యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుపై నిర్ణయాలను ఆ శాఖ మంత్రి హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుపై నిర్ణయాలను ఆ శాఖ మంత్రి హోదాలో నాటి ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా బుధవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా గుప్తా కేవలం సిఫారసులే చేశారని గుప్తా న్యాయవాది కోర్టుకు నివేదించారు.
జార్ఖండ్లోని రాజ్హరా నార్త్బ్లాక్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ బుధవారం చార్జిషీటు దాఖలు చేసిన సందర్భంలో కోర్టులో వాదనలు జరిగాయి.