పీవీ, చరణ్‌ సింగ్‌ సహా నలుగురికి భారతరత్న ప్రదానం | Sakshi
Sakshi News home page

పీవీ, చరణ్‌ సింగ్‌ సహా నలుగురికి భారతరత్న ప్రదానం

Published Sun, Mar 31 2024 5:33 AM

President confers Bharat Ratna on Charan Singh, Narasimha Rao, Karpoori Thakur and MS Swaminathan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు.

పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌదరి, ఎంఎస్‌ స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్‌ తరఫున కుమారుడు రాంనాథ్‌ ఠాకూర్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
 

Advertisement
Advertisement