విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం | straight flight from vizag to malaysia | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం

Published Wed, Mar 11 2015 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం

విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం

కౌలాలంపూర్: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా కౌలాలంపూర్-విశాఖపట్నం రూట్లో డెరైక్ట్ ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మే 7 నుంచి వారానికి మూడు విమానాలు నడుపుతామని తెలియజేసింది. ప్రారంభ ఆఫర్ కింద కౌలాలంపూర్-వైజాగ్ ఫ్లయిట్‌లో సుమారు రూ.4000కే టికెట్లు (వన్‌వే చార్జీ) అందిస్తున్నట్లు ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఏడాది మే 7 నుంచి 2016 మార్చి 26 దాకా చేసే ప్రయాణాలకు ఈ నెల 22 దాకా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పర్యాటక, వాణిజ్య కేంద్రంగా వైజాగ్ ఎదుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఈ ఫ్లయిట్ సేవలు ఉపయోగపడగలవని ఎయిర్ ఏషియా హెడ్(కమర్షియల్ విభాగం) స్పెన్సర్ లీ తెలిపారు.
 
బ్యాంకాక్, కొలంబోలకు కూడా..
ఇక్కడి విమానాశ్రయం నుంచి ఇప్పటికే ఎయిరిండియా  దుబాయ్‌కి, సిల్క్ ఎయిర్‌వేస్ సింగపూర్‌కి, మలిందో ఎయిర్‌లైన్స్ కౌలాలంపూర్‌కి విమా న సర్వీసులు కల్పించాయి. విశాఖ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో బ్యాంకాక్, కొలంబో దేశాలకూ విశాఖ నుంచి విమాన సర్వీసులు రాబోతున్నాయని భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement