బోరిస్‌ కావాలనే తప్పుదోవ పట్టించారు | Former UK PM Boris Johnson deliberately misled parliament | Sakshi
Sakshi News home page

బోరిస్‌ కావాలనే తప్పుదోవ పట్టించారు

Jun 16 2023 6:04 AM | Updated on Jun 16 2023 6:04 AM

Former UK PM Boris Johnson deliberately misled parliament - Sakshi

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్‌ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్‌ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్‌ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్‌ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం.

ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్‌ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్‌ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్‌ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు  ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement