గురించి తప్పనిసరిగా వినాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు పెన్నులు, ఖర్చీఫులు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వ్యక్తి సరైనవాడేనా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, అలా ఆలోచించకుండా పెన్నులు ఖర్చీఫ్లా పంపకం మాదిరిగా యూపీఏ ప్రభుత్వం 204 బొగ్గు గనులను కేటాయించింది. ఫలితంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లింది' అని ఆయన చెప్పారు. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేటాయింపులను రద్దు చేసిందని, ఆ విషయంలో మాజీ ప్రధానిని కూడా తప్పుబట్టిందని, ఇప్పుడా విషయం జోలికి వెళ్లనని, విమర్శలకు దిగాలనుకోవడం లేదని చెప్పారు. -
భూ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
పునఃజారీని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో రైతు సంఘాల పిటిషన్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ను పునఃజారీచేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు రైతు సంఘాలు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో పారదర్శకత, న్యాయమైన పరిహారానికి హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015ను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ స్వరాజ్, చోగామ వికాస్ అవాం ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. పార్లమెంటులో చట్టం చేసే ప్రక్రియను కాదని.. వరుసగా ఆర్డినెన్స్లు జారీచేయటం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించటమే కాక రాజ్యాంగాన్ని దగా చేయటమేనని ఆరోపించాయి. భూసేకరణ బిల్లు 2015 మార్చి 10 నుంచి 20 మధ్య లోక్సభలో ఆమోదం పొందాక.. దానిని ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో చర్చకు పెట్టలేదని.. ఆ సభలో ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవటం, దానిపై ఏకాభిప్రాయం లేకపోవటం, రాజకీయ అభీష్టం లేకపోవటం దీనికి కారణమని వివరించాయి. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, హోంశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలతో పాటు.. మంత్రివర్గ సచివాలయాన్ని ఈ వ్యాజ్యంలో ప్రత్యర్థులుగా చేర్చారు. ఆర్డినెన్స్లను కొనసాగించటం, వాటిని పునఃజారీచేయటం అనేది.. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్ని బాహాటంగా వినియోగించటమేనని అభివర్ణించారు. యూపీఏ చట్టం రైతులపై కుట్ర: జైట్లీ యూపీఏ హయాంలో ఆమోదించిన భూసేకరణ చట్టం.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ఉద్దేశంతో.. పల్లెలను అభివృద్ధికి దూరంగా ఉంచేందుకు, భూమిలేని వారిని నిరుద్యోగులుగానే మిగిల్చేందుకు చేసిన కుట్ర అని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ ఆరోపించారు. ఆయన భోపాల్లో మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడారు. -
ఎఫ్సీఐ తప్పుకుంటే ‘మద్దతు’ ఎలా?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం రహస్య ఎజెండాతో ఎఫ్సీఐ పునర్ వ్యవస్థీకరణ, ఆహార ధాన్యాల సేకరణ అంశాలపై శాంతకుమార్ కమిటీని నియమించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని, దాని ఉదాత్తమైన ఉద్దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తోంది. చట్టం కింద ఉన్న 67 శాతం లబ్ధిదారులను 40 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూసేకరణ చట్టాన్ని రైతు వ్యతిరేక చట్టంగా మార్చినట్టే, ఆహార భద్రత చట్టాన్ని పేదల వ్యతిరేక చట్టంగా మా ర్చుతున్నారన్నారు. జనతాపరివార్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడా పునరేకీకరణ జరగాలని దిగ్విజయ్ అన్నారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలు.. కాంగ్రెస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఇతర పార్టీలు అన్నీ తిరిగి కాంగ్రెస్లో ఐక్యం కావలసి న అవసరం ఉందని పేర్కొన్నారు. -
సామాన్యుడిని విస్మరించిన బడ్జెట్
యూపీఏ కంటే మెరుగైన పాలన అందిస్తాం.. సామాన్యుడికి అందుబాటులో ఉంటాం.. కష్టాలు తెలిసిన ఒకప్పటి ఛాయ్వాలా ప్రధాని అయ్యారు.. పాలన మధ్యతరగతి చేతిలో వజ్రాయుధం అంటూ ఇంతకాలం బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే నరేంద్రమోడీ సర్కార్ తీరును బడ్జెట్లు తేటతెల్లం చేశాయి. ఈ ప్రభుత్వం కూడా సంపన్నులకే దాసోహమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ చెప్పకనే చెప్పింది. సామాన్యుడిని గుర్తించకపోగా, సర్వీసు ట్యాక్స్ పెంచి మరింత భారం మోపింది. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు చేతలకు పొంతనలేదని పలువురు విమర్శిస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరుద్యోగులకు ఈ బడ్జెట్తో నిరాశే మిగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సంపన్నులకు చేయూతనిస్తూ కార్పోరేట్ ట్యాక్స్ 5శాతం తగ్గిస్తే.. అదే రైతుల ఉత్పత్తులైనా ఆహార నిల్వలపై ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వైపు సర్వీసు ట్యాక్స్ పెంచుతూ మరింత భారం పడేలా వ్యవహరించింది. ఈ పరిణామాన్ని రాజకీయవేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు లేదు. ప్రణాళికేతర వ్యయం పెరిగినప్పుడు ఉత్పత్తులకు ఆశించిన చేయూత కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఐఐఎం, ఐఐటీ, నిట్లకు రూ.40కోట్లు చొప్పున కేటాయించారు. ట్రిపుల్ ఐటీకి రూ.45కోట్లు దక్కింది. ఈ లెక్కన జిల్లాలో ఉన్న ట్రిపుల్ ఐటీకి రూ.15కోట్లు కేంద్ర బడ్జెట్ దక్కనుంది. మొత్తంగా పరిశీలిస్తే సామాన్యుడికి మధ్యతరగతి ప్రజానీకానికి అరుణ్జైట్లీ బడ్జెట్ గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - సాక్షి ప్రతినిధి, కడప పథకాలు ఆచరణలో పెట్టాలి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి న పథకాలను ఆచరణలో పెడితేనే ప్రయోజనం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా, గ్రామాలకు తాగునీ టి సౌకర్యం, రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యంతోపాటు ప్రతి ఇంటికి ఉపాధి కల్పనలో భాగంగా ఉద్యోగం కల్పిస్తామని బడ్జెట్లో ప్రకటించడం సంతోషకరం. గొప్పలు చెప్పడం కాదు వాటిని ఆచరణలో తీసుకురావాలి. ప్రస్తుత పాలకులుమాటలతో తాత్కాలికంగా కడుపునింపే ప్రయత్నం చేశారు. - రాచమల్లు శివప్రసాదరెడ్డి,ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు ఆశాజనకంగా లేని బడ్జెట్ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. నిరాశను కలిగించింది. రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి పొత్తున్న పార్టీ టీడీపీ కూడా ఈ బడ్జెట్కు వ్యతిరేకండా ఉన్నారన్నారు. అధిక రేట్లు వాటిని తగ్గించేందుకు, తక్కువ ధరలున్న వాటిని పెంచటం చేశారు. ఇలా చేయటం వలన దేశంలో ఉన్న అధిక భాగం పేద, సామాన్య ప్రజలకు ఏ మాత్రం మేలు జరుగదు. - ఎస్. రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు ఏపీకు తీరని అన్యాయమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ప్రజల కడుపులో కారం వేశారు. శవంపై నాలుగు బోరుగులు చల్లినట్టుగా ఆంధ్రప్రదేశ్కు నాలుగు రూపాయలు కేటాయించారు. తెలుగువారంటేనే ఏమీ చేయలేరనే భావనలో కేంద్రం ఉంది. - దేవగుడి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఏదీ? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. విభజనకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదు. లోటు బడ్జెట్ను పూడుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ముఖ్యంగా సీమకు స్పెషల్ ప్యాకేజీ, తదితర సౌకర్యాలను ఇస్తామని చెప్పారు. ఏదీ జరగలేదు. ఈ బడ్జెట్ నిరుపేద వర్గాలను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. - అంజాద్బాష, కడప ఎమ్మెల్యే కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే నాడు కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో అడ్డదిడ్డంగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తే నేడు బీజేపీకి విభజన చట్టంలో ప్రవేశపెట్టిన ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోకుండ బడ్జెట్ను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల కడుపుల్లో చిచ్చుపెట్టింది.టీడీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లనేబడ్జెట్లో తీరని అన్యాయం జరిగింది. రాయలసీమ అభివృద్ధికి నిధుల ప్రస్తావనలేదు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు లేవు. నిధులు ప్రస్తావన ఎక్కడలేదు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఐక్యమత్యంగా పోరాటం చేసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేకహోదాపై పోరాటం చేయాలి. - ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే, జమ్మలమడుగు నిరాశ కలిగించిన బడ్జెట్ ఈ బడ్జెట్ నిరాశక్తి కలిగించే విధంగా ఉంది. పోలవరానికి రూ. 100 కోట్లు కేటాయించడం దారుణం. పోలవరంకు ఇంత తక్కువ నిధులు కేటాయించడం బట్టి చూస్తే పోలవరం త్వరగా పూర్తి చేయడం ఇటు రాష్ట్రానికి అటే కేంద్రానికి ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టమవుతోంది. రాయలసీమకు కనీసం ఒకటి కూడా సెంట్రల్ యూనివర్శీటీని ప్రకటించకోవడం విచారకరం. ఈ బడ్జెట్ రైతులను ఆదుకొనే విధంగా లేదు. - గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి -
దక్షిణాది నుంచే అనుసంధానం
మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానానికి కేంద్రం ప్రణాళిక గోదావరిలో 530 టీఎంసీల మిగులు జ లాలు ఉన్నాయంటున్న జల వనరుల శాఖ వీటిని కృష్ణా, కావేరిలకు తరలించాలని యోచన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. ఉన్న ప్రాజెక్టులకే నీళ్లు సరిపోవని వెల్లడి 15 ఏళ్ల నాటి లెక్కలను పరిగణన లోకి తీసుకోవడంపై అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టను న్న నదుల అనుసంధాన కార్యక్రమాన్ని దక్షిణా ది నుంచే మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి మరో నదికి నీటిని మళ్లించడంలో భాగంగా తొలుత దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరిల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. తెలంగాణ పరిధిలోని గోదావరి నది లో మిగులు జలాల లభ్యత ఉందని చెబుతున్న కేంద్ర జల వనరుల శాఖ... ఈ నది నీటిని కృష్ణాకు తరలించే అంశంపై కసరత్తు చేస్తోంది. అయితే గోదావరి నీటి తరలింపును తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిలో ఎక్కడా మిగులు జలాలు లేవని.. ప్రస్తుతం లభ్యమవుతున్న జలాలు తమ అవసరాలకే సరిపోవడం లేదని వాదిస్తోంది. అయినా కేంద్రం మాత్రం మొండిగా నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలనే గట్టి పట్టుదలతో ఉంది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తుది మెరుగులు దిద్ది, ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఉత్తరాది నదు లకోసం ‘హిమాలయ నదుల అభివృద్ధి’, దక్షిణా ది నదుల కోసం ‘ద్వీపకల్ప నదుల అభివృద్ధి’ పథకాలను చేపట్టింది. ఇందులో హిమాలయ నదుల అభివృద్ధి పథకం కింద బ్రహ్మపుత్ర, గంగా, నర్మదా తదితర నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిం చినా... బ్రహ్మపుత్ర నదుల నీటి వాడకం విషయంలో పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్తో వివాదాలు ఉన్న దృష్ట్యా దానిని వాయిదా వేసింది. దీంతో దక్షిణాదిలోని నదుల అనుసంధానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. గోదావరిపైనే కన్ను..: మహానదిలో సుమా రు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్న దృష్ట్యా... వాటిని కృష్ణా, కావేరి నదులకు తరలించాలన్నది కేంద్ర జల వనరుల శాఖ వాదన. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తెలంగాణ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరిపై ఆధారపడ్డ ప్రస్తుత ప్రాజెక్టులకే నీటి అవసరాలు సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదీగాక ప్రస్తుతం కేంద్రం చెబుతున్న 530 టీఎంసీల అదనపు జ లాలు ఎప్పుడో 15 ఏళ్ల కిందట 75 శాతం డిపెం డబిలిటీతో లెక్కించినవని.. ఇప్పడు ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయని చెబుతోంది. నిర్మాణంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే గోదావరిలో ఏపీ, తెలంగాణకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు తమ అవసరాలకే సరిపోవని స్పష్టం చేస్తోంది. తెలంగాణ పీఠభూమి ప్రాంతం అయినందున గోదావరి ప్రవాహం కింది రాష్ట్రమైన ఏపీకి ఉంటుందని.. అక్కడే అదనపు జలాల అవకాశం ఉంటుందని చెబుతోంది. రాష్ట్ర పరిధిలోని నదుల అనుసంధానానికి అభ్యంతరం లేదని, అలాకాకుండా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలిస్తామంటే అంగీకరించేది లేదని తెలంగాణ వాది స్తోంది. విషయాలను ఇటీవల కేంద్రం నిర్వహించిన జల్ మంథన్ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రానికి స్పష్టంగా వివరించినా, వాటిని కేం ద్రం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. -
పీఎస్యూ బ్యాంక్కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్ల ఎంపిక కోసం జరిగిన షార్ట్లిస్ట్లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్యూ) బ్యాంకు చీఫ్ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్రా కన్నుమూత
-
మోదీవి యూపీఏ విధానాలే..
మంచిర్యాల సిటీ : మెజార్టీ ధీమాలో ఉన్న మోదీ యూపీఏ విధానాలనే అనుసరిస్తున్నారని పీవైఎల్ మాజీ అధ్యక్షుడు, న్యూడెమక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.రంగారావు విమర్శించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ అనుబంధ సంఘం ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర ఆరవ మహాసభలు రెండో రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో ముగిశాయి. విద్య, ఉపాధి అవకాశాలపై సభలో పలు తీర్మానాలు చేశారు. ముగింపు కార్యక్రమంలో రంగారావు మాట్లాడారు. బీజేపీ పాలనలో చెప్పుకోదగ్గ కొత్త విధానాలు ఏమీ లేవన్నారు. ఈ ప్రభుత్వాన్ని యూపీఏ-3గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద దేశాల్లో పర్యటించి దేశానికి అప్పులు, టెక్నాలజీ తెచ్చిపెట్టి అమెరికాకు ఉపగ్రహ రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం మోడీ అవలంబిస్తున్న విధానాలు రానున్న రోజుల్లో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొందరు పారిశ్రామికవేత్తలు మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారని, అటువంటి వారి ఆశలు త్వరలోనే కూలడం ఖాయమన్నారు. గుజరాత్, ముజఫర్నగర్ ప్రాంతాల్లో జరిగిన మరణకాండను పక్కదారి పట్టిస్తున్న మోదీ అతిభయంకరమైన మతోన్మాది అని పేర్కొన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్ మాట్లాడుతూ యువత సామాజ్రవాద విష సంస్కృతిలో కొట్టుకుపోతుందన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, వీకెండ్ క్లబ్లు యువతను నాశనం చేయడంతోపాటు సంస్కృతిని కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాల్కుమార్, సక్రు పాల్గొన్నారు. -
వంట గ్యాస్ పై నగదు బదిలీకి ఆమోద ముద్ర
-
వంట గ్యాస్ పై నగదు బదిలీకి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: గతంలో వంట గ్యాస్ పై యూపీఏ ప్రభుత్వ చేపట్టిన నగదు బదిలీకి పథకం మరోసారి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోద ముద్ర వేసింది. ఈ నగదు బదిలీ పథకం నవంబర్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. గ్యాస్ ధరపై కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశమైంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గ్యాస్ ధరపై పునఃసమీక్ష నిర్వహిస్తామని కేంద్ర కేబినెట్ తెలిపింది. ప్రతీ ఏటా ఏప్రిల్ 1 వ తేదీన, అక్టోబర్ 1 వ తేదీన గ్యాస్ ధరపై సమీక్ష చేపట్టనుంది. యూనిట్ ధరను 5.61 యూఎస్ డాలర్ గా నిర్దారిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ కు పూర్తి స్థాయిలో నగదు బదిలీకి పథకాన్ని అమలు చేస్తామని.. దీంతో వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీని వర్తింపజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. యూపీఏ అమలు చేసిన పథకాన్నిఎత్తివేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఆధార్ అనుసంధానంతో గ్యాస్ సబ్సిడీని పొందిన వంట గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అయితే తాజాగా అదే పథకాన్ని తెరపైకి తీసుకురావడంతో ఆధార్ ను బ్యాంక్ ల్లో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితి. దేశంలో అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకున్నా.. ఇంకా చాలా మందికి ఆధార్ నంబర్ లభించలేదు. ఈ పథకంతో పూర్తి స్థాయి లబ్ధి చేకూరాలంటే మాత్రం వినియోగదారులకు ఆధార్ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే త్వరలో అమల్లోకి రానున్న నగదు బదిలీ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. -
బీజేపీ యూటర్న్ ను ప్రశ్నించిన తృణమూల్
కోల్ కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ సర్కారు వెనక్కి తగ్గడాన్ని ప్రశ్నించింది. నల్లధనం వ్యవహారానికి సంబంధించి అసలు బీజేపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం నిజంగా బాధాకరమని తృణమూల్ రాజ్యసభ అభ్యర్థి ఓబ్రెయన్ విమర్శించారు. దేశంలోని అవినీతి కారణంగానే కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీచాయని ఆయన తెలిపారు. ఇదే తరహాలో బీజేపీ కూడా వ్యవహరించడం రెండు పార్టీలు దొందూ దొందూగానే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.' నల్లధనంపై చేపట్టే చర్యలు ఏమిటి? దీనిపై ఉపయోగంలేని కమిటీ ఏర్పాటు ఒక్కటే చాలదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తృణమూల్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని శుక్రవారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని, ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. దీనిపై తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది.నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టిందని అభిప్రాయపడింది. -
నల్లధనం వివరాలన్నీ వెల్లడించలేం
విదేశీ ఖాతాల సమాచారంపై సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఎన్డీయే సర్కారు కూడా గత యూపీఏ బాట పట్టింది. భారత్తో రెండుసార్లు పన్ను పడకుండా మినహాయింపు ఒప్పందం(డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాలు అందించిన భారతీయుల ఖాతాల మొత్తం వివరాలను బహిర్గతం చేయలేమని తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. డీటీఏఏ ఒప్పందం ఉన్న దేశాలు అందించే సమాచారాన్ని వెల్లడిస్తే ఆ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయంది. ఒకసారి బహిర్గతం చేస్తే ఇక ఆ దేశాలు సమాచారం ఇవ్వక పోవచ్చని, ఇతర దేశాలతో డీటీఏఏ కుదుర్చుకోవడం కూడా కష్టమవుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనానికి శుక్రవారం 800 పేజీల నివేదిక సమర్పించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ వివరాలను కోర్టుకు వివరించారు. భారతీయుల ఖాతాల వివరాలను బహిర్గతం చేసే విషయంలో జర్మనీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని, విచారణ జరపాలని భావిస్తున్న ఖాతాలను మాత్రం వెల్లడించేందుకు సుముఖంగా ఉందన్నారు. అందువల్ల ఆ దేశానికి చెందిన లీచెన్స్టెయిన్ బ్యాంకు అందించిన ఖాతాల వివరాలను బహిర్గతం చేయాలన్న గత ఆదేశాలను సవరించాలని కోరారు. ఈ వాదనను పిటిషనర్, సీనియర్ న్యాయవాది రామ్జెఠ్మలానీ వ్యతిరేకించారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారిని కాపాడేం దుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. విదేశాల్లో భారతీయులు దాచుకున్న సొమ్మునంతా నల్లధనంగా చూడలేమని, విదేశాల్లో ఖాతాలు తెరవడం నేరమేమీ కాదని రోహత్గీ వ్యాఖ్యానించారు. -
యూపీఏ ఓటమికి కాగ్ కారణం కాదు!
న్యూఢిల్లీ: గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పతనానికి కారణం, అప్పటి కాంప్ట్రోలర్ ఆడిటర్ జన రల్ (కాగ్) వ్యవస్థ నివేదికలు కానేకాదని మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్ స్పష్టంచేశారు. 2 జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారాల కు సంబంధించిన కాగ్ నివేదికలు, వాటిపై జారీ అయిన సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే యూపీఏ పరాజయం పాలైందన్న వాదన సరికాదన్నారు. ఈ విషయంలో కాగ్ పాత్రను అతిగా ఊహించడమేని, కాగ్కు ఘనతనో, నిందనో కట్టబెట్టడం సరికాదని వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. -
మల్టీబ్రాండ్ రిటైల్లో ఎఫ్డీఐని అనుమతించం
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)ను ప్రభుత్వం అనుమతించబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ‘ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు..’ అని మోడీ సర్కార్ ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. ఈ రంగంలో ఎఫ్డీఐపై బీజేపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించి ఎన్నికల్లో నెగ్గిందని అన్నారు. మునుపటి యూపీఏ ప్రభుత్వం మల్టీబ్రాండ్ రిటైల్లో 51 శాతం ఎఫ్డీఐని అనుమతించగా, బీజేపీ వ్యతిరేకించింది. అయితే, యూపీఏ విధానానికి స్వస్తిపలికే చర్యలను మోడీ సర్కార్ ఇప్పటివరకు చేపట్టలేదు. యూకేకు చెందిన టెస్కో పెట్టుబడి ప్రతిపాదనను మాత్రమే యూపీఏ హయాంలో అనుమతించారు. ఈ-కామర్స్లోనూ అంగీకరించం... మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో ఏ రూపంలోనూ ఎఫ్డీఐని అనుమతించేది లేదనీ, ఈ-కామర్స్ రూట్లో కూడా ఒప్పుకోబోమనీ నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి ప్రశ్నించగా, ఈ విషయంపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయనీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ బదులిచ్చారు. కాగా, నిర్మాణ రంగంలో ఎఫ్డీఐ నిబంధనలను సరళతరం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. మేధో హక్కులపై త్వరలో పాలసీ మేధో సంపత్తి హక్కుల(ఐపీఆర్)ను మరింత సమర్థవంతంగా అమలుచేసేదిశగా 6 నెలల్లో కార్యాచరణ విధానాన్ని(పాలసీ)ని ప్రకటించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘భారత్కు ప్రస్తుతం ఐపీఆర్ పాలసీ లేదు. తొలిసారిగా మేం దీన్ని అమల్లోకి తీసుకురానున్నాం. ఫార్మా ఇతరత్రా కొన్ని రంగాల్లో మన మేధో హక్కులను కూడా పరిరక్షించుకోవాలంటే తగిన పాలసీ అవసరం. మరోపక్క, అమెరికాతో ఐపీఆర్ విషయంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వీటన్నింటికీ సరైన విధానం ఒక్కటే పరిష్కారమార్గం’ అని పేర్కొన్నారు. -
యూపీఏను అనుసరిస్తున్న ఎన్డీఏ
ఆత్మకూరు రూరల్: ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గత యూపీఏ అవలంబించిన విధానాలను అనుసరిస్తుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్ ఆరోపించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ హాల్లో ఆదివారం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని, అందుకోసం తమను గెలిపించాలని మోడీ ప్రచారం చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసీ, బ్యాంకింగ్ రంగాల్లో 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారని మండిపడ్డారు. రైల్వేను ప్రైవేటు పరం చేసి ఉద్యోగ కార్మికులకు నష్టం కలిగించే చర్యలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రయివేటు, పారిశ్రామివేత్తలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పేదల, నిరుద్యోగుల సంక్షేమం కోసం, కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. అనంతరం సీపీఎం డివిజన్ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల అమలుకు బడ్జెట్లో నిధలు కేటాయించలేదని విమర్శించారు. సీపీఎం డివిజన్ కార్యవర్గ సభ్యులు ఏసురత్నం, స్వాములు, రణధీర్, డివిజన్ కమిటీ సభ్యులు రజాక్, రాందాసు, నరసింహానాయక్, పుల్లమ్మబాయి, రామచంద్రుడు, మహిళా సంఘం నాయకురాళ్లు మంజుల, మణెమ్మ, అక్కమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్, ఓంకార్, జయచంద్ర, రైతుసంఘం నాయకులు సామన్న తదితరులు పాల్గొన్నారు. -
పూరా నిర్లక్ష్యం
సాక్షి, హన్మకొండ : పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. రూ.168 కోట్లతో చేపట్టే ఈ పథకాన్ని మొదటగా అమలు చేసేందుకు 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పర్వతగిరి మండలాన్ని ఎంపిక చేసింది. కానీ, మూడేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి నిధులు కేటాయింపుపై ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపకల్పన చేసింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం వాటా 73 శాతం అంటే రూ.123.34కోట్లు, రాష్ర్ట ప్రభుత్వం వాటా 15 శాతం అంటే రూ.25.80 కోట్లతో పాటు భాగస్వామ్య సంస్థల వాటా 11 శాతం అంటే రూ.19.38కోట్లగా నిర్ణరుుంచారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం ద్వారా గ్రామాలు పట్టణాల తరహాలో స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉంటుంది. అక్కడ పూర్తి.. ఇక్కడ మొదలుకాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్, కృష్ణా జిల్లాలను మొదటిదశలో ఎంపిక చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ప్రాజెక్టు ప్రారంభానికి అప్పటి ప్రభుత్వం చొరవ చూపించడంతో యూపీఏ-2 హయూంలోనే ఈ పథకం కృష్ణా జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర వాటాగా రూ.8.34 కోట్ల నిధులు 2014 జనవరిలో విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఒకరోజు ముందు ఈ పథకాన్ని అప్పటి ఎంపీ సిరిసిల్ల రాజయ్య హడావుడిగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకం దారితెన్నూ లేకుండా నిలిచిపోయింది. అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దానితో యూపీఏ హయూంలో ప్రారంభించిన ఈ పథకానికి నిధులు కేటాయిస్తారా ? లేదా అనే సందిగ్ధం నెలకొంది. పైగా మూడేళ్ల కిందటి అంచనాలతో పోల్చితే ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. -
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
కోల్గేట్పై సుప్రీంకోర్టు తీర్పు 218 గనులు, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకం 1993-2010 లలో చేసిన కేటారుుంపులన్నీ నిర్హేతుకమన్న ధర్మాసనం {స్కీనింగ్ కమిటీ ఆలోచన లేకుండా వ్యవహరించిందని వ్యాఖ్య {పజా ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని స్పష్టీకరణ బొగ్గును నల్ల వజ్రమనడంలో అతిశయోక్తి లేదని వెల్లడి న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వేలం విధానం ప్రవేశపెట్టక మునుపు, 1993 నుంచి 2010 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల హ యూంలో చేసిన బొగ్గు గనుల కేటారుుంపులన్నీ చట్టవిరుద్ధం, నిర్హేతుకమని సోమవారం తీర్పు చెప్పింది. తాత్కాలికమైన, ఆషామాషీ పద్దతుల్లో, ఏమాత్రం ఆలోచన చేయకుండా గనులు కేటారుుంచారని అభిప్రాయపడింది. 1993 మొదలు 36 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అవలంభించిన విధానాలను ఖండించేందుకు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు అన్ని పదాలను ఉపయోగించింది. అరుుతే ఈ కేటారుుంపుల్ని రద్దు మాత్రం చేయని న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్లతో కూడిన బెంచ్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటన్న అంశమే తమ ముందు మిగిలి ఉందని పేర్కొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 218 బొగ్గు బ్లాకులు, వాటి ఆధారంగా పెట్టిన సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం 218 బొగ్గు బ్లాకుల కేటారుుంపులను పరిశీలించిన ధర్మాసనం 163 పేజీల తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 1న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీం సుదీర్ఘంగా విచారించింది. ధర్మాసనం ఇంకా ఏమన్నదంటే.. ఇటు స్క్రీనింగ్ కమిటీ మార్గాన, అటు ప్రభుత్వ పంపిణీ మార్గంలో.. రెండు పద్దతుల్లోనూ నిర్హేతుకంగా, చట్టవిరుద్ధంగా కేటారుుంపులు జరిగారుు.1993 జూలై 14 మొదలు 36 సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు యూవత్ కేటారుుంపులు చట్టవిరుద్ధంగా జరిగింది.{స్కీనింగ్ కమిటీ స్థిరంగా వ్యవహరించలేదు. మార్గదర్శకాలను తక్కువగా పాటించారు. పారదర్శకత లేదు. విజ్ఞతఉపయోగించలేదు.వాణిజ్య ప్రయోజనాల కోసం బొగ్గు తవ్వకాలు జరిపే అర్హత ఏ రాష్ట్రానికీ లేదా దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థకు లేదు. వీటివల్ల జాతి సంపద, పరిశ్రమల ప్రభువ రుున బొగ్గుఅన్యాయంగా పంపిణీ అరుుంది. బొగ్గును నల్ల వజ్రంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. చాలా దేశాలలో బొగ్గు ఆధారంగానే పారిశ్రామిక ప్రగతి చోటు చేసుకుంది.మన దేశంలో ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే బొగ్గు గని కేటారుుంపు కంపెనీలపై ఉదారతకు సంబంధించిన వ్యవహారమయింది.పరిపాలన మార్గం ద్వారా కేటారుుంపు జరిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇప్పటికే ఉన్న చట్టానికి అనుగుణంగా లేదు. యూఎంపీపీలు బొగ్గును మళ్లించకూడదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీలు) నుంచి బొగ్గును వేరే అవసరాలకు మళ్లించేందుకు కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమతించడాన్ని నిరోధించాలన్న ఎన్జీవో వాదనను సుప్రీం అంగీకరించింది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులకు (యూఎంపీపీలు) తక్కువ ధరకు బొగ్గు గనులు కేటారుుంచడంపై ఎలాంటి సవాలూ తమ ముందు లేదని బెంచ్ స్పష్టం చేసింది. యూఎంపీపీలకు కేటారుుంచిన క్షేత్రాలను వాటి నిమిత్తమే ఉపయోగించాలని. బొగ్గును మళ్లించడం కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం కానీ చేయరాదని ఆదే శాలిచ్చినట్టు తెలిపింది. గనుల కేటారుుంపు కోసం ఏళ్ల తరబడి కాంపిటీటివ్ బిడ్డింగ్ను అనుసరించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరమైనంత నిర్హేతుకంగా ఉందని, అర్ధరహితంగా ఉందని చెప్పజాలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన గణాంకాలను అటార్నీ జనరల్ ఇచ్చినప్పటికీ, వాటిని సరిచూడలేదని తీర్పు అనంతరం ధర్మాసనం మౌఖికంగా చెప్పింది. వీటిని పరిశీలించాల్సి ఉందని, తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను నిర్ధారించేందుకు మరింత విచారణను సెప్టెంబర్ 1వ తేదీన చేపడతామని తెలిపింది. యూపీఏపై ఆరోపణలు యూపీఏ హయూంలో కేటారుుంచిన 194 బొగ్గు బ్లాకులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు పిటిషనర్లు అరోపించారు.సుప్రీం తన విచారణను 1993జూలై 14 నుం చి జరిగిన కేటారుుంపులకు పొడిగించింది. {Oపెవేటు కంపెనీలు, పార్టీలకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఎంపీ రాష్ట్రాల్లో గనులు కేటారుుంచారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్రం 218 క్షేత్రాల సమాచారం అందజేసింది. 2012లో పిటిషన్ దాఖలైనప్పుడు.. గనుల కేటారుుంపుల్లో రూ.1.64 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ అంచనా వేసిందన్నారు.కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును సైతం పర్యవేక్షించింది. దాఖలయ్యే కేసుల ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక కోర్టును సైతం నెలకొల్పారు. కోల్గేట్ ప్రస్థానం జూలై 1992:బొగ్గు బ్లాకుల కేటాయింపుల కో సం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. జూలై 14న సింగరేణి కాలరీస్, కోల్ఇండియా లిమిటెడ్ల ఉత్పత్తి ప్రణాళికల్లో లేని బ్లాకుల గుర్తింపు. 1993- 2010: 1993-2005 మధ్య 70 బ్లాకులను, 2006లో 53 బ్లాకులను, 2007లో 52 సహా మొత్తం 216 బ్లాకుల కేటాయింపు. వాటిలో నుంచి 24 బ్లాకుల కేటాయింపును రద్దు చేశారు.మార్చి 2012: 2004-2009 మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరించిందని, దానివల్ల కేటాయింపులు పొందిన కంపెనీలు రూ. 10.7 లక్షల కోట్లు ఆర్జించారని కాగ్ ముసాయిదా నివేదిక వెల్లడి. మే 31, 2012: సీబీఐ విచారణకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు జూన్ 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అనంతరం 80 బ్లాకుల కేటాయింపు ఉపసంహరణ, ఆగస్ట్, 2012: పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్. ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడి. మైనింగ్ ప్రారంభం కాకుండానే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రభుత్వ అభ్యంతరం. సెప్టెంబర్, 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం పర్యవేక్షణ ప్రారంభం. మార్చ్, 2013: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పొద్దంటూ సీబీఐకి సుప్రీం ఆదేశాలు. జూన్ 11, 2013: నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సీబీఐ. అక్టోబర్లో కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖలపై ఎఫ్ఐఆర్ నమోదు. జూలై, 2014: కేసుల విచారణ కోసం ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. -
మలి సంధ్య మలుపులో కాంగ్రెస్
‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే కాంగ్రెస్ తలరాతను నిర్ణయిస్తుండగా ఆంటోనీ కమిటీని తప్పు పట్టడం అర్థరహితం. ఓటమికి మించిన వ్యక్తిగత విషాదంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. ఆయన ఓటమిలోనే సౌఖ్యాన్ని చూస్తుండి ఉండాలి. ఒకటి కాదు రెండు కాదు అరడజను అసలు సిసలు ‘నం బర్ వన్’ వార్తా చానళ్లతో విరాజిల్లే జాతీయ మీడియా ఉండ టం మన పూర్వ జన్మ సుకృతం. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యత వహించనవసరం లేదని ఆంటోనీ కమిటీ తేలుస్తుందని ఎరగక నోళ్లు తెరిచి, మూయడం మరచేంతటి విశ్లేషక శ్రేష్టులు ఉండటమూ మన భాగ్యమే. కాంగ్రెస్ ఒక స్వతంత్ర పార్టీగా అస్తమించి, ఒక కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారి దశాబ్దాలు గడిచాయి. అది గ్రహిస్తే కాంగ్రెస్ నుంచి ఏమి ఆశించవచ్చో ఏమి ఆశించరాదో స్పష్టమవుతుంది. కాబట్టి ‘అవుటాఫ్ ఫ్యాషన్’ అయినా కాం గ్రెస్ కంపెనీ మరణ వేదనను అర్థం చేసుకునే శ్రమ తీసుకోక తప్పదు. 1966లో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నా డార్, రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీని ప్రధాని పీఠమె క్కించారు. అది ఒక పార్టీగా కాంగ్రెస్ అంతరించిపోవడానికి నాంది కాగలదని ఆయన కలనైనా ఊహించి ఉండరు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ఇందిర ‘కింగ్ మేకర్’ కామరాజ్ సహా సీనియర్లందరినీ శంకర‘గిరి’ మాన్యాలు పట్టిం చేశారు. నాడే కాంగ్రెస్ ఇందిర (నెహ్రూ-గాంధీ) కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారడం మొదలైంది. 1971 భారత - పాకి స్థాన్ యుద్ధ విజయానికి నాటి జనసంఘ్ అగ్ర నేత వాజ్ పేయీ అంతటి వాడే ఇందిరకు ‘అపర దుర్గ’ కీర్తి కిరీటాన్ని తొడిగారు. బ్యాంకుల జాతీయకరణ వంటి వశీకరణ విద్య లతో ఆమె అప్పటికే ‘సోషలిస్టు’గా పేరు మోశారు. ‘కుడి,’ ‘ఎడమ’లను ఏకకాలంలో మెప్పించిన ఖ్యాతితో, అసాధా రణ జనాకర్షణతో మకుటం లేని రాణిగా వెలిగారు. రాచరి కపు వాసనలు అంటడమంటేనే వంశపారంపర్య పాలన దుగ్ధ, ప్రజాస్వామ్యంపై వెగటు పెరగడమని అర్థం. అం దుకే ఆమె కాంగ్రెస్ను వ్యక్తి విధేయత ఇరుసుపై నిలిపారు. ప్రజాస్వామిక వ్యవస్థలు తన ఏకఛత్రాధిపత్యానికి ఆటం కమైనప్పుడు దేశ ప్రజాస్వామ్యాన్నే వ్యక్తి స్వామ్యంగా దిగ జార్చే యత్నం చేశారు (1975-77 అత్యవసర పరిస్థితి). రాహుల్ నాయనమ్మ హయాంలోనే తమ కుటుంబ సం స్థగా మారిన కాంగ్రెస్నే ఆయన తండ్రి రాజీవ్గాంధీ ఏలా రు. ఆయన అకాల మరణంతో సోనియాగాంధీకి మొదలైన కష్టకాలం నేటికీ ముగియలేదు. రాహుల్ అభ్యంతరమో లేక త్యాగమో ఏదో ఓ కారణంతో 1991లో వెతుక్కుంటూ వచ్చి న అధికార లక్ష్మిని సోనియా గడప దాటనిచ్చారు. ‘నంబర్ వన్’ కావాలని కలనైనా ఆశించని వీర విధేయుడు పీవీ నర సింహారావును ఆ తల్లి కటాక్షించింది, ఢిల్లీ గద్దెనెక్కించింది. అదే ఆమె దురదృష్టమైంది. పీవీ పార్టీలో దిగువ నుండి ఎదిగివచ్చిన వారు. అధికార దండం ఇందిర, రాజీవ్ల చేతు ల్లో ఉన్నా అపర చాణుక్యుడై పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రభువుల మాటకు ఎదురు లేకుండా చేసిన వ్యవహార దక్షు డు. సరిగ్గా అందువల్లనే వానప్రస్థం స్వీకరించిన ఆయనను సోనియా ఏరికోరి ప్రధానిని చేశారు. సరిగ్గా అందువల్లనే ఆయన ఆమెను ధిక్కరించి ఐదేళ్లు జోడు గుర్రాల స్వారీ చే యగలిగారు. శాశ్వతంగానే చేజారిందనుకున్న అధికారాన్ని కమలనాధులు అతి భద్రంగా 2004లో కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏకు అప్పగించారు. పార్టీ రాత మారినా సోని యా గీత మారలేదు. అధికార లక్ష్మి ఆమె ఇంటి గడప దాటి లోపలికి రాలేదు. 1991లో చేసిన తప్పును సోనియా 2004లో చేయదల్చుకోలేదు. పార్టీ నేపథ్యమేలేని మన్మో హన్సింగ్ను ప్రధానిని చేశారు. పార్టీ, ప్రభుత్వమూ సోని యా-రాహుల్ - కో. గా కొనసాగుతుండగానే ఆయన పదేళ్ల పాలన ముగిసింది. 2014 ఎన్నికల్లో దివాలా తీసినది ఆ కుటుంబ సంస్థే. కాకపోతే అది ఒకప్పటి ఘన జాతీయ పార్టీ బోర్డును తగిలించుకుంది. మన దేశ ‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే... పార్టీ కాని ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆంటోనీని తప్పు పట్టడం అర్థరహితం. ఎన్నికల ఘోర పరాభవానికి మించిన వ్యక్తిగత విషా దంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిలో అసహనంగా కూచున్న రాహుల్ ఓటమిలో సానుకూలతను చూస్తుండాలి. ముళ్ల కిరీ టం మోసే భారం తప్పిందనో లేక వాయిదా పడిందనో ఊరట చెందుతుండాలి. ఆ కుటుంబ విషాదం నీడలు పార్టీ అంతటా ముసురుకున్నాయి. రాహుల్ ఎప్పటికైనా ప్రధాని కాగలడనే ఆశ ఆ పార్టీలో ఎవరికైనా ఉన్నదా అనేది అనుమా నమే. సోనియాకు అత్త జనాకర్షణా లేదు, రాజకీయ చతు రత అంతకన్నా లేదు. కానీ అత్తగారి బాటలో ప్రజా పునాది గల నేతలను దూరం చేసుకున్నారు, పార్టీ నిర్మాణాన్ని కృశించిపోయేలా చేశారు.ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకత్వం ఆ ఇంటి గడప దాటే అవకాశం లేదు. దాటితే అది ఇక ఒక పార్టీగా మనగలిగే అవకాశమే లేదు. పి. గౌతమ్ -
‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’
పీవీ హెచ్చరించారన్న మన్మోహన్ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ను 1991లో ఆర్థికమంత్రిగా నియమించడం, అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం. నిద్రలో ఉన్న మన్మోహన్ను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఈ విషయం తెలియపరిచారు. పైగా,.. సరిగా పనిచేయకపోతే ఉద్వాసన తప్పదంటూ పీవీ చమత్కారంగా హెచ్చరిక కూడా జారీచేశారట. మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ విషయం తనతో చెప్పారంటూ ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ అన్న శీర్షికతో రాసిన పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. -
రైల్వే వ్యవస్థను నాశనం చేశారు:వెంకయ్య
విజయవాడ: గత ప్రభుత్వం రైల్వే వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. రైల్వే వ్యవస్థను కాపాడేందుకు చార్జీలు పెంచడానికి యూపీఏ ప్రభుత్వ విదానాలే కారణమని మండిపడ్డారు. శుక్రవారం దేశానికి వెన్నుముక అయిన రైల్వే వ్యవస్థపై యూపీఏ ప్రభుత్వం అవలంభించిన తీరును వెంకయ్య తప్పుబట్టారు. ఆ ప్రభుత్వం రైల్వేను నాశనం చేయడం వల్లే ఈ రోజు ఆ వ్యవస్థను కాపాడేందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. పార్లమెంట్ లో కమ్యూనిస్టుల ఉనికి ఏమైనా ఉందా?అని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో సంపద సృష్టించి, అభివృద్ధి చేయగల సత్తా మోడీకే ఉందని వెంకయ్య తెలిపారు. -
యూపీఏ బాటలోనే ఎన్డీయే
* కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ * మైనార్టీ వర్గాలపై పెరిగిన దాడులు * వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయం * త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ * వరంగల్లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు సాక్షి ప్రతినిధి, వరంగల్: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ దారిలోనే పయనిస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. బీజేపీ పాలన.. పదేళ్ల యూపీయే ప్రభుత్వాన్ని తలపిస్తోందని చెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు వరంగల్లో బుధవారం ప్రారంభమయ్యూయి. ఆగస్టు 2 వరకు ఈ మహాసభలు జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో బీజేపీ సర్కార్ ఉందని, వారి ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. రైల్వే, సాధారణ బడ్జెట్లలో ధనికులకు, కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేశారని విమర్శించారు. రైల్వే రవాణా, ప్రయాణ చార్జీలు, పెట్రోల్ ధరలు పెరిగాయని విమర్శించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఆత్మగా పనిచేస్తోందని, దీని పట్టు నుంచి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు విజృంభించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని మార్పులు చేస్తామంటూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టి, దోపిడీ శక్తులను నిరోధించేందుకు వామపక్షాలే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. దేశవ్యాప్తంగా విస్తరించి బలమైన ఉద్యమానికి ఈ మహాసభలు నాంది పలకాలని ఆకాంక్షించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సమయంలో పక్కదారి పట్టించేందుకు రెచ్చగొట్టే కుట్రలకు అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చంద్రబాబు లాంటివారు ఈ విషయంలో ముందుంటారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సభకు ముందు వరంగల్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
మన్మోహన్పై విచారణ జరిపించండి!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని కొనసాగించడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ లేవనెత్తిన దుమారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ న్యాయమూర్తిపై ఐబీ ఇచ్చిన వ్యతిరేక నివేదికకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతికి చెప్పకుండా.. ఆ న్యాయమూర్తి నియామకానికి సిఫారసు చేశారంటూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, న్యాయశాఖ మాజీ మంత్రి హెచ్ఆర్ భరద్వాజ్లపై విచారణ జరపాలని ఆ పిల్లో కోరారు. ఇది రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని మోసం చేయడమేనని, అందువల్ల దీన్ని తీవ్రమైన అవినీతి వ్యవహారంగా పరిగణించాలని పిల్లో న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ పిల్ను పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. -
మేము జీరో.. మీరు హీరో!
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని కాంగ్రెస్ మండిపడింది. ఆ బడ్జెట్ ను గత యూపీఏ ప్రభుత్వం నుంచి కాపీ చేసి మాత్రమే ప్రవేశపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. ఈ రోజు రాజ్యసభలో రైల్వే బడ్జెట్ పై ప్రసంగించిన ఆజాద్.. ఆ పాత బడ్జెట్ నే తాజాగా మూటగట్టి తిరిగి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. ఇదేనా 'యూపీఏ జీరో.. ఎన్డీఏ హీరో' అని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రాలను పాలించిన అనుభవం ఉన్నా దేశంలో సమాఖ్య వ్యవస్థను సవ్యంగా నడపాలంటే అది ఏమాత్రం సులభ సాధ్యమైన అంశం కాదని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని ఆజాద్ తెలిపారు. గత యూపీఏ పాలనలో ప్రభుత్వ పనితీరును వెనుకేసుకొచ్చిన ఆజాద్.. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు పాలించినా యూపీఏ సాధించిన ప్రగతిని చేరుకోలేదన్నారు. -
ఏపీలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తాం: వెంకయ్య
తిరుపతి: నిత్యావసర వస్తువల ధరల పెరుగుదలకు గత యూపీఏ ప్రభుత్వమే కారణమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 2020 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. తిరుపతి చేరుకున్న వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. -
పెద్దల సభలో చిరంజీవికి భంగపాటు!
మెగాస్టార్ గా తెలుగు సినీ తెరపై తనదైన శైలిలో డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి పెద్దల సభలో చేదు అనుభవం ఎదురైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం దారుణమైన ఓటమి పాలైన తర్వాత మాజీ కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ పై తన గళాన్ని వినిపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాట్లాడేందుకు రాజ్యసభలో మూడు నిమిషాల పాటు సమయాన్ని చిరంజీవికి డిప్యూటీ చైర్మన్ కురియన్ కేటాయించారు. అయితే తనకు కేటాయించిన సమయాన్ని మించి ఏడు నిమిషాలపాటు ఏకధాటిగా తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ ను చదువుతుండగా కురియన్ ముగించాలని పదే పదే కోరారు. అయితే కురియన్ విజ్క్షప్తిని పట్టించుకోకుండా అదేపనిగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిరంజీవి చదివే తీరును కురియన్ అనుకరించడంతో సభ నవ్వుల్లో మునిగిపోయింది. అంతేకాకుండా ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతున్నారని, సభలో గౌరవ సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సబబు కాదని కురియన్ వ్యాఖ్యానించారు. కురియన్ స్పందనతోకొద్దిసేపు చిరంజీవి తికమకపడ్డనట్టు కనిపించారు. అయితే సర్దుకుని ప్రసంగాన్ని ముగించి.. తనకు సమయాన్ని కేటాయించినందుకు సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం తెలిసిందే. అలాగే పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
తీరుమారని పాలకులు!
గవర్నర్ల వ్యవస్థపై ఎన్డీయే ప్రభుత్వానిది పాత బాటేనని కొన్ని రోజు లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. యూపీఏ పాల కులు నియమించిన గవర్నర్లందరూ వైదొలగాలని అధికారానికొచ్చిన నెల్లాళ్లలోపే ఎన్డీయే సర్కారు హుకుం జారీచేసినప్పుడు ఈ వ్యవస్థను బాగుజేయడానికి ప్రయత్నిస్తున్నదేమోనని కొందరిలోనైనా ఆశపు ట్టింది. రాజ్భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన దౌర్భాగ్యస్థితి ఇక అంతరిస్తుందని అలాంటివారనుకున్నారు. కానీ, కొత్త గవర్నర్ల నియామకం కోసం ఎన్డీయే సర్కారు జరిపిన కసరత్తు అలాంటి ఆశలన్నిటినీ ఆవిరిచేసింది. కేవలం రాజకీయ కారణాలతో పాత గవర్నర్లను పంపించాలనుకున్నాం తప్ప, కొత్త ఒరవడిని సృష్టించే ఉద్దేశం తమకు లేదుగాక లేదని ప్రభుత్వం తన ఆచరణ ద్వారా తెలియజెప్పింది. అయిదు రాష్ట్రాలకు ఇప్పుడు గవర్నర్లు కాబో తున్నవారంతా బీజేపీ సీనియర్ నేతలు. కేంద్ర మాజీ మంత్రి రాం నాయక్, యూపీ బీజేపీ నేత కేసరీనాథ్ త్రిపాఠి, ఢిల్లీ బీజేపీ నేత విజయ్కుమార్ మల్హోత్రా, మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ కైలాస్ జోషి, పంజాబ్కు చెందిన బలరాం దాస్ టాండన్లు రేపో మాపో రాజ్భవన్ లను అలంకరించబోతున్నారు. మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ కూడా గవర్నర్ కాబోతున్నారని కథనాలొచ్చినా ఆయన పేరు ప్రస్తుత జాబితాలో లేదు. ఏదైనా వ్యవస్థ సక్రమంగా లేదనుకుంటే దాన్ని సవరించవచ్చు లేదా పూర్తిగా ప్రక్షాళన చేయొచ్చు. అలాంటి చర్యను ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఎన్డీయే చేసింది వేరు. ముందు ‘యూపీఏ’ గవర్నర్లను వైదొలగమని కబురంపింది. పదవీకాలం ముగి సిన హెచ్ఆర్ భరద్వాజ్(కర్ణాటక), దేవానంద్ కన్వర్(త్రిపుర) ‘గౌర వం’గా తప్పుకున్నారు. ఎం.కె. నారాయణన్(పశ్చిమబెంగాల్), బీవీ వాంచూ(గోవా)వంటివారు అగస్టా హెలికాప్టర్ల స్కాంలో సీబీఐ ప్రశ్నించాక వైదొలిగారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గవర్నర్గా వ్యవహరించి ఆయనను ఇబ్బందిపెట్టిన కమలా బేణీవాల్ ను మిజోరం రాష్ట్రానికి బదిలీచేశారు. మిజోరంనుంచి నాగాలాండ్కు బదిలీ అయిన గవర్నర్ పురుషోత్తమన్ మాత్రం తమను సాధారణ ప్రభుత్వోద్యోగులుగా పరిగణించి బదిలీచేయడాన్ని జీర్ణించుకోలేక రాజీనామాచేశారు. యూపీ గవర్నర్ బీఎల్ జోషి నిష్ర్క మించమని సందేశం వచ్చిన వెంటనే వైదొలగారు. ఇంకా రాజ్భవన్ లను అంటిపెట్టుకుని ఉన్న షీలా దీక్షిత్(కేరళ), శంకర్నారాయణ్ (మహారాష్ట్ర), జగన్నాథ్ పహాడియా(హర్యానా)తదితరులను కూడా బదిలీ చేసే ఉద్దేశంలో కేంద్రం ఉంది. గవర్నర్ పదవి రాజ్యాంగం రీత్యా చూస్తే చాలా ఉన్నతమై నది.రాజ్యాంగంలోని 157. 158 అధికరణలు ఎలాంటివారిని ఆ పదవుల్లో నియమించాలో చెబుతాయి. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఆ పదవులు సీఎంలుగా, కేంద్రమంత్రులుగా విఫలమైనవారికో... ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్టు లభించనివారికో దక్కుతున్నాయి. ఒక్కోసారి పార్టీలో ఏ బాధ్యతనూ సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహించలేని వృద్ధ నేతలు కూడా గవర్నర్ పదవులకు అర్హులవుతున్నారు. ఉన్నతా ధికారులుగా ఉన్నప్పుడు తాము చెప్పినట్టల్లా నడుచుకున్నవారికి రిటైరయ్యాక పదవులిచ్చి యూపీఏ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. మరోవిధంగా చెప్పాలంటే కేంద్రంలో పాలన సాగిస్తున్న వారు ఉన్నతమైన రాజ్యాంగ పదవిని తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. గవర్నర్ల నియామకాలు రాజకీయ నిర్ణయం అయినప్పుడు రాజీనామా కోరడంలో తప్పేమున్న దని వాదించిన బీజేపీ నేతలు చివరకు తామూ ఆ బాటనే ఎంచుకు న్నారు. ఇంతకూ దారికి రాని గవర్నర్లను ఈశాన్య ప్రాంతానికే బదిలీచే యడంలోని ఆంతర్యమేమిటి? ఇది ఆ గవర్నర్లను తక్కువచేయడమా? ఈశాన్య ప్రాంతాన్ని చులకనచేయడమా? మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గవర్నర్ల వ్యవస్థను ఆరో వేలితో పోల్చారు. ప్రజామోదం పొందిన రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేసేందుకు, గుప్పెట్లో పెట్టుకునేందుకు ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిం చారు. ఇందులో నూటికి నూరుపాళ్లూ నిజముంది. కేంద్రంలో పాలన సాగించే పక్షం అవతలిపక్షానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు గవర్నర్ను ప్రయోగిస్తుంది. గవర్నర్ తల్చుకుంటే చేయలేనిదంటూ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సంతకం కోసం పంపిన బిల్లును నిరవధికంగా పెండింగ్లో ఉంచొచ్చు. శాంతిభద్రతలు క్షీణించాయన్న నివేదికను కేంద్రానికి పంపి ప్రభు త్వాన్ని బర్తరఫ్ చేయించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించి తాను ఆడింది ఆటగా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్ విషయంలో సుప్రీంకోర్టు ఒకటికి రెండు సందర్భాల్లో మందలించి ఉన్నది కనుక అలాంటి ధోరణి ఈమధ్య తగ్గినా... ఏమాత్రం అవకాశమున్నా దాన్ని వినియోగించుకోవడానికి కేంద్రంలోని పాలకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందువల్లే ఆమధ్య సుప్రీంకోర్టు సైతం గవర్నర్ల నియామకంలో రాజకీయ నీడ పడకుండా చూడాలని హితవు చెప్పింది. ఇలాంటి హితవచనాలు మన పాలకుల తలకెక్కలేదని ఎన్డీయే ప్రభుత్వ తాజా ఆలోచనలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పుడు ఎన్డీయే తీరును తప్పుబడుతున్న కాంగ్రెస్ పదేళ్లక్రితం తాను సైతం ఇదే తప్పు చేసింది. ఆనాడు యూపీఏ సర్కారును తప్పుబట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలోకొచ్చి తామూ అదేవిధంగా వ్యవ హరిస్తున్నారు. ఇప్పటికైనా దీనికి ఫుల్స్టాప్ పడుతుందని ఆశిం చినవారికి కొత్త గవర్నర్ల నియామకం నిరాశ కలిగించిందనడంలో సందేహంలేదు. -
ఏడు రాష్టాల గవర్నర్ల భర్తీకి సన్నాహాలు
-
పుదుచ్చేరి గవర్నర్ తొలగింపు!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన రాష్ట్ర గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఆ పనిలో వేగం పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం తొలిసారిగా ఓ గవర్నరుపై వేటు వేసింది. పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియాను తొలగించి, ఆ స్థానంలో అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్నెంట్ గవర్నర్ అజయ్కుమార్కు అదనంగా బాధ్యతలను అప్పగించింది. గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని వీరేంద్రను ఆదేశిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారని రాష్ట్రపతి భవన్ వర్గాలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. గవర్నర్ తొలగింపు అనేది.. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లకు హెచ్చరికలాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. తనను సంప్రదించకుండా మిజోరం నుంచి నాగాలాండ్కు బదిలీ చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్ వక్కొం బి. పురుషోత్తమన్ శుక్రవారం రాజీనామా చేశారు. గవర్నర్లను, ప్రభుత్వ అధికారుల మాదిరిగా బదిలీ చేయడం అవమానించడమేనన్నారు. రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా శనివారం సాయంత్రం(నేడు) గోవా గవర్నర్గా ప్రమాణం చేయనున్నారు. -
నిధుల ఊసే లేదు
కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ యూపీఏ తరహాలో తమిళనాడు మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. దక్షిణాది జిల్లాలకు పూర్తిగా హ్యాండిచ్చిన సదానంద, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు మాత్రం ఐదు రైళ్లను కంటి తుడుపు చర్యగా ప్రకటించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఊసే లేని దృష్ట్యా, తమిళనాట రైల్వే బడ్జెట్కు వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని పెండింగ్, అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సుమారు పది వేల కోట్ల మేరకు నిధులు అవసరం. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ప్రస్తుతం అధికారం మారడంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో సామరస్య పూర్వంగా మెలిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసక్తి చూపినా కేంద్రం వైఖరి మాత్రం మారలేదు. హ్యాండిచ్చిన సదానంద: తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, దక్షిణాది జిల్లాలోని పలు ప్రధాన నగరాల్ని కలుపుతూ కొత్త రైళ్ల సేవలకు ప్రతిపాదనలున్నారుు. అయితే, తమిళనాడుకు సదానంద హ్యాండిచ్చారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలు కూడా ప్రకటించ లేదు. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తుల్ని సైతం సదానంద ఖాతరు చేయలేదు. అమల్లో ఉన్న పనులకు కనీసం నిధుల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో ఆ పనులు పూర్తవడానికి మరెన్ని నెలలు పట్టనుందోనని ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరాశే : విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్, మార్గాల్లో జరుగుతున్న పనులకు నిధుల ఊసెత్తక పోవడం గమనార్హం. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటన వెలువడుతుందని ఎదురు చూసిన వాళ్లకు చివరకు మిగిలింది నిరాశే. అయితే, మౌళిక వసతుల కల్పం, రైల్వే ప్రయాణికుల భద్రత, మహిళా భద్రత ప్రకటనలు మాత్రం స్వాగతిస్తున్నారు. కంటి తుడుపు చర్య : తమిళనాడు ప్రజలకు హ్యాండిచ్చిన సదానంద గౌడ కంటి తుడుపు చర్యగా కొన్ని రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ చెన్నై నుంచి బయలు దేరే రైళ్లే. దక్షిణాదిలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి నగరాలకు మిగిలింది నిరాశే. అరుుతే చెన్నై - హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సావల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఐదు రైళ్లు : పార్లమెంట్లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ మేరకు ఐదు రైళ్ల వివరాలు. మదురై - జైపూర్ (వారంతాపు ప్రీమియర్ ఎక్స్ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు రైలు సేవ),- చెన్నై - విశాఖ (వారంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత). సర్వత్రా విమర్శ : ఈ బడ్జెట్ను తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమిళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారని పీఎంకే ఎంపీ అన్భుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైళ్లను తన సొంత రాష్ట్రానికి మంత్రి తరలించుకున్నారని సీపీఎం ఎంపీ రంగరాజన్ మండిపడ్డారు. తమిళ ప్రజలకు మొండి చేయి మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాటనే మళ్లీ మళ్లీ పాడినట్టు, చివరకు తమిళ ప్రజల నెత్తిన టోపీ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. తమిళుల ఆశల్ని, విజ్ఞప్తులపై మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండి పడ్డారు. టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ సైతం రైల్వే బడ్జెట్పై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం : సీఎం జయలలిత మాత్రం రైల్వే బడ్జెట్ను ఆహ్వానించారు. భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ బడ్జెట్ను రూపొందించినట్టుందన్నారు. స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల సేవలు, మహిళలకు భద్రత, రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రకటనలు సంతృప్తినిచ్చాయన్నారు. ముంబె తర్వాత బుల్లెట్ రైలు సేవల ప్రాధాన్యతలో తమిళనాడుకు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకటించినవి మదురై - జైపూర్ (వారాంతపు ప్రీమియర్ ఎక్స్ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు), చెన్నై - విశాఖ (వారాంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ). వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సవాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఆశించినవి చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలైనా వస్తుందని ఆశించారు. విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్ మార్గాల పనులకు నిధులివ్వలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటిస్తారని ఆశించినా జరగలేదు. -
కేంద్రానికి రిలయన్స్ ఆర్బిట్రేషన్ నోటీసు
న్యూఢిల్లీ: ఇప్పటికే చాలా జాప్యమైన సహజవాయువు ధర పెంపును వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), భాగస్వామ్య సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్లు ఆర్బిట్రేషన్ నోటీసు జారీ చేశాయి. గత ప్రభుత్వం ఆమోదించిన గడువు తేదీ అయిన ఏప్రిల్ 1 నుంచి రేటు పెంపు అమలుకాకపోవడం వల్ల సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు నిలిచిపోయేందుకు దారితీస్తోందని మే 9న జారీ చేసిన ప్రీ-ఆర్బిట్రేషన్ నోటీసులో ఈ 3 కంపెనీలు పేర్కొన్నాయి. లండన్కు చెందిన సర్ డేవిడ్ స్టీల్ను తమ తరఫున ఆర్బిట్రేటర్గా పేర్కొంటూ ఆర్బిట్రేషన్ నోటీసును జూన్ 17న జారీ చేసినట్లు సమాచారం. గ్యాస్ రేటును 4.2 డాలర్ల నుంచి(ఒక్కో యూనిట్కు) రెట్టింపునకు పైగా పెంచుతూ(8.8 డాలర్లకు) గతేడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కూడా పేర్కొందని... దీనికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని రిలయన్స్-బీపీ-నికో పేర్కొన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి రేటు పెంచుతూ జనవరి10న గత యూపీఏ సర్కారు కొత్త గ్యాస్ ధర ఫార్ములాను నోటిఫై చేసింది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకిరావడంతో అమలు జూలై 1 వరకూ వాయిదా పడింది. అయితే, రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్ములా ప్రకారం రేటు పెంపుపై తాజాగా మోడీ నేతృత్వంలోని సెప్టెంబర్ నెలాఖరు వరకూ పెంపును వాయిదా వేసింది. -
గ్యాస్ ధర పెరగడమే మాక్కావాల్సింది!!
-
'కాంగ్రెస్ పార్టీది అనాలోచిత నిర్ణయం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యూపీఏ ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ధూళిపాళ్ల విమర్శించారు. -
‘స్నూప్గేట్’ దర్యాప్తునకు మంగళం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఒక మహిళపై అనధికారికంగా నిఘా పెట్టారన్న ఆరోపణలపై గత యూపీఏ ప్రభుత్వం ఆదేశించిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును రద్దుచేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. స్నూప్గేట్ దర్యాప్తు రద్దు అంశాన్ని కేంద్ర హోంశాఖ త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని సమాచారం. స్నూప్గేట్పై దర్యాప్తుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 26న ఇచ్చిన ఆదేశాలు రాజకీయ ప్రేరేపితమని.. దీనిని ఎన్డీఏ సర్కారు సమీక్షిస్తుందని హోంశాఖ సహాయమంత్రి కిరెన్రిజిజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. స్నూప్గేట్ దర్యాప్తు కోసం యూపీఏ సర్కారు ప్రకటించిన కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కానీ నేతృత్వం వహిస్తారని.. హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్భద్రసింగ్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయనపై అప్పటి బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టారన్న ఆరోపణల పైనా, బీజేపీ నేత (ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి) అరుణ్జైట్లీకి సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాల రికార్డుల లీకేజీపైనా దర్యాప్తు చేస్తుందని పేర్కొంది. అయితే.. మాజీ న్యాయమూర్తి ఎవరూ ఈ కమిషన్కు నేతృత్వం వహించేందుకు సుముఖంగా లేకపోవటంతో యూపీఏ సర్కారు కమిషన్ను ఏర్పాటు చేయలేకపోయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. -
ఈ ఉత్తర్వులు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినవే!
-
ఇదేం బాదుడు?!
అందరం ఏకమై యూపీఏ సర్కారు పీడ విరగడ చేసుకున్నామని జనం సంబరపడి ఇంకా నెల్లాళ్లయినా కాలేదు... చార్జీల బాదుడులో తాను కూడా యూపీఏకు ఏమాత్రం తీసిపోనని ఎన్డీఏ ప్రభుత్వం రుజువుచేసుకుంది. ఉన్నట్టుండి శుక్రవారం రోజున ఒక్కసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా సరుకు రవాణా చార్జీలను కూడా 6.5 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తాయి. రేపో మాపో వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్నవారు అసలు చార్జీలే పెంచరాదని, అలా పెంచనివారే మంచి పాలకులని ఎవరూ వాదించరు. కానీ అందుకు ఒక పద్ధతంటూ ఉండాలని ఆశిస్తారు. అలాంటి పద్ధతి పాటించకపోవడంలో యూపీఏ సర్కారు చరిత్ర జగ ద్విదితం. విషాదమేమంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సైతం ఆ అడుగుజా డలే ఆదర్శమయ్యాయి. పార్లమెంటులో తనకున్న మెజారిటీకి ఎన్డీఏ ఇలా చేయాల్సిన అవసరం లేదు. అసలిది మెజారిటీ ఉండటం, లేకపోవడానికి సంబంధించింది కూడా కాదు. నైతికతకు సంబంధిం చిన అంశం. మెచ్చి మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు దిగ్భ్రమ కలిగించే విషయం. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటివారంనుంచి ప్రారం భం కావొచ్చని చెబుతున్నారు. ఆ సమావేశాల్లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. చార్జీల పెంపుతో సహా అన్ని ప్రతిపాదనలూ అప్పుడుండాలి. చట్టసభలంటే గౌరవమున్నా, ప్రజాస్వామ్యమంటే విశ్వాసం ఉన్నా చేయాల్సింది ఇదే. కానీ, బడ్జెట్కు ముందో, తర్వాతో ప్రజల నడ్డి విరిచి అటు తర్వాత చార్జీల ఊసే లేని బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇటీవలికాలంలో అలవాటైంది. పర్యవసానంగా చార్జీల పెంపు సంగతి పార్లమెంటులో అసలు చర్చకే రాకపోవడమో లేదా మొక్కుబడి ప్రస్తావనగానో మిగిలిపోతున్నది. అసలు ఎన్డీఏ సర్కారు చార్జీల విష యమై ఆదరాబాదరాగా వ్యవహరించిన తీరును ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రయా ణికుల చార్జీలు పెంచడం తప్పకపోవచ్చని ఆరు రోజులక్రితమే రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. గురువారం అధికారులతో మాట్లాడి నప్పుడు ఈ విషయంలో మరికొన్ని దఫాలు చర్చలు జరగాల్సివున్న దని మంత్రి చెప్పారంటున్నారు. అలా చెప్పి 24 గంటలు గడవక ముందే చార్జీల పెంపు ప్రకటన వెలువడింది. ఎందుకిలా జరిగిందో సదానందకే తెలియాలి. ‘నాకు ముందున్న రైల్వే మంత్రి చేసిన నిర్ణ యాలను అమలు చేయకతప్పలేదు. నేను చేసిందల్లా ఆయన పెండింగ్ లో పెడుతూ జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించడమే’అని సదా నంద లౌక్యంగా చెబుతున్నారు. యూపీఏ సర్కారు పరమ అస్తవ్య స్తంగా వ్యవహరించేదన్న కారణానే దాన్ని జనం కాదన్నారు. ఒకవేళ తామూ అదే తోవన వెళ్లకతప్పదని భావించే స్థితి బీజేపీకి ఉంటే ఆ సంగతి ఎన్నికల్లోనే చెబితే సరిపోయేది. ‘మాకూ వారికీ తేడా ఏం లేదు. చార్జీలు పెంచి కూడా దాన్ని అమలు చేయడానికి వారు భయపడ్డారు. మాకు ఓటేస్తే ఆ ప్రతిపాదనలను నిర్భయంగా అమలుచేస్తాం’ అని చెప్పివుండాల్సింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పార్లమెంటును లెక్కచేయని యూపీఏనే మాకూ ఆదర్శమని ప్రకటించాల్సింది. అప్పుడు ప్రజలు దానికి తగ్గట్టే వ్యవహరించేవారు. గత రెండేళ్లనుంచి 5 శాతానికి మించకుండా మందగించిన వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థను స్వస్థపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ప్రధాని నరేంద్రమోడీ ఈమధ్యే చెప్పారు. ఎన్నికల్లో తమపై అపార ప్రేమను ప్రదర్శించిన ప్రజలు ఈ నిర్ణయాలకు కలవరపడినా ఫలితాలు చూశాక తిరిగి తమను ఇష్టప డతారని మోడీ అంటున్న మాటల్లోని నిజానిజాల సంగతలా ఉంచి... నిర్ణయాలు ఎలాంటివైనా వాటిని అమలుపరిచే తీరు సక్రమంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఊగిసలాడే పాలకులు పోయి నిర్ణయాత్మ కంగా వ్యవహరించేవారు రావాలని ప్రజలు ఆశించారు తప్ప ఇలా పెడ దోవన వెళ్లాలని కోరుకోలేదు. యూపీఏ పాలనలో రైల్వే శాఖ వట్టిపో యిందని, దాన్ని పట్టాలెక్కించాలంటే ఇది తప్పనిసరని ప్రభుత్వ పెద్దలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. నిరుడు జనవరిలో యూపీఏ సర్కారు రైల్వేచార్జీలను పెంచినప్పుడు ఆ నిర్ణయాన్ని విమ ర్శిస్తూ నరేంద్రమోడీ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇప్పుడొచ్చిన అధి కారం ఆ అభిప్రాయాన్ని ఎలా మార్చేయగలదో అనూహ్యం. పెంచిన చార్జీలవల్ల రూ. 8,000 కోట్ల ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. రవాణా చార్జీల పెంపువల్ల వివిధ సరుకుల ధరలు మరింత పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చవుతుంది. రైల్వేలు నష్టాల్లో కూరుకుపోయిన మాట వాస్తవమే. కానీ, అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే మంత్రులుగా ఉన్నవారు లాభనష్టాలతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టుల్ని తమ రాష్ట్రాలకు తరలించుకుపోవడం... ప్రయాణికులు లేకున్నా, పైసా ఆదాయం రాకున్నా ప్రతిష్టకుపోయి దురంతోలు, సూపర్ఫాస్ట్లు తమ ప్రాంతాలకు మళ్లించడంవంటి చర్యలు రైల్వేలను కుంగదీశాయి. ఇవిగాక అడ్డూ ఆపూ లేకుండా చేసే వృథా వ్యయం అదనం. వీటన్నిటి పర్యవసానంగా రైల్వేలు సంపా దించే ప్రతి రూపాయిలో దాదాపు 89 పైసలు ఖర్చులకే పోతున్నాయి. జోన్లవారీగా చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ జోన్లలో ఆదాయ వ్యయాలు చెల్లుకు చెల్లవుతున్నాయి. అధికాదాయం తెస్తున్నది దక్షిణ మధ్య రైల్వేనే! వీటన్నిటినీ ఓపిగ్గా సమీక్షించి లోపాలు సరిచేయాల్సింది పోయి ఎప్పటిలా ప్రయాణికులను చావబాదడమే పరిష్కారమన్నట్టు ఎన్డీఏ సర్కారు వ్యవహరించింది. ఈ తరహా పోకడలు తమను నమ్ముకున్న ప్రజలకు చేటు కలిగిస్తాయని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. -
మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా
-
నేనింకా రాజీనామా చేయలేదు
తానింకా గవర్నర్ పదవికి రాజీనామా చేయలేదని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తెలిపారు. అయితే రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఏమైనా వర్తమానం వచ్చిందా లేదా అన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లను సాగనంపాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణన్ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు. దానికి ఆయన తానింకా రాజీనామా చేయలేదని, ఇప్పటికీ తానే బెంగాల్ గవర్నర్నని అన్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదని కూడా నారాయణన్ చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏమీ చెప్పకపోయినా.. రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిన గవర్నర్ల జాబితాలో నారాయణన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
రాజీనామా బాటలో గవర్నర్లు
-
రాజీనామా బాటలో గవర్నర్లు
మార్పు తప్పదన్న సంకేతాలతో సిద్ధమవుతున్న వైనం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో కొలువైన నరేంద్ర మోడీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కొందరు రాజీనామాల బాట పట్టగా.. కేరళ గవర్నర్ షీలాదీక్షిత్సహా మరికొందరు వైదొలిగేందుకు ససేమిరా అంటున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి మంగళవారం ఉదయం తన రాజీనామాను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు పంపించారు. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపగా ఆయన ఆమోదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యూపీ బాధ్యతలను ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీకి తాత్కాలికంగా అప్పగించారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి సన్నిహితునిగా పేరుపడిన 78 ఏళ్ల జోషి పదవీకాలం కొద్ది నెలలక్రితం ముగియగా.. తిరిగి గవర్నర్గా నియమితులయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించాలని, ముఖ్యంగా కేరళ గవర్నర్ షీలాదీక్షిత్, మరో నలుగురు గవర్నర్లను ఇంటికి పంపాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. వీరిలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్, నాగాలాండ్ గవర్నర్ అశ్వినీకుమార్, గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ ఉన్నట్టు సమాచారం. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించాలన్న కొత్త ప్రభుత్వ ఉద్దేశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఆయా గవర్నర్ల దృష్టికి తీసుకుపోయినట్టు సమాచారం. కొత్తవారిని నియమించేందుకు వీలుగా తప్పుకోవాలని సూచించినట్టు తెలిసింది. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులై మరో రెండేళ్లలో పదవీకాలం ముగియనున్న వారిపై కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ల రాజీనామాల పర్వం ఆరంభమైంది. జోషి రాజీనామా చేయగా.. ఇదే సమయంలో కొందరు గవర్నర్లు మంగళవారం ఢిల్లీలో ఉండడం, రాష్ట్రపతిని కలవడంతో వారు సైతం రాజీనామా చేసినట్టు ఊహాగానాలొచ్చాయి. ఈ క్రమంలో కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, అస్సాం గవర్నర్ జేబీ పట్నాయక్లు రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తాము రాజీనామా చేయలేదని వీరిద్దరూ స్పష్టం చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. అస్సాం గవర్నర్ జేబీ పట్నాయక్ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుంది. మరోవైపు ఎంకే నారాయణన్(పశ్చిమబెంగాల్), మార్గరెట్ అల్వా (రాజస్థాన్), కమలా బేణివాల్ (గుజరాత్) రాజీనామా బాటలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోడీని కలిసిన రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా తన రాజీనామాపై చర్చించినట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో ఆయనతో సఖ్యతతో వ్యవహరించకపోవడం గవర్నర్ కమలా బేణివాల్ పదవికి ఎసరు తెచ్చింది. యూపీఏ ప్రభుత్వ బాటలోనే... గతంలో ఎన్డీఏ సర్కారు హయాంలో నియమితులైన గవర్నర్లను 2004లో యూపీఏ అధికారంలోకి రాగానే మార్చింది. తాజాగా ఎన్డీఏ సైతం యూపీఏ తరహాలో గవర్నర్ల మార్పునకు తెరతీసింది. యూపీఏ హయాంలో గవర్నర్ల నియామకం సక్రమంగా జరగలేదని, వారిలో ప్రతిభ ఆధారంగా గాక పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుంగులైన వారికే అవకాశమిచ్చారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఈ రాజీనామాల పర్వానికి తెరలేచింది. ఇదిలా ఉండగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) వంటి సంస్థల్లో సభ్యులుగా నియమితులైన రాజకీయ ప్రముఖులను కూడా తొలగించేందుకు ఎన్డీఏ సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వదంతులపై స్పందించనన్న షీలా.. లోక్సభ ఎన్నికలకు ముందు కేరళ గవర్నర్గా నియమితులైన ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ తాను గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. వదంతులపై తాను స్పందించబోనని ఆమె వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ కూడా రాజీనామాపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. నరసింహన్ కొనసాగింపు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక అంశాలు అపరిష్కృతంగా ఉండడంతో ఆయన్ను మార్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్లకు అవకాశం ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్లో చోటు దక్కని బీజేపీ సీనియర్ నాయకులను ఆయా రాష్ట్రాల గవర్నర్లుగా పంపి సంతృప్తి పర్చాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతలైన ఎం.ఎం.జోషి, లాల్జీ టాండన్, వీకే మల్హోత్రా, కల్యాణ్సింగ్, శాంతకుమార్తోపాటు బీసీ ఖండూరీ పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కేబినెట్లో ప్రాధాన్యం లభించని నాయకులను సైతం గవర్నర్లుగా పంపే యోచనలో బీజేపీ ఉందని సమాచారం. అనైతికమన్న కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ ఎన్డీఏ ప్రభుత్వ చర్యను కాంగ్రెస్, సీపీఎంలు తప్పుపట్టాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, అనైతికమని మండిపడ్డాయి. దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా, నిరంకుశమైన చర్యగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అభివర్ణించారు. రాజ్యాంగపరంగా గవర్నర్ల వ్యవస్థకున్న గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం సరికాదని సూచించారు. గత ప్రభుత్వంలో నియమితులయ్యారన్న ఏకైక రాజకీయ కారణం తప్ప గవర్నర్ల తొలగింపు వెనుక మరొక కారణం కనిపించడం లేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. గవర్నర్ల మార్పులో ఏ మార్పు అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిమతానికి అనుగుణంగా ఉండాలని హితవు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వ యోచన సరికాదని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి నరేష్ అగర్వాల్ అన్నారు. దేశాన్ని కాషాయీకరణ చేయడానికి ఇది నాందిగా పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చెందినవారిని గవర్నర్లుగా పంపేందుకు చేస్తున్న ప్రయత్నమిదని తప్పుపట్టారు. బీజేపీ నేతలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ స్పందిస్తూ.. యూపీఏ నియమించిన గవర్నర్ల జాబితాలో తానున్నట్లయితే రాజీనామా చేసేవాడినని వ్యాఖ్యానించారు. -
వద్దనుకుంటున్నారు.. తప్పుకుంటున్నాం..
-
ముగ్గురు గవర్నర్ల రాజీనామా
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో నియమితులయిన గవర్నర్లకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. కర్ణాటక, అసోం, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. యూపీ గవర్నర్ బీఎల్ జోషీ తొలుతు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. తాజాగా కర్ణాటక గవర్నర్ భరద్వాజ్, అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ రాజీనామా చేశారు. అదే బాటలో మరి కొందరు గవర్నర్లు ఉన్నారు. కేళర గవర్నర్ షీలా దీక్షిత్, శివరాజ్ పాటిల్, ఎంకే నారాయణ్ కూడా తమ పదవులకు రాజీనామ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వారికి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు రాజస్తాన్ గవర్నర్ మార్గరేట్ అల్వా ఈరోజు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కాగా యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో సోనియా విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజకీయ లబ్ది కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు. అర్హత లేకున్నా వారికి గవర్నర్లుగా పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ నేతలు షీలా దీక్షిత్, ఎంకే నారాయణ, శివరాజ్పాటిల్ను ఇలాగే గవర్నర్లుగా నియమించారని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. -
చేదు మాత్రలు తప్పవు
రాబోయే రెండేళ్లు కఠిన నిర్ణయాలు అవసరం: మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను గత యూపీఏ సర్కారు అధఃపాతాళానికి దిగజార్చింది రాష్ట్రాల ప్రగతితోనే దేశ సుసంపన్నత..కేంద్ర, రాష్ట్రాలు జట్టుగా పనిచేయాలి పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలు త్వరలో ‘సాగరమాల’కు రూపకల్పన పణజి: రోగగ్రస్తమైన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే రాబోయే రెండేళ్లలో.. చేదు మాత్రలతో కఠిన నిర్ణయాలు తప్పవని.. ఇవి కొన్ని వర్గాల వారికి మింగుడుపడక పోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను శనివారం జాతికి అంకితం చేసిన కార్యక్రమం అనంతరం మూడు వేరువేరు కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. మొదట పణజిలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఓ స్టార్ హోటల్లో 150 మంది ప్రత్యేక ఆహ్వానితులైన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మోడీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పణజిలో బీజేపీ కార్యకర్తల సదస్సులో.. ► యూపీఏ హయాంలో పదేళ్ల పాటు అసలు పాలనే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యపరిస్థితి అధఃపాతాళానికి దిగజారింది. ఖజానా ఖాళీ అయిన పరిస్థితుల్లో దేశ పాలనాపగ్గాలు చేపట్టాను. ఇప్పుడిక దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాల్సి ఉంది. ► ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావటానికి.. రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. దేశం నాకు ఇచ్చిన అపారమైన ప్రేమకు.. ఈ నిర్ణయాలు గండి కొట్టవచ్చని నాకు బాగా తెలుసు. కానీ.. ఈ చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని నా దేశ ప్రజలు గుర్తించినప్పుడు ఆ ప్రేమను నేను తిరిగి పొందుతాను. ► రాష్ట్రాల సుసంపన్నత దేశ ప్రగతిపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం, పథకాల కోసం గతంలో మాదిరిగా కేంద్రం వద్ద ప్రాధేయపడాల్సిన అవసరం ఇక లేదు. రాష్ట్రాలు, కేంద్రం ఒక జట్టుగా కలిసి పనిచేయాలి. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ గురించి చెప్తోంది. అయితే.. మేం సహకార సమాఖ్య విధానం అనే కొత్త విధానాన్ని రూపొందించాం. పారిశ్రామికవేత్తలతో భేటీలో.. ► పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, నైపుణ్యాల అభివద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. నైపుణ్యం గల సిబ్బంది ప్రోత్సాహానికి అభివద్ధి చెందిన దేశాలు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాయి. ► దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసున్న వారే. నైపుణ్యాల అభివద్ధికి ప్రోత్సాహమివ్వటం ద్వారా.. చదువుకున్న నిరుద్యోగులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తగినన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ► ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించేందుకు, వ్యయం తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపడుతాం. ఆర్థిక రంగ పునరుజ్జీవానికి భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ► 2022 సంవత్సరానికి దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికల్లా దేశంలో ప్రతి ఒక్కరికీ నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో కూడిన ఇళ్లను సమకూరుస్తాం. మాండవి నదిపై వంతెనకు శంకుస్థాపన కార్యక్రమంలో.. ► అన్ని తీరప్రాంత నగరాలు, పట్టణాలను రోడ్డు, రైలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ‘సాగర్మాల’ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం. దీనిద్వారా తీర నగరాల ప్రత్యేకత, ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. నేడు భూటాన్కు ప్రధాని: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు వారాల కిందట ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. రెండ్రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో మోడీ వెంట విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ ఉంటారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. భూటాన్ ఉభయ సభలను (జాతీయ అసెంబ్లీ, జాతీయ మండలి) ఉద్దేశించి ప్రసంగిస్తారు. -
‘స్వచ్ఛంద సేవ’లో కుట్రా?!
సామాజిక వివక్షను అరికట్టడం, అట్టడుగువర్గాల అభ్యున్నతి, పర్యావరణం, పౌరహక్కులువంటి సమస్యలపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలు. కానీ, ఇలాంటి సంస్థల వెనక స్వచ్ఛత కాకుండా స్వప్రయోజనాలు... సేవ కాకుండా దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపిం చేవారికి కొదవేమీ లేదు. స్వాభావికంగా సౌమ్యుడైన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఒకానొక సందర్భంలో స్వచ్ఛంద సంస్థల ఆంతర్యంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని కూడంకుళంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అమెరికానుంచి నిధులు వచ్చిపడుతున్నాయని ఆయన ఆరోపిం చారు. అది రష్యా సహకారంతో నిర్మాణమైన ప్రాజెక్టు గనుక అమెరికా నుంచి కొన్ని సంస్థలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆటంకాలు సృష్టి స్తున్నాయన్నది ఆయన ఆరోపణల సారాంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంకో అడుగు ముందుకేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల ప్రోద్బలంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తూ అభివృద్ధి నిరోధకంగా మారుతున్నాయని ఆరోపించింది. ఇందువల్ల జీడీపీ 2 నుంచి 3 శాతం తగ్గే ప్రమాదమున్నదని ఒక నివేదికలో హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగం ఐబీ. ఈ నివేదిక యూపీఏ ప్రభుత్వ హయాంలోనే తయారైం దని, ఇప్పుడది లీక్ కావడం వెనక నిర్దిష్ట ప్రయోజనాలున్నాయని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అంటున్నారు. పెండింగ్లో పడిపోర ుున అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధపడుతున్నదని...అందుకు తగిన ప్రాతిపదికను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ నివేదికను ఇప్పుడు లీక్చేశారని వారి అభియోగం. స్వచ్ఛంద సేవా రంగంలో పనిచేసే కార్యకర్తలను, వారికి చేదోడువా దోడుగా నిలిచే వర్గాలను భయభ్రాంతులను చేయడమే దీని ఉద్దేశ మన్నది వారి ప్రధాన ఆరోపణ. స్వచ్ఛంద సంస్థలన్నిటినీ ఒకే గాటన కట్టి చూడలేం. వాటి ప్రకటిత లక్ష్యాలు వేరైనట్టే, వాటి కార్యక్షేత్రాలు వేరైనట్టే ఆ సంస్థల దశ, దిశ కూడా వేరుగా ఉంటాయి. అటువంటప్పుడు స్వచ్ఛంద సంస్థలు జాతిద్రోహా నికి పాల్పడుతున్నాయని ఒక ముద్రేయడం సరికాదు. నిజమే...కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేరుకే ఉంటాయి. విదేశీ విరాళాలను దండుకోవ డమే లక్ష్యంగా ఏర్పడతాయి. రాజకీయ నాయకుల, ఉన్నతోద్యోగుల సమీప బంధువులు ఏయే రంగాల్లో ‘పనిచేస్తే’ భారీయెత్తున విరాళాలు అందుతాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా బోగస్ సంస్థలను స్థాపించి స్వాహాచేయడమూ ఉంటున్నది. కానీ ఉన్నతాశయాలతో, లక్ష్యాలతో చిత్తశుద్ధిగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. 80 దశకం తర్వాత ఇలాంటి సంస్థలు ప్రజారంగంలోకి రావడంవల్ల మరుగునపడివున్న అనేక అంశాలు ఎజెండాలోకి వచ్చాయి. మనం ఎవరమూ సమస్యలుగా పరిగణించనివాటిపై ఎరుక కలిగించడమే కాదు...ఉన్న సమస్యలను కొత్త కోణంనుంచి దర్శించగలిగే చైతన్యాన్ని కూడా అందించాయి. స్త్రీవాదమైనా, దళితవాదమైనా అంత బలంగా ముందుకు రావడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఉన్నది. ఇవి మాత్రమే కాదు...బాల కార్మిక వ్యవస్థ మొదలుకొని పర్యావరణ సమస్యల వరకూ ఎన్నో అంశాల విషయంలో ఆ సంస్థలు పౌరులను సమీకరిం చగలుగుతున్నాయి. పోరాడుతున్నాయి. అవగాహనకలిగిస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థల నిర్వహణ ను, వాటి ఆదాయమార్గాలను నియంత్రించేందుకు...ఆరా తీసేందుకు తగిన చట్టాలున్నాయి. చట్ట ఉల్లంఘన జరిగినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడాన్ని కూడా ఎవరూ ప్రశ్నించరు. అవి మరింత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పనిచేయడంకోసం వాటిని సమాచార హక్కు చట్టంకిందకు తీసుకొస్తామన్నా అభ్యంతరపెట్టేవారు ఉండరు. నిజంగా జాతి భద్రతకు, ఆర్ధిక వ్యవస్థ మనుగడకు ఇబ్బందులు కలిగిస్తున్నారని రుజువైతే చర్య తీసుకోవద్దని కూడా ఎవరూ అనరు. కానీ, కూడం కుళంలో అణు విద్యుత్తు ప్రాజెక్టును వ్యతిరేకించారనో, మరోచోట థర్మల్ విద్యుత్కేంద్రం వద్దన్నారనో ఆ సంస్థలకు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. సమస్యలపై ఆ సంస్థల అవగాహనలో లోపం ఉన్నదనుకున్నా... అవి లేవనెత్తుతున్న ప్రశ్నలు సరైనవి కావ నుకున్నా వాటిని చర్చకు పెట్టాలి. ప్రజలకు నచ్చజెప్పాలి. ఒప్పిం చాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగవలసింది అదే. అంతేతప్ప భిన్నాభిప్రాయాన్నో, అసమ్మతినో వ్యక్తంచేసినవారిని అణచాలని చూడటం...వారిపై జాతి వ్యతిరేక ముద్రేయడం సరైన విధానం అనిపించుకోదు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం లేవనెత్తిన సమస్యలెన్నో ఉన్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాజెక్టు నిర్మించారని, దాని సమీ పంలో చేపల వేటను నిషేధించారు గనుక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. వాటన్నిటికీ సమర్ధవంతంగా జవాబివ్వడాన్ని విడనాడి ఉద్యమకారుల ల్యాప్ టాప్లో ప్రస్తుత, ప్రతిపాదిత అణు విద్యుత్ ప్రాజెక్టులను గుర్తించిన మ్యాప్ లభించడమే నేరమన్నట్టు చిత్రించడం సరికాదు. ఎక్కడెక్కడ అణు విద్యుత్తు ప్రాజెక్టులు నెలకొల్పదల్చుకున్నదీ ప్రభుత్వమే తెలిపింది. ప్రస్తుతం ఉన్నవేమిటో అందరికీ తెలుసు. అలాంటపుడు ఆ మ్యాప్ ఉండటం దానికదే నేరమెలా అవుతుంది? భిన్నాభి ప్రాయా లకూ, అసమ్మతికీ చోటిచ్చినప్పుడే ప్రజల సమస్యలు అవగాహన కొస్తాయి. వాటి ఉనికే ఉండవద్దనుకోవడం సమస్యల పరిష్కారానికి దోహదపడదు. -
యూపీఏ ఎంపీలకు సోనియా విందు
న్యూఢిల్లీ: యూపీఏ ఎంపీలకు మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ప్రాంగణంలో విందు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు యూపీఏ పక్ష పార్టీలైన ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆరెల్డీ, ఐయూఎంఎల్లకు చెందిన ఎంపీలు ఈ విందుకు హాజరయ్యారు. యూపీఏకు మద్దతిస్తున్న ఆర్జేడీ, జేఎంఎంల అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శిబూ సొరేన్లు కూడా విందులో పాల్గొన్నారు. విందులో పలు రకాలైన శాఖాహార, మాంసాహార వంటకాలను వడ్డించారు. నిజానికి ఈ విందు కార్యక్రమాన్ని జూన్ 5 వ తేదీన్నే ఏర్పాటు చేయాలని భావించినా.. కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే హఠాన్మరణంతో మంగళవారానికి వాయిదా పడింది. -
ఇక సభలో సమరం
పార్లమెంటులో తలపడిన అధికార - ప్రతిపక్షాలు న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత.. కేంద్రంలో పదేళ్ల యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాక.. ప్రతిపక్ష ఎన్డీఏ అధికారం చేపట్టి సర్కారును ఏర్పాటు చేశాక.. ఆ రెండు పక్షాలూ పార్లమెంటులో తొలిసారి తలపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కారు అహంకారం లేకుండా పనిచేయాలని, హామీలను అమలుచేయాలని కాంగ్రెస్ హితవు పలికితే.. కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ సర్కారు దేశ ఆర్థికవ్యవస్థను భ్రష్టుపట్టించిందంటూ అధికార పక్షం తూర్పారబట్టింది. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రసంగించారు. మంత్రిగా తొలిసారి మాట్లాడిన జైట్లీ.. దేశంలో ఆర్థికవృద్ధి దిగజారటానికి, ద్రవ్యోల్బణం పెరగటానికి, పన్నుల వసూళ్లు తగ్గటానికి, పేదరికం పెరగటానికి నిన్నటి మన్మోహన్ సర్కారే కారణమని ధ్వజమెత్తారు. బలమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పునరుత్తేజితం చేస్తుందన్నారు. మైనారిటీల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిపై సందేహాలు అవసరం లేదని.. సామాజిక సామరస్యాన్ని, దేశ భధ్రతను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతుందని చెప్పారు. యూపీఏ సర్కారు పనితీరు ఘోరంగా ఉండటం వల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రజలు.. చాలా ఆకాంక్షలతో ఎన్డీఏకు అధికారాన్ని కట్టబెట్టారని, అది ప్రభుత్వంపై సక్రమంగా పనిచేయాల్సిన భారం మోపిందన్నారు. యూపీఏ ఎజెండానే..: ఖర్గే లోక్సభలో కేవలం 44 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం యూపీఏ ఎజెండా కాపీయేనని పేర్కొంది. ఎన్డీఏ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ఖర్గే మాట్లాడుతూ యూపీఏ సర్కారు పదేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తూ.. వీటన్నిటినే చుట్టచుట్టి మోడీ పేరుతో ముందుకు తెస్తున్నారని ఎద్దేవా చేశారు. దేనినైనా ప్రచారం చేయటంలో, మార్కెటింగ్ చేయటంలో నైపుణ్యాలను బీజేపీ నుంచి నేర్చుకోవాలన్నారు. ఉత్త మాటలు చెప్తే పేద ప్రజల పొట్ట నిండదన్నారు. సభలో తమ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజా కార్యక్రమాలను అమలు చేయటానికి సర్కారుపై ఒత్తిడి తేవటంలో తాము ఏమాత్రం వెనక్కు తగ్గబోమని వ్యాఖ్యానించారు. మహాభారతంలో వంద మంది కౌరవులు చాలా తక్కువ మంది ఉన్న పాండవులను ఓడించలేకపోయారని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఎన్డీఏ తాను ఎల్లకాలం అధికారంలో ఉంటుందని భావించరాదని.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి దూసుకువస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖర్గే తన ప్రసంగంలో కొత్త సభ్యులకు ఆహ్వానం పలికారు. మహిళా సభ్యురాలిని స్పీకర్గా ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించటం పట్ల బీజేపీకి అభినందనలు తెలిపారు. ఖర్గే ప్రసంగం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. -
విదర్భకు రూ.30 వేల కోట్లు కావాలి
నాగపూర్: ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడ్డ విదర్భ ప్రాంతానికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని విదర్భ జనాందోళన్ సమితి (వీజేఏఎస్) డిమాండ్ చేసింది. విదర్భ వ్యవసాయ సంక్షోభం, ఇక్కడి రైతుల దుస్థితిని దృష్టిలో ఉంచుకొని భారీగా సాయం అందించాలని వీజేఏఎస్ అధ్యక్షుడు కిశోర్ తివారీ సోమవారం కోరారు. రైతుల రుణాల మాఫీ, పంటల ప్రోత్సాహం, భారీ సూక్ష్మసేద్యం పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అత్యున్నత కమిటీని నియమించాలని తివారీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆరేళ్లలో మహారాష్ట్ర, యూపీఏ ప్రభుత్వం విదర్భ కోసం రూ.ఐదువేల కోట్లు వ్యయం చేసినా ఆత్మహత్యలు ఆగలేదని, ఇక్కడ వెనుకబాటుతనం తగ్గడం లేదని పేర్కొన్నారు. -
గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీకరించింది. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గవర్నర్ల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో లేని బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర గవర్నర్గా మురళీ మనోహర్ జోషీని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించింది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియమించారనే అపవాదును యూపీఏ ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాటలోనే మోడీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. ఆయన స్థానంలో గవర్నర్గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియను చేపడతారన్న సమాచారంతో ప్రస్తుత గవర్నర్ల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. -
యూపీఏ నిర్లక్ష్యం వల్లే..
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శ రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల ముందే నిర్ణయం తీసుకోవాల్సింది సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సింది పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నీ మా ప్రభుత్వం నెరవేరుస్తుంది సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల క్రితమే నిర్ణయం తీసుకుని, తద్వారా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపేందుకు చొరవ చూపాల్సిందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చాలా ఆలస్యంగా చొరవ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమలు కోరుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. అభివృద్ధిలో కలసి పనిచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న సవాళ్లు, ఏర్పడిన ఇబ్బందులు గుర్తించినందుకు సంతోషం. ఈ మాత్రం ఆలోచన ముందే ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఈ చొరవ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండి ఉంటే బావుండేది. కాలయాపన చేసి చివరి క్షణంలో విభజన చేయకుండా ముందే ఈ ప్రక్రియ చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కాంగ్రెస్కు కూడా ఏపీలో ఈ పరిస్థితి దాపురించేది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయి. రాష్ట్ర విభజనపై రెండు మూడేళ్ల ముందే స్పష్టమైన వైఖరి తీసుకుని, దాని ఫలితంగా ఏర్పడే పరిస్థితులను గుర్తించి సరిదిద్దేందుకు.. సీమాంధ్రలో సమాంతరంగా కొన్ని విద్య, వైద్య, విజ్ఞాన, సాంకేతిక సంస్థలు ఏర్పాటు చేసి ఉండాల్సింది. విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు, రెవెన్యూ లోటు లేకుండా, నీటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆగ్రహం ఉండేది కాదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పట్ల నిరాసక్తత ఉండేది కాదు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ముందు ఇప్పుడు పెద్ద ఎత్తున రెవెన్యూ లోటు ఉంది. అలాగే పారిశ్రామికీకరణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పన్నుల మినహాయింపు, ప్రత్యేక హోదా, ప్రత్యేక రాజధాని నిర్మాణం.. కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు. యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందు చూపు లేని విధానం, అపరిపక్వ వ్యవహారం వల్ల ఈ పరిస్థితి సంభవించింది. అనేక సమస్యలు ఉన్నాయని అప్పుడే బీజేపీ చెప్పింది. చట్టంలో అన్నీ పొందుపరచాలని కోరాం. ప్రణాళికా సంఘ ఆమోదం కూడా తీసుకోమన్నాం. ఆ పని చేయలేదు. అలాగే ప్రత్యేక రాష్ట్ర హోదా ముందే జారీచేసి ఉండాల్సింది. పోలవరంపై ఆర్డినెన్స్ తెస్తామన్నారు.. కానీ తేలేదు..’ అని వెంకయ్యనాయుడు విమర్శించారు. ‘కాంగ్రెస్ రెండు చోట్ల దెబ్బతినడానికి కారణం విశ్వసనీయత లేకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం. అందుకే రెంటికీ చె డ్డ రేవడి లా తయారైంది..’ అని ఎద్దేవా చేశారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం.. ‘కాంగ్రెస్ ఉత్తరం రాసినా రాయకపోయినా మా ప్రభుత్వానికి, మా ప్రధానికి బాధ్యత తెలుసు. ఈ విషయంలో మేం ఇప్పటికే చొరవ తీసుకున్నాం. నేను అన్ని మంత్రిత్వ శాఖలకు తగిన సూచనలు ఇచ్చాను. లేఖలు రాశాను. పాత ప్రధాని హామీలు ఇచ్చిన విషయం గుర్తుచేశాను. చట్టంలో ఉన్న అంశాలను గుర్తుచేశాం. వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. వీలైనంత త్వరలోనే మోడీ ప్రభుత్వం ఏపీ ప్రగతికి అన్ని చర్యలు తీసుకుంటుంది. అటు ఏపీలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఎలాంటి రాజకీయ వివక్ష చూపకుండా రెండు ప్రాంతాలు శ్రీఘ్రగతిన అభివృద్ధి చెందేందుకు, ఆయూ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. చాలా సంతోషం..’ అని చెప్పారు. అన్నీ రాత్రికి రాత్రే జరిగేవి కావు.. ‘మా చిత్తశుద్ధికి నిదర్శనం పోలవరం ఆర్డినెన్స్ను మొదటి రోజే జారీచేయడం. మిగిలినవాటిపై కూడా వరుసగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని హామీలు ఉన్నాయి. వాటన్నింటినీ మంత్రులకు గుర్తుచేశాం. ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగేవి కావు. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 11వ షెడ్యూలులో పేర్కొన్నట్టుగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగాలి. వీటికి రెండు ప్రాంతాల ఆమోదం ఉంది. దీన్ని ఆ రోజు నేను పట్టుబట్టి పెట్టించాను. 13వ షెడ్యూలులో 12, 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఐఐటీ, ఐఐఎం, తదితర విద్యాసంస్థలు, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థ ఏర్పాటు, వివిధ అభివృద్ధి పనులు, వివిధ వసతుల ఏర్పాటుకు అధ్యయనం తదితర హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఆనాడే మొదలుపెట్టి ఉంటే ఆ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కేది. కానీ చొరవ చూపలేదు. బీజేపీ ప్రభుత్వం చట్టంలో నిర్దేశించిన సమయం కంటే ముందే వేగంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుంది. ఎన్డీసీ ఆమోదం పొందుతుంది..’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 5 ఏళ్లకు వర్తించేలా వస్తుందా లేక 15 ఏళ్లకా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘అది కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం..’ అని మంత్రి జవాబిచ్చారు. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాలకు మెట్రో రైలు కచ్చితంగా వస్తుందని, వీటిపై తగిన అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
రాష్ట్రం ఇచ్చింది రాజకీయు లబ్ధికోసం కాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ శంషాబాద్, రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చే యోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
వారంలోగా అమల్లోకి వెయ్యి పెన్షన్
న్యూఢిల్లీ: భవిష్యనిధి వినియోగదారులు ఈ వారంలోనే నెలకు వెయ్యి రూపాయల కనీస పింఛన్ పొందనున్నారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీంతో దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వీరికి ప్రస్తుతం రూ. వెయ్యి కన్నా తక్కువ పెన్షన్ అందుతోంది. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందించాలని గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల భవిష్యనిధి సంస్థపై రూ.1,217 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు కాలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ. 15వేలకు పెంచడం, ఈపీఎఫ్వోకు సంస్థలు చెల్లించే పాలనా చార్జీలను తగ్గించడం వంటి నిర్ణయాలను కూడా కేంద్రం నోటిఫై చేయనుంది. దీంతో ఈ వారంలోనే ఈ నిర్ణయాలు అమలయ్యే అవకాశముంది. -
యూపీఏ జీవోఎంలపై వేటు
30 మంత్రుల బృందాలను రద్దు చేసిన మోడీ సర్కారు ఆయా అంశాలపై ఇక మంత్రిత్వ శాఖలదే నిర్ణయం న్యూఢిల్లీ: యూపీఏ పాలనావశేషాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా.. ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 30 మంత్రుల బృందాలను(జీవోఎం) మోడీ సర్కారు రద్దు చేసింది. వాటిలో 9 సాధికార మంత్రుల బృందాలు(ఈజీవోఎం) కాగా, 21 సాధారణ జీవోఎంలు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ఈజీవోఎంలు, జీవోఎంలకు నిర్దేశించిన విధులను ఆయా మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలే నిర్వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరింత సాధికారత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇబ్బందులు ఎదుర్కొనే పక్షంలో కేబినెట్ సెక్రటేరియట్, పీఎంవో సహకరిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడే వివాదాలపై కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ జీవోఎంలలో చాలా వాటికి నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఇతర కీలక మంత్రులు చిదంబరం, శరద్ పవార్లు నేతృత్వం వహిస్తున్నారు. అవినీతి, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పాలనాసంస్కరణలు.. మొదలైన అంశాలపై ఆ జీవోఎంలను ఏర్పాటు చేశారు. వాటి సిఫారసులపై కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునేది. ఏదైనా అంశంపై కేబినెట్ మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు జీవోఎంలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడితే చివరి నిర్ణయం ప్రధానిగా నరేంద్ర మోడీనే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఆయనపై బాధ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. జీవోఎంల ఏర్పాటు మొదట్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. యూపీఏ పాలనలో అది మరింత విస్తృతమైంది. ఈజీవోఎంలకు నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉండేది. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 60 వరకు జీవోఎంలు ఏర్పాటయ్యాయి. అయితే అవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగుతూ ఉండేవి. కాగా, ఆయా అంశాల సంక్లిష్టత, వాటిలో ఒకటికి మించిన మంత్రిత్వ శాఖల జోక్యం ఉన్నందువల్లనే మంత్రుల బృందాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ జీవోఎంల ఏర్పాటును కాంగ్రెస్ సమర్ధించుకుంది. అయితే, జీఓఎంల రద్దుపై ఎలాంటి విమర్శలు చేయకుండా.. తాము కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు, అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని వ్యాఖ్యానించింది. -
రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య
బెంగళూరు: రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ డీఏ ప్రభుత్వం ఎలాంటి పగసాధింపు చర్యలుండవని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్ధులైన సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలాంటి వ్యక్తులపై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోమని ఆయన అన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎలాంటి దాడులు చేయబోమని... హర్యానా, రాజస్థాన్ లోని వివాదస్పద భూకేటాయింపులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో యూపీఏ ప్రభుత్వంలో వాద్రా కు కేటాయించిన భూకేటాయింపులపై బీజేపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
మోడీ పంటకు 11 సూత్రాలు
యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదో, అప్రతిహతంగా జరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలే సాక్ష్యం చెబుతాయి. గడచిన పదిహేడేళ్లలో దాదాపు మూడు లక్షల మంది కర్షకులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. అవకాశం దొరికితే సాగును విడిచి వెళ్లిపోవాలని మరో 42 శాతం మంది రైతులు కోరుకుంటున్నారు. పదహారో లోక్సభ ఎన్నికల సంరంభంలోనూ రైతుల ఆత్మహత్యలలో తీవ్రత తగ్గలేదు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గడచిన కొన్ని వారాలలో సగటున రోజుకు ఐదుగురు సేద్యగాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణలో ఐదుగురు, బుందేల్ఖండ్లో ఇద్దరు వంతున కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి-ఏప్రిల్ మాసాలలోనే మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో 101 మంది కర్షకులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వార్తలు వెలువడినాయి. సేద్యంలో ఎంతో ముందంజ వేసిన పంజాబ్లోనూ గడచిన రెండు మాసాలలో పద్నాలుగు మంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. దేశం నలుమూలలా ఆయా ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి కొన్ని మాటలు చెప్పి రైతాంగంలో ఆశలు కల్పించారు. వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఆహార స్వయం సమృద్ధి విషయంలో భారత్ రాజీపడకూడదన్న అంశాన్ని అంతా దృష్టిలో ఉంచుకుంటూనే, కొన్ని దీర్ఘకాలిక, ఇంకొన్ని స్వల్పకాలిక చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు రూపొందించిన పదకొండు సూత్రాలను ఇక్కడ పేర్కొంటున్నాను. సాగుకు గత వైభవాన్ని తేవడానికి ఉద్దేశించిన ఎజెండా ఇది. రైతులకు నెలవారీ ఆదాయ కల్పన: సాధారణ రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 2,115 అని అర్జున్ సేన్గుప్తా సంఘం నివేదిక వెల్లడించింది. ఆ కుటుంబం తెచ్చుకునే వ్యవసాయేతర ఆదాయం రూ.900 కూడా ఇందులో కలిపారు. దేశంలో 60 శాతం రైతులు బతకడానికి మహా త్మాగాంధీ గ్రామీణాభివృద్ధి పథకం మీద ఆధారపడ్డారు. 55 శాతం రైతులు పస్తులు ఉండడం ఇంకో వాస్తవం. అయితే ఈ రైతులంతా కూడా సేద్యం, ఫలపుష్ప సాగుతో, పాల ఉత్పత్తితో దేశానికి ఆర్థిక సంపదను అందిస్తున్నవారే. ఆహారోత్పత్తి రూపంలో రైతాంగం సమకూరుస్తున్న ఆర్థిక సంపత్తికి ప్రతిఫలం చెల్లించవలసిన సమయమిది. కొత్త ప్రభుత్వం రైతుల ఆదాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని నా సలహా. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ రైతు చేస్తున్న ఉత్పత్తిని బట్టి నెలసరి ఆదాయం కల్పించాలి. ధరల విధానం కాదు, ఆదాయ విధానం కావాలి: కనీస మద్దతు ధర ఆహార కొరత మీద చూపుతున్న ప్రభావం ఏమిటో ప్రతిసారి ప్రశ్నార్థకంగానే ఉంటోంది. కాబట్టి ఇది ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు జరగవల సిన సమయం. రైతు ఆదాయాన్ని, ఆ రైతు పండించిన పంట మార్కెట్లో తెచ్చే ధర నుంచి విడదీసి చూడాలి. అందుకే రైతుకు నెలవారీ ఆదాయాన్ని సమకూర్చేందుకు హామీ ఉండాలని నేను భావిస్తున్నాను. పెరిగిన ద్రవ్యోల్బణం అందరితో పాటు రైతు మీద కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని విస్మరించరాదు. కానీ ఒక ప్రభుత్వోద్యోగికి పెరిగిన ద్రవ్యోల్బణానికి తగినట్టు ప్రతి ఆరు మాసాలకు కరువు భత్యం మంజూరవుతుంది. వీరికి కొన్నేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ రైతుల విషయంలో ఒక్క కనీస గిట్టుబాటు ధరే ఇస్తారు. 1.25 బిలి యన్ ప్రజలకు చౌకగా ఆహారం అందించే భారమంతా రై తుల భుజాల మీదే మోపకుండా, దేశమంతా భరించాలి. మండీల నెట్వర్క్ పటిష్టం కావాలి: వ్యవసాయోత్పత్తులను విక్రయించడానికి అవకాశం కల్పించే మండీల నెట్వర్క్ను దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలి. వ్యవసాయోత్పత్తులకు ధర కల్పించే అవకాశం మార్కెట్ చేతిలో పెట్టడం వల్ల విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ విషయంలో పంజాబ్, బీహార్ ఉదాహరణలు చూద్దాం. పంజాబ్లో మండీల వ్యవస్థ బలంగా ఉంది. రోడ్లతో వాటిని అనుసంధానం చేశారు. రైతులు అక్కడకు తీసుకెళ్లి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1,310 పొందారు. కానీ బీహార్లో ఏపీఎంసీ చట్టం వర్తింపజేయడం లేదు. దీనితో అక్కడి రైతుల దిగుబడికి రూ. 900 మించి ధర పలకలేదు. అయితే ఇప్పుడు పంజాబ్లో ధరలూ వ్యయాల కమిషన్ మండీల వ్యవస్థను రద్దు చేయమని కోరుతోంది. అంటే పంజాబ్ రైతుకు కూడా త్వరలోనే బీహార్ రైతుకు పట్టిన గతే పడుతుంది. కూరలూ, పళ్ల మీద ఏదీ ఆ శ్రద్ధ?: పాలు వంటి త్వరగా చెడిపోయే పదార్థాన్ని రక్షించుకోవడానికి ప్రత్యేక నెట్వర్కింగ్ను ఏర్పాటు చేసుకున్న దేశం అదే పద్ధతిలో పళ్లూ, కూరగాయల రక్షణకు వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? పాల సేకరణ పద్ధతిలోనే భారత్లో కూరలూ, పళ్ల సేకరణకు గొలుసుకట్టు వ్యవస్థను ఎందుకు నిర్మించుకోలేదు? సహకార సేద్యానికి ప్రోత్సాహం: సహకార వ్యవసాయా న్ని ప్రోత్సహించడం అవసరం. సహకార సంఘాలు మరింత స్వేచ్ఛాయుతంగా, ప్రతిభావంతంగా పని చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందించాలి. అమూల్ పాల సహకార వ్యవస్థ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల, పళ్ల సహకార సేద్య వ్యవస్థను కూడా రూపొందించాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా చిన్న చిన్న సహకార సంఘాలు అద్భుత ఫలితాలు సాధించిన సంగతిని గుర్తించాలి. అదే మిగిలిన పంటలకు కూడా ఎందుకు వర్తింపజేయకూడదు? స్వయం సమృద్ధ గ్రామసీమలు : ఆహారభద్రతలో, వ్యవసాయంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధిని సాధించాలి. సేద్యం, ఆహార భద్రతల స్వయం సమృద్ధిలో ఛత్తీస్గఢ్ చక్కని నమూనాను అందించింది. అక్కడ స్థానికంగా జరిగే ఉత్పత్తులు, స్థానికంగా ఉత్పత్తుల సేకరణ, స్థానికంగా పంపిణీ అనే అంశం మీద దృష్టి సారించారు. దేశమంతా అనుసరించవలసిన విధానం సరిగ్గా ఇదే. ఇందుకు జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సవరించాలి. నెల నెలా ఐదు కిలోల వంతుల గోధుమలో, బియ్యమో, రాగులో అందించడానికి బదులు ప్రతి గ్రామం తన ఆహార భద్రతకు తనే బాధ్యత తీసుకునే విధంగా జాగ్రత్త వహించాలి. రసాయనిక ఎరువులు వద్దు: భూసారం నశించడం, రసాయనిక ఎరువులతో వాతావరణం కలుషితం కావడం, జల వనరుల లభ్యత క్షీణించడం వంటి సమస్యలతో హరిత విప్లవం కింద ఉన్న ప్రాంతాలు ఉత్పత్తిలో నిలకడను సాధించలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది ఆహార లభ్యత క్రమం మీద, ప్రజారోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. కొత్త ప్రభుత్వం క్రిమి సంహారకాలతో ప్రమేయం లేని సాగును ప్రోత్సహించాలి. ఆంధ్రప్రదేశ్లో 35 లక్షల ఎకరాలలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సేద్యం చేశారు. మరో 20 లక్షల ఎకరాలలో రసాయనిక ఎరువులు ఉపయోగించలేదు. ఉత్పత్తి పెరిగి, కాలుష్యం తగ్గింది. వైద్య ఖర్చు తగ్గడంతో సేద్యపు పెట్టుబడులు 45 శాతం పెరిగాయి. వ్యవసాయ వృద్ధిలోనే పర్యావరణ పరిరక్షణ : సేద్యం, పాల ఉత్పత్తులను, అటవీ వ్యవహారాలను సమన్వయం చేయాలి. వ్యవసాయ వృద్ధిని కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలతోనే బేరీజు వేయరాదు. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోనికి తీసుకోవాలి. ఆ దిగుమతుల మీద సుంకం పెంచాలి: ఆహార దిగుమతి అంటే, నిరుద్యోగాన్ని కూడా దిగుమతి చేసుకోవడమే. దిగుమతి అవుతున్న యాపిల్స్ మీద తక్కువ సుంకా న్ని విధిస్తున్నందుకు ఈ మధ్య హిమాచల్ రైతాంగం నిరసన తెలియజేసింది. యాపిల్స్ను దిగుమతి చేసుకోవడం వల్ల హిమాచల్లో వాటికి గిరాకీ తగ్గింది. మిగిలిన పంటల విషయం కూడా ఇంతే. దిగుమతి చేసుకునే వ్యవసాయోత్పత్తుల మీద, పాల, ఫలపుష్ప ఉత్పత్తుల మీద ప్రభుత్వం సుంకం పెంచాలి. వీటి మీద సుంకం తగ్గించాలన్న యూరోపియన్ యూనియన్ విధానాలకు తలొగ్గరాదు. కర్బనాలను తగ్గించాలి: వాతావరణంలో మార్పులు సేద్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికీ, లేదా దీని నుంచి తప్పించుకునే జాగ్రత్తలు రైతులు తీసుకునేటట్టు చేయడానికీ ప్రభుత్వాలు పరిమితం కారాదు. అసలు వ్యవసాయం ద్వారా వచ్చే కర్బనాల నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కర్బనాల విడుదలలో సేద్యం వాటా 25 శాతం. నిల్వ సౌకర్యం అనివార్యం: ఆహార ధాన్యాల నిల్వకు సౌకర్యాలు లేవు. ఆహార రక్షణ నినాదం కింద 1979లో ప్రభుత్వం దేశం మొత్తం మీద 50 చోట్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. నేటి ప్రభుత్వం కూడా ఇదే ప్రాధాన్యాన్ని గౌరవించాలి. ఒక్క గింజ కూడా వృథా కానివ్వరాదు. దేవేందర్ శర్మ (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) -
ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష కూడా లేదు: ఎన్సీపీ
ముంబై: యూపీఏ మిత్ర పక్షాల పట్ల కాంగ్రెస్ నాయకత్వంలో సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోందని, తాజా ఎన్నికల్లో యూపీఏ పక్షాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో జయాపజయాలపై సమీక్ష చేపట్టేందుకు సైతం ఎవరినీ సంప్రదించ లేదని యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీ విమర్శించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధిక స్థానాల నుంచి బరిలో దిగుతామని పేర్కొంటూ కాంగ్రెస్కు సంకేతాలు పంపారు. -
అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓటమి
వామపక్షాల ఓటమి విచారకరం చాడ వెంకట్రెడ్డి కరీంనగర్, న్యూస్లైన్: అసమర్థత, అవినీతితోనే యూపీఏ ఓడిపోయింద ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంలో అవినీతిని పెంచి పోషించిందని విమర్శించారు. నిరుద్యోగం, అడ్డూ అదుపులేని అవినీ తిని ప్రజలు తిరస్కరించారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానన్న మోడీని నమ్మి ప్రజలు బీజేపీకి పట్టంకట్టారని పేర్కొన్నారు. విభేదాలు పక్కనబెట్టి చంద్రబాబునాయుడు, కేసీఆర్ కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజా సమస్యలపై ని త్యం స్పందించే వామపక్షపార్టీలను ప్రజలు ఆదరించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్కు సీపీఐ పక్షాన సహకరిస్తామని తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణంలో పార్టీలకతీతంగా అన్నివర్గాల ప్రజలు భాగస్వాములుకావాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, బోయిని అశోక్, పైడిపెల్లి రాజు పాల్గొన్నారు. -
అప్పుడు ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్షం లేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ప్రభుత్వముందా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందని.. అందుకే ప్రతిపక్ష స్థానం హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా ఓటర్లు తీర్పు నిచ్చారని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. యూపీఏలో ప్రభుత్వం మనుగడ లేదని.. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కూడా స్థానం లేదు అని వెంకయ్య అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగదల, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారని వెంకయ్య అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలకు నరేంద్రమోడీ భరోసా ఇచ్చారని.. విశ్వాసం కలిగించారన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెసేతర ప్రభుత్వానికి భారీ మెజార్టీని కట్టబెట్టారని ఆయన అన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్ కుమార్ మనోవ్యధకు గురవుతున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం రాజీనామా ఆస్త్రం జేడీ(యూ)కు ఎలాంటి ప్రయోజనం కలిగించిందని వెంకయ్య విమర్శించారు.