వర్మకు పిచ్చి ముదిరిందా?
ముంబై: సినిమాలతోనే కాదు ట్వీట్లతో కూడా వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరోసారి దారుణమైన ట్వీట్లతో చెలరేగిపోయాడు. దేశ మాజీ ప్రధానమంత్రులు ముగ్గురిపై విచక్షణారహితంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీరి ముగ్గురు ఉన్న ఒక ఫోటో ఆధారంగా విచిత్రకరమైన వాదనకు దిగాడు. పార్లమెంటులో ముగ్గురు మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు, చంద్ర శేఖర్.. ఈ ముగ్గురికీ ముందు సోనియా గాంధీ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దానిపై హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. పార్లమెంటులో ముందువరుసలో కూర్చున్న సోనియాపై వెనక కూర్చున్న ప్రధానమంత్రులు ముగ్గురు కుళ్లు జోకులు వేసుకుంటున్నారంటూ లేనిపోని భాష్యాలు చెప్పుకొచ్చి వివాదాన్ని సృష్టించాడు. అంతేకాదు.. దీనిపై పోలీసు విచారణ జరగాలంటూ నోటికొచ్చినట్టు చెలరేగిపోయాడు.
పురుషులు ఎక్కడున్నా పురుషులేనని, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నవాళ్లు ఎపుడూ బ్యాడ్ అని ట్వీట్ చేశాడు. పాఠశాల అయినా.. పార్లమెంట్ అయినా.. పురుషులు పురుషులే అంటూ కామెంటు చేశాడు.
Whoever these 3 men r am shocked they are cracking dirty jokes about such a classy dignified woman whoever she is pic.twitter.com/sbRJ07vpt7
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016
Back benchers r always bad whether in school or parliament .Dont know who these 3 r but they look badder than each pic.twitter.com/iJ9GgqKFlM
— Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016