former cm
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలకు హైకోర్టు సమన్లు
-
కేసీఆర్కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.కోడా పిటిషన్ను శుక్రవారం(అక్టోబర్ 25) విచారించిన జస్టిస్ సంజీవ్కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది. అన్సారీ సిట్టింగ్ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.ఇదీ చదవండి: వయనాడ్లో ఖర్గేకు అవమానం నిజమేనా.. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
హరియాణా బీజేపీ సర్కారుకు కౌంట్డౌన్
న్యూఢిల్లీ/చండీగఢ్/కురుక్షేత్ర: హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని మాజీ సీఎం భూపీందర్ హుడా వ్యాఖ్యానించారు. అవినీతి, చేతగాని ప్రభుత్వం గద్దెదిగడం ఖాయ మని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలు, తప్పుడు హామీలతో పదేళ్లుగా ప్రజలను దోచుకుందని, అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించనుందని ఆయన ఆరోపించారు. నామినేషన్ వేసిన ప్రముఖులు: కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య సూర్జే వాలా, మాజీ సీఎం బన్సీలాల్ మునిమనవరాలు, బీజేపీకి చెందిన శ్రుతి చౌదరి, కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రీ జిందాల్ గురువారం నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. -
కరుణానిధి స్మారక రూ.100 నాణెం విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారక రూ.100 నాణేన్ని ఆదివారం చెన్నైలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణేన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డీఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖచిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. ఆదివారం చెన్నై కలైవానర్ అరంగంలో జరిగిన వేడుకలో ఈ నాణేన్ని విడుదల చేశారు. కరుణ జీవిత ప్రస్థానంతో రూపొందించిన 7డీ టెక్నాలజీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
లైంగికవేధింపుల కేసు: యడ్యూరప్పకు నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరారు. అయితే తాను ఢిల్లీలో ఉండటం వల్ల విచారణకు రాలేకపోతున్నానని వచ్చిన వెంటనే హాజరవుతానని యడ్యూరప్ప పోలీసులకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కూతురుతో కలిసి యడ్యూరప్పకు ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతరుపై అత్యాచారం చేశారని 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ వ్యవహారంలో పోలీసులు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికేవ ఈ కేసులో యడ్యూరప్ప పోలీసుల ఎదుట విచారణకు మూడుసార్లు హాజరయ్యారు. -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
రాజకీయాల్లోకి హేమంత్ సోరెన్ భార్య
భూ కుంభకోణం కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు కోర్టు నుంచి ఇంకా ఉపశమనం లభించలేదు. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జేఎంఎం నేత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. ఇదిలావుండగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్ సోరెన్ను అరెస్టు చేసిన సమయంలో కల్పనను జార్ఖండ్కు కొత్త సీఎం చేయాలనే చర్చ జరిగింది అయితే, చివరి నముషంలో చంపై సోరెన్ను సీఎం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గిరిడిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ తాను ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆమె జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హేమంత్ సోరెన్ను కూడా కలిశారు. కల్పనా సోరెన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయాన్ని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘జార్ఖండ్ ప్రజల కోరిక మేరకు నేను ప్రజా జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. హేమంత్ మన మధ్యకు వచ్చే వరకు, నేను అతని వాయిస్ వినిపిస్తాను. అతని ఆలోచనలను అందరితో పంచుకుంటాను. నేను ప్రజాసేవ సేవ చేస్తూనే ఉంటాను. మీరు హేమంత్కు ఎంతటి ఆప్యాయత, దీవెనలు అందించారో అతని జీవిత భాగస్వామినైన నాకు కూడా అందిస్తారని నేను నమ్ముతున్నాను’ అని రాశారు. आज अपने जन्मदिन और कल गिरिडीह में झामुमो के स्थापना दिवस कार्यक्रम में शामिल होने से पहले आज झारखण्ड राज्य के निर्माता और झामुमो के माननीय अध्यक्ष आदरणीय बाबा दिशोम गुरुजी और मां से आशीर्वाद लिया। आज ही सुबह हेमन्त जी से भी मुलाकात की। मेरे पिता भारतीय सेना में थे। वह सेना से… pic.twitter.com/IBZmBVnXr9 — Hemant Soren (@HemantSorenJMM) March 3, 2024 -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న
న్యూఢిల్లీ: దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన 24 జనవరి, 1924 బిహార్లోని సమస్తీపూర్లో జన్మించారు. బడుగు, బలహీలన వర్గాల కోసం ఠాకూర్ చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జననేత ‘జననాయక్’గా కర్పూరి ఠాకూర్ ప్రసిద్ధి. ఆయన రెండు సార్లు బిహార్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటి సారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు బిహార్ సీఎంగా పనిచేశారు. రెండో సారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ సీఎంగా సేవలు అందించారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు చదవండి: Subhash Chandra Bose Jayanti Special: సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? -
యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
-
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పరిస్థితి విషమం
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ హాస్పిటట్లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. చదవండి: పార్లమెంట్లో ఆరని మణిపూర్ మంటలు.. -
ఆయన గొప్ప నాయకుడు: ప్రధాని మోదీ సంతాపం
చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్సింగ్ బాదల్ (95) ఇక లేరు. చాలారోజులుగా మొహాలీలోని ఓ ఫోరి్టస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన ఏడాది జనవరిలో కరోనా బారినపడి కోలుకున్నారు. గ్యాస్రై్టటిస్, బ్రాంకియల్ ఆస్తా్మతో బాధపడుతూ గత ఏడాది జూన్లో మళ్లీ చికిత్స పొందారు. బాదల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన గొప్ప నాయకుడు, ఉన్నత రాజనీతిజ్ఞుడు అని కీర్తించారు. పంజాబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. ఎన్నో సంక్షోభాల నుంచి పంజాబ్ను గట్టెక్కించారంటూ మోదీ ట్వీట్ చేశారు. బాదల్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు బాదల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐదుసార్లు పంజాబ్ సీఎం 👉 బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. 👉 లాహోర్లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 👉 గ్రామ సర్పంచ్గా, బ్లాక్ సమితి చైర్మన్గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యే అయ్యారు. 👉 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్పై మళ్లీ గెలిచారు. 👉 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు. 👉 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. 👉 గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా.. ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి. 👉ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. 👉 ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. (Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ రెండో ఛార్జ్షీట్.. మనీష్ సిసోడియా పేరు..) -
కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ రాజీనామా
-
పార్టీ అధ్యక్ష బరిలో అందుకే నిలవటం లేదు: కమల్నాథ్
భోపాల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఎంత మంది ఉండనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ భేటీ కావటం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కమల్నాథ్ సైతం పోటీలో నిలువనున్నారని వినబడింది. అయితే.. తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కమల్నాథ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్ పరిణామాలతో కాంగ్రెస్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్లో విలేకర్లతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీతో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరాను. అప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుందని చెప్పాను. పార్టీలో పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయని కూడా ఆయనకు వివరించాను. అయితే, అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ సుముఖంగా లేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలనుకోవడంలేదు గనకే ఎన్నికలు జరుగుతున్నాయి. ‘ అని తెలిపారు కమల్నాథ్. మరి జేపీ నడ్డా ఎలాంటి ఎన్నిక జరగకుండానే భాజపా అధ్యక్షుడయ్యారు కదా అని విమర్శలు చేశారు. ఎన్నికల విషయం పక్కనబెడితే.. నడ్డాను అధ్యక్షుడిని చేసే ముందు భాజపా 10మంది నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని కమల్నాథ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు మీరెందుకు పోటీ చేయట్లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి సోనియాతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు కమల్నాథ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 నెలల సమయం ఉందని.. ఈ సమయంలో తాను మధ్యప్రదేశ్ను వదిలిపెట్టబోనన్నారు. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపడితే తన దృష్టంతా మధ్యప్రదేశ్ వైపు ఉండదని.. ఆ పరిస్థితి తనకు ఇష్టంలేదని స్పష్టంచేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు తాను సిద్ధంగా లేనట్టు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్ నుంచి తన దృష్టిని వేరే వైపు పెట్టదలచుకోలేదన్నారు. ఆయన్నే అడగండి.. ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరైనా తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుందని కమల్నాథ్ సూచించారు. అలాగే, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేస్తారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. శశిథరూర్ నామినేషన్ గురించి ప్రస్తావించగా.. ఆయనతో చర్చించానని.. ఎన్నికలు ఉన్నందునే ఆయన నామినేషన్ వేయాలనుకొంటున్నారన్నారు. దిగ్విజయ్ సింగ్ పోటీచేసే అవకాశం ఉందా? అని అడగ్గా.. ఆయనకు ఇష్టం ఉందో లేదో దిగ్విజయ్నే అడగాలని సమాధానమిచ్చారు. రాజస్థాన్లో ఏర్పడిన పరిస్థితులకు గెహ్లాట్కు క్లీన్ చిట్ ఇస్తారా అని అడగగా.. ఆ రాష్ట్ర విషయాల్లో తాను కలుగజేసుకోబోనని, మధ్యప్రదేశ్పైనే తన దృష్టంతా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్సింగ్?
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం లండన్లో ఉన్న అమరీందర్ రెండు వారాల్లో తిరిగి వచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయంటున్నారు. అమరీందర్ కార్యాలయం కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. వచ్చే వారంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ను ప్రకటించాక.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే బాధ్యతను ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తీసుకుంటారని సమాచారం. పటియాలా ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ ఆగస్ట్ 6వ తేదీన, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 5న నోటిఫికేషన్ రానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. -
హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలుశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(86)కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారులు ఆయన్ను శుక్రవారం తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రెండో నంబర్ జైలులో మరో ఇద్దరితో కలిపి ఆయనకు గదిని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ గత వారమే చౌతాలాను దోషిగా నిర్ధారించారు. చౌతాలా ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని ఆదేశించారు. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది. హరియాణా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది. -
లాలూ ప్రసాద్ యాదవ్పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్గంజ్లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
నింగికేగిన నిగర్వి
సాక్షి, హైదరాబాద్/అమరావతి/తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రోశయ్య తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. రోశయ్యను శనివారం ఉ.8:20 గంటల సమయంలో అచేతన స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన మరణించారని స్టార్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ప్రకటించారు. రోశయ్య మరణవార్త తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. రోశయ్య పార్థివదేహాన్ని సందర్శించిన ప్రముఖులు రోశయ్య పార్థివదేహాన్ని శనివారం మధ్యాహ్నం అమీర్పేటలోని ధరమ్కరమ్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇక రోశయ్యను కడసారి చూసేందుకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. నేటి ఉదయం గాంధీభవన్కు.. రోశయ్య పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్కు తీసుకెళ్లనున్నారు. కొంతసేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచి.. తర్వాత హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘బడ్జెట్ల’ రోశయ్య దేశ చరిత్రలోనే అత్యధికంగా పదిహేనుసార్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్యదే. అంతేకాదు.. ఇందులో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. విషయ పరిజ్ఞానం గల వ్యక్తిగా రోశయ్య ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లడమంటే పక్కింటికి వెళ్లి పంచదార అరువు తెచ్చుకోవడమేనని చెప్పే ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లలేదు. వైఎస్ మరణానంతరం సీఎంగా.. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో.. కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. 2009 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబర్ 24 వరకు రోశయ్య ఈ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాత పలు పరిణామాల కారణంగా పదవిని వదిలిపెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా యూపీఏ ప్రభుత్వం గవర్నర్ గిరీ అప్పగించింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్గా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో కొన్నాళ్లు కర్ణాటక ఇన్చార్జి గవర్నర్గా పనిచేశారు. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్ హోదాలో సేవలు అందించారు. తర్వాత హైదరాబాద్లోని తన స్వగృహంలో విశ్రాంత జీవితాన్ని గడిపారు. ఆయనంటే అందరికీ గౌరవం ఎవరినైనా కలుపుకొనిపోయే స్వభావం, అపార అనుభవం, విషయాలపై స్పష్టమైన అవగాహన, చక్కని భాష, దీనికితోడు సమయస్ఫూర్తి వంటివన్నీ రోశయ్యను ఉన్నత శ్రేణిలో నిలబెట్టాయి. ఆయనకు 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరిలో లలిత కళాపరిషత్ ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని బహూకరించింది. కుటుంబానికీ ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం బాగోగులను చూసుకోవడంలోనూ, కుటుంబ సభ్యులకు ఆప్యాయత పంచడంలోనూ రోశయ్య ముందుండేవారు. రోశయ్యకు 17 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆయనకు భార్య శివలక్ష్మి, కుమారులు శివసుబ్బారావు, త్రివిక్రమ్, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. వనభోజనాలంటే ఇష్టం 1992లో రోశయ్య ఆరు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో తులసి, రుద్రాక్ష, నేరేడు, వేపతోపాటు అనేక రకాల మొక్కలను రోశయ్య స్వయంగా నాటారని అక్కడి పనివారు తెలిపారు. రోశయ్యకు వనభోజనాలంటే ఇష్టమని, అక్కడికి ఎప్పుడొచ్చినా చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని సైట్ ఇన్చార్జి రమేశ్ వెల్లడించారు. వ్యవసాయ క్షేత్రంలో పందిరిని రోశయ్య ప్రత్యేకంగా కట్టించుకున్నారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని తెలిపారు. ఎన్జీ రంగా స్ఫూర్తితో.. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ చేశారు. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారిగా 1968లో ఉమ్మడి ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1974, 1980లోనూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ అండ్ బీ, రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1995–97 మధ్య ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009లో రోశయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. వైఎస్సార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆర్థికశాఖను అప్పగించారు. 3 రోజులు సంతాప దినాలు మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ సర్కారు కూడా మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఆయన కృషి గుర్తుండిపోతుంది రోశయ్య మరణం బాధాకరం. మేం ఇద్దరం సీఎంలుగా పనిచేసినప్పుడు, తర్వాత రోశయ్య గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనతో నేను చేసిన సంప్రదింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాసేవ కోసం రోశయ్య చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా..’’ – ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తీరని వేదన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాదక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని రోశయ్య కోరుకునేవారు. – సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అంకిత భావం ఉన్న నేత రోశయ్య నాకు చిరకాల మిత్రుడు. రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాల్లో అంకితభావం, నిబద్ధతతో పనిచేశారు. ఆయన ఇకలేరనే వార్త బాధాకరం. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనది రాజీలేని పోరాటం రోశయ్య ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ధికం అంటే అర్ధంకాని పరిస్ధితుల్లో ఆర్థిక వ్యవస్థకు నూతన మార్గనిర్దేశం చేశారు. ఆయనను తెలుగు జాతి మరువబోదు. – టీడీపీ అధినేత చంద్రబాబు పదవులకే వన్నె తెచ్చారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రోశయ్య పదవులకే వన్నె తెచ్చారు. సౌమ్యుడిగా, సహనశీలిగా నిలిచారు. రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలితో హూందాగా వ్యవహరించారు. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.. – తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు నాన్న నిరాడంబరుడు దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘నాన్న నిరాడంబరుడు. రాజకీయాల్లో ఎన్ని కీలక పదవులు అధిరోహించినా ఆ హోదాను ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు. సింపుల్ లైఫ్ స్టైల్నే ఇష్టపడేవారు. అమ్మా, నాన్నలకు నేను ఏకైక కుమార్తెను కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నేను నాన్న కూతురినే. నన్ను విలువలతో పెంచారు. నా వంట అంటే నాన్నకు చాలా ఇష్టం. ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుమార్తె రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య మృతితో విశాఖ బాలాజీ నగర్లో నివాసముంటున్న అతని ఏకైక కుమార్తె రమాదేవి నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటే ఎనలేని అభిమానమని చెప్పారు. ఆయన తన జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వర్తించినా ఏరోజూ రాజకీయాలను ఇంట్లో ప్రస్తావించే వారు కాదని చెప్పారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. రాజకీయ జీవితంలో కొన్నిసార్లు మంచిచేసినా నిందలు భరించాల్సి వస్తుందని, తన తండ్రికి చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తన తండ్రి లేని లోటు తీరనిదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రిని కడసారి చూసేందుకు రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ విశాఖ నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. అంత్యక్రియలకు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని పంపిస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ఆదేశించగా సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం జరిగే ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు. అజాత శత్రువు రోశయ్య రోశయ్య గారితో నాకు 40 ఏళ్లకు పైగా అనుబంధముంది. ఆయన, నేను పలుమార్లు కేబినెట్లో బాధ్యతలు నిర్వర్తించాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాను. ఆయనకు ట్రబుల్షూటర్ అనే పేరు. చక్కని చమత్కారాలతో, వాక్చాతుర్యంతో అందరితో కలివిడిగా ఉంటూ అజాత శత్రువుగా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. – ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నేత, మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు మంచి స్నేహితుడ్ని కోల్పోయా ఆరు శాఖలను నేను రోశయ్య గారు ఒకేసారి నిర్వహించాం. అసెంబ్లీలో కూడా ఆయన చాలా సమర్థంగా సమయస్ఫూర్తితో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురుకాకుండా చూసేవారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేవారు. రాజ్యసభ పదవి తప్ప ఇంచుమించు అన్ని పదవులు ఆయన సమర్ధంగా నిర్వహించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనేక సేవలందించారు. మంచి స్నేహితుడిని కోల్పోయాను. – డీకే సమరసింహారెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి 56 ఏళ్ల స్నేహం మాది రోశయ్యగారు, నేను ఇంచుమించు ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి కేబినెట్లలో ఇద్దరం పనిచేశాం. 56 ఏళ్ల స్నేహం మాది. కాంగ్రెస్లో దాదాపు అందరు సీఎంల కేబినెట్లో ఉండడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నాపట్ల చాలా అభిమానంతో ఉండేవారు. ఆయన మరణం వ్యక్తిగతంగా మాకు తీరని లోటే. – గాదె వెంకటరెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి చీరాల నుంచే రాజకీయ అరంగేట్రం చీరాల: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన అకాల మరణంతో చీరాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. రోశయ్య సొంత ఊరు గుంటూరు జిల్లా వేమూరు అయినా.. ఆయన రాజకీయ స్వస్థలం చీరాల అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 1967లో అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు పోటీచేసి రెండుసార్లు గెలుపొంది అనేక మంత్రి పదవుల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ప్రగడ కోట య్య స్వతంత్ర అభ్యర్థి రోశయ్యపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా రోశయ్య టీడీపీ అభ్యర్థి చిమటా సాంబుపై గెలుపొందారు. ఆ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై పోటీచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొణిజేటి రోశయ్య.. టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై విజయం సాధించి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక మాజీ సీఎం రోశయ్య మృతికి గవర్నర్ హరిచందన్ సంతాపం సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని కొనియాడారు. ఉదయం అస్వస్థతకు గురైన రోశయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రోశయ్య మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, గవర్నర్గా అనేక ఉన్నత పదవులను రోశయ్య సమర్థంగా నిర్వహించారు. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి. – తమ్మినేని సీతారాం, స్పీకర్ ► రోశయ్య మృతితో రాష్ట్రం సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడ్ని కోల్పోయింది. ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక నిపుణుడిగా రాష్ట్రానికి విశిష్ట సేవలందించారు. ఒక మంచి మనిషి మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. – మంత్రి బొత్స సత్యనారాయణ ► వైఎస్సార్తో కలిసి ఆయన పనిచేసిన రోజులు మర్చిపోలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ► రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరనిలోటు. రాజకీయంగా ఎంతోమందికి ఆయన ఆదర్శనీయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఎంతో ప్రీతిపాత్రుడు. – మంత్రి మేకతోటి సుచరిత ► ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం. – మంత్రి ఆళ్ల నాని ► రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. – మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ► రోశయ్య మరణం నన్ను ఎంతో కలచివేసింది. ఆయనకు శ్రీ శారదా పీఠంతో ఎంతో అనుబంధం ఉంది. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించేవారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ► పెద్దలు, మచ్చలేని సీనియర్ నాయకులు రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం. – మంత్రి అనిల్కుమార్ యాదవ్ ► సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. సీఎంలు ఆయన నిర్ణయాలకు విలువ ఇచ్చేవారు. – మంత్రి సీదిరి అప్పలరాజు ► రాజకీయాల్లో అజాత శత్రువు రోశయ్య మృతి జీర్ణించుకోలేనిది. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలి. – ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ► రోశయ్య మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. – మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ► ఏ సీఎం దగ్గరైనా రోశయ్య తనకంటూ ఒక గుర్తింపును పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర కీలకం. రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టం – సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ► ఆపత్కాలంలో రోశయ్య 14 నెలలపాటు సీఎంగా సేవలు అందించారు. ఆయన నిష్కళంక రాజకీయ యోధుడు. ఆయన విజ్ఞతను ఎవరూ మరచిపోలేరు. – పవన్కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు ► ఉమ్మడి రాష్ట్రానికి నాలుగుసార్లు ఆర్థిక మంత్రిగా.. సీఎంగా, తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. వారి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది. – మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ గ్రాంటును పునరుద్ధరించి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి రోశయ్య ఎంతో సహకరించారు. – జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు -
మేఘాలయలో కాంగ్రెస్కు ఝలక్!
న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా తలబొప్పి కట్టింది. అసెంబ్లీలో పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతోతో సహా ఏకంగా 12 మంది బుధవారం తృణమూల్ కాంగ్రెస్లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మేఘాలయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విన్సెంట్ హెచ్. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్ సంగ్మాకు ఆయనతో పొసగడం లేదు. తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్ నియామకం జరిగిందనేది ఆయన కినుక. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది. -
రుణ ఎగవేత కేసు, మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
గువహటి: రుణ ఎగవేత కేసులో అసోం మాజీ సీఎం హితేశ్వర్ సైకియా కుమారుడు, కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియాకు ఎదురు దెబ్బ తగిలింది. పాతికేళ్ల నాటి 9 లక్షల రూపాయల లోన్ డిఫాల్ట్ కేసులో సైకియా సోదరడు అశోక్ సైకియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసేలో సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరు కానందున అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నామని గువహటి సీబీఐ అధికారులు తెలిపారు. దీనిపై హితేశ్వర్ అసోం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా స్పందించారు. అరెస్టు చేశారో లేదా అదుపులోకి తీసుకున్నారో అసలు అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు పరిష్కారమై పోయిన చాలా పాత కేసు అని, బ్యాంక్ కోర్టుకు సమాచారం అందించకపోవడం బ్యాంకుది తప్పు దేబబ్రత అన్నారు. మరోవైపు 1996లో అస్సాం స్టేట్ కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు ద్వారా సంబంధిత రుణాన్ని తీసుకున్నానని వ్యాపారవేత్త అశోక్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 2011లో రుణాన్ని తిరిగి చెల్లించానని, ప్రస్తుతం టువంటి బకాయిలు పెండింగ్లో లేవని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2015 అక్టోబర్ 28న బ్యాంకు జనరల్ మేనేజర్ అధికారిక లేఖను కూడా ఆయన ప్రస్తావించారు. కానీ రుణ ఎగవేత అంటూ నిరాధార అరోపణలు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికి, సీబీఐకే తెలియాలంటూ ఎద్దేవాచేశారు. బీజేపీలోకి చేరునున్నట్టు బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులను సీబీఐ ద్వారా భయపెట్టే వ్యూహాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని విమర్శించారు. కాగా కోల్కతా బ్రాంచ్లో అశోక్ సైకియాపై నమోదైన రెండు ఫిర్యాదుల మేరకు పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఆ తరువాత 2001లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. దీంతో పాటు 2013లో మరో కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు. -
తలైవికి కంగనా నివాళి
-
ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్నాథ్ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు కాంగ్రస్ నేతలు కమల్ నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్ నాథ్పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని కమల్నాథ్ బీజేపీ సర్కార్పై మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్కు హనీ ట్రాప్ కేసులో సిట్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. पूर्व मुख्यमंत्री श्री कमलनाथ जी के अस्वस्थ होने की सूचना मिली है। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। @OfficeOfKNath — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 9, 2021 -
ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి
కోల్కతా: గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టచార్జీ(77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆక్సిజన్ స్థాయిల్ 90శాతం కంటే దిగువకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ ఇప్పటి వరకూ హోం ఐసోలేషన్లో బీపీఏపీ సపోర్టు మీద ఉన్నారన్నారు. బుద్ధదేవ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి కారణంగా ఆయన తరచుగా ఆస్పత్రిని సందర్శించాల్సి ఉంటుంది. ఈ నెల 18న ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే ఆమె కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. (చదవండి: బిడ్డకు ప్రాణం.. తల్లి మరణం..!) -
ట్రోలింగ్: ‘కరోనాకు కూడా మనలాగే జీవించే హక్కుంది’
డెహ్రాడూన్: భారత్లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా ఓ జీవిలాంటిదని, కరోనా కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తున్నదని త్రివేంద్రసింగ్ వెల్లడించారు. ఒక తాత్విక కోణం నుంచి చూస్తే కరోనా వైరస్ కూడా ఒక జీవి. అందరిలాగా దానికి జీవించే హక్కు ఉంది. కానీ మనం (మనుషులు) దాని కంటే తెలివైనవాళ్లమనుకుంటాం. మనం దానిని నాశనం చేస్తున్నాం. అందుకే కరోనా వైరస్ నిరంతరం మారిపోతోంది’ అని త్రివేంద్ర సింగ్ రావత్ వింత వ్యాఖ్యలు చేశారు అయితే మానవులు సురక్షితంగా ఉండాలంటే వారు వైరస్ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా త్రివేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ప్రకటనపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్తో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఇలాంటి మాటలేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతేగాక ఈ వైరస్ సెంట్రల్ విస్టాలో ఆశ్రయం ఇవ్వాలని ఒక వినియోగదారు చురకలంటించాడు. కరోనాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉండాలని నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ విమర్శించారు. మరోవైపు గత 24 గంటల్లో భారతదేశంలో 3,43,144 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడుట లేదు 'ఆ సమయంలో నా బిడ్డ ఎంత బాధ అనువించిందో' -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్ఫాదర్ ?
సాక్షి, కర్ణాటక: నిత్యం సంచలనాలు నమోదవుతున్న శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని అనుశ్రీ శుక్రవారం ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో కుమారస్వామి గళమెత్తారు. డ్రగ్స్ కేసులో అనుశ్రీకి ఒక మాజీ ముఖ్యమంత్రి సహాయహస్తం అందించినట్లు ప్రచారం జరుగుతోంది, ఆ మాజీ సీఎం ఎవరో బయట పెట్టాలని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శనివారం బెంగళూరులో డిమాండ్ చేశారు. అనుశ్రీకీ మాజీ సీఎం ఒకరు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆరుమంది మాజీ సీఎంలున్నారు. ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. డ్రగ్స్ కేసులో విస్తృతంగా దర్యాప్తు చేయాలన్నారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ఆ వీడియో నాటకం: సంబరగి అనుశ్రీ వీడియోపై సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి మండిపడ్డారు. అరెస్ట్ భయంతోనే ఆమె నాటకమాడుతున్నారని అన్నారు. ఆమె అరెస్ట్ కాకుండా ఒక గాడ్ ఫాదర్ రక్షించినట్లు ఆయన ఆరోపించారు. ఆమె చేసిన తప్పులకు శిక్షను అనుభవించక తప్పదన్నారు. సీసీబీ విచారణకు హాజరైనంత మాత్రాన తాను తప్పు చేసినట్లు కాదని అనుశ్రీ వ్యాఖ్యానించడంపై ఆక్షేపించారు. (నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన) డ్రగ్స్ కేసు చాలా పెద్దది: మంగళూరు సీపీ డ్రగ్స్ కేసు చాలా పెద్దదని మంగళూరు నగర పోలీసు కమిషనర్ (సీపీ) వికాస్కుమార్ చెప్పారు. ఆయన శనివారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నగర సీసీబీ సీఐ శివప్రకాశ్ నాయక్ బదిలీ వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఇప్పటివరకు సీసీబీపై రాజకీయ ఒత్తిడి లేదన్నారు. శాండల్వుడ్ డ్రగ్స్ కేసు చైన్ లింక్లా ఉంది, చివర ఎక్కడ అనేది కనిపించటం లేదని అన్నారు. మంగళూరులో ఇప్పటివరకు ఆరుమందిని అరెస్ట్ చేశామన్నారు. కాగా నటీమణి రాగిణి, సంజనలతో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన వీరేన్ఖన్నాపై బెంగళూరులో గతంలోనే 4 కేసులు నమోదైనట్లు తేలింది. కాగా, సంజయ్నగరలోని ఒక అపార్ట్మెంట్పై దాడిచేసి ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. (ఆయనతో డ్యాన్స్ చేశా అంతే..) -
కరోనా బారిన పడిన మాజీ ముఖ్యమంత్రి
అహ్మదాబాద్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఆయనకు రాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు గాంధీనగర్ సివిల్ హాస్పిటల్ పూపరింటెండెంట్ డాక్టర్ తెలిపారు. (గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు) 92 ఏళ్ల పటేల్కు ఇంతకు ముందు బైపాస్ సర్జరీ జరిగిందని, అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని ఆయన తనయుడు భరత్ తెలిపారు. ఇది తమకు ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. (కరోనా ఎఫెక్ట్: 60 లక్షల ఉద్యోగులకు ఉద్వాసన) -
కోమాలోకి అజిత్ జోగి
రాయ్పూర్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (79) ఆదివారం కోమాలోకి వెళ్లారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్పై ఉన్నారని వైద్యులు తెలిపారు. గుండె పనితీరు బాగానే ఉందని, బీపీ కూడా అదుపులోకి వచ్చిందని చెప్పారు. అయితే శ్వాసకోస వ్యవస్థ పనిచేయకపోవడంతో మెదడు స్పందించడం లేదని, వైద్య పరిభాషలో దీన్ని హైపాక్సియా అంటారని తెలిపారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. రానున్న 48 గంటలు కీలకమని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. -
రిక్షాలో అసెంబ్లీకి వెళ్లిన నేత
సాక్షి, కర్నూలు: భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానం. నీతి, నిజాయితీకి నిలువుటద్దం. పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించిన దామోదరం చిన్న తనంలోనే తండ్రి చనియారు. దీంతో అన్న చిన్నయ్య కష్టం మీదే 5వ తరగతి వరకు పెద్దపాడులో చదువుకున్నారు. అనంతరం కాలినడకనే నిత్యం కర్నూలుకు వచ్చి మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివి, ఎస్ఎస్ఎల్సీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆర్ట్స్ (సీడెడ్) కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. దామోదరం సంజీవయ్య ఉపయోగించిన మంచం, ట్రంక్ పెట్టె ఉన్నత విద్యను అభ్యసించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేని కారణంగా కర్నూలులోని పౌర సరఫరాల శాఖలో సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన ‘లా’ చదువును మద్రాసు నగరంలో పూర్తి చేశారు. అనంతరం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలకమైన పదవులను చేపట్టినా.. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా, నీతి, నిజాయితీలకు నిలువుట్టదంగా నిలిచారు. 1960 జనవరి 10వ తేదీన 39 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన రిక్షాలో అసెంబ్లీకి వెళ్లి నిజాయితీ చాటుకున్నారు. ఆయన మృతి చెందే వరకు ఆయనకున్న ఆస్తి.. దుస్తులు, భోజనం చేసేందుకు ఒక పళ్లెం, గ్లాసు తప్ప మరొకటి లేవు. 1972 మే 7వ తేదీన ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు జానపద గేయాలు, నాటకాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ‘బోనస్’ సంజీవయ్యగా : 1964 జనవరి 22న పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహద్దూర్ శాస్త్రి మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1965 మే 29వ తేదీన పార్లమెంట్లో బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు సంరక్షించి ‘బోనస్ సంజీవయ్య’గా మన్ననలు అందుకున్నారు. అలాగే జెనీవా అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి ఈఎస్ఐ చట్టంలో ‘కుటుంబం’ అనే పదాన్ని చేర్చడమే కాకుండా, మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించిన గొప్ప వ్యక్తి. జ్ఞాపకార్థం ఇలా.. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి దేశానికి ఎన్నో సేవలను అందించిన దామోదరం సంజీవయ్య జ్ఞాపకార్థం జిల్లాలో ఎన్నో చేపట్టారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు సంజీవయ్య సాగర్గా నామకరణం చేశారు. పెద్దపాడు గ్రామంలో ఆయన పేరుతో బాలికల వసతి గృహాన్ని, పెద్దపాడులో ఆయన స్వగృమాన్ని తీర్చిదిద్ది, కమ్యూనిటీ హాల్తో పాటు పార్కును ఏర్పాటు చేశారు. ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోయేలా లైబ్రెరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దపాడు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ ఆయన ఉపయోగించిన, ఆస్తిగా మిగిలిన మంచం, దుస్తులు, ట్రంకు పెట్టె భద్రంగా ఉన్నాయి. సీఎంగా సేవలు 1960లో దళితులకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పట్టాలను అందించారు. జీఓ 559తో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు. దామోదరం హయాంలోనే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్, మైనింగ్ కార్పొరేషన్, మౌలిక సదుపాయల సంస్థ, బీహెచ్ఈఎల్ ప్రారంభమయ్యాయి. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ప్రోత్సహించడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేశారు. 961లోనే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు. మధ్య నిషేధాన్ని విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు. గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ‘లా’ కమిషన్ ఏర్పాటు తెలంగాణలో భూమిని రీ సర్వే చేయించారు. జయంతి వేడుకలకు ఏర్పాట్లు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆ రోజు నగరంలోని నంద్యాల చెక్పోస్టు సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఇన్చార్జ్ సోషల్ వెల్ఫేర్ డీడీ శిరీషను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించడంతో పాటు మెమొంటోలను అందజేయనున్నారు. -
మాజీ సీఎం కుమారుడి అరెస్ట్
రాయ్పూర్ : చత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని అరెస్ట్ చేశారు. తాను ఎస్టీనని పేర్కొంటూ తప్పుడు అధికారిక పత్రాలను ప్రకటించినందుకు ఆయన అరెస్ట్ అయ్యారు.2013లో చత్తీస్గఢ్లోని మార్వాహి అసెంబ్లీ స్ధానం నుంచి తనపై పోటీచేసిన బీజేపీ నేత సమీర పైక్రా ఫిర్యాదుపై అమిత్ జోగి అరెస్ట్ అయ్యారు. మార్వాహి రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తప్పుడు పత్రాలతో ఎస్టీగా పేర్కొంటూ అమిత్ జోగి పోటీ చేశారని ఆయన ప్రత్యర్ధి ఫిర్యాదు చేశారు. కాగా, అమిత్ జోగిని బిలాస్పూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన ప్రదేశం గురించి కూడా ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలున్నాయి. -
సీఎం మారినా.. అదే పాత ఫొటో
గండేపల్లి(తూర్పు గోదావరి): సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో అనూహ్యరీతిలో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ప్రజలకు మంచిపాలనతోపాటు నవరత్నాల పథకం అమలుచేసేందుకు శ్రమిస్తున్న వైనం అందరికీ ఎరుకే. నూతన ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాజీల ఫొటోలను, వారిపేర్లను కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలందిస్తున్న 104 వాహనంపై నేటికీ మాజీ సీఎం చంద్రబాబు ఫొటో, చంద్రన్న సంచార చికిత్స అని పేర్లు ఉండడం ఆరోగ్యశాఖ అధికారుల నిద్రమత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నామకరణం చేసినా వాహనంపై మాజీల ఫొటోలు ఉండటంపై ఆపార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోటోను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అవి ఆచరణకు నోచుకోవడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి వైద్య సేవలందిస్తున్న 104, 108 వాహనాలపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటోలను ఉపయోగించాలని అలాగే పేర్లు మార్పుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హూడా, కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకులలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్ వోరా చైర్మన్గా ఉన్న ఏజేఎల్కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏజేఎల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. -
మదన్లాల్ ఖురానా కన్నుమూత
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మదన్లాల్ ఖురానా (82) అనారోగ్య కారణాలతో శనివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని తమ ఇంట్లో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1993–96 మధ్య కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖురానా, 2004లో రాజస్తాన్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉందనీ, శనివారం ఉదయం నుంచీ ఆరోగ్యం మరింత విషమించిందని ఖురానా కొడుకు హరీశ్ చెప్పారు. అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఖురానాకు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మరో కుమారుడు నెల క్రితమే మరణించారు. -
కశ్మీర్ సమస్యకు ఐర్లాండ్ తరహా పరిష్కారం
లండన్: కశ్మీర్ సమస్య పరిష్కారానికి బ్రిటన్–ఐర్లాండ్లు అనుసరిస్తున్న కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమలుచేయాలని కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సూచించారు. కశ్మీర్ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని భారత్, పాకిస్తాన్లు అర్థం చేసుకోవాలన్నారు. సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ లండన్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఫరూక్ మాట్లాడారు. ‘సమస్య పరిష్కారానికి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిఒక్కరూ ఆమోదించబోరని అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్లు అర్థం చేసుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కావొచ్చు. కానీ భారత్, పాకిస్తాన్ కశ్మీర్లో కనీసం 80 శాతం మంది ఆ నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి’ అని చెప్పారు. యూకేలో భాగమైన ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ల మధ్య 1920ల్లో కామన్ ట్రావెల్ ఏరియా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ పౌరులు పాస్పోర్ట్ లేకుండా రెండో దేశంలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు. -
మాజీ సీఎం ఇంటిని సందర్శించిన రాహుల్ గాంధీ
కేజీఎఫ్: ఎన్నికల ప్రచారం కోసం జిల్లా పర్యటనకు వచ్చిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాలూకాలోని క్యాసంబళ్లి గ్రామంలో ఉన్న రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసి రెడ్డి నివాసాన్ని సందర్శించారు. ఇదే సమయంలో స్థానిక నాయకులు 1951లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా క్యాసంబళ్లి గ్రామంలోని కేసి రెడ్డి నివాసంలో ఓ రాత్రి గడిపిన విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లారు., జవహర్లాల్ నెహ్రూ విశ్రమించిన గదిని కేసి రెడ్డి కుటుంబీకులు రాహుల్గాంధీకి చూపించారు. కేసి రెడ్డి నివాసం చూసిన రాహుల్ గాంధీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసి రెడ్డి కుటుంబంతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
మాజీ సీఎం కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్లాల్ పట్వా(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. పట్వా మధ్యప్రదేశ్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి జనతాపార్టీ నుంచి 1980 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 17 వరకు నెల రోజులకన్నా తక్కువకాలం సీఎంగా పనిచేసిన ఆయన.. రెండోసారి భారతీయ జనతాపార్టీ నుంచి 1990 మార్చి 5 నుంచి 1992 డిసెంబర్ 15 వరకు సీఎంగా సేవలందించారు. పట్వా తన రాజకీయ ప్రస్థానాన్ని జనసంఘ్తో ప్రారంభించారు. అనంతరం 1977లో జనసంఘ్.. జనతా పార్టీలో విలీనమైంది. -
జయలలిత మృతికి పుష్పాంజలి
అనంతపురం అర్బన్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి జయలలితకు సంతాప కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జయలలిత చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జయలలితకు సంతాప సూచికంగా కలెక్టర్, ఎమ్మెల్యే, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత వినూత్న ఆలోచనలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
బీహార్ మాజీ సీఎం మనవడు అరెస్ట్
-
మాజీ సీఎం కాన్వాయ్ పై దాడి
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంజీ కాన్వాయ్ లోని కారుకు నిప్పంటించిన ఘటన గయ జిల్లాలోని దమారియాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్ జేపీ) నాయకుడు సుధీష్ పాశ్వాన్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని వస్తున్న ఆయన కాన్వాయ్ పై దాడిచేసిన కొందరు కారుకు నిప్పంటించారు. ఈ ఘటనలో మాంజీకి ఎటువంటి హానీ జరగలేదు. దాడి ఘటనపై స్పందించిన ఎల్ జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ ప్రభుత్వమే మాంజీపై దాడి చేయించిందని ఆరో్పించారు. మంగళ్ రాజ్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఎల్ జేపీ నాయకులపై దాడులు పెరిగాయని పాశ్వాన్ ఆరోపించారు. పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుదీష్, అతని సోదరున్ని మావోయిస్టులు హత్య చేసినట్లుగా భావిస్తున్నారు . -
మాజీ సీఎం కిరణ్ సోదరుడు టీడీపీలోకి!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ బలహీనంగా ఉండటంతో కిషోర్కుమార్రెడ్డిని చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కిషోర్కుమార్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆయనను పార్టీలో చేర్పించుకునే విషయాన్ని ఇటీవల జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో మదనపల్లె నుంచి శాసనసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కిషోర్కుమార్రెడ్డిని చేర్చుకుని ఆ స్థానం నుంచి మండలికి పోటీ చేయించాలని చంద్రాబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కిషోర్ తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం కిరణ్కుమార్రెడ్డితో పాటు ఆయన సోదరులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ ఆ పని చేయలేదు. కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ సందర్భంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం గట్టెక్కడానికి వీలుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభలో ఓటింగ్ రోజున ఓటింగ్లో పాల్గొనకుండా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ తటస్థంగా ఉండాలంటూ విప్ జారీ చేశారు. ఆ కారణంగా వైఎస్సార్సీపీ అవిశ్వాసం వీగిపోయి కిరణ్ సర్కారు నిలబడిన సంగతి తెలిసిందే. ఇలావుండగా, నల్లారి కిషోర్కుమార్రెడ్డితో ఫోన్లో మాట్లాడి టీడీపీలో చేరుతున్న విషయం ప్రస్తావించగా, ఆయన దాన్ని ఖండించలేదు. అయితే తాను వేరే పనిలో ఉన్నానని, తర్వాత మాట్లాడుతానని మాత్రమే చెప్పారు. -
'మాజీ సీఎం, మంత్రులకు ముడుపులిచ్చాం'
వాషింగ్టన్: సంచలనం రేపిన నీటి ప్రాజెక్టుల్లో ముడుపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికా కేంద్రంగా నడుస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ సంస్థ.. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎవరెవరికి ఎంతెత ముడుపులిచ్చిందో ఫెడరల్ కోర్టుకు వెల్లడించింది. ఆ సంస్థ ప్రతినిధులు రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు కోర్టుకు చెప్పిన వివరాలను బట్టి.. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు దాదాపు రూ.6 కోట్లు లంచంగా ఇచ్చి లూయీస్ కంపెనీ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నమని, ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన ఆధారాలను సేకరించేపనిలో ఉన్నామని గోవా పోలీసులు చెప్పారు. 2009లో గోవాలో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి, సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టుల్లో ఈ ముడుపుల వ్యవహారం చోటుచేసుకుంది. కాగా, మాజీ సీఎం కామత్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా.. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే లూయీస్ బెర్గర్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది. కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మొదట లంచం తీసుకున్న వివరాలను వెల్లడించడానికి కోర్టు నిరాకరించినప్పటికీ తర్వాత ఆ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి. బెర్గర్ సంస్థ ప్రతినిధులకు విధించే శిక్షలకు సంబంధించి నవంబర్లో తుది తీర్పు వెలువడనుంది. ఈ కంపెనీకి హైదరాబాద్ నగరంలోనూ ఓ కార్యాలయం ఉడటం గమనార్హం. -
'భారీ స్థాయిలో వైఎస్ జయంతి వేడుకలు'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని బుధవారం భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ పేరును ప్రజల గుండెల్లోంచి చెరిపేసే ప్రయత్నాన్ని తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారని విమర్శించారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల డిజైన్లను మార్చుతున్నారని మండిపడ్డారు. 'చంద్రబాబు పోలవరాన్ని పక్కనపెట్టి వైఎస్ పేరును ప్రజల గుండెల్లోంచి తప్పించేందుకు పట్టిసీమను నిర్మిస్తున్నారు. కేసీఆర్ కూడా తన ఇమేజ్ కోసం ఆరు జిల్లాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టును నాలుగు జిల్లాలకే పరిమితం చేస్తున్నారు. ప్రాణహిత - చేవెళ్లతో హైదరాబాద్కు తాగునీటి సమస్యను తీరనుంది. చనిపోయిన వైఎస్పై విమర్శలు చేయటం కేసీఆర్కు తగదు.. కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. బుధవారం భారీ స్థాయిలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం' అని పొంగులేటి అన్నారు. అదే విధంగా.. ప్రజల కోసం పరితపించిన వ్యక్తుల్లో వైఎస్ ప్రథమ స్థానంలో ఉంటారని అన్నారు. రైతులను రాజులను చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉండగా దేశంలోనే వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిందంటే ఆయనకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత వరకు నెరవేర్చారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. -
మాజీ సీఎం సోదరుడిపై చార్జ్ షీట్
కోర్టులో చార్జ్షీట్ 26న హాజరు కావాలని ఆదేశం సాక్షి, చెన్నై : మాజీ సీఎం, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజ మెడకు పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసు బిగుసుకుంటోంది. రాజాతో పాటుగా ఏడుగురి మీద కోర్టులో గురువారం చార్జ్ షీట్ దాఖలైంది. ఆ ఏడుగుర్ని ఈనెల 26న కోర్టులో హాజరు పరచాలని పెరియకుళం మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మారియప్ప ఆదేశాలు జారీ చేశారు. ఓ పన్నీరు సెల్వం సీఎంగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు, పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్ ఓ రాజ సాగించిన వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై బయలు దేరిన ఆరోపణలు, ఫిర్యాదుల్ని ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్రంగా పరిగణించి ఉన్నారు. కైలాశ నాథ ఆలయం పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసులో రాజ ప్రమేయం ఉన్నట్టుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే రీతిలో ఇటీవల కాలంగా రాజకు వ్యతిరేకంగా పరిస్థితులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పదవులు ఊడినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, సీబీసీఐడీ రంగంలోకి దిగడం, విచారణ వేగవంతం చేయడంతో పన్నీరు సోదరుడు రాజ ఇక జయలలిత ఆగ్రహానికి గురి కావడంతో పాటుగా చిక్కుల్లో పడ్డట్టేనని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. చార్జ్ షీట్ దాఖలు : పూజారి ఆత్మహత్య కేసు విచారణను వేగవంతం చేసిన సీబీసీఐడీ చార్జ్ షీట్ను సిద్ధం చేసింది. పూజారి నాగముత్తు రాసి పెట్టిన లేఖ ఆధారంగా సాగిన విచారణ మేరకు చార్జ్ షీట్లో ఓ రాజ పేరును చేర్చారు. అలాగే, రాజ సన్నిహితులు, అన్నాడీఎంకే నాయకు లు పాండి, శివకుమార్, జ్ఞానం, లోగు, శరవణన్, ముత్తు పేర్లను ఈ చార్జ్ షీట్లో పెట్టారు. ఈ చార్జ్షీట్లో ఆ ఏడుగురి ఒత్తిళ్లు తాళ లేక నాగముత్తు ఆత్మహత్య చేసున్నట్టు ఆధారాలతో సీబీసీఐడీ నిరూపించినట్టుగా సంకేతా లు వెలువడుతున్నాయి. ఈ చార్జ్ షీట్ ను పరిశీలించిన పెరియకుళం మెజి స్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మారియప్పన్ విచారణకు నిర్ణయించారు. ఈ నెల 26న చార్జ్షీట్లో పేర్కొన బడిన వారందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే రాజ ముందస్తు బెయిల్ పొంది ఉండడం గమనార్హం. -
స్వగ్రామానికి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి
కలికిరి (చిత్తూరు): మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలం నగిరిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. శనివారం రాత్రి పీలేరులో తన అనుచరుడు కుమారుడైన శరత్కుమార్రెడ్డి వివాహ వేడుకులో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారని సమాచారం. కాగా, మూడు నెలల తర్వాత గ్రామానికి చేరుకున్న ఆయన్ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
67వ పడిలోకి అడుగుపెట్టిన 'అమ్మ'
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (అమ్మ) మంగళవారం 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమ్మ పేరిట పూజలు నిర్వహిచంటంతో దేవలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. యుద్ధ కళల్లో నైపుణ్యం ఉన్న జయ విశ్వాసపాత్రుడు షిహాన్ హుస్సెయినీ తనకు తాను శిలువ వేయించుకుని ఆరు నిమిషాలపాటు ఉన్నాడు. అమ్మకు ఇక ముందంతా జయం కలగాలని జయజయద్వానాలు చేశారు. జయ రూ.66.66 కోట్ల ఆస్తులు అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలతో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అనంతరం ఆమె కర్ణాటక హైకోర్టులో ఆ తీర్పును సవాల్ చేసి బెయిల్పై విడుదలయ్యారు. -
నేదురుమల్లి ఇకలేరు