7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు! | Tax department to issue letters to 7 lakh assessees for PAN details | Sakshi
Sakshi News home page

7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు!

Published Thu, Jul 21 2016 6:54 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు! - Sakshi

7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు!

న్యూఢిల్లీ : పన్ను ఎగవేత తనిఖీ నేపథ్యంలో ఏడు లక్షల మంది పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విభాగం నోటీసుల జారీ చేసింది. ఈ నోటీసుల జారీ ద్వారా అధిక విలువ కల్గిన లావాదేవీలు లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలను ఆదాయపు పన్ను విభాగం సేకరించనుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన చాలా మంది పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ లో నమోదై లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తాజా నోటీసులతో వారి పాన్ వివరాలను ఐటీ విభాగం సేకరించనుంది. బ్లాక్ మనీని నిరోధించడంలోనూ, పన్ను ఎగవేతదారులను కనుగోవడంలోనూ పది అంకెల పాన్ నెంబర్ చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెంబర్ తోనే  పన్నుఎగవేతదారులను ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తిస్తోంది.

అధిక విలువ కల్గిన లావాదేవీల వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ వద్ద నమోదవుతాయి. సేవింగ్స్ ఖాతాల్లో నగదు డిపాజిట్ లు రూ.10లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు, రూ.30లక్షలకంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు/ అమ్మకం నిర్వర్తించేవారి ఈ లావాదేవీ వివరాలు రికార్డు అయి ఉంటాయి. కానీ ఈ లావాదేవీలకు సంబంధించి చాలా మంది పాన్ వివరాలు ఐటీ విభాగం వద్ద లేవని ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇన్-హోస్ కంప్యూటర్ టెక్నిక్ తో 14లక్షల నాన్-పాన్ లావాదేవీల వివరాలను ఐటీ డిపార్ట్ మెంట్ సేకరించింది. వీరిలో 7లక్షల మందిని అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించింది. నోటీసులు పొందిన వ్యక్తుల సౌలభ్యానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ఐటీ విభాగం డెవలప్ చేసింది. లెటర్ అందిన వ్యక్తులు తమ పాన్ నెంబర్ ను ఎలక్ట్రిక్ గా కూడా నమోదుచేసుకునే సౌకర్యాన్ని అందించింది. ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి పార్టీలు లాగిన్ అయి, లెటర్లో పంపిన ప్రత్యేక లావాదేవీ సంఖ్యతో, వారి లావాదేవీని పాన్ కార్డుతో తేలికగా లింక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement