విశాఖ నుంచి చౌకగా విమానయానం | Ticket prices reduced for Bangkok and Kuala Lumpur | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి చౌకగా విమానయానం

Published Mon, Feb 17 2025 5:15 AM | Last Updated on Mon, Feb 17 2025 5:15 AM

Ticket prices reduced for Bangkok and Kuala Lumpur

బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు టికెట్‌ ధరల తగ్గింపు

రూ.5వేల లోపు ఒక్కో టికెట్‌

ఈ నెల 23లోపు టికెట్‌ బుక్‌ చేసుకోవాలి

జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 15లోపు ప్రయాణించవచ్చు

ఎయిర్‌ ఏసియా ప్రత్యేక ఆఫర్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్‌ ఏసియా విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జీరో బేస్‌ ఫేర్‌ పేరుతో విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్‌ 15 వరకూ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 

అయితే, ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు టికెట్‌ బుక్‌ చేసుకోవాలని ఎయిర్‌ ఏసియా సూచించింది. సాధారణంగా వైజాగ్‌ నుంచి బ్యాంకాక్‌ లేదా కౌలాలంపూర్‌కు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్‌ ధర ఉంటుంది. 

ఈ ఆఫర్‌ ద్వారా రూ.4,400 నుంచి రూ.5వేల లోపే టికెట్‌ ధర ఉంటుందని ఎయిర్‌ ఏసియా తెలిపింది. అన్ని వర్గాల ప్రయాణికులకు విమానయాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement