Former Prime Minister
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్లో బంగ్లాదేశ్లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్పోర్ట్ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్పోర్ట్లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
-
Magazine Story: ఆర్థిక మహర్షి - అడుగులు
-
సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
-
మన్మోహన్ సింగ్ అంటే అందరి నోటా ఒకటే మాట
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
-
దేశం గొప్ప భూమిపుత్రున్ని కోల్పోయింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ‘ఎక్స్’వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు, సంస్కరణవాది, అన్నిటికంటే మించి మానవతావాది మన్మోహన్ సింగ్ ఇకలేరు. ధర్మానికి ప్రతీకగా, నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్ నవభారత నిర్మాతల్లో ఒకరు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది. మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని ట్వీట్లో రేవంత్ పేర్కొన్నారు. దేశానికి తీరని లోటు: డిప్యూటీ సీఎం భట్టి మన్మోహన్ సింగ్ మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నా రు. దేశానికి మన్మోహన్ చేసిన కృషి, అభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఉద్యమాన్ని అర్థం చేసుకున్నారు: కేసీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ‘పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ. భారత ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’అని కేసీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ పాత్రను దేశం మర్చిపోదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ‘ఆర్బీఐ గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూ జీసీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా మన్మోహన్ దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ పోషించిన పా త్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు’అని పేర్కొన్నారు. ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత : కేటీఆర్ ‘ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత, దూర దృష్టి గల నేత, మేధావి, అద్భుతమైన మానవతావాది మన్మోహన్ సింగ్. చరిత్ర పుటల్లో వారి కీర్తి ఎల్లప్పుడూ అజరామరంగా నిలిచిపోతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’ దేశ ప్రగతిలో కీలక భూమిక: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు నేతల సంతాపం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్ రెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
మన్మోహన్ అస్తమయం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. ‘‘అన్నిరకాలుగా అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. 9.51 గంటల ప్రాంతంలో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు’’ అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదుభాషిగా, మచ్చలేని రాజనీతిజు్ఞడిగా పేరొందిన మన్మోహన్ మృతి పట్ల రాజకీయ తదితర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ అస్వస్థత గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి హుటాహుటిన ఎయిమ్స్కు చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలిసి సీడబ్ల్యూసీ భేటీ కోసం కర్ణాటకలోని బెల్గావీలో ఉన్న ఖర్గే, రాహుల్ తదితరులంతా హస్తిన బయల్దేరారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమై మన్మోహన్కు ఘనంగా నివాళులు అర్పించనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ రెండుసార్లు ప్రధానిగా చేశారు. ఆయనకు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలున్నారు. ⇒ శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది.⇒ 1991లో మేం చేపట్టిన సంస్కరణలు ఎవరినీ సంతోషపరిచేందుకు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం.⇒ మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది.⇒ మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారీ మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ కష్టపడేతత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించగలం. -
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
పెళ్లి కేసులో ఇమ్రాన్కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్లో ఎవర్కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
వెబ్ సిరీస్గా పీవీ నరసింహారావు బయోపిక్
భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘హాఫ్ లయన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా ఈ సిరీస్కి దర్శకత్వం వహించ నున్నారు. ‘‘1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత ΄ûర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్ను రూ΄÷ందిస్తాం’’ అని మేకర్స్ అన్నారు. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్లాండ్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ
విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్ గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్ పన్ను పెంపు, టీడీఎస్ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. పీవీ నరసింహారావు హైదరాబాద్లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్తో కుస్తీ పట్టి.. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్ మాత్రమేకాదు.. కంప్యూటర్ లాంగ్వేజ్నూ నేర్చుకున్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్ 28న నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ► 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ)లో చేరారు. ► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ► 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కారు. ► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. ► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే.. – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు వంగరలో సంబురాలు సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్ హర్షం సాక్షి, అమరావతి : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో సీఎం ట్వీట్ చేశారు. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్ఖాన్కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ఖాన్కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్ఖాన్కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు. గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. -
ఇమ్రాన్ ఖాన్కు ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్: అల్–ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రహస్య పత్రాల లీకేజీ కేసులో రావలి్పండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అల్–ఖదీర్ ట్రస్ట్ కేసులో ఈ నెల 14న అదుపులోకి తీసుకుంది. రూ.2 వేల కోట్లు మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ కేసులో ఇమ్రాన్ను కస్టడీకివ్వాలన్న ఎన్ఏబీ వాదనను జడ్జి తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
పాకిస్తాన్కు షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (73) నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. జనవరిలో సాధారణ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ నుంచి బయల్దేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు. కోర్టుకు సమరి్పంచాల్సిన బెయిల్ పత్రాలపై సంతకం తదితరాల అనంతరం అదే విమానంలో లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తన తల్లి, భార్య రాజకీయాలకు బలయ్యారని గుర్తు చేసుకుంటూ భా వోద్వేగానికి లోనయ్యారు. వారి చివరిచూపుకూ నోచుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
నేడు స్వదేశానికి నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్కు చేరుకుంటారు. లాహోర్లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. -
షినవత్రకు థాయ్లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తోషఖానా కేసులో దిగువ కోర్టు తీర్పు తప్పు
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు. -
‘అడియాలా’కి బదులు ‘అటోక్’కి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. -
కొన్ని కానుకలు.. ఒక మాజీ ప్రధాని.. ఏమిటీ తోషఖానా కేసు?
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ జైలుపాలయ్యే పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తనని జైలు పాలు చేసినా, అనర్హత వేటు వేసినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని పలు సందర్భాల్లో ధీమాగా చెప్పారు. మరి ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా భవిష్యత్ ఉండబోతోందా ? ఇమ్రాన్కు జైలు శిక్ష పడిన కేసు ఏమిటి ? ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి? ఏమిటీ తోషఖానా కేసు..? ► తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న మూడేళ్లలో 58 కానుకలు వచ్చాయి. అలా వచ్చిన కానుకల్ని ప్రధాని తీసుకోవాలంటే దాని ధరలో సగం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించి అసలు ధరలో 20 శాతం మాత్రమే చెల్లించి కానుకలు తన సొంతం చేసుకున్నారు. 2018, సెప్టెబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 15.4 కోట్ల విలువైన కానుకల్ని కేవలం 3 కోట్లకే ఆయన సొంతం చేసుకున్నట్టుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదైంది. పీటీఐపై నీలినీడలు? ► పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ)ఇమ్రాన్ఖాన్ ప్రజలపై వేసిన ప్రభావం గత అయిదు దశాబ్దాల్లో మరే నాయకుడు వెయ్యలేకపోయాడు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ తిరుగులేనిది. గత మేలో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ను అరెస్ట్ చేసినప్పుడు పీటీఐ కార్యకర్తలు దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారిని నియంత్రించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్గా మారింది. గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధా నులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్, షాహిద్ఖాన్ అబ్బాసి వంటి వారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ పట్టించుకోని ప్రజలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో మిలటరీకే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇమ్రాన్ఖాన్ అభిమానుల్లో అప్పట్లో కనిపించిన ఆగ్రహావేశాలు చూస్తే పార్టీ పునాదులు ఎవరూ కదపలేరన్న భావన కలుగుతుంది. ఇమ్రాన్ఖాన్ ఒక్కడే నిజాయితీపరుడని, ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఆయన మాత్రమే గాడిలో పెట్టగలరన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ పవర్ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ ఇమ్రాన్ఖాన్కు బాగా మొండివాడన్న పేరుంది. రాజకీయాల్లో ఆయనకి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇమ్రాన్ ప్రధాని కావడానికి కారకుడైన అప్పటి ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో ఆయ న ఎక్కువ కాలం సత్సంబంధాలు నడపలేకపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇమ్రాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ సంకీర్ణ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇమ్రాన్ను కేసుల ఉచ్చులో బిగించాయి. గత రెండు నెలల్లో పారీ్టకి చెందిన సీనియర్ నాయకులు 80 మందికి పైగా పార్టీని వీడారు. వారిని బెదిరించి పార్టీని వీడేలా చేశా రని ఇమ్రాన్ ఆరోపించినప్పటికీ వరసపెట్టి కీలకమైన నాయకులు వెళ్లిపోవడం పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఇమ్రాన్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు మిలటరీ జైళ్లలో ఉన్నారు. పాకిస్తాన్లో ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడం ఆయన పారీ్టకి శరాఘాతంలా తగిలింది. పార్లమెంటు రద్దయిన 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇమ్రాన్పై ఐదేళ్లు అనర్హత వేటు పడడంతో ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అయింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల మధ్య ఉంటే పార్టీ ఎంతవరకు మనుగడ సాగించగలదన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఆశలన్నీ ఇప్పుడు పై కోర్టులోనే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుని పీటీఐ లాహోర్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇమ్రాన్ను అరెస్ట్ చేయలేదని, ఆయ నపై తుపాకీ గురిపెట్టి అపహరించుకొని వెళ్లిపోయారని పీటీఐ తన పిటిషన్లో విమర్శించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్రాన్ కూడా శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నారు. అరెస్ట్కు ముందే చేసి ఉంచిన రికార్డు మెసేజ్లో ఆయన కార్యకర్తలకి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తోషఖానాతో సహా 150 కేసుల్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఆ ఉచ్చులోంచి ఎలా బయటకి రాగలరన్న సందేహాలైతే ఉన్నాయి. -
బోరిస్ కావాలనే తప్పుదోవ పట్టించారు
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంట్ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్ స్ట్రీట్లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్ను జాన్సన్కు ఇవ్వొద్దని పేర్కొంది. -
ఆనందంలో బోరిస్ జాన్సన్, తండ్రిగా మరోసారి ప్రమోషన్.. ఎనిమిదోసారి
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఏడుగురు పిల్లల తండ్రయిన ఆయన మరోసారి తండ్రి అవుతున్న ఆనందంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేరీ ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ లోకంలోకి రానున్న బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జాన్సన్ మూడో భార్య కేరీ. మొదటి భార్యతో ఆయనకి పిల్లలు లేరు. రెండో భార్య వీలర్తో నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కేరిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో మరో మహిళతోనూ జాన్సన్ అఫైర్ కొనసాగించడంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటిదాకా జాన్సన్కు ఏడుగురు సంతానం ఉన్నారు. -
Pakistan Supreme Court: చట్టవిరుద్ధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అల్–ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ను అరెసుŠట్ చేసి జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీలో ఉంచడాన్ని పాక్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఇమ్రాన్ను అరెస్ట్చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. ఆయనను వెంటనే విడుదల చేయండి. విడుదలయ్యాక ఇస్లామాబాద్లో సురక్షిత ప్రాంతంలో ఉంచి రక్షణ కల్పించండి’అని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్టయిన ఇమ్రాన్కు పెద్ద ఉపశమనం లభించింది. గంటలో హాజరుపరచండి అంతకుముందు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో లాక్కెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఇమ్రాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఏబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గంటలోగా ఇమ్రాన్ను మా ముందుకు తీసుకురండి’ అని మధ్యాహ్నం 3.30కి ఎన్ఏబీని ఆదేశించింది. దీంతో వెంటనే ఖాన్ను కోర్టుకు తీసుకొచ్చారు.‘హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణంలో ఎలా అరెస్ట్ చేస్తారు? న్యాయం కోసం కోర్టుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కోర్టులో లొంగిపోవడానికే వస్తుంటే అరెస్ట్ చేయడంలో అర్థమేముంది? అరెస్ట్ చేసేందుకు ఏకంగా 90 మంది పోలీసులు కోర్టులో చొరబడితే హైకోర్టుకు ఏం విలువ ఇచ్చినట్టు? అని అధికారులపై ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బందియాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తదుపరి న్యాయపర ఆదేశాల అభ్యర్థన కోసం శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లండి. ఆ కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం’ అని ఇమ్రాన్కు సుప్రీంకోర్టు సూచించింది. అరెస్ట్తో రణరంగంలా మారిన పాక్లో ఇప్పటిదాకా ఎనిమిది మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ‘ఒక నేరగాడిని విడుదల చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. నేరగాడికి రక్షణ కవచంగా ఉంటూ దేశంలో చెలరేగుతున్న హింసకు మరింత ఆజ్యం పోస్తున్నారు’ అని పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ఆరోపించారు. -
ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) రిమాండ్కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్రూమ్కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రణరంగంగా పాక్ ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. -
Imran Khan: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ను రెండు కేసులు చిక్కుల్లో పడేశాయి. ఒక కేసు ఆయన అరెస్ట్కి దారి తీస్తే, మరో కేసులో న్యాయస్థానం ఆయనని దోషిగా తేల్చింది. ఈ రెండు కేసులు దేనికవే భిన్నమైనవి. బ్రిటన్లో మూలాలున్న ఒక కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు ప్రధానంగా ఉంటే , మరో కేసులో ప్రభుత్వానికి వచ్చిన ఖరీదైన బహుమతుల్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు కారణమైన అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుది ఆసక్తికరమైన నేపథ్యం. దీని మూలాలు బ్రిటన్లో ఉన్నాయి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2019లో అల్ ఖదర్ యూనివర్సిటీ ట్రస్ట్ ఏర్పాటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్కు, ఇమ్రాన్ఖాన్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.5 వేల కోట్లు నష్టం వాటిల్లిందనేది ప్రధానమైన ఆరోపణ. గత ఏడాది జూన్లో మొట్టమొదటిసారిగా అల్ ఖదీర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసు అవినీతిపై అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనుల్లా వివరాల ప్రకారం పంజాబ్లోని జీలం జిల్లా సొహావా ప్రాంతంలో సూఫీయిజాన్ని బోధించడం కోసం అల్ ఖదీర్ యూనివర్సిటీని నిర్మించడానికి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు జుల్ఫికర్ బుఖారీ, బాబర్ అవాన్ కలిసి అల్ ఖదీర్ ట్రస్ట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2019లో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ బహ్రియా పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. ట్రస్ట్కు వందలాది కోట్ల విలువైన 57.25 ఎకరాలను ఆ సంస్థ విరాళంగా అందించింది. అందులో 240 కనాల్స్ భూమిని (30 ఎకరాలు) బుష్రా బీబీకి ప్రాణ స్నేహితురాలైన ఫరా గోగి పేరిట బదలాయించారు. బహ్రియాలో రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతే మాలిక్ రియాజ్. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని బ్రిటన్లో విచారించే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) ఒకానొక కేసులో మాలిక్ రియాజ్ నుంచి ఏకంగా 19 కోట్ల పౌండ్ల (అప్పట్లో పాకిస్తాన్ కరెన్సీలో రూ. 5,000 కోట్లు) నల్లధనం జప్తు చేసింది. బ్రిటన్లో చట్టాల ప్రకారం విదేశీయుడికి చెందిన డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి వారి మాతృ దేశంలో ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ప్రకారం పాకిస్తాన్లో ఇమ్రాన్ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఇమ్రాన్కు, మాలిక్ రియాజ్కు మధ్య కుదిరిన ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ ఆ వ్యాపారి బ్రిటన్ ఖాతాకు తిరిగి డబ్బులు పంపినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా మాలిక్ రియాజ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములతో పాటు రూ.500 కోట్ల రూపాయల్ని కూడా ముట్టజెప్పారన్నది ఆరోపణ. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ను ఈ ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ పూర్తిగా ముంచేసిందని షహబాజ్ సర్కార్ ఆరోపించింది. ఈ కేసులో మే 1న ఇమ్రాన్పై అరెస్ట్కి వారెంట్లు జారీ కాగా మే9న ఆయన అరెస్టయ్యారు. తోషాఖానా కేసు.. ►ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోష ఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ఖాన్ ప్రధాని పదవిలో ఉండగా 101 కానుకలు వచ్చాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన వజ్రాల రిస్ట్ వాచీలు, ఉంగరాలు, కఫ్లింక్స్ పెయిర్, రోలాక్స్ వాచీలు, పెన్నులు పెర్ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్ బాటిల్స్ నమూనాల వంటి కళాకృతులు వంటివి ఉన్నా యి. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకల్ని ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని, వాటిని మార్కెట్లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేవలం మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదు. ఇప్పుడు పాక్ కోర్టు ఆయనని ఈ కేసులో దోషిగా తేల్చింది. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
నన్ను చంపేందుకే అరెస్ట్ కుట్రలు : ఇమ్రాన్ ఖాన్
-
ఇమ్రాన్కు ఊరట
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాన్బెయిలబుల్ వారెంట్ను కోర్టు రద్దు చేసింది. శనివారం ఆయన ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టులో హాజరయ్యారు. చేరుకున్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఇమ్రాన్ హాజరైనట్టు కోర్టు ఆవరణలో వాహనంలోనే సంతకం తీసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్లోకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో విచారణ సాగదన్న జడ్జి, ఇమ్రాన్పై జారీ అయిన నాన్బెయిలబుల్ వారెంట్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అభియోగపత్రం లేకుండానే అక్కడి నుంచే తిరిగి వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్లో ఉండగానే లాహోర్లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 20 రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు దొరికాయన్నారు. విచారణకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇమ్రాన్ కాన్వాయ్లో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
ఇమ్రాన్ ఖాన్కు ఊహించని షాక్..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) చీఫ్ పదవి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఆ దేశ ఎన్నికల సంఘం. తోషాఖానా(ఖజానా) కేసుకు సంబంధించి ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలుపుతూ ఇమ్రాన్కు నోటీసులు సైతం జారీ చేసిందని డౌన్ న్యూస్పేపర్ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 13న చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను దేశ ఖజానా తోషాఖానా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ ధరకు విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో తప్పుడు సమాచారం, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారన్న ఆరోపణలతో ఆర్టికల్ 63(i) ప్రకారం ఆయనను అనర్హుడిగా గుర్తించింది ఎన్నికల సంఘం. ఈసీ రికార్డ్స్ ప్రకారం.. తోషాఖానా నుంచి బహుమతులను రూ.21.5 మిలియన్లకు కొనుగోలు చేసి రూ.108 మిలియన్లకు విక్రయించినట్లు తేలింది. తోషాఖానా బహుమతుల విక్రయంపై వార్తలు వచ్చిన క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ చట్టాల ప్రకారం విదేశాల్లో బహుమతిగా లభించిన వాటిని తోషాఖానా(ఖజానా) విభాగంలో వాటి విలువను లెక్కించాలి. ఆ తర్వాతే వాటిని 50 శాతం డిస్కౌంట్తో తీసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: భారీ వర్షాలతో బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి -
Pankaj Tripathi: వెండితెర వాజ్పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. -
ట్రస్కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్.. ఐదేళ్లు వేటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి పొందిన ఖరీదైన బహుమతులను చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుని భారీ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపింది. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ మేరకు వెలువరించింది. ఎన్నికల సంఘం తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో తన పదవిని కోల్పోనున్నారు. అంతేకాదు మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. అయితే ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ సన్నిహితులు తెలిపారు. ఏంటీ వివాదం..? 2018లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వంటి అరబ్ దేశాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఖరీదైన వస్తువులు బాహుమతులుగా అందుకున్నారు. చట్ట ప్రకారం వీటిని కేబినెట్ నేతృత్వంలోని ప్రభుత్వ శాఖ అయిన తోషఖానాలో భద్రపరిచారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు కానుకలుగా వచ్చే విలువైన వస్తువులను ఈ శాఖ భద్రపరుస్తుంది. వాటిని వాళ్లు సొంతం చేసుకోవాలనుకుంటే డిస్కౌంట్తో విక్రయిస్తుంది. అయితే సాధారణంగా 20శాతం ఉండే డిస్కౌంట్ను ఇమ్రాన్ ఖాన్ 50 శాతానికి పెంచారు. ఆ తర్వాత తనకు వచ్చిన ఖరీదైన కానుకలను తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు. అనంతరం వాటిని భారీ ధరకు ఇతరులకు విక్రయించారు. ఈ ఆరోపణలపైనే విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఇమ్రాన్పై అనర్హత వేటు వేసింది. చదవండి: అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే! -
పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఇమ్రాన్పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. అబెనామిక్స్తో ఆర్థిక చికిత్స అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం. అది 1950ల్లో జపాన్ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ‘క్వాడ్’తో చైనాకు ముకుతాడు రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సంయుక్త కూటమి (క్వాడ్). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్గా రూపుదాల్చింది. అది జపాన్తో పాటు భారత్నూ అమెరికాకు సన్నిహితం చేసింది. -
Shinzo Abe: చెరగని ముద్ర వేసిన షింజో అబే
నేరగాళ్లు రెచ్చిపోవడం, ఎక్కడో ఒకచోట తుపాకులు పేలడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిన వర్తమానంలో కూడా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యో దంతం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. జపాన్లో హింసాత్మక ఘటనల శాతం తక్కువ. తుపాకుల వినియోగం దాదాపు శూన్యం. అటువంటి ఉదంతాలు ఏడాదికి పది కూడా ఉండవు. ఇటు చూస్తే షింజో అబే వివాదాస్పద వ్యక్తి కాదు. పైపెచ్చు జపాన్ ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దాన్ని గట్టెక్కించిన చరిత్ర ఆయనది. అందువల్లే 2012 నుంచి ఎనిమిదేళ్లపాటు అధికారంలో కొనసాగారు. రెండేళ్ల క్రితం ఆరోగ్యం సహకరించక పదవి నుంచి తప్పుకున్నారుగానీ ఆ సమయానికి కూడా ఆయన తిరుగులేని నేతగానే ఉన్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ అందరినీ మెప్పించాలని లేదు. వాటివల్ల ఇబ్బందులకు గురయ్యే వర్గాలు కూడా ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమానికీ, శ్రేయస్సుకూ ఏది మంచి దన్నదే అంతిమంగా గీటురాయి అవుతుంది. అబేను పొట్టనబెట్టుకున్న దుండగుడు ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడన్నది మున్ముందు తెలుస్తుంది. కానీ అబే ఆర్థిక విధానాలు 2012 నాటికి నీరసించి ఉన్న జపాన్కు జవసత్వాలు ఇచ్చాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అతి సంపన్న దేశంగా వెలుగులీని, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్ 80వ దశకం మధ్యనుంచి వెలవెలబోవడం మొదలైంది. ఆ స్థానాన్ని చూస్తుండగానే గతంలో తన వలస దేశమైన చైనా ఆక్రమించింది. ఇది జపాన్ను కుంగదీసింది. రాజకీయ రంగంలో అస్థిరత చోటుచేసుకుంది. అస్థిర ప్రభుత్వాలు ఒకపక్క, ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క దాన్ని పట్టి పీడించాయి. సహజంగానే ఇవన్నీ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి. అలాంటి సమయంలో అబే అధికార పగ్గాలు స్వీక రించి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆ విధానాలు ‘అబేనామిక్స్’ పేరిట ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా త్వరలోనే వాటివల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి. జపాన్ పుంజుకుంది. ప్రారంభంలో జాతీయవాదిగా, స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న అ»ే తన వైఖరిని మార్చుకున్నారు. 2012కు ముందు విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) జపాన్ ప్రయోజనాలు దెబ్బతీస్తుందని వాదించిన ఆయనే, అధికారంలోకొచ్చాక దాన్ని నెత్తికెత్తుకున్నారు. ట్రంప్ ఏలుబడిలో ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటికొచ్చినా 2018లో వేరే దేశాలను కలుపుకొని దాన్ని మరింత విస్తరించారు. సంస్కరణలపై ఎంత మొగ్గు చూపినప్పటికీ అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలన్న స్వేచ్ఛా మార్కెట్ ఉదారవాది కాదాయన. ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను ఏమాత్రం తగ్గించలేదు. దేశానికొక కొత్త రాజ్యాంగం కావాలనీ, సైనికంగా బలపడాలనీ ఆయన కలలుగన్నారు. కరోనా అవాంతరం లేకపోతే అది కూడా జరిగేదే. అమెరికా, కొన్ని యూరప్ దేశాల మాదిరిగా వలసలపై ఆంక్షలు విధించడం కాక, వాటిని ప్రోత్సహించారు. పర్యవసానంగా లక్షలాదిమంది విదేశీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించాయి. మన దేశానికి మంచి మిత్రుడిగా మెలిగారు. చైనాతో మనకు సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా సమర్థించారు. బహుశా కరోనా విరుచుకుపడకపోతే ఆయన ఆర్థిక విధానాలు మరింత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేవేమో! కానీ కరోనా సమయంలో కఠినమైన లాక్డౌన్లు అమలు చేయడం వల్ల చాలామంది ఉపాధి కోల్పో యారు. ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకు పెద్దగా తోడ్పడలేదు. దాంతో ఆయనపట్ల వ్యతి రేకత మొదలైంది. ఒకపక్క అనారోగ్యం, మరోపక్క ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు ఆయన్ను కుంగదీసి చివరకు పదవినుంచి వైదొలగారు. జపాన్లో హింసాత్మక ఉదంతాలు లేనేలేవని చెప్పలేం. కానీ ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరగడం చాలా అరుదు. 1960లో సోషలిస్టు నాయకుడు ఇనెజిరో అసానుమోపై ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. 2007లో నాగసాకి నగర మేయర్ను కాల్చిచంపారు. ఆ తర్వాత ఈ స్థాయి ఘటన జరగడం ఇదే ప్రథమం. ఆ దేశంలో సాయుధ బృందాల ఉనికి లేకపోలేదు. అయితే కరుడు గట్టిన యకుజా ముఠా సైతం తుపాకుల వినియోగం విషయంలో జంకుతుంది. తుపాకుల అమ్మ కంపై కఠిన ఆంక్షలు, వాటిని వినియోగించేవారికి కఠిన శిక్షల అమలు ఇందుకు కారణం. హింసా త్మక ఘటనలు అరుదు గనుక నేతలు భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. ఎన్నికల ప్రచార మంతా వీధి సభల ద్వారానే సాగుతుంది. నిజానికి దాడి జరిగే సమయానికి అలాంటి చిన్న సభ లోనే అబే మాట్లాడుతున్నారు. 1986లో అప్పటి స్వీడన్ ప్రధాని ఓలోఫ్ పామే నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడు ఆయన్ను నడి బజారులో కాల్చిచంపాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతిపరిచిన ఘటన అబే హత్యోదంతమే. సంక్షోభాలకు ఏ దేశమూ అతీతం కాని వర్తమాన పరిస్థితుల్లో హింసకు ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు. పైగా సంఘటిత నేర బృందాలకు బదులు ఎవరితోనూ సంబంధాలు లేనట్టు కనబడే వ్యక్తులే హింసకు దిగుతున్న ఉదంతాలు అమె రికా వంటిచోట్ల ఎక్కువయ్యాయి. కనుక నిరంతర అప్రమత్తత, నేతలకు తగిన భద్రత కల్పించడం తప్పనిసరి. వర్తమాన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన నేతల్లో ఒకరిగా, భారత్కు చిరకాల మిత్రునిగా ఉన్న అబే ఒక దుండగుడి కాల్పుల్లో కనుమరుగు కావడం అత్యంత విచారకరం. -
పాక్ ఆర్మీ చీఫ్పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
పాక్ మాజీ ప్రధాని కన్నుమూత
ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని జమాలి కుమారుడు మొహమ్మద్ ఖాన్ జమాలి వెల్లడించారు. 76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్ఐసీ- ఎన్ఐహెచ్డీ)లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి : 2024లో పోటీ చేస్తాను: ట్రంప్) మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2002 నవంబర్ నుంచి 2004 జూన్ వరకు జమాలీ ప్రధానిగా కొనసాగారు. కాగా ఆ తర్వాత ముషారఫ్తో వచ్చిన విభేదాల కారణంగా 2004లో ప్రధాని పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఫ్రాన్స్ను ముస్లింలు శిక్షించవచ్చు
పారిస్: ఫ్రాన్స్ను శిక్షించే అధికారం ముస్లింలకు ఉందంటూ మలేసియా మాజీ ప్రధానమంత్రి మహథిర్ మహ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర సంచలనానికి తెరతీసింది. ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా 13 ట్వీట్లు చేశారు. ‘‘ఫ్రాన్స్ గతంలో నరమేధం సాగించింది. అందుకు ప్రతీకారంగా లక్షలాది మంది ఫ్రెంచ్ పౌరులను హతమార్చే అధికారం ముస్లింలకు ఉంది. కానీ, కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని ముస్లింలు పాటించరు. ఫ్రాన్స్ కూడా అందుకు కట్టుబడి ఉండాలి. ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించడం ఫ్రాన్స్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నేర్పాలి’’అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. మహథిర్ మహ్మద్పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ సెడ్రిక్ ఓ వెంటనే రంగంలోకి దిగారు. మహథిర్ చేసిన ట్వీట్ను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం మహథిర్ మహ్మద్ ట్వీట్ను తొలగించింది. చర్చి ఘటనలో మరొకరి అరెస్టు నైస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్లో నైస్ నగరంలోని చర్చిలో జరిగిన నరమేధంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యునీషియాకు చెందిన ఇబ్రహీం ఇస్సాయ్ అనే ముష్కరుడు చర్చిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 47 ఏళ్ల ఈ అనుమానితుడు కత్తితో దాడి చేసిన ముష్కరుడితో అంతకు మందు రోజు రాత్రే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష
కౌలాలంపూర్ : మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. కాగా.. మలేషియాలో ఎన్ఆర్సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. (దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) -
మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
నవాజ్ షరీఫ్కు బెయిల్
లాహోర్: అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆయన రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థా యికి తగ్గడంతో సోమవా రం రాత్రి ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూ రో(ఎన్ఏబీ) కార్యాల యం నుంచి లాహోర్లోని సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత అయిన నవాజ్ షరీఫ్ అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సోదరుడు షాబాజ్ పెట్టుకు న్న పిటిషన్ను లాహోర్ హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం రూ.రెండు కోట్ల విలువైన రెండు సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నగదు అక్రమ చెలామణీ కేసులో షరీఫ్ ఎన్ఏబీ అదుపులో ఉన్నారు. -
మాజీ ప్రధానుల కోసం మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు. చంద్రశేఖర్ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్.అంబేడ్కర్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్ సింగ్ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ను కాదని జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతనేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. -
ఊచకోత కారకుడు మృతి
బీజింగ్: చైనా మాజీ ప్రధాని, తియానన్మెన్ స్క్వేర్లో వేలాది మంది ఊచకోతకు కారకుడు లీపెంగ్(90) కన్నుమూశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ లీపెంగ్ అనారోగ్యంతో సోమవారం బీజింగ్లో మృతి చెందినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఇంతకుముందు ఆయన మూత్రాశయ కేన్సర్తో బాధపడ్డారు. 1989లో దేశ రాజధాని బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్లో ప్రజాస్వామ్యవాదులు కొన్ని వారాలపాటు శాంతియుత నిరసనలు తెలిపారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న లీపెంగ్ బీజింగ్లో మార్షల్ లా విధించారు. అయినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో 1989 జూన్ 3, 4వ తేదీల్లో తియానన్మెన్ స్క్వేర్లో బైఠాయించిన నిరసనకారుల పైకి సైన్యాన్ని పంపారు. యుద్ధట్యాంకులతో వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కించారు. దీంతో నిరాయుధులైన వెయ్యి మందికి పైగా యువకులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాన్ని చైనా ఉక్కుపాదంతో అణచివేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. అప్పటి నుంచి లీ పెంగ్ ప్రపంచం దృష్టిలో అణచివేతకు ప్రతిరూపంగా, బీజింగ్ కసాయి (బుచర్ ఆఫ్ బీజింగ్)గా నిలిచిపోయారు. సైనిక చర్య చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవ నిర్ణయమైనప్పటికీ, ఈ ఘటనకు లీపెంగ్నే బాధ్యుడిగా భావిస్తారు. ఆయన ఆ తర్వాత కూడా తన నిర్ణయాన్ని ‘అవసరమైన చర్య’గా సమర్థించుకున్నారు. ‘ఇలాంటి చర్యలు తీసుకోకుంటే ఒకప్పటి సోవియట్ యూనియన్, పశ్చిమ యూరప్ల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పట్టిన గతే చైనాకూ పట్టేది’ అని 1994లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా లీపెంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని అరెస్ట్
ఇస్లామాబాద్ : సహజ వాయువు దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించి ఓ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బోర్డు (ఎన్ఏబీ) అరెస్ట్ చేసింది. అబ్బాసీ ఓ మీడియా సమావేశానికి వెళుతుండగా 12 మంది సభ్యులతో కూడిన ఎన్ఏబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుందని డాన్ పత్రిక పేర్కొంది. తన అరెస్ట్ను తొలుత ప్రతిఘటించిన అబ్బాసీ ఆ తర్వాత ఎన్ఏబీ బృందానికి సహకరించారని తెలిపింది. అబ్బాసీ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఎల్ఎన్జీ దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అబ్బాసీని ఎన్ఏబీ ఎదుట శుక్రవారం రిమాండ్కు తరలిస్తారని భావిస్తున్నారు. ఇక 2017లోఅవినీతి ఆరోపణలపై నవాజ్ షరీఫ్ ప్రధానిగా వైదొలగిన అనంతరం అబ్బాసీ పాక్ ప్రధానిగా పనిచేశారు. కాగా అబ్బాసీ అరెస్ట్ను నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఎన్ఏబీ ఇమ్రాన్ ఖాన్ జేబు సంస్ధగా మారిందని విమర్శించారు. -
బాత్రూమ్లో జారిపడిన హెచ్డీ దేవెగౌడ
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బాత్రూమ్లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు. -
బంగ్లా మాజీ ప్రధానికి మరో ఎదురు దెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది. -
పాక్ మాజీ ప్రధాని షాబాజ్ అరెస్టు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్లోని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్ స్కీమ్, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి. -
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్లో వాజ్పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్పేయి లాహోర్ బస్సుయాత్రకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్ 11న ఏయిమ్స్కు వచ్చిన సందర్భంగా ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆ వెంటనే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. గత శనివారం నుంచి వాజ్పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్ట్రా మెంబ్రేన్ ఆక్సిజెనెషన్’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న వాజ్పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్ను సందర్శించాక, వాజ్పేయి మరణవార్తను ఏయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డా. ఆర్తి విజ్ ప్రకటించారు. వాజ్పేయి మరణం రూపంలో ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు. -
తరగతి గదిలో దస్తూరి తిలకం
గ్వాలియర్లో వాజ్పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్ పర్వదినం రోజు జన్మించిన అటల్ బిహారి వాజ్పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్పేయి తండ్రే ప్రిన్సిపాల్గా ఉండేవారు. వాజ్పేయి స్కూలు రిజిస్టర్లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్ మాత్రం పదిలంగా ఉంది. ‘ఈ రిజిస్టర్ మాకో నిధిలాంటిది. నెంబర్ 101 దగ్గర ఉన్న పేరు వాజ్పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు. ఇప్పుడే ఇది ఒక చారిత్రక పత్రంగా మారింది‘ అని స్కూలు ప్రిన్సిపాల్ కె.ఎస్.రాథోడ్ ఉద్వేగంగా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలను కూడా స్థానికులు అటల్ జీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పాఠశాల అలాగే గుర్తింపు ఉంది. స్కూల్ రోజుల్లో వాజ్పేయి కబడ్డీ, హాకీ ఆటలు ఆడేవారు. అందరు విద్యార్థుల మాదిరిగానే సైకిల్ వేసుకొని పట్టణం అంతా చక్కెర్లు కొట్టేవారు. చిన్నప్పట్నుంచి అటల్జీకి స్వీట్లు అంటే ప్రాణం. గ్వాలియర్ ఎప్పుడు వచ్చినా తనకిష్టమైన మిఠాయి దుకాణానికి వెళ్లి లడ్డూలు, గులాబ్జాములు లాగించేవారు. తాను పుట్టిన గడ్డ, చిన్నతనంలో గడిపిన పరిసరాలు, చదువుకున్న స్కూలు, నోరూరించే మిఠాయిలుండే దుకాణాలు ఇవంటే వాజపేయికి ఎంతో మమకారం. ఆ అనుబంధంతోనే 1984 లోక్సభ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాధవ్ రావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సొంత గడ్డ తనని ఓడించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే మరోసారి గ్వాలియర్ నుంచి పోటీ చేయడానికి ఆయన సాహసించలేదు. కానీ తరచూ గ్వాలియర్ వెళ్లి వస్తూ ఉండేవారు. 2006లో చివరిసారిగా వాజపేయి గ్వాలియర్కు వెళ్లారు. అనారోగ్యం కబళించడంతో ఆయన ఆ తర్వాత వెళ్లలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, చివరి రోజుల్లో వెళ్లలేకపోయినా గ్వాలియర్తో అటల్జీకున్న అనుబంధం మరువలేనిది. ఉత్తమ గేయ రచయిత వాజ్పేయి వాజ్పేయి కవిత్వం కొత్త చిగుళ్లు తొడుక్కున్న ఆమనిలా ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజంగానే సున్నిత మనస్కుడు, ప్రేమమూర్తి , భావకుడు అయిన వాజ్పేయి కలం నుంచి మరువలేని, మరపురాని అద్భుతమైన కవితలెన్నో జాలువారాయి. అలాంటి కవిత్వానికి ఒక సినిమా అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు వాజపేయి కూడా అనుకోలేదు తన కవిత్వానికి ఒక అవార్డు వస్తుందని.. స్క్రీన్ అవార్డుల కమిటీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వాజపేయిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. వాజ్పేయి కవితల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్నింటిని ఏరి గజల్మాస్ట్రో జగిత్ సింగ్ ఆలపించారు. అవన్నీ నవి దిశ పేరుతో 1999లో ఆల్బమ్గా వచ్చాయి. ఈ ఆల్బమ్కు 2000 సంవత్సరంలో నాన్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ గేయ రచయితగా వాజపేయి అవార్డు దక్కించుకున్నారు. అయితే అప్పుడు వాజ్పేయి ప్ర«ధానమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి అవార్డుని అందజేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల సంతాపం
తాను నమ్మిన సిద్ధాంతాలను మానవతా ధృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించిన ఒక పాలనాధక్షుడిగా వాజ్పేయి చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్పేయి. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది. – వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు -
స్నేహం కోసం ఎంతో శ్రమించారు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/మాస్కో: భారత మాజీ ప్రధాని వాజ్పేయి మృతిపట్ల అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా పలు ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా విదేశాలతో భారత స్నేహపూర్వక సంబంధాల కోసం వాజ్పేయి ఎంతో శ్రమించారని ఆయా దేశాలు గుర్తుచేసుకున్నాయి. భారత్–పాక్ల్లో శాంతిస్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పాక్కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాజ్పేయి విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలోనే భారత్–పాక్ సంబంధాల్లో మంచి పురోగతి కనిపించదని గుర్తుచేసుకున్నారు. -
వాజ్పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరణించారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. -
ఆ పలకరింపు మరువలేం...
లక్నో : లోక్సభ సభ్యుడిగా తాను ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్నో అంటే మాజీ ప్రధాని వాజ్పేయికి ప్రత్యేక అనుబంధముంది. లక్నోకే ప్రతిష్టాత్మకంగా మారిన 24 కి.మీ ఔటర్రింగ్రోడ్డు లాంటి ’పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ హై’ను అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. అమరుల మార్గం (షహీద్ పథ్) పేరుతో నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ’షహీద్ పథ్ అనేది లక్నోకు వాజ్పేయికి ప్రత్యక్షంగా ఇచ్చిన పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగానూ స్వర్ణ చతుర్భుజిని నిర్మించింది ఆయనే. అంతకుముందు లక్నోలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తాను వాజ్పేయిని కలుసుకోవడం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని రతన్కుమార్ అనే వ్యాపారవేత్త చెప్పారు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా పలకరించడంతో పాటు, ఏ సమస్య మీద అయినా ఆయనను సులభంగా కలుసుకునేందుకు వీలుండేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ’పార్టీ అవసరాలు, ఫ్రస్తావన పక్కన పెడితే వాజ్పేయికి ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదు. ఈ రోడ్డుపై ఏ మతానికి చెందిన వారైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడగలరేమో చూపించండి ’ అని అక్కడి దుకాణదారు తేజ్బహదూర్ వ్యాఖ్యానించాడు.’ మోదీ ప్రభుత్వం కూడా వాజ్పేయి ప్రభుత్వ పాలన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుత బీజేపీకి, వాజ్పేయి కాలం నాటి బీజేపీకి ఎంతో వ్యత్యాసముంది’ అన్నది పాత సామాన్ల కొనుగోలు వ్యాపారి షంషేర్ అలీ అభిప్రాయం. రాజకీయ ప్రత్యర్థులు వచ్చేవాళ్లు... చిన్న పిల్లాడిగా తన తండ్రి ద్విచక్రవాహనం లూనాపై లక్నోలో జరిగిన వాజ్పేయి ర్యాలీకి హాజరైన అనుభవాన్ని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్శర్మ గుర్తుచేసుకున్నారు. ’చలికాలం రాత్రి 11.30 గంటలకు వాజ్పేయి ప్రసంగం మొదలుకాగా, దుప్పటిలో ముఖాన్ని పూర్తిగా కప్పుకున్న ఓ వ్యక్తిని మా నాన్న గుర్తుపట్టి దానిని లాగేశారు. సిద్ధాంతాల రీత్యా జనసంఘ్ను వ్యతిరేకించే ఆ వ్యక్తి పేరున్న కమ్యూనిస్టు నేత, పైగా ముస్లిం. జనసంఘ్లో ఏమైనా చేరుతున్నారా అంటూ మా నాన్న అడిగిన ప్రశ్నకు అరే అటువైపు చూడండి ప్రముఖ సమాజ్వాది సిద్ధాంతకర్త కూడా వాజ్పేయి ప్రసంగం వినడానికి ముసుగు ధరించి వచ్చారు అంటూ అటువైపు చూపారు’ అని దినేశ్శర్మ తెలిపారు. సంఘ్ కార్యకలాపాలు, సిద్ధాంతాలు వ్యతిరేకించే ఇతర పార్టీల వారికి కూడా వాజ్పేయి ఎలా ఆమోదయోగ్యుడో తెలిపేందుకు ఈ ఉదంతం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రముఖుల తుది మజిలీ ‘స్మృతి స్థల్’
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలోని స్మృతి స్థల్లో జరిగాయి. యమునా నది తీరంలో పచ్చిక బయలుతో అలరారే సువిశాల ప్రాంగణం స్మృతి స్థల్. గాంధీ సమాధి(రాజ్ఘాట్)కి సమీపంలో శాంతివన్ (నెహ్రూ సమాధి), విజయ్ ఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి సమాధి)ల మధ్య ఈ స్మృతి వనం ఉంది. రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రుల వంటి అత్యంత ప్రముఖుల అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మృతి స్థల్ను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మరణించినప్పుడు వారికోసం దేశ రాజధానిలో ప్రత్యేకంగా స్థలాల కేటాయింపులు జరిగాయి. రాజ్ఘాట్ సమీపంలో వారికి కూడా స్మారక స్థలాలను కేటాయించేవారు. శాంతివన్, శక్తి స్థల్, వీర్ భూమి, ఏక్తా స్థల్, సమతా స్థల్, కిసాన్ ఘాట్ వంటి పేర్లతో ఏర్పాటు చేసిన ఈ స్మారకాల కోసం రాజధానిలో అత్యంత విలువైన 245 ఎకరాలకు పైగా కేటాయించారు. ఇలా కేటాయిస్తూ పోతే రాజధానిలో భూమి కొరత వస్తుందన్న ఆందోళనతో 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రముఖులకు స్థలాలు కేటాయించకూడదని నిర్ణయించింది. 2013లో కేంద్ర మంత్రివర్గం స్మతి స్థల్ నిర్మాణానికి ఆమోదం తెలపగా, 2015లో రాజ్ఘాట్ సమీపంలో నిర్మాణం పూర్తయింది. స్మతి స్థల్లో మొదటి సమాధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ఈ స్మృతి స్థల్లో ఆయన స్మారకాన్ని నిర్మించింది. అయితే ఇందుకు ఆయన కుటుంబీకులు పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు ఢిల్లీలో మరణించారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు రాజధానిలో జరిపేందుకు అంగీకరించలేదు. దాంతో కుటుంబీకులు పీవీ అంత్యక్రియలను హైదరాబాద్లో నిర్వహించి స్మారకం ఏర్పాటు చేశారు. తమ తండ్రికి దేశ రాజధానిలో స్మారకం ఏర్పాటు చేయాలని పీవీ కుటుంబీకులు కోరడంతో 2015లో ఎన్డీయే ప్రభుత్వం పీవీకి స్మృతి స్థల్లో స్మారకం ఏర్పాటు చేసింది. మరో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్కు 2012 డిసెంబర్లో స్మృతి స్థల్లో అంత్య క్రియలు నిర్వహించారు. కొందరు మాజీ ప్రధానుల స్మారక స్థలాలు– వాటి పేర్లు–కేటాయించిన స్థలం మహాత్మా గాంధీ రాజ్ఘాట్ 44.35 ఎకరాలు జవహర్లాల్ నెహ్రూ శాంతి వన్, న్యూఢిల్లీ 52.6 ఎకరాలు లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, న్యూఢిల్లీ 40 ఎకరాలు ఇందిరా గాంధీ శక్తి స్థల్,న్యూఢిల్లీ 45 ఎకరాలు రాజీవ్ గాంధీ వీర్ భూమి, న్యూఢిల్లీ 15 ఎకరాలు చరణ్ సింగ్ కిసాన్ భూమి 19 ఎకరాలు జైల్ సింగ్ ఏక్తా స్థల్ 22.56 ఎకరాలు చంద్ర శేఖర్ ఏక్తా స్థల్, న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది ఐకే గుజ్రాల్ ఏక్తా స్థల్,న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది వీపీ సింగ్ దియా గ్రామం, రామ్ఘడ్, అలహాబాద్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, గుజరాత్ -
మదురై మహిళకు పాదాభివందనం
మదురై జిల్లా పుల్లచ్చేరి గ్రామానికి చెందిన చిన్నపిళ్లై అనే మహిళకు 2001లో వాజ్పేయి ప్రధానిగా ఉండగా పాదాభివందనం చేశారు. కళంజియం అనే పేరుతో చిన్నపిళ్లై ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజల్లో పొదుపు చేసే అలవాటును బాగా ప్రోత్సహించారు. ఆమె సమాజ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘శ్రీ స్త్రీశక్తి’పురస్కారాన్ని అందజేసింది. నాడు ప్రధానిగా ఉన్న వాజ్పేయి చిన్నపిళ్లైకి అవార్డు బహూకరిస్తూ ఆమె పాదాలకు నమస్కారం చేశారు. దీంతో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. వాజ్పేయి కన్నుమూశారన్న వార్త విని చిన్నపిళ్లై కన్నీరు పెట్టుకున్నారు. -
ఏ బంధమో...
ఏ బంధం లేకున్నా ... బలమైన అనుబంధమేదో కలిపింది వీరందరినీ. వాజ్పేయితో వ్యక్తిగత అనుబంధం లేకపోవచ్చు. ఆయన్నసలు చూసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆయన చేసిన పనులేవో వారిని తట్టిలేపాయి. ఆయన మాటలేవో వారి మదిని కదిలించాయి. అందుకే జనం తరలి వచ్చారు. కడసారి ఆ మహానేతను చూసిపోదామని వచ్చిన బహుదూరపు బాటసారులెందరో వాజ్పేయి ఇంటిముందు బారులు తీరారు. ఎక్కడ నుంచో తరలి వచ్చిన పీహెచ్డీ విద్యార్థి ఒకరు.. రాష్ట్రీయ స్మృతి స్థల్లో పనిచేసే రోడ్డు నిర్మాణ కార్మికుడొకరు.. బీహార్ నుంచి వచ్చిన ఓ సివిల్ సర్వీసెస్ విద్యార్థి, ఒక న్యాయవాది..ఉత్తరప్రదేశ్నుంచి వచ్చిన వలస కార్మికుడొకరు. వాజ్పేయి ఎదిగివచ్చిన సమాజం ఒకవైపూ, వాజ్పేయి స్ఫూర్తినొందిన సిద్ధాంతాన్ని విశ్వసించిన ప్రజలు మరోవైపూ, ఏ సంబంధమూ లేని వీరందరినీ 6–ఎ క్రిష్ణ మీనన్ మార్గ్..దగ్గరికి చేర్చేందుకు కారణమయ్యారు అటల్ బిహారి వాజ్పేయి. ఒకరికొకరు సంబంధంలేని వేనవేల ప్రజానీకం ఆఖరి చూపుకోసం, తన ప్రియతమ నేత మహాభినిష్క్రమణం వేళ అశ్రునివాళులర్పించేందుకు శుక్రవారం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆఖరిచూపు కోసం సైనిక పటాలాలు, సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత రక్షక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య 6–ఎ, క్రిష్ణ మీనన్ మార్గ్ వద్ద జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ నుంచి వచ్చిన 52 ఏళ్ళ యోగేశ్ కుమార్, ఆయనతో సహా అనేక మంది 500 కిలోమీటర్ల సుదూర తీరాలనుంచి ప్రయాణించి వాజ్పేయికి నివాళులర్పించేందుకు తెల్లవారేసరికి వాజ్పేయి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంగాజలం తెచ్చాను.. ‘‘1984లో వాజ్పేయి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళుతుండగా మార్గం మధ్యలో మొదటిసారి వాజ్పేయిని కలిసాను. మళ్లీ రెండేళ్ల తరువాత 1986లో ఉత్తరకాశీలో రెండోసారి వాజ్పేయిని చూశానంటూ వాజ్పేయితో దిగిన ఫొటోని చూపిస్తూ కనిపించారు యోగేష్ కుమార్. తనతో పాటు గంగోత్రి నుంచి గంగాజలాన్ని తెచ్చాననీ, ఒక్కసారి వాజ్పేయి పార్థివ దేహాన్ని చూసే అవకాశం వస్తే చాలన్నారు. అందరూ ఆయన ఆరాధికులే ‘‘హిందువా, ముస్లిమా అన్నది చర్చనీయాంశం కాదు. ఏ మతానికి చెందిన వారైనా అందరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ఆయన జాతిజనులకోసం పరిశ్రమించారు’’అని బిహార్లోని ముజఫర్పూర్ నుంచి వచ్చిన 49 ఏళ్ళ న్యాయవాది సుధీర్కుమార్ ఝా పేర్కొన్నారు. వార్తల్లో చూసి... ‘‘వాజ్పేయి ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్త విని నా స్నేహితుడూ, నేనూ కడసారి ఆయన చూడాలని పట్నా నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చాము’’అని ఆశీష్ ఉపాధ్యాయ అనే ఇంజనీర్ తెలిపారు. జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్డీ చదువుతున్న దీన్నాథ్ గుప్తా అనే విద్యార్థి తాను మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాననీ, మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు తెలిసి తన రీసెర్చ్పనిని విడిచి ఎయిమ్స్కి వచ్చినట్టు తెలిపారు. ఆయన కవిత్వమే నాకు స్ఫూర్తి వాజ్పేయే కవిత్వమే తనకు స్ఫూర్తి అని సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న రాహుల్ అహ్వద్ అంటారు. 2013, 2015లో రెండుసార్లు వాజ్పేయిని చూశానంటారు. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా లేరని, చివరిసారిగా ఆ మహానేతని ఒకసారి చూడాలని వచ్చినట్లు చెప్పారు. ‘‘వాజ్పేయి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పారు. అందరి మన్ననలూ అందుకున్నారు’’అన్నారు రాహుల్ అహ్వద్. ఓ మంచి మనిషి... ‘‘నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకునేటప్పుడు వాజ్పేయి గురించి తెలుసుకున్నానని, ఆయన్ని గురించి చదివానని చెప్పిన 19 ఏళ్ళ బిపిన్ కుమార్ ‘‘వాజ్పేయి ఓ మంచి మనిషి’’అంటారు. అసంఘటిత రంగ కార్మికుడి నుంచి సంఘటిత ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల వరకూ అందరూ తమ అధినేతకు అశ్రునివాళులు అర్పించామన్న సంతృప్తితో వెనుదిరిగారు. వాజ్పేయి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. వాజ్పేయితో కలసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. దేశ ప్రజలంతా అమితంగా ఆరాధించే మాజీ ప్రధాని, విభిన్న జాతీయ నేత, ఆధునిక భారత రాజనీతిజ్ఞుడు వాజ్పేయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రచయితగా, కవిగా, ఎంపీగా, పరిపాలకుడిగా, చివరకు ప్రధానిగా ప్రజా జీవితంలో ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఆయన మరణం దేశానికే కాదు ప్రపంచమంతటికీ లోటు – రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాజ్పేయి అస్తమయంతో ఒక శకం ముగిసిందని అందరూ అంటున్నారు. అయితే నేను మాత్రం భావించడం లేదు. ఆయనతో పాటు మరికొందరు వేసిన పునాదిపై నిర్మితమైన ఆ శకం కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో మొదటి కొన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. దానికి ముగింపు పలుకుతూ వాజ్పేయి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపారు. అడ్వాణీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో రెండో తరం నేతల్ని తయారు చేసిన ఘనత వాజ్పేయిదే. – కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ వాజ్పేయి మరణంతో దేశం ఒక మహాపురుషుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మానవత్వానికి ప్రతీక అటల్ జీ. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నా. – గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేశాభివృద్ధికి, జాతీయ సమస్యల పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చూపిన బాట నేటికికూడా అనుసరణీయమే. 1975లో నేను కరీంనగర్ జన్సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాజ్పేయితో ఏర్పడిన బంధం ఆయన మంత్రివర్గంలో చోటు దక్కేస్థాయికి చేరింది. నా కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చుకానీ పక్కింటివారిని మార్చుకోలేమని అనేవారు. ఆ దృక్పథంతోనే పాక్ విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. – మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు దేశంలో మలిదశ సంస్కరణలకు ఆద్యుడు వాజ్పేయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో, జాతీయ రహదారులు, హరిత విమానాశ్రయాలు, సూక్ష్మ నీటిపారుదల రంగాల్లో వాజ్పేయి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో హుం దాగా నడుపుతూ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యక్తిత్వం, విలువలు ఎవరికీ లేవు. – ఏపీ సీఎం చంద్రబాబు అజాత శత్రువు అయిన వాజ్పేయి మరణం దేశానికి తీరని లోటు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా వాజ్పేయి నడపగలిగారు. ఎవరినీ శత్రువులా చూడకుండా అన్ని పార్టీల అభిమానాన్ని ఆయన సంపాదించగలిగారు. – టీఆర్ఎస్ ఎంపీలు కేకే, జితేందర్రెడ్డి రాజకీయ విలువలను కాపాడుతూ వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి ఆదర్శం. వాజ్పేయి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. – దత్తాత్రేయ, కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ -
భారతీయుల గుండెల్లో ఉంటారు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి వీడ్కోలు తెలిపారు. వాజ్పేయి వంటి అసాధారణ వ్యక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని మహోన్నతంగా మార్చడంలో జీవితాన్నే త్యాగం చేసిన వాజ్పేయికి నివాళులర్పించేందుకు సరైన పదాలే లేవు. నేడు దేశం నలుమూలల నుంచి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అరుదైన వ్యక్తికి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చారు. అటల్ జీ దేశం మీకు సెల్యూట్ చేస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉదయం తన బ్లాగ్లోనూ ‘స్ఫూర్తి, సుహృద్భావం, అద్భుతమైన వాక్చాతుర్యం కలబోసిన మహనీయుడిని దేశం నేతగా ఎంచుకుంది. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు నీతిమంతమైన, స్ఫూర్తిదాయకమైన దీర్ఘదృష్టి గల నేతగా ప్రజలకు సరైన మార్గదర్శనం చేశారు’ అని పేర్కొన్నారు. 1990వ దశకంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక దుర్భర పరిస్థితులున్న సమయంలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకొచ్చిన గొప్ప వ్యక్తి, రెండు దశాబ్దాలుగా మనం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలకు ఆయన వేసిన బీజాలే కారణం. వాజ్పేయి దృష్టిలో అభివృద్ధి అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సాధికారత దక్కడమే. ఆయన ఆలోచనలతోనే మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించుకుని ముందు కెళ్తోంది’ అని పేర్కొన్నారు. భారతదేశాన్ని అణుశక్తిగా మార్చేందుకు ఎవరినీ లెక్కచేయని ధైర్యవంతుడని కొనియాడారు. ‘వ్యక్తిగతంగా ఆయన నా ఆదర్శం, నా గురువు, నాలో స్ఫూర్తి రగిలించిన అసాధారణ మహనీయుడు. 2001 అక్టోబర్లో ఓ రోజు నన్ను పిలిచి.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లమన్నారు. వ్యవస్థ పరంగా పనిచేశానని.. పరిపాలనలో అనుభవం లేదని చెప్పాను. అయినా నాలో ధైర్యాన్ని నింపి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయాలని చెప్పి పంపించారు. నాపై ఆ నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. అందుకే ఆయన చూపిన బాటలో.. ఆయన నేర్పిన విధానాలతోనే మేం ప్రపంచంతో పోటీపడగలుగు తున్నాం’ అని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని పరిపాలనలో (గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు) ఆయన ఇచ్చిన సూచనలను మోదీ గుర్తుచేసుకున్నారు. సిమ్లాలో జాతీయ జెండా అవనతం... వాజ్పేయికి నివాళులర్పిస్తున్న అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు, సుష్మాస్వరాజ్, భూటాన్ రాజు జిగ్మే -
అంతిమయాత్రలో..
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అంత్యక్రియలు జరిగిన స్మృతి స్థల్ వరకు ఏడు కిలోమీటర్ల పాటు అంతిమయాత్ర కొనసాగింది. రోడ్డుపొడవునా కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నేతకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ కార్యాలయం నుంచి జరిగే చివరి యాత్రలో తాను నడుస్తానని మోదీ ముందే తెలిపారు. ఉగ్రవాదుల ముప్పు ఉన్నప్పటికీ.. ప్రొటోకాల్ను పక్కనపెట్టి అమిత్ షాతోపాటుగా నడిచారు. దీంతో పార్ధివదేహం వెనక ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటుచేశారు. మోదీ, షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు శివ్రాజ్ సింగ్, యోగి, ఫడ్నవిస్లు కూడా నడిచే వచ్చారు. రోడ్డుపై భారీ సంఖ్యలో జనం వాజ్పేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న వాహనంపై పూలు చల్లుతూ భారతరత్నంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువకులు, చిన్నా పెద్దా, ఆడామగా తేడా లేకుండా అశేష అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వాజ్పేయిని చివరిసారి చూసేందుకు అవకాశం దొరకని కొందరైతే.. రోడ్డుపక్కనున్న చెట్లు కూడా ఎక్కేశారు. చాలా మంది ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో రోడ్లు మార్మోగాయి. -
ప్రియతమ నేత
ఒక మంచి మనిషి, గొప్ప కవి, మహానేత, దార్శనికుడు, హృదయవాది, భరతమాత ముద్దుబిడ్డ శాశ్వతంగా కన్ను మూశారు. అటల్ బిహారీ వాజ్ పేయి మహా శూన్యాన్ని సృష్టించి వెళ్లిపోయారు. దాదాపు దశాబ్దంగా ఈ కర్మ యోగి యోగనిద్రలో ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజాజీవితానికి దూరంగా ఉన్నా.. ప్రభుత్వాలు, ప్రజలు ఆయన్ని తలుచుకోని క్షణం లేదు. విలక్షణమైన వ్యక్తిత్వం. అనుకరణీయుడేగానీ అనుసరణకు అసాధ్యుడు. ‘‘మీరు ప్రధాని అయ్యారు. రేపట్నించి జన సామాన్యంలోకి వెళ్లలేరు. బోలెడు సెక్యూరిటీ కంచెలుంటాయ్’’ అని ఒక పాత్రి కేయుడు వ్యాఖ్యానించినప్పుడు, అటల్జీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టారు. ‘‘నాకు శిఖరంలా ఎదగాలని లేదు, నలుగురిలో నలుగురితో ఉండాలని ఉంది. కొండ శిఖ రాల మీద రాళ్లు రప్పలు తప్ప పచ్చదనం ఉండదు. చెమ్మ అసలే ఉండద’’ని కవితామయంగా అన్నారు. సభల్లో, సమావేశాల్లో వాజ్పేయి నోరు విప్పితే అమృతం కురిసేది. వేద రుక్కులు, ఉపనిషత్ వాక్యాలు సందర్భోచితంగా వచ్చి వర్షించేవి. ఇంగ్లిష్, హిందీ, సంస్కృత మాధ్యమాలలో డిగ్రీ తీసు కున్నారు. రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. తర్వాత ఆ శాస్త్రానికి ఆయనే పాఠ్యగ్రంథంలో నిలిచారు. కవితలు ఆశువుగా భావోద్వేగంతో చెప్పడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నానని చెప్పుకు న్నారు. కబీర్ రామచరితమానస్, మహాదేవి వర్మ ‘గీత’ తనకి గొప్ప ప్రేరణనిచ్చాయనేవారు. అటల్జీపై అవిశ్వాసం పెట్టినప్పుడు, పదవి నుంచి దిగిపోతూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం, ప్రపంచంలోనే అతి గొప్ప విశ్లేషణాత్మక సందేశంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసానికి కూడా ఆ సన్నివేశం నిదర్శనం. వాజ్పేయి మేథలో సరస్వతీ, హృదయంలో సిద్ధార్థుడు కొలువుతీరి ఉన్నారని పెద్దలు అంటారు. ఆయన ప్రసంగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. అటల్జీ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ గురించి చెప్పాలంటే వెయ్యి సందర్భాలు ఉటంకించాలి. ఆయన పరిపాలనా దక్షతకి, వాజ్పేయి హయాంలో దృష్టిపెట్టిన రోడ్లు, కరెంటు, నీళ్లు ఈ మూడు మౌలిక అంశాలను చెబుతారు. పోఖ్రాన్ అణుపరీక్షని గుర్తు చేసుకుంటారు. కార్గిల్ యుద్ధం మన సేనల్లో ఆత్మ స్థయిర్యం పెంచింది. ప్రైవేటైజేషన్లో ఆయన వేయించిన ముందడుగులు దేశ ఆర్థిక స్థితిని మార్చాయి. వాజ్పేయి ప్రధానిగా ఉండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రకారుడు బాపు రచించిన రామాయణ వర్ణచిత్రాలు వాజ్పేయి ఆవిష్కరించారు. ‘‘రాముడు మనుషుల్లో దేవుడు. ఆదర్శప్రాయుడు. అందుకే ఆయనకు గుళ్లు కడతాం. ఆయన సన్మార్గానికి, ఆయన ఆదర్శాలకు చిహ్నంగా కడతాం. యుగాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. రాముడు దేవుడు కాదు కాబట్టి నాస్తికులు కూడా దణ్ణం పెట్టుకోవచ్చు. తప్పులేదు’’ అని సభలో నవ్వులు పూయించారు. ‘అజాత శత్రువు’ అనే మాట ద్వాపరయుగంలో ధర్మరాజుకి చెల్లిపోయింది. మళ్లీ కలియుగంలో అటల్ బిహారీ వాజ్పేయికి చెల్లింది. అందరూ ఆమోదించారు. వాజ్పేయికి ప్రాంతం వర్తించదు. పూర్తిగా దేశవాసి. కనుకనే అన్ని ప్రాంతాలనించి గెలిచి సభకి వచ్చారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఆయనకు మిత్రులంటే మిత్రులే! అటల్జీ ఇంట్లో పీవీ ఫొటో ప్రముఖంగా ఉండటం చూసి, ఇదేమిటని అడిగారట ఒకాయన. రాజకీయ లబ్ధి కోసం మిత్రులను వదులుకోలేను అని జవాబు ఇచ్చారట. ‘‘ఒక పల్లెటూరి బడిపంతులు కొడుకునైన నా వంటి సాధారణ పౌరుడికి ప్రధాన పదవి కట్ట బెట్టారు. మన ప్రజాస్వామ్య శక్తికిది నిదర్శనం. ఈ దేశంలో వంశపాలనకు కాలం చెల్లింది’’ అంటూ హెచ్చరించారు. దీని వెనుక ఒకే ఒక్క ఓటు బలంతో ఆయనను గద్దె దింపిన సంఘటన తాలూకు ఉద్వేగం ఉంది. రోషం ఉంది. ‘‘నా విధి నిర్వహణలో విజయం వరించినా, అపజయం ఎదురైనా జంకను. రెంటినీ స్వీకరిస్తా. ఎందుకంటే రెండూ నిజమే కాబట్టి’’ ఇదీ అటల్జీ మనోభావం. భారతీయత ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. హిమాలయాల్లోని కులుమనాలి ప్రాంతం అంటే ఆయ నకు ఇష్టం. విశ్రాంతికి వెళ్లాలంటే మనాలిని కోరుకునే వారు. నాట్యం, సంగీతంపట్ల అభిరుచి ఆసక్తి ఉన్నవారు. మంచి భోజనప్రియులు. తెలుగువాళ్లం గర్వంగా చెప్పుకో తగింది– వాజ్పేయికి మన పుల్లారెడ్డి మిఠాయిలంటే పరమ ఇష్టం. తెలుగువారితో ఆయనిది తీయని అను బంధం. తరచూ ఆయన కవితా రచనలలో మృత్యువుతో పరిహాసమాడేవారు. సవాళ్లు విసిరేవారు. ఆ మహా మనీ షిని ఏ మృత్యువూ తీసికెళ్లలేదు. కోట్లాదిమంది హృద యాలలో అటల్జీ నిలిచే ఉంటారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
శాంతి సాధన ఓ ముళ్లబాట...!
పాకిస్తాన్ నూతన ప్రధానికి అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారుల తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించ లేదు. ఇక మూడోది, ఎన్నికైన ప్రతి ప్రధాని ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. పాక్లో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పిం చిన ప్రతి ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇవన్నీ దాటుకుని ఇమ్రాన్ శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూనుకుంటాడు. భారత్, పాక్ మధ్య శాంతి స్థాపనకు అత్యంత సాహసోపేత, నాటకీయ ప్రయత్నం గురించి తెలియని విషయాలు వెల్లడించ డానికి పాకిస్థాన్ 30వ ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణం చేస్తున్న రోజే తగిన రోజని భావిస్తున్నా. ఈ ప్రయత్నం చేసిన ఇద్దరు ఎన్నికైన నేతల్లో ఒకరు గురువారం కన్నుమూయగా, రెండో నాయకుడు క్రూరమైన రావల్పిండి జైల్లో మగ్గుతున్నారు. దీనిలో ఈ వ్యాస రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది. మియా నవాజ్ షరీఫ్ 1997లో రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో అధి కారంలోకి వచ్చింది. అప్పటికి కొంత కాలంగా భారత–పాక్ సంబంధాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. వాజ్పేయి సర్కారు పోఖ్రాన్–2 పేరుతో అణుపరీక్ష జరపడంతో ఇవి మరింత క్షీణించాయి. పాకిస్తాన్ చాగైలో అణుపరీక్షతో పదునైన జవాబి చ్చింది. 1998 చివరి మాసాల నాటికి రెండు వైపులా ఓర్పు నశించిన సూచనలు కనిపించాయి. ఇద్దరు కొత్త నేతలూ రెండు దేశాల సంబంధాలు మెరుగుప డాలని కోరుకున్నాగాని, పరస్పర అవిశ్వాసం అందుకు అడ్డు నిలిచింది. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉభయ దేశాల ఉన్నతాధికారుల వల్ల ముందుకు సాగలేదు. ఈ దశలో చలికాలం ఆరంభంలో పాకిస్థాన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నుంచి అని రాసి ఉన్న ఈ లేఖ కవరుపై ఉన్న పోస్టల్ ముద్రలను బట్టి చూస్తే ఇది ఢిల్లీ చేరడానికి చాలా వారాలు పట్టిందని అర్థమైంది. మధ్యలో ఈ లేఖ ఎన్వలప్ను రెండు దేశాలకు చెందిన వివిధ శాఖలు తెరచి, చదవి మళ్లీ మళ్లీ సీలు చేశాయి. ఎందుకంటే, పాక్ ప్రధాని సాధారణ పోస్టులో గతంలో ఉత్తరం పంపలేదు. కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ కోసం నేను రాసిన లేఖకు జవాబుగా ఆలస్యంగా పంపినా ఆత్మీయంగా పంపిన స్పందన ఇది. నేను ఇస్లామా బాద్లోని పాక్ ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నవాజ్ షరీఫ్ నాకు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ చేయడానికి పాకిస్థాన్ ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. కొద్దిసేపు నేను మాట్లాడాక, ‘‘ఇద్దరు ప్రధానులూ సంబంధాలు ముందుకు సాగ డానికి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇంటర్వ్యూల వల్ల ప్రయోజనం ఏముంటుంది? పెద్ద ఒప్పందాల సంగతి వదిలేయండి. కనీసం బస్సు సర్వీసు కూడా మొదలు కాలేదు’’ అన్నాను. దీనికి షరీఫ్ దౌత్య వేత్తలు మాట్లాడే రీతిలో కొన్ని కారణాలు చెప్పారు. నేను సరదాగా పంజాబీలోనే మాట్లాడుతూ ‘‘ నాకు మీరిచ్చే ఇంటర్వ్యూలోనే బస్సు సర్వీసు ప్రారంభించే విషయం ప్రకటించడంతోపాటు, మొదటి బస్సులో రావాలని మా ప్రధానిని ఎందుకు ఆహ్వానించకూడదు?’’ అని ప్రశ్నించాను. నా సలహాను నవాజ్ షరీఫ్ సీరియస్గా తీసుకుని ఆలోచించారు. నా ఐడియా ఆయనకు నచ్చింది. అయితే, తాను ఆహ్వానించాక భారత ప్రధాని అందుకు నిరాకరిస్తే ఏం చేయాలి? అనే అనుమానం ఆయనను పీడించింది. అదే జరిగితే బావుండదు కదా. నేను విషయం కనుక్కుని చెబుతానని ఆయనతో అన్నాను. వాజ్పేయికీ నచ్చిందీ ప్రతిపాదన! విషయం తెలియజేయగానే, ఈ ప్రతిపాదన వాజ్పేయికి కూడా నచ్చింది. అయితే, పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాకే నేను ఆయనను కలవాలనీ, అప్పటిదాకా ఇది ప్రచురించవద్దని వాజ్పేయి చెప్పారు. లాహోర్లోని సొంత ఇంట్లో నవాజ్ షరీ ఫ్ను ఇంటర్వ్యూ చేశాను. మధ్యమధ్యలో భారత– పాక్ క్రికెట్ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారంతో మా సంభాష ణకు బ్రేకులు పడ్డాయి. ఆయన తన మాట నిలబెట్టు కున్నారు. బస్సు సర్వీసుకు అంగీకారం తెలపడమే గాక, వాజ్పేయిని ఈ బస్సులో రావాలని ఆహ్వానిం చారు. చరిత్రలో నిలిచిపోయేలా తాను భారత ప్రధా నికి స్వాగతం పలుకుతానని షరీఫ్ తెలిపారు. షరీఫ్తో ఇంటర్వ్యూను ఒక రోజు ఆపాలనీ, తాను విమానంలో లక్నోలో దిగే రోజు అది ప్రచురితమయ్యేలా చాడాలని వాజ్పేయి నన్ను కోరారు. ఆనవాయితీగా భారత విదేశాంగశాఖ అనుమానాలు వ్యక్తం చేయక ముందే తాను ఆహ్వానం అంగీకరిస్తానని వాజ్పేయి చెప్పారు. ఆ తర్వాత జరిగిదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అత్యంత నాటకీయ పరిణామాల తర్వాత అటల్ బస్సు యాత్ర జరిగింది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా వాజ్ పేయికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు శాల్యూట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ అంగీకరించలేదు. బస్సు దిగాక వాజ్పేయి మీనారే పాకిస్తాన్ మెట్ల వరకూ వచ్చి, పాక్ సుస్థిరతతో సుసపన్నంగా ఉండడం భారతదేశా నికి మేలని ప్రకటించారు. నేను ఈ యాత్రలో భాగం కావడం నాకెంతో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇది నాకు మొదటి ఏకైక అనుభవం. బస్సు యాత్ర విషయం నేను ఇంటర్వ్యూ ద్వారా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఓ పక్క ఇద్దరు ప్రధానులూ తమకు పూర్తిగా అవగాహన లేని శాంతి చర్చలు జరుపు తుంటే, మరో పక్క పాకిస్తానీ ఆర్మీ కార్గిల్ ప్రాంతం లోని విశాల సరిహద్దు గుండా తన సైనికులు భారత భూభాగంలోకి చొరబడేలా చేసింది. మే నెల మధ్య నాటికి ఉభయ దేశాల దళాల మధ్య తొలి ఘర్షణలు జరిగాయి. మే 26న ఇండియా తన వైమానికి దళాన్ని రంగంలోకి దింపింది. మరుసటి రోజు రెండు భారత మిగ్ విమానాలను పాక్ సైనికులు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో కూల్చివేశారు. శత్రు శిబిరం వివరాలు తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా పోతున్న మూడో యుద్ధవిమానం ఇంజన్లలో ఒకదానికి క్షిపణి దెబ్బతగిలింది. అయితే, అది అదృష్టవశాత్తూ కూలి పోకుండా తిరిగి తన స్థావరానికి సురక్షితంగా వచ్చే సింది. ఇలాంటి నాటకీయ మలుపునకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రధాని నుంచి నా హోటల్ రూముకు ఫోన్! ఉదయం ఆరున్నరకు ముంబైలో నేను బసచేస్తున్న హోటెల్ రూములో ఫోను మోగింది. ప్రధానమంత్రి నాతో మాట్లాడాలనుకుంటున్నారని అవతలి వ్యక్తి చెప్పారు. వెంటనే వాజ్పేయి ఫోన్లైన్లోకి వచ్చి ‘‘యే క్యా కర్ రహాహై మిత్ర్ ఆప్కా?(మీ స్నేహి తుడు చేస్తున్న ఈ పనేంటి?)’’అని ప్రశ్నించారు. పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ చైనా పర్యటనలో ఉండగా కశ్మీర్ ముజాహదీన్ల చేతుల్లోకి క్షిపణులు రావడంపై అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని ఆయన అన్నారు. ‘అసలేం జరుగుతోంది? ఈ విషయం మీరు మీ మిత్రుణ్ని అడగగలరా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను ఇస్లామాబాద్లోని నాకు తెలిసిన పాత ఫోన్ నంబర్కే డయల్ చేసి ఓ కబురు పంపాను. ఆ రోజు రాత్రి నాకు పాక్ రాజదాని నుంచి ఫోనొచ్చింది. నవాజ్ షరీఫ్ కూడా వాజ్పేయి మాదిరిగానే కలవరపాటుతోనే మాట్లా డారు. ‘‘నేను ఆయనకు ద్రోహం చేయబోనని ఆయ నకు మీరు చెప్పండి. అధీనరేఖపై ఎప్పటిలా కొన్ని మామూలు ఘర్షణలు జరిగాయని నిన్న నాకు చెప్పారు. నేడు గగనతల ఉల్లంఘనలు జరిగాయి. నాకు కూడా ఈ పరిణామాలపై ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ వైమానిక ఘర్షణలను ప్రస్తావిస్తూ షరీఫ్ నాతో అన్నారు. రాజధానికి రాగానే వాజ్పేయి, ఆయన సహాయకుడు బ్రజేష్ మిశ్రా నాతో ఫోన్లో మాట్లాడారు. జనరల్ ముషారఫ్, ఆయన డెప్యూటీ సైనికాధికారి మధ్య జరిగిన సంభాషణలను ‘మన మనుషులు’ రహస్యంగా విన్నారనీ, ఇది పూర్తిగా పాక్ చేపట్టిన సైనిక చర్యయేనని తేలిందని వారు నాకు చెప్పారు. ‘‘కాబట్టి, మీరు ఇంటర్వూ్య పేరుతో ఇస్లామాబాద్ వెళ్లి, పాక్ సైనికాధిపతుల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణ గురించి నవాజ్ షరీఫ్కు చెప్పగలరా?’’ అని నన్ను అడిగారు. కానీ, నాకు ఈసారి విషయం తీవ్రత అర్థమైంది. నేను మొదట చేసింది నిజమైన ఇంటర్వూ్య. దాని సత్ఫలి తమే బస్సు యాత్ర. వారు చెప్పినట్టు చేస్తే జర్నలిజం పరిధి దాటినట్టే అవుతుందని వారికి తెగేసి చెప్పాను. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. వారు అంతటితో ఆగకుండా మాజీ ఎడిటర్ ఆర్.కె.మిశ్రాకు ఈ పని అప్పగించారు. ఆయన అప్పుడు అబ్జర్వర్ ఫౌండే షన్లో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టే ఆయన ఇస్లా మాబాద్కు అనేకసార్లు వెళ్లొచ్చారు. పాక్ సేనల చర్య లకు సాక్ష్యంగా పైన చెప్పిన రహస్య సంభాషణల టేపులను కూడా ఆయన పాక్ ప్రధానికి అందజే శారు. దీంతో పాత్రికేయ పరిధిని దాటిన నా సాహసం ఇంతటితో ముగిసింది. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రికి ఇక్కడ అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారులు తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించలేదు. ఇక మూడోది ఏమిటంటే ఎన్నికైన ప్రతి ప్రధాన మంత్రీ ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. గత దశాబ్ది కాలంలో ప్రజా స్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పించిన ప్రతి ప్రయత్నమూ ఎదురుదెబ్బ తిన్నది. ఇవన్నీ దాటు కుని ఇమ్రాన శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూను కుంటాడు. అంతే తప్ప సైన్యాన్ని ధిక్కరించి కాదు. చివరగా, ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకం మొదలైనట్లయితే అది అందరిలో ఆశలు రేపవచ్చు కానీ కపటత్వంతో కూడి ఉంటుంది. అప్పటికి కూడా అది ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన చక్కటి గాథగా మారవచ్చు. ఈ విషయాలను ఇప్పుడు చెప్పడానికి నాకు నాలుగు కారణాలున్నాయి. వాజపేయి నిష్క్ర మణం, నవాజ్ షరీప్ జైలు శిక్ష, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం, అన్నిటి కంటే ముఖ్యంగా ఆనాటి ఘటన జరిగి ప్రస్తుతం 20 సంవత్సరాలు గడిచిపోయాయి. శేఖర్ గుప్తా(వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్) twitter@shekargupta -
వాజ్పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..
-
‘వాజ్పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!
సాక్షి, ముంబై, ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కార్పొరేటర్పై బీజేపీ కార్పొరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్పేయి మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాజ్పేయి మృతికి సంతాపం వ్యక్తం చేయాలని బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అతడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఒక్కసారిగి అతనిపై దాడికి దిగి సయ్యద్ను చితకబాదారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి సయ్యద్ తప్పించుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మటీన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... మాజీ ప్రధాని మృతికి సంతాపం వ్యక్తం చేయవల్సిందిగా తీర్మానం ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించారని, గతంలో కూడా సభలో జాతీయ గీతం పాడటానికి అతను వ్యతిరేకించారని తెలిపారు. తమ సభ్యుడిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడున్న బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేసి, కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. మటీన్పై దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
వాజ్పేయి కవితలు
-
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా!