‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’ | Decision to appoint Manmohan Singh as FM in 1991 came 'out of the blue', says daughter | Sakshi
Sakshi News home page

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

Published Tue, Aug 19 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

‘పనిచేయకపోతే తీసేస్తానన్నారు’

పీవీ హెచ్చరించారన్న మన్మోహన్

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌ను 1991లో ఆర్థికమంత్రిగా నియమించడం, అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం. నిద్రలో ఉన్న మన్మోహన్‌ను రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ ఈ విషయం తెలియపరిచారు.

పైగా,.. సరిగా పనిచేయకపోతే ఉద్వాసన  తప్పదంటూ పీవీ చమత్కారంగా హెచ్చరిక కూడా జారీచేశారట. మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ విషయం తనతో చెప్పారంటూ ఆయన కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్‌లీ పర్సనల్ అన్న శీర్షికతో రాసిన పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement