Black Money
-
‘నల్ల’ ఖజానా
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ బాగోతం అంతా మేడిపండు చందమేనన్నది స్పష్టమైంది. నిగనిగలాడే మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులే ఉంటాయి. నీతులు వల్లించే రామోజీ కుటుంబానికి చెందిన ‘మార్గదర్శి’ డిపాజిట్ల గుట్టు విప్పితే నల్లధనం బట్టబయలవుతుంది. అక్రమార్జనను మార్గదర్శిలో గుట్టు చప్పుడు కాకుండా దాచిన టీడీపీ పెద్దల బండారం గుట్టు వీడుతుంది. అందుకే తాము సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెల్లడించేందుకు రామోజీ కుటుంబం మొండికేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు సహకరిస్తోంది. భారీగా నల్లధనం దందా...మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు భారీస్థాయిలో నల్లధనం దందా సాగించారు. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. ఆ అక్రమ డిపాజిట్ల ముసుగులో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. అందులో సింహభాగం టీడీపీ పెద్దలవేనని స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే నిధులు ఎలా వచ్చాయో వెల్లడించాల్సి ఉంటుంది. భూములు, ఇతర స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టినా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తే వారి అక్రమార్జన బట్టబయలవుతుంది.అందుకే నల్లధనాన్ని రామోజీరావుకు చెందిన ‘మార్గదర్శి’లో డిపాజిట్లుగా పెట్టారు. కేంద్ర ఆదాయపన్ను చట్టం సెక్షన్ 269 ప్రకారం రూ.20 వేలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో తీసుకోకూడదు. కానీ, మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే సేకరించడం గమనార్హం. ఆ నిధులను తమ కుటుంబ వ్యాపార సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు వాడుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడులుగా పెట్టారు.తద్వారా తమ ఫిల్మ్ సిటీ భూముల విలువ, మ్యూచ్వల్ ఫండ్స్లో తమ పెట్టుబడులు భారీగా పెరిగేలా చేసుకుని తమ అక్రమ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేలా కథ నడిపించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా సాగించిన ఈ దందాతో అటు టీడీపీ పెద్దలు, ఇటు రామోజీరావు కుటుంబం భారీగా అక్రమ ఆస్తులను వెనకేసుకున్నారు.రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి?రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రూ.2,610.38 కోట్ల డిపాజిట్లలో రూ.1,864.10 కోట్లు తిరిగి చెల్లించేశామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి? ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు. ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని, బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలకు కొమ్ముకాస్తోంది. -
Rahul Gandhi: మోదీజీ... భయపడ్డారా?
న్యూఢిల్లీ: అంబానీ– అదానీలతో కాంగ్రెస్కు ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తిప్పికొట్టారు. ‘నమస్కారం మోదీజీ.. మీరు భయపడ్డారా?’ అని రాహుల్ ఓ వీడియో సందేశంలో ప్రశ్నించారు. ‘సాధారణంగా మీరు అంబానీ, అదానీల గురించి అంతర్గతంగా, తెరవెనుక మాట్లాడుతారు. కానీ మొదటిసారిగా ఇవాళ మీరు అంబానీ, అదానీల పేర్లను బహిరంగంగా తీసుకున్నారు’ అని రాహుల్ అన్నారు. ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్కు ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ– అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ బుధవారం వేములవాడ సభలో ప్రశ్నించారు. ప్రధాని విమర్శలకు బదులిస్తూ ‘వారు టెంపోల నిండా డబ్బులిస్తారని కూడా మీకు తెలుసు. అంటే మీకు వ్యక్తిగతంగా ఇది అనుభవమేనా?’ అని రాహుల్ నిలదీశారు. ఒక పనిచేయండి.. అంబానీ, అదానీలపైకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ)ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి వారు నల్లధనమిచ్చారనే దానిపై సాధ్యమైనంత త్వరగా లోతైన దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారిపైకి ఈడీని పంపడానికి భయపడొద్దన్నారను. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో మొత్తం దేశానికి తెలుసన్నారు. -
గుట్టలుగా... అవినీతి కట్టలు
ఆరు కౌంటింగ్ మిషన్లు... పదుల కొద్దీ సిబ్బంది... 12 గంటల పైగా లెక్కింపు... 32 కోట్లకు పైగా విలువైన నగదు... దాదాపు అన్నీ అయిదొందల నోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని గాడీఖానా చౌక్లోని ఆ చిన్న రెండు బెడ్రూమ్ల ఫ్లాట్లో అంత పెద్ద మొత్తం, పెద్ద పెద్ద సంచీల కొద్దీ నోట్ల కట్టలు ఉంటాయని ఎవరూ ఊహించరు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పేరుకుపోయిన అవినీతికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం నాటి సోదాల్లో ఎదురైన దృశ్యాలే కళ్ళుచెదిరే సాక్ష్యాలు. సదరు శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి ఇంట, ఆ కార్యదర్శికి పనివాడి ఫ్లాట్లో, ఇతరుల వద్ద సోదాల్లో మొత్తం కలిపి రూ. 35 కోట్ల పైనే బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. అంతలేసి ధనం లెక్కాపత్రం లేకుండా ఎవరింట్లోనైనా ఉందంటే, అది అక్రమధనం కాక మరేమిటి? ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్ఏ) కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇక, మంగ ళవారం రాంచీలో మరో 5 చోట్ల సోదాలు జరిపితే, ఓ కాంట్రాక్టర్ వద్ద 1.5 కోట్లు దొరికాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్... ఇలా ప్రాంతాలు, ప్రభుత్వాలు ఏవైనా సోదా చేస్తే చాలు... నల్లధనం విశ్వరూపం గుట్టల కొద్దీ కట్టల రూపంలో సాక్షాత్కరిస్తున్న తీరు ఆందోళనకరం.జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పై నుంచి కింద దాకా సమస్తం అవినీతిమయమేనని ఈడీ మాట. తీగ లాగితే డొంకంతా కదలడానికి తాజా కేసు ఉదాహరణ. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర∙గ్రామీణాభివృద్ధి శాఖలో ఛీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేవలం పదివేల రూపాయల లంచం తీసుకున్నందుకు జరిగిన ఆ అరెస్టు కథ చివరకు అనూహ్యంగా ఇంత పెద్ద కరెన్సీ గుట్టు విప్పింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చిన్నస్థాయిలోనే ఉన్నప్పటికీ, అవినీతి పరులైన ఉద్యోగులు నిఘా సంస్థల కంటబడకుండా తమ అక్రమార్జనను ఎలా తరలిస్తున్నదీ వీరేంద్రరామ్ విచారణలో తెలిసింది. సంక్లిష్టమైన అవినీతి వ్యవస్థలో తాను, తన లాంటి అధికారుల కోటరీ ఎలా భాగమైనదీ, టెండర్ల ప్రక్రియ సందర్భంగా లంచం సొమ్మును వివిధ మార్గాల్లో తరలించే పద్ధతీ ఆయన బయటపెట్టారు. ఆ వివరాలకు తగ్గట్లే... గ్రామీణాభివృద్ధి శాఖలో విస్తృతంగా అవినీతి సాగుతోందని గ్రహించిన ఈడీ తగిన చర్య చేపట్టాల్సిందిగా గత ఏడాది మేలోనే రాష్ట్ర సర్కారుకు గోప్యంగా లేఖ రాసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెద్దగా స్పందించలేదు. పైగా, నిఘా నీడలోని అవినీతి అధికారుల చేతిలోనే ఆ లేఖ పడడం విడ్డూరం.తిరుగులేని సాక్ష్యాధారాలు లభించడంతో గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్లాల్ సహా పలువురు కీలక అనుమానితులపై ఈ సోమవారం ఈడీ దాడులు జరిపింది. కాంట్రాక్టులు ఇస్తూ అవినీతి ముఠాలో కీలకంగా వ్యవహరిస్తూ, లాల్ కోట్లు కూడ బెట్టారట. లాల్ పనివాడి ఇంట్లో ఏకంగా రూ. 32 కోట్ల పైగా డబ్బు గుట్టలుగా దొరకడంతో వ్యవహారం సంచలనమైంది. ఇదికాక, మరో వ్యక్తి ఇంట్లో మరో 3 కోట్లు దొరికిందంటే, అక్కడి ప్రభుత్వ శాఖలో ఏ స్థాయిలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ఈడీ దాడుల్లో లభించిన దస్తావేజులను బట్టి ముందుగా ఊహించిట్టే ఇందులో మంత్రి గారి హస్తం ఉండనే ఉందని రుజువవుతోంది. ఆయన మెడకు ఉచ్చు బిగుస్తోంది. జార్ఖండ్లోని పాకూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డెబ్భై ఏళ్ళ ఈ సీనియర్ కాంగ్రెస్ నేతను ఈడీ ప్రశ్నించడమే ఇక బాకీ. పనివాడినీ, అతని ఇంటిని అవినీతి సొమ్ముకు గిడ్డంగిగా మార్చిన వ్యక్తిగత కార్యదర్శినీ అరెస్ట్ చేసినా అమాత్యవర్యులు అదరక, బెదరక అమాయకత్వం ప్రకటిస్తుండడం విడ్డూరం. జార్ఖండ్లోని చంపాయ్ సోరెన్ ప్రభుత్వంపై పడ్డ ఈ అవినీతి మచ్చ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి బాగా అంది వస్తోంది. కాంగ్రెస్కు పెద్దదిక్కయిన గాంధీ కుటుంబానికి సన్నిహితులైన వారి ఇళ్ళల్లోనే గతంలోనూ, మళ్ళీ ఇప్పుడూ... ఇంత భారీగా అక్రమ ధనం లభించడాన్ని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్నారు. అవినీతిని ఆపడానికి తాను ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తమను విమర్శిస్తున్నాయని ఆయన వాదన. కాగా, ఇదంతా ప్రత్యర్థులే లక్ష్యంగా మోదీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తు సంస్థల దుర్వినియోగమని ప్రతిపక్ష కూటమి ఆరోపణ. గత డిసెంబర్లో జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన ఒడిశా మద్యం డిస్టిలరీల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపితే, కనివిని ఎరుగని రీతిలో రూ. 350 కోట్ల పైగా మొత్తం దొరికిన సంగతి తెలిసిందే. పరస్పర ఆరోపణలెలా ఉన్నా, ఈ ఘటనలన్నీ ప్రమాదకరమైన పరిణామాన్ని సూచిస్తు న్నాయి. అక్రమధనంపై దీర్ఘకాలంగా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతూనే ఉంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గానే ఉన్నాయి. అయినా సమస్య తీరకపోగా, కొత్తవి బయటపడడం పెను సవాలు. అవినీతిని అంతం చేసి, అక్రమధనాన్ని అందరికీ పంచిపెడతామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు గత పదేళ్ళుగా గద్దె మీదే ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై పోరాటమని చెబుతూనే వస్తున్నారు. ఫలితం శూన్యం. పెద్దనోట్ల రద్దు లాంటివి ఎంత విఫలయత్నాలో అర్థమవుతూనే ఉంది. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో నిందితులైన నేతలు సైతం జెండా మార్చి, కాషాయం కప్పుకుంటే పరమ పునీతులైపోతున్న పరిస్థితులూ చూస్తున్నాం. ఏలికల చేతుల్లో ఏజెన్సీలు, పీఎంఎల్ఏ లాంటి అసమంజస కఠిన చట్టాలున్నా సమస్య తీరకపోవడానికి కారణమేమిటో ఆలోచించాలి. ఇవాళ వ్యాపారం, రాజకీయాలు, సమాజం ఏ స్థితికి చేరాయో గ్రహించాలి. నేతలు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఒకరి కోసం ఒకరు నడిచే తీరు దేశానికి క్షేమం కాదు. ఎన్నికల వేళ ఈ అక్రమధనం పెనుసమస్య. దాని పర్యవసానాలు ఎన్నికలపైనే కాదు, ఆ తర్వాతా ఉంటాయని విస్మరించరాదు. -
ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉండాల్సింది.. అమిత్ షా
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. స్కీమ్ను పూర్తిగా రద్దు చేయకుండా ఉండాల్సిందని, మార్పులు చేస్తే బాగుండేదని అమిత్ షా అన్నారు. ఒక వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మట్లాడుతూ అమిత్షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌవరవిస్తానని తెలిపారు. భారత రాజకీయాల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ స్కీమ్ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ‘ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.20 వేల కోట్ల రాజకీయ పార్టీల ఖాతాలకు చేరాయి. వీటిలో కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే బీజేపికి విరాళంగా వచ్చాయి. మిగిలిన డబ్బులు ప్రతిపక్షాలకు వెళ్లాయి. 303 ఎంపీ సీట్లకు రూ.6 వేల కోట్లు వస్తే 242 సీట్లకు ఏకంగా రూ.14 వేల కోట్లు వెళ్లాయి’అని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఎన్నికల కమిషన్ (ఈసీ)కి బాండ్ల వివరాలు అందజేసింది. ఈ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఏయే కంపెనీలు బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చాయి, ఏ పార్టీకి ఎంత సొమ్ము చేరిందనేది ఈ వివరాల్లో బహిర్గతమైంది. ఇదీ చదవండి.. చంద్రబాబుకు బుద్ధొచ్చింది.. అమిత్ షా -
నారాయణ ‘నల్ల’ పుట్ట!
సాక్షి, అమరావతి: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..! ఇటు పన్నుల ఎగవేత అటు నల్లధనం చేరవేత! ఇవన్నీ నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు! అవినీతికి తెగబడి పోగేసిన నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ‘ఎన్స్పై’ అనే కంపెనీనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తప్ప డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ‘ఎన్స్పై’ ద్వారా టీడీపీ హయాంలో నారాయణ భూ దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు ఎన్స్పైరా ద్వారా కొనుగోలు చేసిన స్కూలు బస్సులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు, అక్రమ రాయితీలకు ఎన్స్పైరను వాడుకున్నట్లు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్ట్రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) నిర్వహించిన సోదాల్లో వెల్లడైంది. ఎన్స్పై నిర్వాకాలు ఇవిగో.. నిధులు మళ్లించేందుకే.. నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులకు జీతాల చెల్లింపు పేరుతో ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటైంది. అయితే ఆ ముసుగులో తమ అక్రమ ఆదాయాన్ని తరలించేందుకు నారాయణ దీన్ని వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. వివిధ సేవల పేరుతో నిధులు మళ్లించి అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారు. అమరావతి భూ దందా.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో చంద్రబాబు, నారాయణ ద్వయం అమరావతిలో సాగించిన భూ దోపిడీకి ఎన్స్పైరను ప్రధాన సాధనంగా వాడుకున్నారు. అందుకోసం ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపారు. ఒలంపస్ క్యాపిటల్ ఏసియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చూపడం గమనార్హం. 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. రెండు విడతల్లో ఎన్స్పైరలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. అనంతరం నల్లధనాన్ని ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నారాయణ సమీప బంధువు కేవీపీ అంజనికుమార్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటం గమనార్హం. నారాయణ సిబ్బంది, మరి కొందరిని తమ బినామీలుగా మార్చుకుని రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అనంతరం వారి ద్వారా ఆ నగదు డ్రా చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను టీడీపీ సర్కారు తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను భయపెట్టారు. ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత నారాయణ బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్లు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ.3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. అక్రమంగా బస్సుల కొనుగోలు రాయితీ నెల్లూరు కేంద్రంగా నెలకొల్పిన ఎన్స్పైర కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఎన్స్పైర రూ.20.80 కోట్లతో హైదరాబాద్లో 92 బస్సులను కొనుగోలు చేసి నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించారు. నారాయణ విద్యా సంస్థలు అందుకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రవాణా శాఖకు సమర్పించిన రికార్డుల్లో మాత్రం ఆ 92 బస్సులను నారాయణ విద్యా సంస్థలే కొనుగోలు చేసినట్టు చూపడం గమనార్హం. తద్వారా విద్యా సంస్థల కోటాలో భారీగా పన్ను రాయితీ పొందారు. ఓ వ్యాపార సంస్థ ఎన్స్పైర కొనుగోలు చేసిన బస్సులను విద్యా సంస్థ కోసం కొనుగోలు చేసినట్టు తప్పుడు వివరాలు సమర్పించి అడ్డదారిలో పన్ను రాయితీలు పొందారు. ఎన్స్పైరకు ప్రతి నెల 92 బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్నట్టు చూపిస్తూ కంపెనీలోకి నల్లధనాన్ని తరలిస్తున్నారు. అంతేకాకుండా నారాయణ విద్యా సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నట్టు పేర్కొంటూ ఎన్స్పైర బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లిస్తున్నారు. నారాయణ నల్లధనాన్ని తరలించేందుకు ఎన్స్పైరను వాడుకుంటున్నారు. సోమవారం నెల్లూరులో ఎన్స్పైరతో సంబంధం ఉన్నవారి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.1.81 కోట్లు నగదు స్వాదీనం చేసుకున్నారు. ఆ కంపెనీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారీగా నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 కోట్ల పన్నుల ఎగవేత లెక్క చూపని రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాదీనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యా సంస్థల వాహనాలకు పన్ను రాయితీ ఉంటుంది. దీంతో వాహనాలు ఎన్స్పై ద్వారా కొనుగోలు చేసినప్పటికీ నారాయణ విద్యాసంస్థలు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద రూ.4.48 కోట్లు జీఎస్టీ రిటర్న్ల రూపంలో పొందారు. ఈ మోసాన్ని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం రవాణా శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. రూ.10.23 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా రూ.22.35 లక్షలు మాత్రమే చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోమవారం నారాయణ విద్యా సంస్థలతో పాటు అనుబంధ సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టి పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ.1.81 కోట్ల నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నారాయణ డైరెక్టర్ పునీత్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్కు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు. లెక్కా పత్రాలు లేవు.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు. దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్లధనం కేరాఫ్ ‘నోవా’ నోవా అగ్రిటెక్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్లీక్ సొమ్ము రాజస్తాన్లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్వర్క్ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి విచిత్ర భాష్యం
-
బాబు ‘బ్లాక్మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని ఝలక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఆదాయ పన్నుల శాఖ. చంద్రబాబు వద్ద ఉన్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగానే గుర్తించింది ఐటీ శాఖ. ఈ పరిణామాలను చంద్రబాబు అస్సలు ఊహించి ఉండడు. సీఎంగా ఉన్న టైంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టు ల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారాయన. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా(వెల్లడించని)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును కోరింది ఐటీ శాఖ. అంతకు ముందు రీ అస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2016 నుంచి 2019 మధ్య నడిచిన ముడుపుల బాగోతం నడిచింది. ఐటీ శాఖ అధికారులు.. షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ స్కాం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు ఒప్పుకున్నాడు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి). షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు.. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగింది. 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. ఆ శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని తన బాస్ చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అయితే.. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా బాబు లబ్ధి పొందినట్లు నోటీసుల్లో పేర్కొంది ఐటీ. 2017లో బాబు మయాంలో షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎంవీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖ. ఆ సమయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ పేరుతో నిధులు మళ్లించిన విషయాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఎంవీపీ కార్యాలయం నుంచి కీలక పత్రాలు, ఎక్సెల్షీట్లు, కీలకమైన మెసేజ్లు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటీ.. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి.. పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్మెంట్ ఇచ్చారు. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందగా.. ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఆదాయ పన్ను శాఖ అధికారులు.ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు అందిన విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక బయటపెట్టింది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో ఈ అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ విషయాన్నే ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించింది కూడా. ఇక.. చంద్రబాబు నేర చరిత్ర ఇదే కాదు.. ఇంకా చాలా ఉంది. ఇదీ చదవండి: గ్యారెంటీ లేని బాబు ష్యూరిటీ.. జనం నమ్ముతారా? -
పాక్లోనూ పెద్ద నోట్ల రద్దు?.. ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉందా?
పేదరికం అంచునకు చేరుకున్న పాకిస్తాన్ను ఇప్పుడు నల్లధనం సమస్య వెంటాడుతోంది. పాకిస్తాన్లో నల్లధనం విపరీతంగా పెరిగిపోవడంతో దానిని అరికట్టడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. పాకిస్తాన్లో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఆర్మీ జనరల్స్, ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగిన పోలీసు అధికారులు తమ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్లో నల్లధనం నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న దాడులు కూడా విఫలం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. పాక్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లధనంపై మాట్లాడేందుకు ఏ పార్టీ నేతలు కూడా సిద్ధంగా లేరని సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పాకిస్తాన్లో నల్లధనాన్ని అరికట్టేందుకు భారత్ మాదిరిగా పెద్ద నోట్లను రద్దు చేయాలని అక్కడి ఆర్ధిక నిపుణులు కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచిందని పాక్ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇది మొదట్లో ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లను విసిరింది. కానీ తరువాతి కాలంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను నియంత్రణలో ఉంచిందని ఆ పత్రిక పేర్కొంది. నగదు నిల్వలను అరికట్టేందుకు పాకిస్తాన్లో రూ.5000 నోటును దశలవారీగా రద్దు చేస్తారా అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. అయితే దీనిపై పాక్ అధికారులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్లోనే అతిపెద్ద నోటు దక్షిణాసియా దేశాల్లో 5000 రూపాయల నోటు కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది. ఇంత భారీ విలువ కలిగిన నోటు మరే ఇతర ఆసియా దేశంలోనూ లేదు. నగదు నిల్వలకు ఇంత భారీ విలువ కలిగిన కరెన్సీ నోట్లు ప్రధాన కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ గత ఏడాదిలో నగదు ప్రవాహం గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ మొత్తంమీద భౌతిక నగదు మారకం 29 శాతం వరకూ ఉంటుంది. పాకిస్తాన్లో జీడీపీలో 40 శాతం నల్లధనం పాకిస్తాన్లో నల్లధనంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ 341.5 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐపీఎస్ఓఎస్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్లోని షాడో ఆర్థిక వ్యవస్థ అక్కడి జీడీపీలో 40 శాతం మేరకు ఉంది. పాకిస్తాన్ జీడీపీలో ప్రతి సంవత్సరం 6 శాతం మాయమవుతున్నది. అంటే పెద్దమొత్తంలో నగదు లెక్కలకు అందకుండా పోతున్నది. ఇదే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం దిశగా నెట్టివేస్తున్నది ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..! -
మార్గదర్శిలో ‘నల్ల’ ఇంధనం!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్ఫండ్స్ ముసుగులో సాగిన నల్లధనం దందాపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీసేందుకు సిద్ధమైంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతోపాటు మరికొన్ని గ్రూపుల మూసివేతకు చర్యలు చేపట్టింది. ఆ చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రూ.కోటికిపైగా డిపాజిట్దారులకు నోటీసులు మార్గదర్శి చిట్ఫండ్స్లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో నల్లధనం వ్యవహారాలను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నల్లధనం దందా సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆదాయ వివరాల పరిశీలన.. రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ చేసిన ఆ మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్ఫండ్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి వాస్తవికతను నిగ్గు తేలుస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదు? అనే కోణాల్లో విచారణను వేగవంతం చేయనున్నారు. తద్వారా నల్లధనం వ్యవహారాలపై ఒక నిర్ధారణకు వస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపడతారు. మూసివేసిన చిట్టీల నిర్వహణకు ప్రత్యేక అధికారి! కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు. మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించడానికి సన్నద్ధమవుతున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని నియమిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్ఫామ్లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
మార్గదర్శి బ్రాంచీల్లో ఫేక్ చందాదారులు, జాడలేని రికార్డులు
-
మార్గదర్శి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ
-
నల్ల ‘మార్గం’లో! పయనించిన మార్గదర్శి.. గుర్తించిన సీఐడీ
సాక్షి, అమరావతి: భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించింది. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది. చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా తాజాగా 7 చోట్ల మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. విశాఖ (సీతంపేట), రాజమహేంద్రవరం (శ్యామల థియేటర్ బ్రాంచి), ఏలూరు (నర్సింగరావుపేట బ్రాంచి), విజయవాడ (లబ్బిపేట బ్రాంచి), గుంటూరు (అరండల్ పేట), నరసరావుపేట (సత్తెనపల్లి రోడ్ బ్రాంచి), అనంతపురం (లక్ష్మీనగర్ బ్రాంచి)లోని మార్గదర్శి కార్యాలయాల్లో ఉదయం 10కి మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. చట్ట ప్రకారం నిర్వహించాల్సిన 12 రికార్డులకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల సోదాల సందర్భంగా గుర్తించినట్లు సమాచారం. ఏటా దాదాపు రూ.600 కోట్ల వరకు నగదు రూపంలో మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా బదిలీ చేసినట్లు గతంలో గుర్తించారు. ఆ నిధులను బ్రాంచి కార్యాలయాల నుంచి ఏ తేదీల్లో అక్రమంగా తరలించారనే అంశాలపై తాజా సోదాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. ఏటా మార్చి 31న వచ్చినట్లు చూపిస్తున్న దాదాపు రూ.500 కోట్లకు పైగా చెక్కులకు సంబంధించిన వివరాలను సంబంధిత బ్రాంచి కార్యాలయాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. ఇక రశీదుల రూపంలో డిపాజిట్లు వివిధ బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు మార్గదర్శి చూపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన రికార్డులు బ్రాంచి కార్యాలయాల్లో లేవని వెల్లడైనట్లు తెలుస్తోంది. రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల నిధులనే రామోజీరావు తమ కుటుంబ సంస్థల్లోకి మళ్లించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ప్రధాన కార్యాలయం, బ్రాంచీల రికార్డులకు ఎక్కడా పొంతన లేదని వెల్లడైంది. తాజా సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ సోదాలు మరికొద్ది రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. -
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ధనవంతుడిగా చంద్రబాబు
-
విదేశాల్లో చంద్రబాబు నల్లధనం రూ.5 లక్షల కోట్లు
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి దుబాయ్, స్విట్జర్లాండ్లో దాచిన రూ.5 లక్షల కోట్ల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. తిరుపతిలోని అకాడమీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు దాచిన చంద్రబాబుపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు అక్రమార్జనలపై పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. విషయ పరిజ్ఞానం లేని దద్దమ్మ, ఒక్కచోట కూడా గెలవలేని లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం కామెడీగా ఉందన్నారు. ప్రజాపాలన సాగుతున్న రాష్ట్రంలో విమర్శించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ వారు ఫ్ర్రస్టేషన్లో బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, పెంపుడు కుక్కల్ని పోషిస్తూ మహిళలను సైతం కించపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇ చ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం హామీలను అమలు చేసినందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆదరించాలని కోరుతున్నారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడితే ఆరు నెలలకు కూడా అర్థం కాదు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడుతారో ఆరునెలలకు కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదువుతున్న పవన్కళ్యాణ్కు ప్రజాసంక్షేమం ఎందుకు కనపించడంలేదని ప్రశ్నించారు. కనిపించే అభివృద్ధి, సంక్షేమాన్ని సైతం విమర్శిస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో సైతం ఆయన్ని రెండు కాదు.. మూడుచోట్ల పోటీచేసినా ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన సైకో చంద్రబాబు అని, ఎల్లో మీడియా అండతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయతి్నస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పాపాలు పండిపోయాయని, ఆయనకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తెలుగు అకాడమీకి పూర్వవైభవం రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నిర్విర్యం చేసిన తెలుగు అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వవైభవం తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మిడియట్ పుస్తకాలను ముద్రిస్తున్నామని, త్వరలో డిగ్రీ పుస్తకాలను, పోటీ పరీక్షలకు అవసరమయ్యే 17 రకాల పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల మాండలిక పుస్తకాలు ముద్రిస్తామన్నారు. జాతీయ సంస్కృత యూనివర్సిటీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగు అకాడమీ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసి, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసాలు చేస్తుండటంపై విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉందని, విలువైన ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటికోసం ప్రయతి్నస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, దీనిపై హైకోర్టులో పోరాడుతున్నామని ఆమె చెప్పారు. -
‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్స్పైర’!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తాజాగా తేలింది. ఈ మేరకు హైదరాబాద్లోని ‘ఎన్స్పైర’ కార్యాలయంలో మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందం 45 హార్డ్ డిసు్కలు, బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక పత్రాలను స్వాదీనం చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తమ కుటుంబ వ్యాపార సంస్థ ‘ఎన్స్పైర’ ద్వారా సాగించిన అక్రమాల బాగోతం ఇలా ఉంది. కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా.. మాజీ మంత్రి నారాయణ తమ కుటుంబం నిర్వహించే నారాయణ విద్యా సంస్థల కోసమంటూ ‘ఎన్స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థను లాభాపేక్షలేని సంస్థగా ఏపీ సొసైటీల చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థ నిధులను నారాయణ తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్లించేందుకు వీలులేదు. దీంతో నిధుల మళ్లింపు కోసం ఎత్తుగడ వేసిన నారాయణ తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్స్పైర అనే కంపెనీని నెలకొల్పారు. నల్లధనం భారీగా మళ్లింపు.. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపడం గమనార్హం. రెండు విడతల్లో ఎన్స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఆ నిధులు రామకృష్ణ హౌసింగ్లోకి.. వివిధ మార్గాల్లో ఎన్స్పైరలోకి మళ్లించిన నిధులను నారాయణ తమ సమీప బంధువైన కేవీపీ అంజనికుమార్ ఎండీగా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకి తరలించారు. దీంతోపాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు మళ్లించడం గమనార్హం. అనంతరం ఆ చిరుద్యోగుల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. తమ వద్ద పనిచేసే చిరుద్యోగులను బినామీలుగా మార్చుకుని 169.27 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. మొత్తం రూ.5,600 కోట్ల అసైన్డ్ దందా అమరావతిలో రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో చక్రం తిప్పిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. రాజధాని కోసం సమీకరించే అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేశారు. ఇదే అదనుగా దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను అయినకాడికి అమ్ముకోకుంటే ప్రభుత్వ పరమైపోతాయని పేదలను బెదిరించి కారుచౌకగా కాజేశారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. రిజిస్ట్రేషన్ చట్టం 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు, రాయపూడి తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం తాపీగా ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. అక్రమాలు బహిర్గతం.. అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 34, 35, 36, 37, 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని గతంలో అరెస్టు చేశారు. కాగా అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు ఎన్స్పైర కంపెనీ ద్వారా నల్లధనాన్ని మళ్లించి అక్రమాల కథ నడిపించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా బహిర్గతమైంది. -
దేశంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ...రూ.31.92 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో చెప్పారు. ‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం(1950) వంటివి రద్దవుతాయి. చదవండి: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్ -
నల్ల డబ్బు మార్చే యత్నం!
చిత్తూరు అర్బన్: ‘మావద్ద లెక్కలో చూపించని బ్లాక్మనీ (నల్లడబ్బు) రూ.40 కోట్ల వరకు ఉంది. దీన్ని కొంచెం కొంచెం మీ బ్యాంకు ఖాతాలో వేస్తాం. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని వైట్ మనీ (లెక్కల్లో చూపించేది)గా ఇస్తే చాలు..’ అంటూ రైస్ పుల్లింగ్ నేరం తరహాలో బురిడీకొట్టించే ప్రయత్నం చేసి.. తీరా పోలీసులకు తెలిసిపోవడంతో ఓ ముఠా పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన గిరీష్ అనే పారిశ్రామికవేత్తకు చెన్నైకి చెందిన సత్య ఇటీవల పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ఓ బడా పారిశ్రామికవేత్త వద్ద రూ.వందల కోట్ల నల్ల డబ్బు ఉందని, దీన్ని బ్యాంకులో వేసుకుని లెక్కల్లో చూపించి తమకు బదిలీ చేస్తే కమీషన్ రూపంలోనే రూ.కోట్లు సంపాదించవచ్చని గిరీష్ను నమ్మించాడు. ఢిల్లీకు చెందిన వినోద్గుప్త అనే వ్యక్తిని గిరీష్కు ఫోన్లో సత్య పరిచయం చేశాడు. గిరీష్, సత్య, వినోద్గుప్త ముగ్గురూ ఫోన్లో పలు దఫాలుగా మాట్లాడుతుకున్నారు. తొలుత రూ.50 లక్షలను సత్య వద్దకు చేరిస్తే.. రూ.5 కోట్లను గిరీష్ బ్యాంకు ఖాతాలో వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అమలు చేయడానికి చిత్తూరు నగరాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీ నుంచి వినోద్గుప్తను చెన్నైకు పిలిపించి, అక్కడి నుంచి కారులో బయలుదేరిన సత్య.. గిరీష్ను చిత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఉండాలని చెప్పాడు. బుధవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న గిరీష్ బృందాన్ని ప్రశ్నించారు. తనను మోసం చేయడానికి సత్య, వినోద్గుప్త ప్రయత్నించారని గ్రహించిన గిరీష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అప్పటికే సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సత్య, వినోద్కుమార్ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే పారిపోయారు. చిత్తూరు సీసీఎస్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్, వజ్రాల ఆభరణాల వ్యాపార సంస్థలపై దాడుల్లో రూ.100 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని నల్లధనం బయటపడింది. ఈ నెల 17న బిహార్, ఢిల్లీల్లో 30 ప్రాంతాల్లో ఈ సొత్తును గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన రూ.5 కోట్ల నగదు, నగలను స్వా«దీనం చేసుకుని, 14 బ్యాంకు లాకర్లకు సీల్ వేసినట్లు తెలిపింది. ‘‘కస్టమర్లకు అడ్వాన్సుల పేరుతో మరో రూ.12 కోట్ల లెక్క చూపని ధనం, రూ.80 కోట్ల మేర వెల్లడించని నగదు లావాదేవీలను గుర్తించాం’’ అని పేర్కొంది. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం -
‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2016 నవంబర్ 8న దేశంలో రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు ఉన్నపళంగా రద్దయిపోయాయి. అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు (డిమానిటైజేషన్) చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, నోట్ల రద్దు దుష్ఫలితాలు బయటపడడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఆరేళ్లలో ఏం జరిగిందో తెలుసుకుంటే నిరాశే మిగులుతుంది. 115 మంది బలి! అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంలో వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు జనసందోహంతో కిటకిటలాడాయి. క్యూలో నిల్చొని 115 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవం మాత్రం మరోలా ఉంది. 2016 నవంబర్ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు కాగా, 2022 అక్టోబర్ 21 నాటికి రూ.30.88 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ‘మాస్టర్స్ట్రోక్’తర్వాత 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరగడం గమనార్హం. పడిపోయిన జీడీపీ వృద్ధిరేటు నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డిజిటల్ చెల్లింపు పద్ధతులు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బడా బాబులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. సామాన్య జనం మాత్రం ఇక్కట్ల పాలయ్యారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగించింది. జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్ వివేక్ నారాయణ్ శర్మ 2016 నవంబర్ 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని పిటిషన్లు పేర్కొన్నారు. వివేక్ నారాయణ్ శర్మ పిటిషన్పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పందించింది. హైకోర్టుల్లోనిపిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే నిర్ణయం తీసుకున్నారు. నేడు సుప్రీంకోర్టు విచారణ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. డిమానిటైజేషన్పై అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వం,ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రం, ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. చదవండి: ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం -
నేషన్ వాంట్స్ టు నో
అది 1978, జనవరి 14వ తేదీ ఉదయం. ముంబై (అప్పుడు బొంబాయి)లో ఉన్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అకౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం. ఆయన ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లని చలా మణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పిం చిందనీ, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనీ, ఇదంతా చాలా గోప్యంగా జరగాలనీ రామన్ను ఆదేశించారు. అనుకున్న పద్ధతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారు జాము కల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్కు ఈ రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆయన అభి ప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు. భారతీయ ఆర్థిక విధానాలపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు. ‘పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ నాతో ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబ ట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.’ ‘సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు’ అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభిప్రాయం. 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నేళ్ళ తరు వాత, 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అయిదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలవి కావడం మరో పోలిక. నవంబర్ ఎనిమిది సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసే సమ యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చో బెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియ చేయడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజలనుద్దేశించి రేడియో, దూరదర్శన్లలో ప్రసం గించారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరనీ తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లలో భాగమే కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారు చేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం. ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోదీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభి ప్రాయం కలిగింది. ‘కొద్ది రోజులు కటకట పడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు’ అనే భావన సర్వత్రా కనబడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొ కటన్న అభిప్రాయం బలపడసాగింది. బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడక పోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల వద్దా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొట మరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. అయితే ప్రజలకు ఉన్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే మంచి రోజుల కోసం ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. దానితో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు పూర్తిగా లభించినట్టు అయింది. దేశానికి సంబంధించి తీసుకున్న ఒక కీలక, ప్రధాన నిర్ణయానికి ప్రజల మద్దతు పొందడం మామూలు విషయం కాదు. ఆ మేరకు ప్రధాని మోదీ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ నల్లధనం రద్దుకు తీసుకున్న ఈ నిర్ణయం వికటించిందా, ఫలించిందా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు అంతకు ముందు లేని ఒక మంచి అలవాటు అలవడింది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో దేశంలో ద్రవ్య చలామణి 17.97 లక్షల కోట్లు వుండగా ఇప్పుడది 72 శాతం పెరిగి 30.88 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబు తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి. ప్రతి చిన్నా, పెద్దా ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు విచ్చల విడిగా డబ్బు వెదజల్లారు. ఇదంతా ప్రజలు కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత కూడా బడా బాబుల దగ్గర ఇంతంత డబ్బు ఎలా పోగుపడింది? పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలించలేదు అనడానికి ఇది తార్కాణం. కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నవంబర్ 17 వరకూ అనిల్ అంబానీపై చర్యలు వద్దు
ముంబై: బ్లాక్ మనీ చట్టం కింద ఐటీ శాఖ నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 17 వరకూ ఎటువంటి బలప్రయోగ చర్యలు తీసుకోవద్దని ఆదాయ పన్ను శాఖను న్యాయస్థానం ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 814 కోట్ల వివరాలు వెల్లడించకుండా రూ. 420 కోట్ల మేర పన్నులు ఎగవేశారంటూ ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేయాలనే ఉద్దేశ్యంతో, ఆయన కావాలనే తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించలేదని ఆరోపించింది. నోటీసులో పొందుపర్చిన సెక్షన్ల ప్రకారం అనిల్ అంబానీకి జరిమానాతో పాటు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ అనిల్ అంబానీ హైకోర్టును ఆశ్రయించారు. నిర్దిష్ట లావాదేవీలు 2006–07 నుంచి 2010–11 మధ్యలో జరిగినవని ఐటీ శాఖ చెబుతుండగా.. బ్లాక్మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని ఆయన తరఫు లాయరు రఫిక్ దాదా వాదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. దీన్ని ఇప్పటికే ఐటీ కమిషనర్ వద్ద సవాలు చేసినట్లు, సివిల్ వివాదం పెండింగ్లో ఉండగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదని దాదా తెలిపారు. అనిల్ అంబానీ పిటిషన్పై స్పందించేందుకు కొంత సమయం కవాలని ఐటీ శాఖ కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. -
అమిత్ షా, కేజ్రీవాల్ ‘కలల’ తూటాలు
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ‘‘కలలతో వ్యాపారం చేయాలనుకునే వాళ్లను గుజరాత్ ప్రజలు ఆదరించరు. వారి కలలు ఎన్నటికీ నెరవేరవు’’ అంటూ అమిత్షా ధ్వజమెత్తారు. దీనికి.. ‘‘నిజమే. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున పంచుతామంటూ పంచ రంగుల కలలు చూపిన వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరు’’ అంటూ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం గాంధీనగర్లో మంగళవారం కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్లో పర్యటిస్తున్న కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఓడిపోతోందని, కాంగ్రెస్ పనైపోయిదని జోస్యం చెప్పారు. తామొస్తే అవినీతి రహిత పరిపాలన అందిస్తామన్నారు. ఇదీ చదవండి: అమిత్ షా మఫ్లర్ ఖరీదు రూ.80వేలు! -
వారు చెప్పింది తప్పు అని నిరూపించాం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: తమ గ్రూప్లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ చైర్పర్సన్గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
బాబోయ్.. నల్లధనంపై రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్!
న్యూఢిల్లీ: నల్లధనం చట్టం కింద వెల్లడించని విదేశీ ఆదాయానికి సంబంధించి 368 కేసుల్లో (అసెస్మెంట్ పూర్తయిన తర్వాత) రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్ నోటీసుల జారీ అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నల్లధనంపై పన్ను వసూళ్లకు సంబంధించి 2022 మే 31వ తేదీ వరకూ డేటాపై లోక్సభలో ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. హెచ్ఎస్బీసీలో రిపోర్టు (పేర్కొనని) చేయని విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లకు సంబంధించిన కేసుల్లో రూ.8,468 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,294 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని వివరించారు. 30 సెప్టెంబర్ 2015తో ముగిసిన బ్లాక్ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు) ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్, 2015 కింద ఒన్ టైమ్ సెటిల్మెంట్గా (మూడు నెలల పరిమితితో) 648 కేసులకు సంబంధించి రూ.4,164 కోట్ల విలువైన వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో రూ.2,476 కోట్లకుపైగా మొత్తాన్ని పన్నులు, పెనాలిటీ రూపంలో వసూలయినట్లు ఆమె తెలిపారు. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అడిగిన ప్రశ్నలకు సీతారామన్ సమాధానం చెబుతూ, ‘‘భారత పౌరులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అధికారిక అంచనా లేదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు. భారతదేశ నివాసితులు స్విట్జర్లాండ్లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వార్షిక బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ సోర్స్ను ఉపయోగించరాదని స్విస్ అధికారులు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్లో ఉన్న భారతీయ నివాసితుల డిపాజిట్లను విశ్లేషించడానికి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్కు సెటిల్మెంట్ (బీఐఎస్)కు చెందిన ‘‘లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్’’ అని పిలిచే మరొక డేటా సోర్స్ను వినియోగించుకోవచ్చని కూడా వారు వెల్లడించినట్లు తెలిపారు. లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లలో 8.3 శాతం క్షీణత నమోదయినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన పలు చర్యలను కూడా ఆమె ఈ సందర్భంగా సభకు వివరించారు. -
ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?
విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది. పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అధ్యయనంలో వెల్లడయింది. అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి నిరోధక చట్టం (2002), లోక్పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ -
రియల్టీ.. స్టాంప్డ్యూటీ.. బ్లాక్మనీ
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగం ప్రక్షాళనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ఫలితంగా ప్రాపర్టీ ఒప్పందాల్లో నల్లధనం తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి తెలిపారు. నరెడ్కో–మహి (సంఘం మహిళా విభాగం) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జోషి మాట్లాడారు. ‘‘స్టాంప్ డ్యూటీ దిగొచ్చింది. దీన్ని మరింత తగ్గించాలి. వ్యాపారాలు పారద్శకంగా నడుస్తున్నాయా (చట్టబద్ధమైన ధనంతో) లేక నల్లధనంతోనా అన్నది నిర్ణయించడంలో స్టాంప్ డ్యూటీ కీలక పాత్ర పోషిస్తుంది. నరెడ్కో, నిర్మాణ రంగం మరింత మంది మహిళా నిపుణులను ఈ రంగంలోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తుండడం స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ మరింత పారదర్శకంగా మారితే పనిచేసేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు వస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన ఒక స్నేహితుడు నిన్ననే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. చాలా వరకు ప్రాపర్టీ లావాదేవీలు ‘వైట్’ (స్వచ్ఛం)గానే జరుగుతున్నట్టు చెప్పాడు. మొత్తం చెల్లింపులు పారదర్శక మార్గంలోనే నడుస్తున్నాయి’’ అని జోషి వెల్లడించారు చదవండి: ఫ్లాట్ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయి -
రోడ్డుపై కుప్పలుగా కట్ చేసిన కరెన్సీ
-
విదేశాల్లోని నల్లధనంపై మా దగ్గర లెక్కల్లేవ్ - ప్రభుత్వ ప్రకటన
న్యూఢిల్లీ: విదేశీ అకౌంట్లలో నల్లధనం ఎంతుందన్న విషయంలో గడచిన ఐదేళ్లలో అధికారిక అంచనాలు ఏవీ లేవని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. అయితే 2015లో మూడు నెలల వన్–టైమ్ సెటిల్మెంట్ విండో కింద రూ. 2,476 కోట్లు పన్ను, పెనాల్టీగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం–ఆస్తులు) పన్ను చట్టం, 2015 విధించడం కింద సెప్టెంబర్ 30, 2015తో ముగిసిన మూడు నెలల వన్ టైమ్ విండో కింద రూ. 4,164 కోట్ల విలువైన బహిర్గతం చేయని విదేశీ ఆస్తులు వెల్లడయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లావాదేవీల సంఖ్య 648 అని వివరించారు. -
మౌన శిల్పం: ప్రశ్నలడిగితే ‘మైగ్రేన్’.. ఆకలేస్తే బిర్యానీ
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఎంత అడిగినా మౌనం దాల్చింది. గట్టిగా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉందని, మనోవేదనకు గురిచేస్తే మైగ్రేన్ వస్తుందని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఒక సందర్భంలోనైతే పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగినట్లు సమాచారం. పోలీసు కస్టడీకి చివరి రోజైన ఆదివారం నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని ప్రశ్నిస్తుండగా మధ్యాహ్న వేళ తనకు ఆకలిగా ఉందని, బిర్యానీ కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో పోలీసులు నార్సింగిలోని ఓ హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చి శిల్పకు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారంతో ఆమె కస్టడీ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టుకు తరలించనున్నారు. తమ క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాలంటూ శిల్ప తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. (ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు) 50 శాతం సొమ్ము తిరిగిచ్చేశా.. దీవానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసి సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఇస్తానని నమ్మించి వందలాది మంది మహిళల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. శిల్పాచౌదరికి రూ. 1.05 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగి పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. శిల్పాచౌదరికి రూ.2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని సూపర్స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, రూ. 3.1 కోట్లు ఇస్తే మోసం చేసిందంటూ మరో మహిళా వ్యాపారవేత్త రోహిణి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీనివాస ప్రసాద్ ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ ముగ్గురు మహిళలకు ఇప్పటికే 50 శాతం సొమ్ము తిరిగి ఇచ్చిసినట్లు శిల్పాచౌదరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. -
వామ్మో!...పైప్లైన్లో నోట్ల కట్టలు..!!
మనం సినిమాల్లో బ్లాక్మనీని కారు టైర్లలోనూ, గోడల్లోనూ దాచడం చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అలా దాచేవాళ్లను చూడటం చాలా అరుదు. మహా అయితే పలానా అధికారి ఇంట్లో ఇంత సోమ్ము స్వాధీనం చేసుకున్నాం అని విని ఉంటాం తప్ప ఎలాంటి చోట్ల వాళ్లు దాచుతారో చూసి ఉండం. కానీ కర్ణాటకలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్ అవినీతి సోమ్మును ఎక్కడా దాచాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే.! బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన ఇంజనీర్ నివాసంలో తాము ఒక ప్లంబర్ సాయంతో పైప్లైన్ల నుంచి కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు. (చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్తో తాగేస్తోంది) పైగా తమకు పైపులైన్లో నగదు దాచినట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ. 25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు దాదాపు 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించన సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై కూడా అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. అవినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
హౌసింగ్ మార్కెట్లో తగ్గిన నల్లధనం ప్రాబల్యం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత గడచిన ఐదేళ్లలో హౌసింగ్ మార్కెట్లో నల్లధనం (లేదా నగదు లావాదేవీలు) ప్రాబల్యం 75 నుంచి 80 శాతం తగ్గిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ– అనరాక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏడు నగరాల్లోని డెవలపర్ల అభిప్రాయాల సేకరణ, బ్యాంకుల గృహ రుణ పంపిణీ గణాంకాలు, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సమీక్ష , 1,500కుపైగా సేల్స్ ఏజెంట్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. గృహ రుణ సగటు పరిమాణం మాత్రం గణనీయంగా పెరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి పేర్కొన్నారు. కాగా, చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆస్తి లావాదేవీల్లో నల్లధనం ఉందని గుర్తించినట్లు అనరాక్ చైర్మన్ వివరించారు. కారణాలు ఇవీ... పెద్ద నగరాల తొలి గృహ కొనుగోళ్లలో నల్లధనం హవా తగ్గడానికి కారణాలను అనూజ్ పురి వివరిస్తూ, బ్రాండెడ్, లిస్టెడ్ సంస్థలు ఇప్పుడు భారీ ప్రాజెక్ట్లను చేపడుతున్నాయని, పూర్తి పారదర్శకతతో కూడిన అకౌంట్ల ద్వారానే మెజారిటీ గృహ కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు తర్వాత గృహ కొనుగోలుదారుల డిమాండ్ కూడా పారదర్శకతలో కూడిన బ్రాండెడ్ ప్రాజెక్టులకే ఉంటోందని తెలిపారు. ఇక ప్రధాన డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపైనే కేంద్రీకరించే తమ గత ధోరణిని మార్చుకుని, చౌక, మధ్య తరగతికి అనుగుణమైన హౌసింగ్ విభాగంపై దృష్టి సారించాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొత్తంగా హౌసింగ్ రంగంలో పారదర్శకత గణనీయంగా మెరుగుపడినట్లు వివరించారు. ‘దేశంలో గృహాల కొనుగోలు, విక్రయం అనే ప్రాథమిక అంశాలు, ధోరణుల్లో పెద్ద నోట్ల రద్దు గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. నేడు గృహ విక్రయాలు అధికభాగం వాస్తవ డిమాండ్ ప్రాతిపదికగానే జరుగుతున్నాయి. నల్లధనాన్ని చెలామణీలోకి తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నంగా ప్రస్తుతం రియల్టీ లేదు’’ అని పురి పేర్కొన్నారు. -
స్విస్ బ్యాంకుల్లో బ్లాక్మనీపై స్పందించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత బ్లాక్ మనీ అంశం పార్లమెంట్లో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందనే ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్. పాలా. ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపమని విన్సెంట్ పార్లమెంట్లో లేవనెత్తారు. అంతేకాకుండా బ్లాక్మనీ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని అడిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్మనీకి సంబంధించి అధికారికంగా అంచనా లేదని తెలియజేశారు. అయితే, విదేశాలలో నిల్వ చేసిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ‘‘ది బ్లాక్ మనీ ఇంపోసిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015’’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాలలో బ్లాక్మనీ జమచేసిన వారి కేసులపై సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. బ్లాక్మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్కు ఛైర్మన్, వైస్ చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు వ్యవహరిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత్ కలిసి పనిచేస్తోంది. బ్లాక్ మనీ యాక్ట్ కింద ఇప్పటివరకు 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 10 (3) / 10 (4) ప్రకారం, 2021 మే 31 వరకు 166 కేసులలో అసెస్మెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఇందులో రూ .8,216 కోట్లు రికవరీ చేశామని కేంద్రం తెలిపింది. -
భారతీయల స్విస్ సంపదపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనంపై వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు 2020లో చేసినట్లు ఆరోపణలు రాగా కేంద్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. స్విస్ నల్లధనం.. అసలు కథేంటి ఈ వార్తలో ఏముందంటే.. 2019లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం 6625 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఏకంగా 20 వేల కోట్లకు చేరినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. కాగా ఈ వార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయం స్పందిస్తూ.. స్విస్ నేషనల్ బ్యాంక్కు వివిధ స్విస్ బ్యాంకులు సమర్పించిన మొత్తం లెక్కలు తప్పుగా చిత్రీకరించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అది కేవలం స్విట్జర్లాండ్లో దాచుకున్న భారతీయుల సొమ్ము కాదు అని వెల్లడించింది. ఇదే క్రమంలో 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది. డిపాజిట్లు తగ్గినట్లు చెప్తున్న ప్రభుత్వం, ఎంత మొత్తం అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా మొత్తం స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో సుమారు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్తో బ్రిటన్ ముందు నిలవగా, 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. ✅Finance Ministry refutes News media reports of alleged black money held by Indians in Switzerland ✅Information sought from Swiss Authorities to verify increase/decrease of deposits Read more➡️ https://t.co/W1fKhlh7LR (1/6) pic.twitter.com/tPUOciARJR — Ministry of Finance (@FinMinIndia) June 19, 2021 చదవండి: మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా జస్ప్రీత్ బుమ్రా..! -
స్విస్ నల్లధనంపై మోదీ మాట్లాడరేం ?
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్లోని నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం నల్ల ధనం గురించి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. స్విస్లో ఖాతాలు కలిగి నల్లధనం దాచుకుంటున్న వారి పేర్లను బయటపెట్టాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి గౌరవ్ వల్లభ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చేందుకు మోదీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని, దానిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 2020లో స్విస్ బ్యాంకులో భారతీయులు దాచుకున్న నల్ల ధనం విలువ ఏకంగా 286 శాతం పెరిగి రూ. 20,700 కోట్లకు చేరుకుంది. గత 13 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ.. ‘మోదీజీ దయ చేసి సమాధానం ఇవ్వండి. నల్ల ధనాన్ని మూడేళ్లలో తీసుకొస్తానన్న మీ వాగ్దానం ఏమైంది. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి ఏడేళ్లయింది. మీ స్నేహితుల డబ్బును తీసుకొచ్చేందుకు మీకు శక్తి లేదా ?’అని ట్వీట్చేశారు. ఓ వైపు కరోనా కారణంగా పేదలు మరింత పేదలవుతుంటే, స్విస్ బ్యాంకులో రికార్డులు బద్దలు చేస్తూ నల్లధనం పోగవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్చేస్తోంది. -
బయటపడుతున్న బ్లాక్మనీ
-
హైదరాబాద్లో బయటపడుతున్న వేల కోట్ల బ్లాక్మనీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీగా బ్లాక్మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల బ్లాక్మనీ లావాదేవీలు గుర్తించారు. తాజాగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ లావాదేవీలు వెలుగుచూశాయి. హైదరాబాద్కు చెందిన స్పెట్రా, సన్సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది. బ్లాక్మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కంపెనీలు తయారుచేసుకున్నాయి. యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. చదవండి: మాయమాటలు చెప్పి బాలిక కిడ్నాప్! బంజారాహిల్స్లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్పై ఎక్కించి.. -
నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు
రాంగోపాల్పేట్: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామన్నారని, విదేశాల్లో ఉన్న దాన్ని కూడా దేశంలోకి తెప్పిస్తామని చెప్పారని.. కానీ, అది రాకపోగా నల్లకుబేరులు దేశం వదలి పారిపోయేలా చేశారని ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి నీరవ్ మోదీ, చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదలి పారిపోతే బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారం చేపట్టిన మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతూపోయారని ఎద్దేవా చేశారు. మోదీ పాలన కంటే ముందు.. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టుకుని వెళ్లాలని నాడు మోదీ అన్నారని చెప్పారు. నేడు అదే సిలిండర్ ధర రూ.870 అయిందని విమర్శించారు. ఇప్పుడు సెంచరీకి చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర చూసి ప్రజలు బంకులోకి వెళ్లి మోదీ ఫొటోకు దండం పెట్టుకుంటున్నారని ఎగతాళి చేశారు. వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దేశం కోసం, ధర్మం కోసం అంటూ విరుచుకుపడుతున్నారని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది దేశం కోసం.. ధర్మం కోసమా.. అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ..? జన్ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని.. కానీ, దీనిపై తాను ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాల ద్వారా తన ఖాతాలో 15 లక్షల తిట్లు బీజేపీ నేతల నుంచి పడ్డాయని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆరున్నర సంవత్సరాల కాలంలో తాము 1,32,799 ఉద్యోగాలు కల్పించామని.. మరి మోదీ చెప్పిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై మోదీని ప్రశ్నిస్తే.. రోడ్ల పక్కన పకోడీ, ఇడ్లీ బండి పెట్టుకుని సొంత కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతున్న వారిని కూడా తాను కల్పించిన ఉద్యోగుల జాబితాలో చూపిస్తున్నారని విమర్శించారు. అమిత్షా హైదరాబాద్కు వచ్చినప్పుడు లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారని.. ఆరున్నరేళ్లలో తామే కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో అందించామని గుర్తు చేశారు. ఇవన్నీ అడిగితే.. బీజేపీ నాయకులు హిందూ, ముస్లిం, పాకిస్తాన్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుక అంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు అంటున్నారని.. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఎప్పుడైనా ప్రశ్నించారా.. అని అన్నారు. న్యాయవాదుల సంక్షే మ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తే.. తానే చేయించానని ఆ పెద్ద మనిషి చెబుతున్నారని అంత అభిమానం ఉంటే కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల నిధి ఎందుకు తీసుకుని రాలేకపోయారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు సాయం చేయాలని ఆలోచించినా సుమా రు 10–12 లక్షల మంది ఉండటంతో అది సాధ్యం కాక ఏమి చేయలేకపోయామన్నారు. విద్యావంతులంతా ఈ నెల 14న ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు కోరారు. -
హైదరాబాద్లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు 400 కోట్ల రూపాయల నల్లడబ్బును గుర్తించారు. వివరాలు.. గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీపై దాడులు చేశారు. బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 400 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు 1.66 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు, పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: చెన్నైలో పట్టుబడ్డ రూ. 220 కోట్ల నల్లధనం యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు.. -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
నల్లధనంపై పోరులో కీలక ముందడుగు
న్యూఢిల్లీ /బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించి రెండో జాబితా భారత్కు చేరింది. స్విట్జర్లాండ్తో సమాచార మార్పిడి ఒప్పందానికి (ఏఈఓఐ) అనుగుణంగా భారత్కు స్విట్జర్లాండ్ ఈ కీలక సమాచారం అందచేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) బ్యాంకు ఖాతాలపై సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్ ఒకటి. ఏఈఓఐ కింద స్విస్ బ్యాంకుల్లో భారత పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి 2019 సెప్టెంబర్లో భారత్ స్విట్జర్లాండ్ నుంచి తొలి జాబితా అందుకుంది. చదవండి : బంజారాహిల్స్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు ఈ ఏడాది 31 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకున్నామని ఎఫ్డీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. స్విస్ బ్యాంకుల్లో 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని స్విట్జర్లాండ్ పంచుకోగా అందులో భారత జాతీయులు, సంస్ధల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు 100కు పైగా వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారని అధికారులు తెలిపారు. ఇక చురుగ్గా ఉన్న ఖాతాలు, 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఈఓఐలో భాగంగా స్విస్ అధికారులు భారత్తో పంచుకుంటారు. స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాల్లో పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవులు వంటి విదేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలను అధికారులు వెల్లడించలేదున. ఒప్పంద నిబంధనల్లో పొందుపరిచిన గోప్యతా క్లాజుల కారణంగా సమాచారాన్ని వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. స్విస్ అధికారులు పంచుకునే సమాచారంలో స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారు పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్, ఆయా బ్యాంకుల పేర్లు, అకౌంట్లో బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్కం వంటి కీలక సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ రిటన్స్లో సరైన సమాచారం అందించారా లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్లో స్విస్ అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీయులు, వారి సారథ్యంలోని సంస్ధల ఖాతాలకు సంబంధించిన సమచారంతో కూడిన మూడో జాబితాను భారత్కు అందచేస్తారు. -
ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!
రాజధానే లేకుండా రాష్ట్రాన్ని విభజించి కేంద్రం సృష్టించిన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని.. దేవతల రాజు ఇంద్రుడి అమరావతిని తలదన్నే రీతిలో ఆంధ్రులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి తెర తీశారు. సన్నిహితులైన నేతలు, అనుచరులు, బినామీలకు రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తామనే అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ‘ఓత్ ఆఫ్ సీక్రసీ’కి పాతరేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు బాటలు పరిచారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లతోపాటు టీడీపీ కీలక నేతలు, బినామీలు 2014 జూన్ 1 నుంచి రాజధానిపై అధికారికంగా ప్రకటన చేసే వరకూ అంటే 2014 డిసెంబర్ 30 దాకా రైతుల నుంచి కారుచౌకగా వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సీఐడీ’ దర్యాప్తు చేస్తోంది. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో చంద్రబాబు, నారా లోకేష్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడటానికి సంబంధించి ఒక భాగం ఈ కథనం. సాక్షి, అమరావతి: ఓత్ ఆఫ్ సీక్రసీ (అధికారిక రహస్యాల ప్రమాణం)ని తుంగలో తొక్కి.. రాజధాని ఏర్పాటు చేయబోయే ప్రాంతంపై సన్నిహితులకు లీకులిచ్చి.. ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరతీసి.. రైతుల నుంచి చౌకగా భూములు కాజేశాక.. తాపీగా ‘అమరావతి’ని ప్రకటించి రూ.వేల కోట్లు దోచేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ నేతల బాగోతం సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) దర్యాప్తులో బట్టబయలైనట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులపై ఐపీసీ 418, 420, 406, 403, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు సీఐడీ సిద్ధమైంది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన వారి ఆదాయ మార్గాలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. ఆదాయపు పన్ను చెల్లించకుండా నల్లధనం(బ్లాక్ మనీ)తో భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. పన్నులు ఎగవేసిన భూచోళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు తెలిసింది. నేతల భూ దోపిడీకి ఆధారాలు ఇవిగో.. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన భూముల క్రయవిక్రయాలపై సీఐడీ దర్యాప్తు చేసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి సేకరించిన పత్రాలను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. దర్యాప్తులో వెల్లడైన అంశాల్లో మచ్చుకు కొన్ని ఇవీ.. - రాజధానికి కూత వేటు దూరంలో ఉండే తాడికొండలో 2014 జూన్ 6న అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు సర్వే నెంబర్ 93–బీలో 7.12 ఎకరాలను తన అల్లుడు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కుమార్ పేరుతో కొనుగోలు చేశారు. విజయవాడకు చెందిన జీబీఆర్ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ గడ్డం బుచ్చారావుకు చెందిన ఈ భూమిని ఎకరం రూ.21 లక్షల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో రెండు రోజులకు అంటే జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. - అమరావతి మండలం వైకుంఠపురం సర్వే నెంబర్ 257లో 1.12 ఎకరాలను ఎకరం రూ.1.12 కోట్ల చొప్పున గుమ్మడి సురేష్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నవంబర్ 21, 2014న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతవరం, నిడమర్రు, మంగళగిరి, పెదపరిమి గ్రామాల్లో కూడా 30.32 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు. గుమ్మడి సురేష్ ఆదాయ మార్గాలు, ఆదాయపు పన్ను చెల్లింపులను పరిశీలించిన సీఐడీ అతడికి అంత భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసే స్థోమత లేదని నిర్దారణకు వచ్చింది. గుమ్మడి సురేష్కు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న సన్నిహిత సంబంధాలపై ఆధారాలను సేకరించింది. - చంద్రబాబు సన్నిహితుడు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఫిరంగిపురం, జి.కొండూరు మండలం వెంకటాపురం, నవులూరు, ఆత్మకూరు, కంకిపాడు మండలం పమిడిముక్కల, జగన్నాథపురం, ఇబ్రహీంపట్నంలలో జూన్ 19, 2014న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5704, 5704, 5706ల ద్వారా, జూలై 22, 2014న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 7627 నుంచి 7637 వరకు 60 ఎకరాలను రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. - చంద్రబాబు మరో సన్నిహితుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబర్ 430/1, 430/3లలో సెప్టెంబరు 23, 2014న ఎకరం రూ.22.62 లక్షల చొప్పున తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో భూములు కొన్నారు. మందడంలో గోనుగుంట్ల సత్యనారాయణ, కుమార్తె లక్ష్మీ సౌజన్య పేరుతో 9.65 ఎకరాలు కొన్నారు. వెలగపూడిలో 4.71, కొండమరాజుపాలెంలో 2.04, ఐనవోలులో 2.43, నేలపాడులో 4.03, నీరుకొండలో 1.29, వెంకటపాలెంలో 0.7 ఎకరాలను లక్ష్మీసౌజన్య పేరుతో కొన్నారు. లింగాయపాలెంలో సత్యనారాయణ పేరుతో 1.25 ఎకరాలు, సన్నిహితుడు కొత్త వెంకట ఆంజనేయులు, కొత్త శివరామకృష్ణల పేర్లతో వెంకటపాలెంలో 0.60 ఎకరాలు కొన్నారు. మందడంలో 2.985 ఎకరాలను జీవీఆర్ ఆంజనేయులు కొనుగోలు చేశారు. వీటిని డిసెంబర్ 30, 2014కు ముందే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సీఐడీ తేల్చింది. - ధూళిపాళ్ల నరేంద్ర తుళ్లూరు మండలం కొండమరాజుపాలెం 1.21 ఎకరాలను ఎకరా రూ.6.05 లక్షల చొప్పున తన కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఐనవోలులో 69–1లో 0.22, 69–2లో 1.86 ఎకరాలను కుమార్తె పేరుతో కొన్నారు. ఈ భూములను డిసెంబర్ 2014కు ముందే కొనుగోలు చేసి రాజధాని ప్రకటన వెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. - చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన వేమూరి రవికుమార్ ప్రసాద్ డైరెక్టర్గా ఉన్న సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోష్ఫాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేర్లతో తుళ్లూరు, వైకుంఠపురం, మందడం, వెంకటపాలెం, ధరణికోటలలో 25.91 ఎకరాలు కొనుగోలు చేశారు. నారా లోకేష్ సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు ప్రతినిధిగా ఉన్న ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శాఖమూరు, వెలగపూడి, ధరణికోటలో 5.16 13.15 ఎకరాలు కొన్నారు. ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కంతేరులో 13.15 ఎకరాల కొన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూములన్నీ డిసెంబర్ 30, 2014లోపు కొన్నవే. - పయ్యావుల కేశవ్ తుళ్లూరు మండలం ఐనవోలులో సర్వే నెంబరు 48/3లో 2.13 ఎకరాలను ఎకరం రూ.6.39 లక్షల చొప్పున తన కుమారుడు విక్రమసింహా పేరుతో కొనుగోలు చేసి అక్టోబర్ 13, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఐనవోలులోనే ఎకరం రూ.5.88 లక్షల చొప్పున మరో 1.96 ఎకరాలను విక్రమసింహా పేరుతో నవంబర్ 3, 2014న కేశవ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కొండమరాజుపాలెంలో పయ్యావుల విక్రమసింహా పేరుతో 4.84 ఎకరాలు, తన సోదరుడి కుమార్తె హారిక పేరుతో 1.18 ఎకరాలను కేశవ్ కొనుగోలు చేశారు. - ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తెలంగాణ నేత వేం నరేంద్రరెడ్డి తన కుమారుడు వేం కృష్ణ కీర్తన్ పేరుతో ఐనవోలులో 1.99 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 0.50 ఎకరాలను కొనుగోలు చేశారు. తనకు సన్నిహితుడైన వేమీశ్వర్రెడ్డి పేరుతో కొండమరాజుపాలెంలో 1.20 ఎకరాలను డిసెంబర్ 30, 2014కు ముందే కొన్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. - తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్ 112/డీలో తన కుమారుడు పల్లె కృష్ణ కిశోర్రెడ్డి పేరుతో ఎకరం రూ.5.07 లక్షల చొప్పున 1.69 ఎకరాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిసెంబర్, 2014కు ముందే కొనుగోలు చేసి మార్చి 30, 2016న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేలపాడులోనే మరో 0.84 ఎకరాలను తన కుమారుడి పేరుతో మే 5, 2016న పల్లె రఘునాథరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే? ఐపీసీ సెక్షన్ 418: ఓ లావాదేవీకి సంబంధించి ప్రయోజనాలను పరిరక్షించి తీరాల్సి ఉన్నా, నష్టం వస్తుందని తెలిసీ మోసానికి పాల్పడటం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా, రెండూ విధించవచ్చు. 420: వంచన లేదా మోసం ద్వారా ఆస్తిని బదలాయించడం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు. 403: దురుద్దేశంతో ఆస్తిని దుర్వినియోగం చేయడం. ఈ నేరానికి గాను రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు. 406: నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు 409: ఆస్తి విషయంలో పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్ లేదా వ్యాపారి, ఏజెంట్ నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను పదేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచు. పక్కా ప్రణాళికతో... - జూన్ 12, 2014న విశాఖపట్నంలో చంద్రబాబు తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతంపై అప్పటికే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆ విషయం వెల్లడించకుండా చినబాబు, తన కోటరీ ప్రధాన నేతలకు మాత్రమే ఉప్పందించారు. ఆ తర్వాత రహస్య అజెండాలో భాగంగా నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు పరిసరాల్లో రాజధాని అంటూ కొందరు మంత్రులు ప్రచారం చేశారు. ఇదే అదనుగా ఈ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసి పది రోజుల్లోనే ఎన్నారైలకు విక్రయించిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందినట్లు టీడీపీ కీలక ఎంపీ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. - టీడీపీ నేతలు మారుబేరాలు చేసి కనిష్ఠంగా రూ.15 వేల కోట్లను కొల్లగొట్టినట్లు రియల్ వర్గాల అంచనా. ఇలా దోచేసిన డబ్బులతోనే మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల్లో చంద్రబాబు బృందం భారీగా భూములు కొనుగోలు చేసింది. - గుంటూరు–విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ఆగస్టు 9, 2014న వేర్వేరు సమావేశాల్లో ప్రకటించారు. దీంతో నూజివీడు, గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ భూములు కొన్న ఎన్నారైలు, చిన్న వ్యాపారులు సంక్షోభంలో కూరుకుపోయారు. దిక్కుతోచక కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. - తాడికొండ మండలం కంతేరు వద్ద సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలను రూ.67.88 లక్షలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కొనుగోలు చేసి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. జూలై 7, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8, 2014న కంతేరులోనే సర్వే నెంబర్లు 63/బి, 56లలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లింగమనేని ఇన్ఫో సిటీ సంస్థకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ నుంచి జీపీఏ ద్వారా కంతేరు వద్దే సర్వే నెంబర్లు 63/2బి, 63/1, 56 సర్వే నెంబర్లలో ఉన్న 4.55 ఎకరాలను రూ.36.40 లక్షలకు కొనుగోలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఇలా 14.22 ఎకరాలను కేవలం రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. అధికారిక రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన మరుక్షణమే చంద్రబాబు వాటికి తిలోదకాలు ఇచ్చారనేందుకు హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములే నిదర్శనం. - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నన్నపనేని లక్ష్మీనారాయణ అత్యంత సన్నిహితుడు. రాజధానికి కూత వేటు దూరంలో చంద్రబాబు, యనమల కొనుగోలు చేసిన భూమికి సమీపంలోనే నన్నపనేని లక్ష్మీనారాయణ పేరుతో సర్వే నెంబర్ 397–బీ, 398–బీ లో 1.5 ఎకరాలు, 397–ఎ2, 397–ఎ1, 398–ఎ, 397–బీ, 398–బీలో 4.505 ఎకరాలు, 380లో ఒక ఎకరాతోపాటు మరో సర్వే నంబర్తో కలిపి మొత్తం 7.50 ఎకరాల భూమిని రూ.కోటికే కొనుగోలు చేసి ఆగస్టు 13, 2014న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాజధానిపై దేవినేని ఉమాకు నాడు చంద్రబాబు ముందే సమాచారం ఇచ్చి భూమిని కొనుగోలు చేయించారు అనడానికి ఈ రిజిస్ట్రేషన్ పత్రాలే రుజువు. -
క్యాషే కింగ్!
నగదు లావాదేవీల్లో బ్లాక్ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్లో నల్లధన లావాదేవీలకు పేరొందిన నగరాలు ఎంఎంఆర్, ఎన్సీఆర్. ఇక్కడ ప్రైమరీ గృహ అమ్మకాల్లో నగదు వినియోగం తగ్గినప్పటికీ.. రీసేల్ ప్రాపరీ్టల్లో మాత్రం క్యాషే కింగ్. మొత్తం ప్రాపర్టీ విలువలో 20–25 శాతం నల్లధనం రూపంలోనే జరుగుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. . బెంగళూరు, పుణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ రీసేల్ గృహాల మార్కెట్లలో బ్లాక్మనీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రాపర్టీ విలువలో సుమారు 30 శాతం దాకా నగదు రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. క్యాషే కింగ్ ఎందుకంటే? సర్కిల్ రేట్ల కంటే మార్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్న చోట, ఊహాజనిత (స్పెక్లేటివ్) కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు లావాదేవీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్కిల్ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోని రియల్టీ లావాదేవీల్లో నల్లధనం వినియోగం చాలా తక్కువ. ఉదాహరణకు గుర్గావ్లోని ఎంజీ రోడ్లో సగటు సర్కిల్ రేటు చ.అ.కు రూ.11,205లుగా ఉంటే.. మార్కెట్ రేటు రూ.11,000లుగా ఉంది. అలాగే డీఎల్ఎఫ్ సిటీ ఫేజ్–4లో డెవలపర్ విక్రయించే మార్కెట్ రేటు, అక్కడి సర్కిల్ రేటు రెండూ చ.అ.కు రూ.10,800లుగా ఉంది. ముంబైలోని లోయర్ పరేల్లో సర్కిల్ రేటు చ.అ.కు రూ.32,604, అదే మార్కెట్ రేటు రూ.32,750లుగా ఉంది. రీసేల్ నగదు రూపంలోనే.. ప్రాథమిక గృహాల్లో కంటే రీసేల్ ప్రాపర్టీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరుగుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు అధికారిక చెల్లింపులను మాత్రమే అకౌంటెడ్గా చేస్తున్నారని.. మిగిలిన చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేస్తున్నారు. రీసేల్ ప్రాపరీ్టల్లో ధర, పారదర్శకత రెండూ నల్లధన ప్రవాహానికి కారణమవుతున్నాయి. రీసేల్ ప్రాపరీ్టలకు స్థిరమైన ధర, క్రయవిక్రయాల్లో కఠిన నిబంధనలు లేకపోవటమే ఇందుకు కారణమని అనూజ్ పూరీ తెలిపారు. ప్రాథమిక గృహాల ధర స్థానిక మార్కెట్ను బట్టి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపరీ్టలకు లొకేషన్, వసతులు తదితరాల మీద ఆధారపడి ధరల నిర్ణయం ఉంటుంది. హైదరాబాద్లో... హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నల్లధనం వినియోగం ఎక్కువగా జరిగేది స్థలాలు, ప్రీలాంచ్ గృహాల కొనుగోళ్లలోనే. పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్లు క్యాష్ రూపంలో జరగడానికి ప్రధాన కారణం.. ఆఫీసర్లే! ఎందుకంటే చేయి తడిపితే గానీ పని చేయని ఆఫీసర్లు బోలెడు మంది. పెద్ద మొత్తంలోని ఈ సొమ్మును రియల్ ఎస్టేట్లో తప్ప బ్యాంక్లోనో లేక ఇంట్లోనో దాచుకోలేరు. అందుకే భారీగా స్థలాలు, ప్రీమియం గృహాల కొనుగోళ్లు చేస్తుంటారని అప్పా జంక్షన్కు చెందిన ఓ డెవలపర్ ‘సాక్షి రియలీ్ట’కి తెలిపారు. క్యాష్ను తగ్గించాలంటే? రియల్టీ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని తగ్గించాలంటే మార్కెట్ ధరలను పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గించాలని షాద్నగర్కు చెందిన ఓ డెవలపర్ సూచించారు. ఉదాహరణకు సదాశివపేటలో మార్కెట్ రేటు ఎకరానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ విలువ రూ.70 వేలుగా ఉంది. ఈ లావాదేవీలను వైట్ రూపంలో ఇవ్వడానికి డెవలపర్ రెడీనే. కానీ, అమ్మకందారులు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఎక్కువ మొత్తం స్టాంప్ డ్యూటీని చెల్లించేందుకు అమ్మకందారు ఒప్పకోడు. అదే ఒకవేళ ప్రభుత్వం గనక ప్రభుత్వ రేటును పెంచి.. స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే వైట్ రూపంలో లావాదేవీలు జరిపేందుకు ముందుకొస్తారు. -
క్యాష్ ఈజ్ కింగ్!
పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరి ఈ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి? ఆర్థిక వ్యవస్థపై, సామాన్యుల జీవితాలపై ఇది చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా బయటపడినట్లేనా? సాక్షి, బిజినెస్ విభాగం: 2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. జేబులోని డబ్బు మొదలెడితే... అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకు లో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్లూ వచ్చాయి. ప్రభు త్వం భీమ్ యాప్ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు..?!! మళ్లీ క్యాష్ జమానా! నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉన్నది ఇప్పుడే!. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది. అదే సమయంలో డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది. మరోవైపు, చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది. ప్రజలు డబ్బును బ్యాంకుల్లో ఉంచడం కన్నా తమ ఇంట్లో దాచుకోవటమే మంచిదన్నట్లు ఈ ధోరణి తెలియజేస్తోందని ఎన్ఏఎస్ వెల్లడించింది. మరి బ్లాక్మనీ సంగతి? నలుపు... తెలుపైపోయిందా? నల్లధనంపై పోరు పేరిట మోదీ సర్కార్ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్బీఐ ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని నల్ల ధనం రూపంలో (రూ.500, రూ.1,000 నోట్ల కింద) ఉల్లంఘనుల దగ్గర ఉందన్న అంచనాలతో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కనక ఉల్లంఘనులు పెద్ద నోట్లను డిపాజిట్ చేయరని, నికరంగా వ్యవస్థలో వైట్ మనీ ఎంతుందో తేలుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఆర్బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం. రేపో మాపో వీటినీ రద్దు చేయొచ్చనే వదంతులు షికార్లు చేస్తున్నాయి. ► రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు ► బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు ► వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు ► తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు డిజిటల్ లావాదేవీల్లోనూ వృద్ధి.. నోట్ల రద్దు తరవాత డిజిటల్ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. ఆర్బీఐ, ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి. మందగమనానికి బీజం.. ఆర్థిక వ్యవస్థ నుంచి నల్లధనాన్ని తొలగించడంలో నోట్ల రద్దు ప్రయోగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రజలు కరెన్సీ రూపంలో భారీగా నగదు దాచిపెట్టుకోవడానికి ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం కారణమైనప్పటికీ.. ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనానికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి. ► నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది. ► 2017 జులైలో కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ).. వ్యవస్థను మరింత కుంగదీసింది. ఎగుమతిదారులకు రీఫండ్లలో జాప్యాల వల్ల ఆ ఏడాది ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ► నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో.. రుణాలభారంతో ఐఎల్అండ్ఎఫ్ఎస్ కుదేలవటం గతేడాది నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని అతలాకుతలం చేసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధాలతో పరిస్థితి మరింత దిగజారింది. కష్టాలకు అదే మూలం.. డీమోనిటైజేషన్ వల్ల నగదు లభ్యత తగ్గిపోయి.. నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడే అసంఘటిత రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అంతం లక్ష్యమని చెప్పినప్పటికీ మరింత పెద్ద నోట్లను ప్రవేశపెట్టడం వల్ల అక్రమ చెల్లింపులు మరింత సులభతరం చేసినట్లయింది. – అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత -
నల్లకుబేరుల జాబితా అందింది!
న్యూఢిల్లీ/బెర్న్: భారతీయ పౌరులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. తమ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం సోమవారం భారత్కు అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్టీఏ)తో అంగీకారం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. రెండో జాబితాను ఒప్పందం ప్రకారం 2020 సెప్టెంబర్లో అందజేస్తామని ఎఫ్టీఏ అధికారి తెలిపారు. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో ఎంతమొత్తం ఆస్తులున్నదీ వెల్లడించేందుకు ఎఫ్టీఏ నిరాకరించింది. ఇవి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది, వాణిజ్య, ఇతర అవసరాలకు వాడుతున్న అకౌంట్లు మాత్రమే. ఎఫ్టీఏ తెలిపిన వివరాల్లో చాలామటుకు వ్యాపారులతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులవేనని పలువురు అధికారులు అంటున్నారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. రిటర్నుల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోని తమ ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా సమర్పిస్తున్నారా లేదా అనేది దీని ద్వారా రూఢి చేసుకోవచ్చని ఎఫ్టీఏ తెలిపింది. ఎఫ్టీఏ అందజేసిన సమాచారంలోని.. ఖాతాదారుల డిపాజిట్లు, లావాదేవీలు, సంపాదన, పెట్టుబడులు, తదితర వివరాలుంటాయి. వీటి సాయంతో బయటకు వెల్లడించని ఆస్తులున్న వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు ప్రారంభించడం, స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరడంతో దాదాపు 100 మంది భారతీయ కుబేరులు 2018కి ముందే తమ ఖాతాలను రద్దు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారులేనని అంటున్నారు. కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన కొందరి ఖాతాదారుల వివరాలను అందజేసే విషయమై ఆగస్టులో స్విస్ బృందం భారత్కు వచ్చి, ఆయా వివరాల గోప్యతకు హామీ పొందింది. ఎఫ్టీఏలో భారత్ సభ్యత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది. -
భారత్ చేతిలో స్విస్ ఖాతాల సమాచారం..
సాక్షి, న్యూఢిల్లీ : నూతన సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా స్విస్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించిన తొలి సమాచారాన్ని భారత్ అందుకుంది. విదేశాల్లో దాగిన నల్లకుబేరుల బ్లాక్మనీ వెలికితీసే ప్రక్రియలో ఇది భారీ ముందడుగుగా భావిస్తున్నారు. భారత్తో పాటు 75 దేశాలు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ (ఎఫ్టీఏ) నుంచి ఈ తరహా సమాచారాన్ని పొందుతాయని ఎఫ్టీఏ ప్రతినిధి వెల్లడించారు. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఇఓఐ) ఫ్రేమ్వర్క్ కింద స్విట్జర్లాండ్ నుంచి భారత్ తమ ఖాతాదారుల వివరాలపై సమాచారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, క్లోజయిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో పొందుపరిచారు. 2020 సెప్టెంబర్లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్టీఏ మొత్తంమీద 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్ ఇన్కమ్ వంటి పలు వివరాలు ఉంటాయి. ఆ గుట్టు తెలిస్తే.. భారత్కు స్విస్ బ్యాంకుల నుంచి లభించిన వివరాలతో అనధికార సంపద పోగేసిన వారిపై గట్టి చర్యలు చేపట్టేందుకు వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఖాతాలకు సంబంధించి డిపాజిట్లు, నగదు బదిలీ, పెట్టుబడుల ద్వారా రాబడులు వంటి కీలక సమాచారం వెల్లడవడంతో నల్ల కుబేరుల గుట్టుమట్లు దర్యాప్తు అధికారులకూ కీలక ఆధారాలుగా మారనున్నాయి. కాగా స్విస్ యంత్రాంగం అందించిన సమాచారం ఎక్కువగా భారత వాణిజ్యవేత్తలు, అమెరికా=బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో స్ధిరపడిన ఎన్ఆర్లకు చెందినవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని పలు దేశాలు నిర్ణయించిన క్రమంలో పలువురు భారతీయులు ఇప్పటికే స్విస్ సహా విదేశీ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేశారనే ప్రచారం సాగుతోంది. -
సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా విదేశాలకు నల్లధనం
న్యూఢిల్లీ: స్విస్బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్ సాఫ్ట్వేర్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు విషయంలో పన్ను అధికారులు స్విట్జర్లాండ్ ప్రభుత్వ సాయాన్ని కోరారు. దీంతో మోటెక్ సాఫ్ట్వేర్కు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేరషన్ (ఎఫ్టీఏ) నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా నియమిత వ్యక్తి (నామినేటెడ్) వివరాలను సమర్పించాలని కోరింది. సమాచారం పంచుకోవడాన్ని వ్యతిరేకించే హక్కును వినియోగించుకునేందుకే చట్టబద్ధంగా ఈ నోటీసు జారీ చేసింది. జెనీవా బ్రాంచ్లో 500 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లతో అతిపెద్ద భారత ఖాతాదారుగా మోటెక్ సాఫ్ట్వేర్ పేరు ఇటీవలే వెలుగు చూసిన హెచ్ఎస్బీసీ జాబితాలో ఉండడం గమనార్హం. -
ఒక్క ఫోన్కాల్తో రూ.5 కోట్లు!
-
‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం
న్యూఢిల్లీ : 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు, విరాళంగా ఇచ్చే ‘ఎన్నికల బాండు’లకు సంబంధించి ఆశ్చర్యకరమైన కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం 5,800 కోట్ల రూపాయల బాండులను భారతీయ స్టేట్ బ్యాంక్ విడుదల చేయగా, అందులో 95 శాతం నిధులు పాలకపక్ష భారతీయ జనతా పార్టీకే వెళ్లిన విషయం తెల్సిందే. ఈ లావా దేవీలకు సంబంధించి బ్యాంకుకు వెళ్లాల్సిన కమిషన్ను గత మే నెల 27వ తేదీ నాటికి 3.24 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించినట్లు సామాజిక కార్యకర్త లోకేష్ భాత్రా ఆర్టీఐ కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్యాంకులు తామందించే ప్రతి సర్వీసుకు కమిషన్ లేదా చార్జీలను వినియోగదారుల నుంచే వసూలు చేస్తాయి. ఉదాహరణకు బాంకు నుంచి డిమాండ్ డ్రాప్టు తీసుకుంటే తీసుకున్న మొత్తాన్ని బట్టి చార్జీలను వినియోగారుడి నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇక్కడ ఎన్నికల బాండులను పరిగణలోకి తీసుకుంటే వ్యక్తులు లేదా సంస్థలు, రాజకీయ పార్టీల మధ్య జరిగే లావా దేవీల వ్యవహారం. ఎన్నికల బాండలు తీసుకున్న వ్యక్తులు, లేదా సంస్థలు బ్యాంకు చార్జీలను చెల్లించాలి, అది కాదనుకుంటే ఎన్నికల బాండుల ద్వారా లబ్ధి పొందే రాజకీయ పార్టీలు చెల్లించాలి. ఈ మొత్తం వ్యవహారానికి ఎలాంటి సంబంధంలేని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కమిషన్ చెల్లించడం ఏమిటీ ? అందులోను పన్ను చెల్లింపు దారుల నుంచి సేకరించిన సొమ్మును అటు మళ్లించడం ఏమిటీ? మొదటి నుంచి ఈ ఎన్నికల బాండులకు సంబంధించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. నల్లడబ్బు రాజకీయ పార్టీలకు చేరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, పెట్టామని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆకాశ రామన్న పేరిట అజ్ఞాత వ్యక్తులు బ్యాంకుల నుంచి ఎన్నికల బాండులు తీసుకుంటున్నారు, వాటిని తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు మాత్రం వారి వివరాలను నోటు చేసుకుంటున్నాయి. అయితే ఆర్టీఐ చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయించడం వల్ల ఆ పార్టీ ఈ ఎన్నికల బాండుల వివరాలను వెల్లడించడం లేదు. బ్యాంకులు వెల్లడించడం లేదు. నిజంగా మోదీ ప్రభుత్వం కోరుకున్నట్లుగా నల్లడబ్బును ఈ విషయంలో అరికట్టాలంటే తాము తీసుకునే ఎన్నికల బాండులకు ఆదాయం పన్ను నుంచి క్లియరెన్స్ తీసుకరావాలనే షరతు విధించాలి. అలా విధిస్తే అధికారపక్షానికి ఆశించిన విరాళాలు రావుగనుక అది అంతకు సాహసిస్తుందని ఆశించలేం. -
ముసద్దిలాల్ జ్యువెల్లర్స్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో తప్పుడు ఇన్వాయిస్లతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయంలో అడ్డంగా దొరికిపోయిన ముసద్దిలాల్ జ్యువెల్లర్స్పై తాజాగా మరో కేసు నమోదైంది. తమకు రూ.75 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) ఫిర్యాదుతో సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలను నిందితులుగా చేర్చింది. పంజగుట్ట కేంద్రంగా నడుస్తోన్న ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009 అక్టోబర్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.55 కోట్లు రుణం తీసుకుంది. ఈ క్రమంలో తమ రుణాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఓబీ)కు మార్చాలంటూ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ ఐఎన్జీ వైశ్యా బ్యాంకుకు విన్నవించుకుంది. బ్యాలెన్స్ షీట్ సరిగానే నిర్వహించడంతో సంతృప్తి చెందిన ఐఎన్జీ వైశ్యా బ్యాంకు 2013 మార్చిలో ఆ రుణాన్ని ఐవోబీ బ్యాంకుకు మార్చారు. ఆ తర్వాత బ్యాంకు వద్ద మరికొంత రుణం తీసుకున్నారు. అది కాస్తా రూ.82 కోట్లకు చేరింది. రానురాను రుణాన్ని తిరిగి చెల్లించడంలో ముసద్దిలాల్ జ్యువెల్లర్స్ విఫలమవుతూ వచ్చింది. దీంతో 2014 మార్చిలో ఖాతాలను బ్యాంకు స్తంభింపజేసింది. 2016లో జరిగిన ఆడిట్ తనిఖీల్లో వారు తీసుకున్న రుణంలో రూ.58 కోట్ల రూపాయలను ఇతర కంపెనీలకు మళ్లించినట్లుగా గుర్తించారు. దీంతో తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి తమకు రూ.75 కోట్లు ఎగ్గొట్టారని బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఐవోబీ బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ రవిచంద్రన్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ బెంగళూరు శాఖ ముసద్దిలాల్ జ్యువెల్లర్స్తోపాటు కంపెనీ డైరెక్టర్లు మోహన్లాల్ గుప్తా, ప్రశాంత్ గుప్తాలపై ఐపీసీ 120, 406, 420, 468, 471 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసింది. -
ప్రభుత్వం చేతికి స్విస్ ఖాతాదారుల వివరాలు
న్యూఢిల్లీ/ బెర్న్: నల్లధనంపై కేంద్రం ప్రకటించిన పోరు క్రమంగా ఫలితాలనిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (ఎఫ్డీఎఫ్) వెల్లడించింది. అటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివి. మురళీధరన్ కూడా ఈ విషయాలు లోక్సభకు తెలిపారు. తొలి సెట్ సెప్టెంబర్లో లభిస్తుందని, ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాతిపదికన స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల వివరాలు ప్రభుత్వం చేతికి వస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని భారత్కు స్విట్జర్లాండ్ అందిస్తోంది. తాజా వివరాలు దీనికి అదనంగా ఉంటాయి. ఏఈవోఐ కింద తమ ఖాతాదారుల వివరాలను బ్యాంకులు స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆయా ఖాతాదారుల దేశాల పన్ను శాఖ అధికారులకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆటోమేటిక్గా చేరవేస్తుంది. ఇందులో ఖాతాదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు మొదలైన వివరాలు ఉంటాయి. -
విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: భారతీయులు తమ నల్లధనాన్ని భారీ మొత్తంలో విదేశాల్లో దాచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమైంది. ఇదంతా కేవలం 1980–2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎమ్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. 1980–2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్సీఏఈఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది. 1990–2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్ఐఎఫ్ఎమ్ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది. అయితే నల్లధనానికి సంబంధించి ఈ మూడు సంస్థల నివేదికలు ఒకేలా ఉంటాయని భావించలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారని పార్లమెంటరీ ప్యానల్ తన నివేదికలో వెల్లడించింది. దీనిని ప్రాథమిక నివేదికగానే భావించాల్సి ఉందని.. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. -
నల్ల కుబేరులకు ‘స్విస్’ నోటీసులు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకు ఖాతాల్లో నల్లధనం దాచుకున్న వారికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతున్నాయి. తాజాగా 11 మంది భారతీయులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తాఖీదులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనున్నామని, దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించింది. అప్పీల్ చేసుకోవడానికి ఇదే ఆఖరు అవకాశమని స్పష్టం చేసింది. వీరిలో కృష్ణ భగవాన్ రామ్చంద్, కల్పేష్ హర్షద్ కినారివాలా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. మిగతా వారి పేర్లను కేవలం పొడి అక్షరాలతో మాత్రమే స్విస్ ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించింది. దశాబ్దాలుగా నల్ల కుబేరులకు స్విస్ బ్యాంకులు ఊతంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్ బ్యాంకుల భారతీయ క్లయింట్స్కు 25 నోటీసులు దాకా జారీ అయినట్లు సమాచారం. -
నల్లధనం కోసం నోట్ల రద్దు
బాజీపుర(గుజరాత్): పాత రూ. 500, రూ. 1,000 నోట్లతో ఎక్కువ మొత్తం నల్లధనం సృష్టించేందుకు సాధ్యపడటం లేదు కాబట్టే ప్రధాని మోదీ అకస్మాత్తుగా నోట్ల రద్దు చేసి ఏకంగా రూ. 2,000 నోటును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. రూ. 2 వేల నోటైతే భారీస్థాయిలో బ్లాక్మనీని ఎక్కువగా దాచేయొచ్చని మోదీ ఇలా చేశారని రాహుల్ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా అమలు చేయకపోవడం వంటి మోదీ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనీ, తాము తేనున్న కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్)తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని రాహుల్ చెప్పారు. గుజరాత్లోని బర్దోలీ జిల్లా బాజీపురలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయ్ పథకం కింద తాము పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చేస్తామనీ, దీంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని దేశ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించకపోయినా వారు జైలుకు వెళ్లకుండా ఉండేలా తాము కొత్త చట్టం తెస్తామని రాహుల్ హామీనిచ్చారు. పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో తమ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశాయని ఆయన చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాహుల్ గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని రాయచూరులోనూ రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీని పదవి నుంచి దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారనీ, లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసేది తమ పార్టీయేనని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ‘దేశాన్ని పటిష్టం చేయడం గురించి మోదీ మాట్లాడతారు. కానీ యువతకు ఉద్యోగాలు లేకపోతే దేశం పటిష్టం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా గెలుస్తారు. ఢిల్లీ నుంచి మోదీని ప్రజలు పంపిస్తారు’ అని అన్నారు. ఆచూకీ చెబితే లక్ష ఇస్తాం: సిబల్ అహ్మదాబాద్లో పాతనోట్లను అక్రమంగా మారుస్తున్నట్లుగా వచ్చిన వీడియోలో ఉన్న వ్యక్తి గుర్తింపు వివరాలు చెప్పినవారికి కాంగ్రెస్ లక్ష రూపాయల బహుమానం ఇస్తుందని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ శుక్రవారం ప్రకటించారు. పాతనోట్ల మార్పిడికి గడువ ముగిశాక రూ. 5 కోట్ల పాత నోట్లను అహ్మదాబాద్లో మార్చి ఇస్తున్నట్లుగా గతంలో ఓ వీడియో బయటకు రావడం తెలిసిందే. -
నరేంద్రజాలం
నాది 56 అంగుళాల ఛాతీ. నాకున్న దమ్ముతో దేశాన్ని నిలబెడతా అంటూ ప్రచారం చేసుకోవడమా?.. చాయ్వాలా కూడా ప్రధాని కాగల దేశం మనదేనంటూ విదేశీ వేదికలపై కూడా భారత్ ఔన్నత్యాన్ని చాటి చెప్పడమా?.. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ వంశ పారంపర్య పాలనపై నిప్పులు చెరగడమా?.. ప్రజాస్వామిక స్వేచ్ఛ గురించి పదేపదే తన ప్రసంగాల్లో చెప్పడమా?.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక యూత్ ఐకాన్గా ఎలా ఉన్నారు? గత ఐదేళ్లలో ప్రధానిగా ఎన్నో రంగాల్లో విఫలమైనా ఆయన ఇమేజ్ చెక్కు చెదరకుండా ఎలా ఉంది?.. ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక కైలీ జెన్నర్లా యూత్లో మోదీకి ఫాలోయింగ్ ఎలా పెరిగిపోతోంది? మోదీ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, మరెన్నో వైఫల్యాలు. కానీ ఆ వైఫల్యాలను ప్రజలు మరచిపోయేలా ఆయన ఒక మాయాజాలాన్నే సృష్టించారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగం రేటు తారాజువ్వలా దూసుకుపోతూ రికార్డు సృష్టించింది. ఉగ్రవాదాన్ని అరికడతానని, బ్లాక్ మనీని బయటకు తీస్తానని పెద్ద నోట్లు రద్దు చేశారు. జనం పడరాని పాట్లు పడ్డారు. గ్రామీణ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకల పీచమణచారు. కానీ బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందన్నట్టుగా కశ్మీర్లో మిలిటెన్సీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రమూకలు పంజా విసిరాయి.. కశ్మీర్ లోయలో బీభత్సం సృష్టించారు. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ అదరలేదు. బెదరలేదు. పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆయన స్వరంలో ధ్వనించే ఆగ్రహావేశాలు, భారత్ ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడినప్పడు మోదీ మాటల్లో తొణకిసలాడే ఆత్మవిశ్వాసం, సోషల్ మీడియాలో తన గురించి తాను చేసుకునే ప్రచారం ఇవన్నీ ఆయన వైఫల్యాలను పక్కనే పెట్టేలా చేశాయనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో యువతరం గుజరాత్ అభివృద్ధి నమూనాయే ఆదర్శంగా నమో మంత్రాన్ని జపించారు. ఈసారి కూడా ఆయనకున్న చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆయన సృష్టించిన మాయాజాలంలో పడి యువత కొట్టుకుపోతోంది. వాస్తవ ప్రపంచంలో ఆయన ఏం చేశారన్నది కాదు, సోషల్ మీడియాలో ఓ వర్చువల్ రియాల్టీని మోదీ సృష్టించి యువతరం తన చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. దటీజ్ మోదీ!. ట్రంప్, కైలీ, మోదీ.. అందరిదీ ఒకే బాట యువభారతం మోదీ వెంట ఉన్నదంటే ఇదేదో ఎన్నికలో, రాజకీయాలో అని భావించనక్కర్లేదు. వీటన్నింటికి మించి ఆయన యువతరంతో ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అరచేతిలో స్వర్గం చూపిస్తారని అంటారే, అచ్చంగా అలాగే భారత్ బంగారు భవిష్యత్ గురించి తాను కంటున్న కలలు ఈస్ట్మన్ కలర్లో అందరికీ చూపించడమే ఆయన నేర్పరితనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎన్ని విమర్శలున్నాయో, ఆయనను సెభాష్ అని మెచ్చుకునే వారూ అంతేమంది ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రంప్ ట్వీట్లు ఎంత వివాదాస్పదం అవుతాయో, అంతే వైరల్ అవుతాయి కూడా. అమెరికా మీడియా పర్సనాలిటీ, మోడల్ కైలీ జెన్నర్ వయసు 20 ఏళ్లయినప్పటికీ ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువతరం గుడ్డిగా అదే ఫాలో అవుతుంది. జనంలో ఉన్న ఆ క్రేజ్నే పెట్టుబడిగా పెట్టి ఆమె మొదలు పెట్టిన కైలీ కాస్మోటిక్స్తో ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా సంపాదిస్తున్నారంటే ఎవరైనా అవాక్కవాల్సిందే. మోదీది కూడా వారి బాటే. ఆకర్షించే ట్వీట్లు.. యూ ట్యూబ్లో పంచ్లు.. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్రచారంతోనే అధికారంలోకి వచ్చారని ఒక అంచనా. అప్పటికీ ఇప్పటికీ దాని విస్తృతి బాగా పెరిగిపోయింది. రిలయన్స్ జియో వంటి సంస్థలు వచ్చాక ఇంటర్నెట్ డేటా ప్లాన్స్ బాగా చౌకగా వస్తున్నాయి. దీంతో నిరుపేదలు కూడా భారత్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో ఫేస్బుక్, వాట్సాప్ యాప్లకి ఆదరణ పెరిగింది. కానీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వచ్చే సమాచారానికి విశ్వసనీయతపై ఎన్ని సందేహాలున్నా జనం వాటినే నమ్ముతూ ఆ లోకంలోనే బతికేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా దానిని తనకు కావల్సినట్టు వినియోగించుకోవడంలో ఆరితేరిపోయారు. నెటిజన్లను ఆకర్షించేలా ట్వీట్లు పెట్టడం, తన ఉపన్యాసాల్లో పంచ్ డైలాగ్లను యూ ట్యూబ్లో పెట్టడం, తన డ్రెస్సింగ్ ఫ్యాషనబుల్గా ఉండటం.. ఇలా ఏది చూసినా యువతరాన్ని ఆకర్షించేలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఇందిరమ్మదీ ఇదే స్టైల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చీటికిమాటికి ఇందిరాగాంధీని, కాంగ్రెస్ వంశానుగత రాజకీయాలను దూషిస్తూ ఉంటారు కానీ ఇద్దరిదీ ఒకటే స్వభావం. అంతా నేనే అన్నట్టుగా అందరినీ తన చుట్టూ తిప్పుకోవడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినప్పటికీ ఇందిరాగాంధీ తనకున్న అధికార దర్పంతో అందరినీ తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారు. ఇందిర కంటే మోదీ రెండాకులు ఎక్కువే చదివారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ తరహా రాజకీయ నాయకుల్ని ప్రజాస్వామిక నియంతలని పిలుస్తారు. అయితే అలాంటి వ్యక్తిత్వాన్నే నేటి తరం ఇష్టపడుతోంది. మోదీ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, స్వయంకృషితో పైకి ఎదిగిన తీరు, తన వ్యక్తిత్వాన్ని తానే ప్రచారం చేసుకునే నైజం.. ఇవన్నీ యువతరాన్ని ఆకర్షించే అంశాలేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇందిరాగాంధీకి మోదీ కొడుకుగా పుట్టాల్సిన వారని గతంలోనే ఆయనపై కామెంట్లు కూడా వినిపించాయి. డిజిటల్ సైకో పాలిటిక్స్లో మాస్టర్ సెంటిమెంట్ను రగిలించడం మోదీకి తెలిసినంతగా మరో రాజకీయ నాయకుడికి తెలీదేమో. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రయిక్స్తో యువతలో దేశభక్తిని రగిలించి డిజిటల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం ద్వారా దానినే ఎన్నికల అస్త్రంగా మార్చేశారు మోదీ. సర్జికల్ స్ట్రయిక్స్పై బాలీవుడ్ స్టైల్లో ఒక మ్యూజిక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. రాజకీయ శాస్త్రాన్ని, చరిత్రని, సోషియాలజీని ఔపోసన పట్టి సెఫాలజీపై పట్టు సాధించడమే కాదు.. ఈ డిజిటల్ యుగంలో మానవ సమాజాన్ని, వారి సాంస్కృతిక భావజాలాన్ని, మనస్తత్వాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆంత్రోపాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మోదీ పేరే మొదట చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రజాస్వామిక నియంతలుగా భావిస్తున్న వారి కంటే తన గురించి తాను ప్రచారం చేసుకోవడంలో, స్వీయ గౌరవాన్ని పెంచుకోవడంలో మోదీ ఒక అడుగు ముందే ఉంటారని రచయిత, రాజకీయ విశ్లేషకుడు పంకజ్ మిశ్రా అభిప్రాయంగా ఉంది. -
దాతలు తెలీకుండా నల్లధనం నియంత్రణా?
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే వారి వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల్లో నల్లధనం కట్టడికే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ తెలిపారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికల తర్వాతే ఈ విధానం పనిచేస్తుందా లేదా అనేది పరిశీలించాలని కోరారు. అయితే, బాండ్ల కొనుగోలు దారుల వివరాలు బ్యాంకులకు తెలుస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్.. అతని వివరాలు తెలిసినప్పటికీ ఏ బాండ్ ఏ పార్టీకి అందిందో తెలపడం కష్టమని బదులిచ్చారు. అలాంటప్పుడు, ఆదాయపన్ను చట్టాల్లో లొసుగుల ఆధారంగా నల్లధనాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథాయే కదా అని ధర్మాసనం పేర్కొంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా మాత్రమే అసలైన డబ్బు బాండ్ల కొనుగోలు దారుల ద్వారా బ్యాంకులకు చేరుతుందని ఏజీ వేణుగోపాల్ పేర్కొనగా దాతలు ఎవరో తెలియకపోతే బినామీ కంపెనీలు కూడా నల్లధనాన్ని ఈ మార్గంలో పార్టీల నిధులుగా మార్చుకునే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, ఎన్నికల్లో తాము ఎన్నుకోబోయే అభ్యర్థులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
నల్లధనంపై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: నల్లధనం చెలామణీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం(ఈసీ) దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ సన్నిహితులతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన దాడులపై బుధవారం నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శిపాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మంగళవారం ఎన్నికల సంఘంను కలిసి ఐటీ, ఈడీ, కస్టమ్స్, డీఆర్ఐ విభాగాలు జరిపిన సోదాలపై వారికి వివరించారు. మధ్యప్రదేశ్లో దాచిన డబ్బును భారీగా ఢిల్లీకి తరలించి, నిల్వ ఉంచుతున్నట్లు అందిన నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకే దాడులు జరిపినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రూ.281 కోట్ల లెక్కలో చూపని డబ్బు వెలుగు చూసిందని వివరించారు. విదేశాల్లో ఆస్తులు, బీనామీ ఆస్తులు, ఆస్తుల కీలక పత్రాలకు సంబంధించి త్వరలో ఐటీ శాఖ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్పందించిన ఈసీ.. నల్లధనం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరింది. అయితే, దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని, దాడులకు ముందుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు(సీఈవో)లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిన మార్చి 10వ తేదీ తర్వాత ఐటీ శాఖ పలువురు రాజకీయ నేతలు, వారి సంబంధీకులపై దాడులు చేపట్టడంపై కేంద్ర సంస్థలను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ చెప్పలేదు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామని చెప్పామే, తప్ప ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు వేస్తామని చెప్పలేదన్నారు. రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...‘ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు. నల్లధనంపై చర్యలు తీసుకుంటామని మేము చెప్పాము. నల్లధనంపై మా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది’ అని అన్నారు. కాగా 2014 ఎన్నికల్లో దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తామంటూ నరేంద్ర మోదీ చెప్పారని, ఆ హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు... ఎన్డీయే సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ దాడులపై రాజ్నాథ్ స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, ఆయా శాఖలు తమ పని తాము చేసుకుపోతున్నాయన్నారు. ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని, ఆ దాడులపై తామెలా జోక్యం చేసుకుంటామని ఆయన ప్రశ్నించారు. -
ఇంతకు ‘లోక్పాల్’ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : లోక్పాల్, లోకాయుక్త బిల్లును భారత పార్లమెంట్ ఆమోదించి ఐదేళ్ల అనంతరం నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి లోక్పాల్గా సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ను ఆదివారం నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఈ లోక్పాల్ కమిటీలోకి ఎనిమిది మంది సభ్యులను తీసుకోవాల్సి ఉంది. కమిటీలో షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలోనే దేశంలో నల్ల డబ్బును నిర్మూలిస్తానని, అవినీతిని అంతం చేస్తానని తెగ ప్రచారం చేయడం ద్వారా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కేంద్ర స్థాయిలో వెంటనే లోక్పాల్ను నియమిస్తారని సామాజిక కార్యకర్తలు ఆశించారు. తొలి లోక్పాల్ను నియమించడానికి నరేంద్ర మోదీకి ఐదేళ్లు పట్టింది. అదీ నాడు లోక్పాల్ కోసం ఉద్యమించిన అన్నా హజారే, లోక్పాల్ను నియమించాలంటూ మళ్లీ నిరశనకు దిగడం, మరోపక్క ఫిబ్రవరి నెలలోగా లోక్పాల్ను నియమించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పరిణామాల మధ్య మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ ఎట్టకేలకు తొలి లోక్పాల్ను సిఫార్సు చేసింది. అదీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక. మిగతా ఎనిమిది మంది సభ్యుల నియామకం ఎన్నికల్లోగా జరుగుతుందన్న నమ్మకం లేదు. సుప్రీం కోర్టు విధించిన గడువుకాలం ముగిసిన తర్వాత లోక్పాల్ను ఖరారు చేసినందున ఆయన నియామకం చెల్లుతుందన్న గ్యారంటీ లేదు. అవినీతి జరగకుండా చూసేందుకు ‘నేను కాపలాదారుడిని’ అని ప్రచారం చేసుకుంటున్న మోదీకి, మరింత ఎన్నికల ప్రచారం కోసం లోక్పాల్ నియామకం పనికి వస్తుందేమో! ఎంపిక కమిటీలో ప్రతిపక్షం మాటకు ఏం మాత్రం విలువ లేనప్పుడు లోక్పాల్ కమిటీ వల్ల ప్రభుత్వంలో అవినీతిని అరికట్టవచ్చని భావించడం అత్యాశే కావచ్చు! గుజరాత్ ముఖ్యమంత్రిగా లోక్పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ‘లోక్పాల్ వ్యవస్థను తీసుకొస్తారనుకోవడం పొరపాటే కావచ్చు! 1968లోనే లోక్పాల్ గురించి చర్చ ప్రభుత్వ స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు ఓ వ్యవస్థ కావాలంటూ 1968లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేయడంతో నాలుగవ లోక్సభలో లోక్పాల్ వ్యవస్థ గురించి మొదటిసారి చర్చకు వచ్చింది. లోక్పాల్ వ్యవస్థకు భయపడడం వల్ల ప్రధాని సహా కేబినెట్ మంత్రులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరన్న వాదనతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత అనేక సార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అదే వాదనతో దాన్ని పక్కన పెడుతూ వచ్చారు. దేశంలో అవినీతి అరికట్టేందుకు లోక్పాల్ వ్యవస్థ కావాలంటూ 2011లో అన్నా హజారే, నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఇతర సామాజిక కార్యకర్తలు ఉద్యమించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లోక్పాల్ బిల్లుకు అంగీకరించింది. బిల్లును తీసుకరావడానకి రెండేళ్లు పట్టింది. 2013లో తీసుకొచ్చినప్పటికీ బిల్లులో మార్పులు, చేర్పుల కోసం పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలు, స్థాయి సంఘాల చుట్టూ తిప్పడంతో 2014, జనవరి 1వ తేదీన చట్టరూపం దాల్చింది. లోక్పాల్ నియామకంపై జరుగుతున్న జాప్యానికి మూడున్నర ఏళ్లపాటు మౌనం వహించిన రాహుల్ గాంధీ 2018, జనవరి నెల నుంచి నరేంద్ర మోదీపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయమై నిలదీస్తూ వచ్చారు. -
తక్కువ పన్ను రేట్లతో నల్లధనం నిర్మూలన
ముంబై: దేశంలో ప్రస్తుతం ఉన్న అధిక పన్ను రేట్లు దిగి రావాల్సిన అవసరం ఉందని... ఇది నల్లధనం ఉత్పత్తిని తగ్గించడంతోపాటు, ఆదాయాన్ని పెంచుతుందని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పట్లో పన్ను రేట్లను తగ్గిస్తారని తాను ఆశించడం లేదని, సాధారణ ఎన్నికల ముందు తదుపరి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ఉండొచ్చన్నారు. ‘‘ప్రజల నుంచి మరిన్ని ప్రయోజనాలు కావాలని, పన్నులు తగ్గించాలన్న డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం ద్రవ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పన్ను రేట్లను నిజంగా తగ్గించాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కొద్ది మొత్తంలో నల్లధన ప్రవాహం అనేది అధిక పన్నుల వల్లే’’ అని కేకి మిస్త్రీ చెప్పారు. తక్కువ పన్ను రేట్లు ఉంటే, అధిక పన్నులు వసూలు అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ద్రవ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని సమతూకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. -
‘నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు’
న్యూఢిల్లీ : నోట్ల రద్దు విషయం అప్పటికప్పుడు ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనూహ్యమైన షాక్ ఏం కాదు. ఈ విషయం గురించి ఓ ఏడాది ముందు నుంచే చెబుతున్నాం. నల్ల ధనం ఉన్న వారందరిని ఏడాది ముందే నుంచే హెచ్చరిస్తున్నాం. మీ దగ్గర ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేయండి.. జరిమానా చెల్లించి ఇబ్బందుల నుంచి బయటపడండి అని చెప్పాను’ అన్నారు. కానీ చాలా మంది ‘మోదీ కూడా ఇతర ప్రధానుల్లానే. కేవలం మాటలు చెప్తారు అని భావించారు. ఫలితం అనుభవించారు. చాలా కొద్ది మంది మాత్రమే నేను చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆచరించార’ని పేర్కొన్నారు. -
సంస్కరణలతో ఆశించిన ఫలితాలు:ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల కట్టలు బ్యాంకుల్లోకి వచ్చినట్టు చెప్పారు. ‘‘మొత్తం నగదును బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే నోట్ల రద్దు ఉద్దేశ్యం. అది చాలా వరకు నెరవేరింది’’అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్లిస్టెడ్ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది. -
‘బ్యాంక్లున్నది విజయ్ మాల్యా లాంటి వారి కోసం కాదు’
ముంబై : మోదీ నాయకత్వం మీద, విధానాల గురించి జనాలకు ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్దేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ అందరిలాంటి వారు కాదు. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ‘2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారా’ అని అడగ్గా.. ఇలాంటి రాజకీయ ప్రశ్నలకు సమాధనం ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు రామ్దేవ్. అయన మాట్లాడుతూ.. ఒక విషయం అయితే చెప్పగలను.. మోదీ నాయకత్వం, విధానల పట్ల జనాలకు ఇంకా నమ్మకం ఉంది. మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయరు అంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమీ మాత్రమే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగల్గుతుందని పేర్కొన్న రాందేవ్.. ఈ సందర్భ్ంగా నల్లధనం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల ధనం సమానంగా ఉంది. అయితే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బును ఏం చేయాలి అని. ఈ మొత్తాన్ని వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పత్తి రంగాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిందని తెలిపారు. అయితే మరిన్ని సంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు కూడా ఇందుకు సహాకారం తెలపాలని కోరారు. సాయం కావాలని బ్యాంకుకు వచ్చిన వారిలో విజయ్ మాల్యా ఎవరో.. నిజాయతి పరుడు ఎవరో గుర్తించగలగే సామార్థ్యం బ్యాంక్లకు ఉండాలని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులున్నది నిజాయతిపరుల కోసం కానీ విజయ్ మాల్లా లాంటి వారి కోసం కాదని వ్యాఖ్యానించారు. -
బ్లాక్మనీ వివరాల వెల్లడికి పీఎంవో ‘నో’
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వివరాలు బహిర్గతమైతే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్ 8 (1) (హెచ్) ప్రకారం దర్యాప్తునకు ఆటంకం కలిగే సమాచార వెల్లడికి మినహాయింపు ఉందంటూ.. ఈ విషయమై తమ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించింది. అక్టోబర్ 16న సీఐసీ జారీ చేసిన ఆదేశాలకు పీఎంవో ఈ మేరకు సమాధానం ఇచ్చింది. అయితే, అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) సంస్థ అధ్యయనం ప్రకారం.. 2005–14 మధ్య రూ.5.44 లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా దేశంలోకి రాగా, రూ.1.16 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయింది. -
తెలుగు రాష్ట్రాల నుంచి 28వేల కోట్ల పెద్దనోట్ల మాయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలు పెద్దనోటును మింగేస్తున్నాయి. రవాణా చేసేందుకు, దాచిపెట్టేందుకు ఈజీగా ఉండే రూ.2వేల నోటుపైనే రాజకీయ పార్టీలతోపాటు బడావ్యాపారులు దృష్టిపెట్టారు. వీరంతా ఇప్పటికే పెద్దనోటును భారీగా నిల్వ చేయడంతో లావాదేవీలు చాలామటుకు తగ్గిపోయాయి. మరో 45 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు, తర్వాతి ఆర్నెల్లలో.. ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రూ.2వేల నోట్ల నిల్వ పెరిగిపోయింది. ఆర్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు రూ.53 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు సరఫరా చేస్తే మొన్నటి సెప్టెంబర్ 30వ తేదీనాటికి రూ.28 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్లాక్ అయ్యాయి. ఈ ప్రమాద తీవ్రతను ఆర్బీఐ ముందుగానే పసిగట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24 వేల కోట్ల విలువైన పెద్దనోట్లను వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది మే నాటికి దాచిపెట్టిన మొత్తంలో సింహభాగం చలామణిలోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ అంచనా వేస్తోంది. రకరకాల రూపేణా సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ మొత్తం బ్యాంక్లకు రావచ్చన్నది ఆర్బీఐ ఆశ. వెళ్లడమే.. రావడం లేదు ఏడాది కాలంగా బ్యాంక్ల నుంచి పెద్దనోట్లు బయటకు వెళ్లడమే గానీ తిరిగి వస్తున్న దాఖలాలు లేకపోవడాన్ని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. ఆ మాటకొస్తే విడుదల చేసిన 6 నెలల్లోనే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10వేల కోట్ల విలువైన ఈ నోట్లను బ్లాక్ చేసినట్లు రిజర్వు బ్యాంక్ అంచనాకు వచ్చింది. రాన్రానూ ఈ నోట్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించి.. 2017 డిసెంబర్ నుంచి పెద్దనోట్లను సరఫరా చేయడం ఆపేసింది. అప్పటికే తగినంత మొత్తంలో రూ.500, రూ.200 నోట్లను భారీగా బ్యాంక్లకు సరఫరా చేసిన ఆర్బీఐ.. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చలామణిలో ఉన్న రూ.2.50 లక్షల కోట్ల విలువైన 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెనక్కు తీసుకున్నవి రూ.24వేల కోట్లు అని ఆర్బీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేసిన తర్వాత.. 2016 నవంబర్ 11 నుంచి 2017 డిసెంబర్ 31 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.53వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లను సరఫరా చేసింది. అవసరమైనంత స్థాయిలో చిన్ననోట్లు ముద్రణ కాకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతోనే పెద్దనోట్లను ఇంత పెద్దమొత్తంలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాల్సి వచ్చింది. 2018 జనవరిలో పెద్దనోట్లు భారీ మొత్తంలో బ్లాక్ అవుతున్నట్లు గుర్తించి.. వెంటనే వీటి సరఫరాను ఆపేసింది. తెలంగాణ కంటే ఏపీలోనే ఈ నోట్లు భారీగా బ్లాక్ అయినట్లు ఆర్బీఐ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ‘రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ.28 వేల కోట్ల విలువైన నోట్లు బ్లాక్ అయినట్లు మా ఆడిట్లో బయటపడింది. ఇదే విషయాన్ని మేము కేంద్ర నిఘాసంస్థల దృష్టికి తీసుకువెళ్లాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖలు వీటిని గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి’అని ఆర్బీఐ హైద రాబాద్ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చలామణిలో 6వేల కోట్లే.. రిజర్వు బ్యాంక్ వెనక్కి తీసుకోవడంతోపాటు బ్లాక్ చేసిన నోట్లు పోగా.. తెలుగు రాష్ట్రాలలో రూ.6వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నట్లు సెప్టెంబర్ 30వ తేదీన ఆర్బీఐ అంచనా వేసింది. వీటిని కొంత మొత్తాన్ని బ్యాంక్లు ఏటీఎంల్లో పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే, ఏటీఎంల నుంచి బయటకు వెళ్లిన నోట్లు తిరిగి బ్యాంక్లకు రాకపోవడాన్ని గుర్తించారు. ప్రస్తుతం రిటైల్ వ్యాపారుల నుంచి 60% రూ.500 నోట్లు మిగిలిన 40% రూ.200, 100, 50 నోట్లు వస్తున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఈజీగా పంపిణీ చేసే లక్ష్యంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీటిని నిల్వ చేస్తూఉండొచ్చని ఆర్బీఐ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎప్పటినుంచో పెద్ద నోట్లను నిల్వ చేసిన బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందించే అవకాశమందని.. అజ్ఞాతంలో ఉన్న మొత్తంలో 50% వరకు వచ్చే ఏడాది మే నాటికి బ్యాంక్లకు వస్తుందని ఆర్బీఐ ఆశిస్తోంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లతో పాటే ఇటీవల రూ.500 నోట్లను కూడా పెద్దమొత్తంలోనే నిల్వచేస్తున్నారని ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తమకు ఏటీఎంల్లో వినియోగించడానికి రూ.500 నోట్లకు కొరత ఏర్పడి రూ.100 నోట్లను వినియోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత తొలి ఆర్నెల్లలో బ్లాక్ అయిన వాటి విలువ రూ. 10,000 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి మాయమైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ. 28,000 కోట్లు -
రూ. లక్ష దాటితే చిక్కే!
సాక్షి, హైదరాబాద్: అసలే ఎన్నికల సమరం... లెక్కలకు చిక్కకుండా నల్లధనం బుసలుకొట్టే సమయం... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నాయకులు కోట్లు కుమ్మరించడానికీ వెనుకాడని తరుణం... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఏ స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినా నగదు రవాణా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి లెక్కలు లేని నగదు తరలిస్తుంటే కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో విచ్చలవిడిగా డబ్బు పట్టుబడుతోంది. తమ అవసరాల కోసం నగదు తీసుకువెళ్తున్న సామాన్యులు ఇలాంటి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవి ఏమిటంటే... - ఎన్నికల సీజన్ ముగిసే వరకు సామాన్యులు వీలైనంత వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమం. - తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ. లక్ష లేదా దానిలోపు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తారు. - అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ. లక్ష లభించినా స్వాధీనం చేసుకుని ఐటీ అధికారుల వద్దకు పంపిస్తారు. అధికారులు తమ విచారణలో సంతృప్తి చెందితే లభించిన మొత్తంపై పన్ను, జరిమానా కట్టించుకున్నాకే మిగిలినవి తిరిగి ఇస్తారు. నగదు తప్పనిసరి అయితే ఇలా... - నగదు తరలింపునకు ప్రత్యామ్నాయంగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా నగదు తమ ఎదుటి వారి ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుందని భావిస్తే బ్యాంకుల నుంచి డిమాండ్ డ్రాఫ్ట్లు తీసుకునే అవకాశమూ ఉంది. - ఇది ఖర్చుతో కూడుకున్నదని భావిస్తే అవకాశం ఉన్న వారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి సౌలభ్యాలను ఉపయోగించుకోవచ్చు. వాటికి అయ్యే ఖర్చు నామమాత్రమే. - తప్పనిసరి పరిస్థితుల్లో నగదునే తీసుకువెళ్లాల్సి వస్తే బ్యాంకు స్టేట్మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను వెంట ఉంచుకోవాలి. - రూ. 10 లక్షలకు మించి తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. - కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకువెళ్తుంటే బ్యాంక్ పాస్బుక్, స్టేట్మెంట్ వెంట ఉంచుకోవాలి. ఆ అత్యుత్సాహంపై విమర్శలు... ఏదైనా క్రిమినల్ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన నిందితుడిని దోషిగా తేలే వరకు మీడియా ముందుకు తీసుకురాకూడదు అనేది ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో ‘లెక్కలు లేని’సొమ్ముతో దొరికే వ్యక్తులకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎలా బయటపెడుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకునే అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 102 సెక్షన్ ప్రకారం పోలీసులకు ఉంది. అదే ఆదాయపుపన్నుశాఖ అధికారులైతే ఐటీ యాక్ట్లోని 132 సెక్షన్ కింద స్వాధీనం చేసుకుంటారు. ఆపై అనుమానితుడు ఆ సొమ్ముకు లెక్కచూపిస్తే తిరిగి అప్పగిస్తారు. ఈలోగా పోలీసులు చేస్తున్న హడావుడి కారణంగా వారి పరువు బజారున పడుతోంది. ఈ నేపథ్యంలో తనిఖీల్లో పట్టుబడిన సొత్తు, సొమ్ము అక్రమమని తేలితే తప్ప మీడియా ముందుకు అనుమానితులను తీసుకురాకపోవడం ఉత్తమమనే వాదన వినిపిస్తోంది. -
నల్లధనం అడ్డుకట్టకు ఈ చట్టాలు చాలవు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు. -
నల్లధనం నిర్మూలన విజయవంతం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: నల్లధనం నిర్మూలించేందుకు ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వ ర్యంలో న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్కాసాథ్, సబ్కా వికాస్ నినాదంతో దేశప్రజల సమగ్రాభివృద్ధికి మోదీ విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారన్నారు. -
స్విస్ బ్యాంకులో భారతీయ నిల్వలు తగ్గాయి
-
స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు తగ్గాయి
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో పెరగలేదు. సరికదా 34.5 శాతంమేర పడిపోయాయి. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో డబ్బు 80 శాతం తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ స్వయంగా మంగళవారం పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానం రూపంలో తెలిపారు. సెంట్రల్ బ్యాంకుల అంతర్జాతీయ సంస్థ– బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) గణాంకాలను ఉటంకిస్తూ మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. స్విస్ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల నుంచి తగ్గుతూ వచ్చిన భారతీయుల డిపాజిట్లు 2017లో 50 శాతం పెరిగి 1.01 బిలియన్ స్విస్ ఫ్రాంక్ (రూ.7,000 కోట్లు)లుగా ఉన్నాయని స్విస్ నేషనల్ బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. ఈ వార్తలను మంత్రి గోయల్ ప్రస్తావిస్తూ, ఇవి తప్పని స్విస్ అధికారులే పేర్కొన్నారని తెలిపారు. స్విస్ డిపాజిట్లకు బీఐఎస్ గణాంకాలే తగిన ఆధారమని ఆయన వివరించారు. భారతీయుల డిపాజిట్ల మొత్తం అది: ఎస్ఎన్బీ అయితే, తాము ఇటీవల వెల్లడించిన భారతీయుల డిపాజిట్ల గణాంకాలు నిజమేనని స్విస్ నేషనల్ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఈ గణాంకాలు భారతీయ కస్టమర్లు, బ్యాంకులు, సంస్థలకు సంబంధించిన మొత్తమని తెలిపింది. భారత్లోని స్విస్ బ్యాంకు శాఖల్లోని డిపాజిట్లను కూడా కలిపి చెప్పామని వివరించింది. ఈ నేపథ్యంలో బీఐఎస్ గణాంకాలు మరితం ఆధారపడతగినవిగా పేర్కొంది. స్విట్జర్లాండ్కు చెందిన క్రెడిట్సూసే ప్రస్తుతం మన దేశంలో ఒక బ్యాంకు శాఖను కలిగి ఉంది. అలాగే, ఆ దేశానికి చెందిన యూబీఎస్, జుర్చెర్ కంటోనల్ బ్యాంకు మాత్రం రిప్రజెంటేటివ్ కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. -
నగదు పరిమితి @ రూ.కోటి!
అహ్మదాబాద్: ప్రజలు గరిష్టంగా రూ.కోటి వరకూ నగదును కలిగిఉండేలా నిబంధనల్ని సవరించాలని జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పరిమితిని దాటి నగదు కలిగిఉంటే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ప్రజలు గరిష్టంగా కలిగిఉండే నగదు పరిమితిని తొలుత రూ.15 లక్షలు, ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచాలని కొన్నిరోజుల క్రితం కేంద్రానికి సిట్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జస్టిస్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలు గరిష్టంగా రూ.కోటి మేర నగదును ఉంచుకునేలా నిబంధనల్ని సవరించాలని సిఫార్సు చేశాం. ఈ పరిమితిని మించి నగదు దొరికితే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించాం’ అని చెప్పారు. ఇటీవల తమిళనాడులోని ఓ సంస్థలో ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడంపై స్పందిస్తూ.. ‘అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదును చూడండి రూ.160 కోట్లు.. 177 కోట్లు. దీనిబట్టి రూ.20 లక్షల నగదు పరిమితి ప్రయోజనకరం కాదని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. 2014లో నల్లధనం కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ ఎంబీ షా(రిటైర్డ్) నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. -
ఎవరివీ 300 కోట్లు?
స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 300 కోట్ల రూపాయాలు మురిగిపోతున్నాయి. ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ఖాతాల్లో ఈ 300 కోట్లు ఉన్నాయని స్విస్ బ్యాంక్ తాజా జాబితాలో పేర్కొంది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతాలో సొమ్మును క్లెయిమ్ చేసుకోని ఖాతాలు 3500కుపైగా ఉన్నాయని అంబుడ్స్మన్ తెలిపింది. తమ బ్యాంకుల్లో చాలా కాలం పాటు లావాదేవీలేమీ నిర్వహించని ఖాతాల వివరాలను అంబుడ్స్మన్ మొదటి సారిగా 2015లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ఇలాంటి ఖాతాల్లో ఏ ఖాతాకు సంబంధించి అయినా లావాదేవీలు జరిగినా, సదరు ఖాతా తమదేనని ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా నిరూపించుకున్నా, వాటిని జాబితా నుంచి తీసివేసి తాజా జాబితాను ప్రతి ఏడూ విడుదల చేస్తోంది.మూడేళ్లుగా స్విస్ బ్యాంక్ అంబుడ్స్మన్ ఈ జాబితాను ప్రకటిస్తున్నా ఇంత వరకు దానిలోని భారతీయ ఖాతాలకు సంబంధించి ఎలాంటి తీసివేతలూ లేవు.అంటే భారతీయులెవరూ ఆ ఖాతాలు తమవేనని నిరూపించుకోవడం లేదన్న మాట. -
తప్పుడు ప్రచారం: అదంతా నల్లధనం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పుంజుకున్నాయన్నవార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం డబ్బు "చట్టవిరుద్ధం" కాదని పేర్కొన్నారు. స్విస్బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లపై తప్పుడు 'తప్పుడు ప్రచారం' జరుగుతోందని జైట్లీ శుక్రవారం తన ఫేస్బుక్ పోస్ట్లో రాశారు. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నల్లదనం కాదని జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంత క్రియాశీలకంగా లేవన్న అంచనాలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు చేసేవారు బేసిక్ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. తాజాగా స్విస్ బ్యాంకులో దాదాపు రూ.7000 కోట్ల వరకు పలువురు భారతీయులు పెట్టుబడులు పెట్టారన్నవార్తలపై ఆయన స్పందించారు. గతంతో పోల్చుకుంటే 50 శాతం వరకు నల్లధనం నిల్వలు స్విస్ బ్యాంకులో పెరిగాయని పలు పత్రికలు రాసిన వార్తల పట్ల జైట్లీ అసహనం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారందరూ నల్లధనాన్ని దాచినట్లు కాదని ఆయన అన్నారు. అలాంటి అక్రమ లావాలదేవీలపై కఠినంగా వ్యవరిస్తామన్నారు. నల్లధనాన్ని దాచే ప్రతి ఒకరిపై కూడా తీవ్రస్థాయిలో పెనాల్టీ ఉంటుందని జైట్లీ తెలియజేశారు. స్విట్జర్లాండ్, భారత్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జనవరి 1, 2018 తేది నుండి ఇప్పటి వరకు అక్కడి బ్యాంకులలో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం మన దేశానికి అందుతుంది. అలాంటప్పుడు అక్కడ భారతీయులు పలు ఆర్థిక లావాదేవీలు జరిపినంత మాత్రాన.. వారు నల్లధనాన్ని దాచుకుంటున్నారని భావించనవసరం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తొలి అయిదు సంవత్సరాల కాలం పూర్తి అయ్యే నాటికి టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారి శాతం గణనీయంగా పెరగనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఆదాయ పన్ను దాఖలు చేసేవారి సంఖ్య 57శాతం పుంజుకుందన్నారు. గత ఏడాది ఆదాయ పన్నుల వసూళ్లు 18శాతం పెరిగాయనీ జైట్లీ పేర్కొన్నారు. కాగా 2017 డేటా ప్రకారం స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 50శాతం పెరిగి1.01 బిలియన్ డాలర్ల (సుమారు రూ .7,000 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే విదేశీయుల లావాదేవీలు 3 శాతం వరకు పెరిగి 1.46 ట్రిలియన్ స్విస్ ఫ్రాంకులు( సుమారు 100 లక్షల కోట్ల రూపాయలుగా) ఉన్నాయి. -
స్విస్ మనీపై పియూష్ స్పందన
సాక్షి,న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు భారీగా పుంజుకోవడంపై ఆర్థికశాఖ ఇంచార్జ్గా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తొలిసారి స్పందించారు. ఈ మొత్తం డిపాజిట్లు నల్ల ధనమే అవుతుందని ఎలా భావిస్తామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ స్విస్ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సరాంతానికి తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు. స్విస్బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల మొత్తాన్ని నల్లధనమా, లేక అక్రమ లావాదేవీయా అనేది ఇపుడే నిర్ధారించలేమంటూ చెప్పొకొచ్చారు. స్విస్ ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు మొత్తం డేటాను అందజేస్తుందనీ, దాని ప్రకారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. . ఇందులో సుమారు 40 శాతం లిబరైజ్డ్ రెమిట్టెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) కారణంగా నెలకొన్న డిపాజిట్లేనని గోయల్ చెప్పారు. ఒక వ్యక్తి సంవత్సరానికి 2,50,000 డాలర్లు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించే ఎల్ఆర్ఎస్ పథకాన్ని మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిందేనని గుర్తు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల మూలంగా స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. -
మావోల నుంచి భారీగా నల్లధనం స్వాధీనం: సిట్
కటక్ : బలవంతపు వసూళ్లు, మాదక ద్రవ్యాల రవాణా ద్వారా మావోయిస్టులు సంపాదించిన నల్లధనాన్ని పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించింది. మావోయిస్టు నేతలు సమకూర్చుకున్న అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిట్ ఉపాధ్యక్షుడు జస్టిస్(రిటైర్డు) అరిజిత్ పసాయత్ తెలిపారు. ‘మావోయిస్టులు భారీగా నల్లధనాన్ని కూడబెట్టినట్లు మొదటిసారిగా సిట్ గుర్తించింది. మావోయిస్టు నేతలు సొంతఆస్తులు కూడబెట్టుకునేందుకు ఈ డబ్బును దారి మళ్లించినట్లు కూడా గుర్తించాం. ఇది కొత్త కోణం’ అని తెలిపారు. శనివారం కటక్లో ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు, డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెబి, ఆదాయ పన్ను శాఖ, సెంట్రల్ ఎకనామిక్ ఇంటలిజెన్స్ బ్యూరోల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఆర్ఐ, ఈడీ దాడుల్లో ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి కోల్కతా, లక్నో, న్యూఢిల్లీకి మావోయిస్టులు సరఫరా చేస్తున్న కోట్లాది రూపాయల విలువైన మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. అక్రమ సొమ్మును మావోయిస్టు కార్యకలాపాల విస్తరణకు వినియోగించినట్లు వెల్లడయింది. మావోయిస్టుల నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న వివిధ సంస్థలు విచారణ పురోగతి వివరాలు తమకు వెల్లడించాయి’ అని ఆయన వివరించారు. -
తలనొప్పిగా మారిన కోటి రూపాయల రివార్డు స్కీమ్
న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీత కోసం ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల రివార్డు స్కీమ్ తలనొప్పిగా మారింది. ఈ స్కీమ్ ప్రకటించిన దగ్గర్నుంచి ఐటీ డిపార్ట్మెంట్ ఫోన్లతో మారుమోగిపోతోంది. అంతేకాక కుప్పలుతెప్పలుగా ఈ-మెయిల్స్, కొరియర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ స్కీమ్ ప్రకటించిన తొలి రోజు నుంచి అంటే జూన్ 1 నుంచి ఇన్ఫార్మర్ల దగ్గర్నుంచి భారీగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయని డిపార్ట్మెంట్కు చెందిన కమిషనర్ స్థాయి అధికారులు చెప్పారు. గత వారమే ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫార్మర్లకు ఇచ్చే రివార్డు స్కీమ్ను సమీక్షించింది. దీని కింద బినామి లావాదేవీ లేదా ఆస్తికి సంబంధించి ఆదాయపన్ను విభాగానికి ఏదైనా నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడిస్తే, పన్ను సమాచార వ్యవస్థ, వారికి కోటి రూపాయల విలువైన రివార్డు అందజేస్తుంది. అదేవిదంగా విదేశాలలో ఉన్న నల్లధనం గురించి సమాచారం అందించిన వారికి సుమారు రూ.5 కోట్ల దాక నజరానా అందిస్తారు. అలాగే, సమాచారం అందజేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు అత్యంత గోప్యంగ ఉంచుతామని పన్ను శాఖ తెలిపింది. దీంతో వారంలోనే ఈ రివార్డుకు సంబంధించి 500 కాల్స్ పైగా వచ్చాయని సీబీడీటీ అధికారులు చెప్పారు. వీటిలో అవసరం లేని కాల్స్, కొరియర్స్ కూడా వస్తున్నాయని పేర్కొంది. ఈ-మెయిల్స్ను తనిఖీ చేసిన అనంతరం, సంబంధిత విచారణ విభాగానికి ఫిర్యాదులను ఫార్వర్డ్ చేస్తున్నామని మరో అధికారి చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ఏకంగా 500 పేజీలకు పైగా ఉంటున్నాయని, వాటిని తాము కోర్టుకు సమర్పిస్తున్నామని తెలిపారు. ఇది ఐటీ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా ఉన్నప్పటికీ, దీనికి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని పేర్కొన్నారు. -
నల్లకుబేరుల జాబితా ఇస్తే బంపర్ ఆఫర్
-
మోదీ నోట.. ఆ మాట రానేలేదు
పుణే: నాలుగేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ నానా ప్రయాసలు పడుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత అమర్ సాబ్లే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సందర్భంగా ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అది నెరవేర్చలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన అమర్.. అసలు మోదీ నోట ఆ మాట రాలేదని చెబుతున్నారు. ‘ప్రజల ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తానని మోదీగారూ ఏనాడూ చెప్పలేదు. అదసలు బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోలో లేని అంశం. అలాంటప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది. పైగా ప్రతిపక్షాలు ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. రూ. 15 లక్షలను ఖాతాలో వేస్తామన్న హామీ, బీజేపీ విఫలం.. అంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లటం మంచిది కాదు’ అని అమర్ సాబ్లే పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం పింప్రీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనానంత వెనక్కి తెప్పించి.. ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోదీ నాటి ఎన్నికల(2014) ప్రచారంలో ప్రామిస్ చేశారు. ఈ హామీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... అది సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలుసని.. అదోక రాజకీయ జుమ్లా అని చెప్పారు. ఇక ఈ హామీపై ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద 2016 నవంబర్లో వివరణ కోరాడు. అయితే రెండేళ్ల తర్వాత ప్రధాని కార్యాలయం అదసలు ‘సమాచారం’ కిందే రాదంటూ అతని దరఖాస్తును తిరస్కరించటం గమనార్హం. -
చిదంబరం కుటుంబంపై ఐటీ చార్జిషీటు
చెన్నై: విదేశాల్లోని ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్లో ఉన్న రూ.5.37 కోట్ల విలువైన ఆస్తి, రూ.80 లక్షల విలువైన మరో ఆస్తి, అమెరికాలోని రూ.3.28 కోట్ల విలువైన ఆస్తి వివరాలను నళిని, కార్తీ, శ్రీనిధి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది. కార్తీ సహ యజమానిగా ఉన్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ, చిదంబరం కుటుంబం ఈ వివరాల్ని దాచడం నల్లధన నిరోధక చట్టాన్ని అతిక్రమించినట్లేనని తెలిపింది. ఈ కేసులో కార్తీకి, ఆయన కుటుంబానికి గతంలో నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కార్తీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నల్లధన చట్టం ప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తులపై 120 శాతం పన్ను విధించడమే కాకుండా దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
చిక్కుల్లో చిదంబరం కుటుంబం
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ తాజా చర్యతో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. చిదంబరంతో సహా ఆయన భార్య నళిని, కుమారుడు కార్తి చిదంబరం, కోడలు శ్రీనిధిలపై ఆదాయ పన్నుశాఖ ఈ కీలక చర్యలకు దిగింది. నల్లధనం చట్టం కింద వీరిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని స్పెషల్ కోర్టు ముందు శుక్రవారం నాలుగు చార్జ్షీట్లను నమోదు చేసింది. ప్రత్యేక పన్నుల చట్టం కింద,(అప్రకటిత విదేశీయ ఆస్తులు, పెట్టుబడులు) సెక్షన్ 50 ప్రకారం ఈ ఆరోపణలను నమోదు చేసింది. నళిని, కార్తి, శ్రీనీధిలపై విదేశీ ఆస్తుల వివరాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగాగానీ ప్రకటించలేదంటూ ఐటీ శాఖ ఆరోపించింది. యూకేలోని కేంబ్రిడ్జ్లో రూ. 5.37 కోట్ల విలువైన స్థిరాస్తులు, 80 లక్షల ఆస్తి, అమెరికాలో 3.25 కోట్ల రూపాయల ఆస్తులను వెల్లడించలేదని అధికారులు తెలిపారు. చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ సహ యజమాని కార్తి చిదంబరం పెట్టుబడులను బహిర్గతం చేయకుండా చట్టా ఉల్లంఘనకు పాల్పడ్డారని చార్జిషీట్లో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. కాగా ఈ ఆరోపణలను ఖండించిన కార్తి చిదంబరం తాను ఇప్పటికే వివరాలను సమర్పించినట్టు వాదిస్తూ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో కార్తీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ శాఖ ఇటీవల నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2015 లో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. విదేశాల్లో అక్రమ సంపదను రహస్యంగా ఉంచిన భారతీయులకు 120 శాతం దాకా జరిమానాతోపాటు పదేళ్ల దాకా శిక్ష విధించే అవకాశ ఉంది. -
‘నోట్ల రద్దు’తో బీజేపీకి కాసులపంట
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ‘తుగ్లక్ పని’ అని దానివల్ల నల్లడబ్బు వెలికి రాకపోగా, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం లేకపోవచ్చుగానీ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం బాగా లాభం చేకూరింది. 2015–16 సంవత్సరానికి బీజేపీ వద్ద 570. 86 కోట్ల రూపాయల ఆదాయం ఉండగా, పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరంలో, అంటే 2016–17 సంవత్సరానికి ఏకంగా ఆ ఆదాయం 1,034.27 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకంగా 81.18 శాతం పెరుగుదల నమోదయింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం అంతకుముందు సంవత్సరం కన్నా 14 శాతం తగ్గింది. మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఒక్క బీజేపీకే 66.4 శాతం ఆదాయం రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 శాతం ఆదాయం వచ్చింది. దేశంలోని రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్ల ఆధారంగా ఢిల్లీలోని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్)’ అనే సంస్థ ఈ డేటాను సేకరించింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోన్న బీజేపీకి ఇతర పార్టీలకన్నా ఎక్కువ నిధులు విరాళంగా రావడం సహజమేగానీ, ఏకంగా 81 శాతం పెరగడం అనూహ్యమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదుకనుక, ఎక్కువ వరకు నల్లడబ్బే బీజేపీకి తరలి వచ్చి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదే 2016–17 సంవత్సరం కోసమే బీజేపీ ఎన్నికల కోసం ఏకంగా 606 కోట్లను ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 149 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టింది. బీజేపీ మొత్తం ఆదాయం 1034 కోట్ల రూపాయల్లో 997.12 కోట్ల రూపాయలు, అంటే 96 శాతం నిధులు విరాళాలు, ఆర్థిక సాయం రూపంలోనే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 116 కోట్ల రూపాయలు కూపన్ల రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన విరాళాల్లో 96 శాతం నిధులు అజ్ఞాత వ్యక్తుల నుంచే వచ్చాయి. వారి పేర్లు, ఊర్ల వివరాలు లేవు. కనీసం పాన్ నెంబర్లు లేవు. ఆదాయం పన్ను మినహాయింపుల కోసం ఎన్నికల కమిషన్కు బీజేపీ ఆదాయం పన్ను రిటర్నులు సమర్పిస్తున్నప్పటికీ డొనేషన్లు ఎవరిచ్చారో మాత్రం 2012 నుంచి ఇంతవరకు బీజేపీ వెల్లడించలేదు. పైగా ఈ పార్టీ విదేశాల నుంచి నల్లడబ్బును తీసుకొస్తానని, నల్ల కుబేరుల పేర్లు వెల్లడిస్తానంటూ అప్పుడప్పుడు తాటాకు చప్పుళ్లు చేస్తూ ఉంటోంది. ఒక్క రాజకీయ పార్టీలకే సమాచార హక్కు పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడమంటే ప్రభుత్వాల నక్కజిత్తులను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపులేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లకుబేరుల నుంచి పార్టీ విరాళాలను తీసుకుంటూ ఎలా వారిని క్షమిస్తూ వచ్చిందో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగానే నల్ల కుభేరులను కాపుకాస్తోంది. పార్టీలకిచ్చే విరాళాల్లో మరింత పారదర్శకత్వాన్ని తీసుకొస్తానంటూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అధికార పార్టీకి మాత్రమే ఎక్కువ విరాళాలకు ఆస్కారమిచ్చే ఈ కొత్త విధానంలో ఎన్ని చిల్లులున్నాయో సాక్షి వెబ్సైట్ ఇదివరకే వెల్లడించింది. -
మరో 1.20 లక్షల కంపెనీల రద్దు!
న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా మరో 1.20 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 2.26 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు వీటితో అనుబంధం కలిగిన 3.09 లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించింది. ఇవి చాలా కాలంగా ఎటువంటి కార్యకలాపాలు లేకుండా, నిబంధనలను పాటించకుండా ఉండటంతో ఈ చర్య తీసుకుంది. తాజా సమీక్షా సమావేశంలో భాగంగా నిబంధనలను పాటించని 1.2 లక్షల కంపెనీలను రికార్డుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలపై వేగంగా చర్యలు తీసుకోవాలని సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి అధికారులను ఆదేశించారు. కాగా, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్టీ) ఆదేశాల మేరకు అవసరమైన నిబంధనలను అమలు చేసిన 128 కంపెనీల రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించడం జరిగింది’’ అని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. -
చట్టాలకు కొదవ లేదు.. నల్లడబ్బు వెలికి రాదు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీయడంతోపాటు విదేశాల్లో పెరుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. దేశంలో దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు, విదేశాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉందని అప్పటివరకున్న అధికారిక అంచనా. విదేశాల్లో పేరుకుపోతున్న నల్లడబ్బును తీసుకరావడానికి ఆయన ప్రభుత్వం ‘అన్ డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ అండ్ అసెట్స్ (ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్) బిల్లు–2015’ను తీసుకొచ్చింది. దీన్ని 2015, మే 13వ తేదీన లోక్సభ ఆమోదించింది. ఇక నల్లడబ్బు దాచుకోవడానికి స్వర్గధామాలుగా ఘనతికెక్కిన దేశాల ఆటలు సాగవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బిల్లుపై వ్యాఖ్యానించారు. ఈ చట్టం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు పట్ల విమర్శకులు పెదవి విరిచారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న లక్షల కోట్ల నల్లడబ్బును వదిలేసి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెస్తారట అంటూ వారు విమర్శించారు. మొదట దేశంలోని నల్లడబ్బును వెలికితీస్తే ఏ మార్గాల్లో నల్లధనం దేశ సరిహద్దులు దాటిందో తెల్సిపోతుందని కూడా నిపుణులు సూచించారు. అప్పటికప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో బిల్లును తీసుకొచ్చి అదే రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. అదే బినామీ లావాదేవీల నిరోధక బిల్లు. బినామీ అనేది ఉత్తరాది మాట. ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు చెల్లించిన వారిపైన కాకుండా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు లేదా నకిలీ వ్యక్తుల పేరిట లావా దేవీలు జరుగకుండా నివారించడం. ఇంతకుముందు ఇలాంటి చట్టం ఉండగా, శిక్షలు పెంచుతూ ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, లేదా బినామీ ప్రాపర్టీకి మార్కెట్ ధరనుకట్టి అందులో 25 శాతాన్ని జరిమానా విధించడం, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం లాంటి అంశాలను బిల్లులో కొత్తగా చేర్చారు. అంతకుముందు జరిమానాగానీ, నాలుగేళ్ల వరకు జైలుగానీ ఏదో ఒకటే విధించే అవకాశం ఉండగా, ఇప్పుడు రెండు శిక్షలు విధించే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. శిక్షలు కఠినంగా ఉన్నాయన్న కారణంగా ఈ బిల్లును ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. ఈ బిల్లుపైనా అసోచమ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని, విదేశాల్లోని నల్లడబ్బును తీసుకురావడానికి మన దేశంలో చట్టాలు లేక కాదు. చట్టాలను అమలుచేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి, అధికారులకు లోపించడమే. పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్)–2002, ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్)–1999లలోపాటు 1961 నాటి ఆదాయం పన్ను చట్టం కూడా ఉంది. వీటిని సక్రమంగా, చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ మూడు చట్టాలను అమలు చేసే యంత్రాంగంలో ఎప్పుడూ అధికారుల కొరతే! ఎందుకు? స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ మంది భారతీయులు నల్లడబ్బు దాచుకుంటున్నారని సామాన్యులకు కూడా తెలిసిన నేపథ్యంలో ఆ దేశంతో నల్లడబ్బు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడం కోసం కృషి చేసినట్లు పాలకులు నటించారే తప్ప నిజంగా కృషి చేయలేదు. చివరకు భారత్లో కేసులు నమోదైన నిందితులకు సంబంధించిన ఖాతాల వివరాలను అందించేందుకు అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులు భారత్లో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం కూడా 2018 సంవత్సరంలో అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు నల్ల కుబేరులు సర్దుకోరా? అదే అమెరికా, తన దేశ పౌరుల ఖాతా వివరాలను అందజేయాల్సిందిగా కోరితే ఆగమేఘాల మీద, అంటే క్షణాల మీద అందజేస్తాయి. ఖాతాల వివరాలను అందజేయనందుకు గతంలో ఎనిమిది స్విస్ బ్యాంకులకు అమెరికా న్యాయవ్యవస్థ 130 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. నోరు మూసుకొని జరిమానా చెల్లించిన ఆ బ్యాంకులు ఇప్పుడు అమెరికా అడిగిన వివరాలను క్షణాల మీద అందజేస్తాయి. నల్లడబ్బులో అమెరికా పౌరుడికి సహకరించారన్న ఆరోపణలపై తమను నిందితులుగా చేర్చి అమెరికా విచారిస్తుందన్నది స్విస్ బ్యాంకు యజమానుల భయం. అలాంటి భయంగానీ, భక్తిగానీ భారత దేశం పట్ల వారికి ఎందుకు లేదు? ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆయా దేశాలతో మనకు అలాంటి ఒప్పందాలు లేవని మన పాలకులు చెబుతుంటారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో గతంలో ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలు తిరిగారు. నల్లడబ్బును వెలికితీస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆయన తన పర్యటనల సందర్భంగా విదేశాలతో అవసరమైన ఒప్పందాలు చేసుకోవచ్చుగదా! -
నోట్ల రద్దు రోజున ‘బ్లాక్’ అండ్ వైట్ గేమ్
సాక్షి, హైదరాబాద్ : సొంత డబ్బులనే ఇతర వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించారు.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డుల్లో చూపారు.. తర్వాత వ్యాపారుల నుంచి ఆ సొమ్మునంతా రప్పించుకున్నారు.. ‘బ్లాక్’ను వైట్ చేయడంలో సహకరించినందుకు ఆ వ్యాపారులకు 30 శాతం కమీషన్ ముట్టజెప్పారు! పదులు.. వందల్లో కాదు.. గంటల వ్యవధిలోనే 5 వేల మంది తమ దుకాణాలకు వచ్చి ఏకంగా 340 కిలోల బంగారం కొన్నట్టు చూపి నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ కస్టమర్లలో కొందరిని పోలీసులు ఆరా తీస్తే తాము అసలు ఆ దుకాణానికే వెళ్లలేదని చెప్పారు! పెద్దనోట్ల రద్దు తర్వాత హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ముసద్దీలాల్ కేసులో లీలలివీ!! రూ.97.85 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్లో పక్కా ఆధారాలు సేకరించిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అభియోపత్రాలు దాఖలు చేసింది. కేసులో మొత్తం పది మంది నిందితులతో పాటు మూడు కంపెనీలపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి బుధవారం వెల్లడించారు. రూ.97.85 కోట్ల నగదు మొత్తం ముసద్దీలాల్ యాజమాన్యానికి చెందినదే అని నిర్ధారణ అయినట్లు స్పష్టంచేశారు. రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య.. గతేడాది నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడింది. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న ముసద్దీలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ల కేంద్రంగా బంగారం ‘విక్రయాలకు’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ.97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రశీదులు సృష్టించారు. ఆ మొత్తాన్ని పంజాగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్లోని యాక్సిస్ బ్యాంక్ల్లో డిపాజిట్ చేశారు. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరు రూ.1.89 లక్షల బంగారం కొన్నారట! ముసద్దీలాల్ యాజమాన్యం రూపొందించిన బోగస్ బిల్లుల ప్రకారం... నవంబర్ 8 రాత్రి వచ్చిన ఒక్కో వినియోగదారుడు రూ.1.89 లక్షల విలువైన బంగారం కొన్నారు. ఈ రశీదులతో పాటు కస్టమర్లకు సంబంధించినవని పేర్కొంటూ యాజమాన్యం ఆధార్ కార్డు వంటి కొన్ని ధ్రువీకరణలను సైతం జత చేసింది. ఆ గుర్తింపు పత్రాల ఆధారంగా సంబంధీకుల్ని సీసీఎస్ పోలీసులు పిలిచి విచారించారు. ఇందులో ఆ బిల్లులన్నీ నకిలీవని స్పష్టమైంది. ఓ అడ్వాన్స్ పేమెంట్ రశీదుతోపాటు గుర్తింపు కార్డు ఆధారంగా ఓ మహిళను విచారించారు. తాను నెలకు రూ.15 వేల జీతానికి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నానని, నోట్ల రద్దు ప్రకటన వెలువడిన రోజు తన వద్ద కేవలం రెండు రూ.500 నోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. ఆ రోజు ఆ జ్యువెలరీ సంస్థల్లో బంగారం కొనలేదని స్పష్టం చేసింది. అనేక మంది నుంచి కూడా ఇలాంటి సమాధానమే వచ్చింది. దీంతో ముసద్దీలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నవంబర్ 8న రికార్డు అయిన ఫీడ్ను విశ్లేషించారు. ఆ రోజు ఈ సంస్థలకు కేవలం 67 మంది వినియోగదారులు మాత్రమే వచ్చినట్లు వెల్లడైంది. బిల్లులు సృష్టించిన కంప్యూటర్ను సీజ్ చేసిన అధికారులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. దీన్ని విశ్లేషించిన నిపుణులు ఆ బిల్లులన్నీ నవంబర్ 8 తర్వాత నమోదు చేసినవిగా నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. అరెస్టు తప్పించుకునేందుకు యత్నాలు సీసీఎస్ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దీలాల్ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డులను సైతం తారుమారు చేసింది. ముసద్దీలాల్ సంస్థలకు కైలాశ్ చంద్ గుప్తా, ఆయన కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, కోడలు నేహ గుప్తా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఈ డైరెక్టర్ల పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించారు. వారి డబ్బునే పంచేసి.. బ్లాక్మనీని వ్యాపారం మార్గంలో డిపాజిట్ చేసేందుకు ముసద్దీలాల్ యాజమాన్యం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. సీసీఎస్ అధికారులు ముసద్దీలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో జరిగిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. నగరంలోని కొందరు బంగారం వ్యాపారులకు ఈ ‘మార్పిడి’లో పాత్ర ఉన్నట్లు తేల్చారు. నగదును ఆయా బంగారం వ్యాపారులు ఖాతాల్లోకి మళ్లించిన ముసద్దీలాల్ యాజమాన్యం.. వారు తమ వద్ద బంగారం కొన్నట్టు రికార్డులు సృష్టించింది. తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఇందుకు సహకరించినందుకు వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఎలాంటి డెలివరీ, రిసీవ్డ్ రశీదులు లేవని నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కైలాశ్ చంద్ గుప్తా, నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, మరో ఏడుగురితో కలిపి మొత్తం 10 మందిపై అధికారులు అభియోగాలు మోపారు. ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలు ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్లపై అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ముసద్దీలాల్ సంస్థల ఖాతాల్లో ఉన్న రూ.12 కోట్లను స్తంభింపచేశారు. ఇది మనీ లాండరింగ్కు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సమాచారం ఇచ్చారు. చార్జ్షీట్ కూడా దాఖలు కావడంతో దాని ఆధారంగా ఈడీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆస్తుల ఎటాచ్మెంట్ కూడా ఉంటుందని సమాచారం. -
‘నోట్లరద్దు’కు ఫ్రీడ్మన్ సూత్రం..!
నేషనల్ డెస్క్ ఎన్డీయే ప్రభుత్వం పాత రూ.500, రూ.1,000 నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించి నవంబరు 8కి ఏడాది పూర్తయ్యింది. దీనివల్ల మంచే జరిగిందని, అవినీతి, నల్లధనంపై పోరులో విజయం సాధించామని ప్రధాని మోదీ గట్టిగా చెబుతున్నారు. మరోవైపు, ఈ అనాలోచిత నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నాశనమైందనీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో లక్షల మంది నిరుద్యోగులయ్యారని కాంగ్రెస్ సహా విపక్షాలు, పలువురు ఆర్థికవేత్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ రెండు వాదనల్లో నిజమెంత? నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడికి జరిగింది మంచా? చెడా?.. ప్రఖ్యాత ఆర్థిక వేత్త, 1976లో నోబెల్ అందుకున్న మిల్టన్ ఫ్రీడ్మన్ రూపొందించిన ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ సూత్రం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయేమో చూద్దాం! వేరే దేశాలూ పెద్ద నోట్లను రద్దు చేసిన దాఖలాలున్నాయి. 2014లో సింగపూర్, 2011లో కెనడా వెయ్యి డాలర్ల నోట్లను రద్దు చేశాయి. 2013లో స్వీడన్ వెయ్యి క్రోనార్ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించింది. పన్ను ఎగవేతలను అరికట్టడానికి, ఆర్థిక నేరాలను నియంత్రించడానికి ఈ చర్యలు ఆయా దేశాల్లో ఉపయోగపడ్డాయి. అయితే, భారత్లో మాత్రం ఈ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టడానికి ఎంతమేరకు ఉపయోగపడిందనే విషయంలో భిన్న వాదనలున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా భారత్లో నగదు ఆధారిత లావాదేవీలే ఎక్కువ. అందుకే నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం నగదు లావాదేవీలు ఎక్కువగా జరిపే సామాన్యులపై భారీగానే పడింది. సత్ఫలితాలొచ్చాయి నోట్ల రద్దు విజయవంతమైందనడానికి ప్రభుత్వం పలు ఉదాహరణలు చూపుతోంది. ఈ నిర్ణయానికి ఒక కారణం ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 2014–15లో కేవలం 4 శాతం భారతీయులే ఆదాయపు పన్ను చెల్లించారు. అంటే పన్ను ఎగవేతల కారణంగా 6 లక్షల కోట్ల నుంచి రూ. 9 లక్షల కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. నోట్ల రద్దు తరువాత ఈ సంవత్సరం ఆగస్ట్ 5 నాటికి పన్ను రిటర్నుల్లో గత సంవత్సరం కన్నా 24.7% వృద్ధి నమోదైంది. నోట్ల రద్దుకు చెబుతున్న మరో కారణం దొంగనోట్లను అరికట్టడం. కోల్కతాలోని భారత గణాంక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం భారత్లో రూ.400 కోట్ల దొంగనోట్లు చెలామణీలో ఉండగా అందులో నాలుగింట మూడొంతులు పాత రూ.500, 1,000 నోట్ల రూపంలోనే ఉండేది. నోట్ల రద్దు తరువాత మే 2017లోపు రూ. 17,526 కోట్ల లెక్కచూపని ఆదాయాన్ని గుర్తించామని, వెయ్యి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, ఐటీ రిటర్నులు భారీగా పెరిగాయని, నల్లధనం చెలామణికి, హవాలా లావాదేవీలకు సహకరిస్తున్న 37 వేల నకిలీ కంపెనీలను గుర్తించామని ప్రభుత్వం చెబుతోంది. విఫలమైంది నోట్ల రద్దును విమర్శిస్తున్న వారి వాదన మరోలా ఉంది. ఈ నిర్ణయం వల్ల నల్లధనం బయటకు రాకపోగా దాన్ని వైట్మనీగా మార్చుకునేందుకు అవకాశం లభించిందని, అసలు నల్లధనంలో సింహభాగం బంగారం, భూములు తదితరాల రూపంలో ఉందేకానీ కరెన్సీ నోట్ల రూపంలో కాదనేది వారి వాదన. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం రద్దు చేసిన నోట్లలో 98.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏం చెబుతోంది? ఈ వాదనలన్నింటిలోనూ ఎంతోకొంత నిజముంది. అయితే, నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసింది? భవిష్యత్తులో ఏ విధమైన ప్రభావం చూపబోతోందనే విషయాన్ని ఫ్రీడ్మన్ సిద్ధాంతం ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రీడ్మన్ సిద్ధాంతం ‘క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ’ ప్రకారం.. ఎంవీ = పీవై ఇందులో ఎం అంటే వ్యవస్థలో ఉన్న నగదు; వీ అంటే నగదు చెలామణీ వేగం; పీ అంటే ధరల స్థాయి; వై అంటే ఉత్పత్తుల నిజవిలువ. ఈ సిద్ధాంతాన్ని సింపుల్గా చెప్పాలంటే.. ప్రజల దగ్గర నగదు(పీ) తగ్గినప్పుడు, డబ్బు చేతులు మారే వేగం(వీ) కూడా తగ్గుతుంది. పీ, వీ తగ్గినప్పుడు ఆటోమాటిక్గా వస్తువుల ధరలు(పీ) కూడా తగ్గుతాయి. అందుకు అనుగుణంగానే నోట్లరద్దు తర్వాత కూరగాయలు, గుడ్లు, ఆహార పదార్థాల ధరలు కొంతవరకు తగ్గాయి. ఫ్రీడ్మన్ చెప్పినదాని ప్రకారం ధరలు తగ్గితే ఆదాయం కూడా తగ్గుతుంది. నోట్లరద్దు జరిగినప్పుడు మొదటగా ప్రజల వద్ద నగదు లభ్యత తగ్గింది. బ్యాంకులు అప్పులు ఇవ్వడం కూడా తగ్గింది. అదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. వీటన్నింటి ఫలితంగా జీడీపీ వృద్ధిరేటు తగ్గింది. ఈ వివరాలన్నింటినీ, నోట్ల రద్దు నేపథ్యంలో, ఫ్రీడ్మన్ సిద్ధాంతం ఆధారంగా అధ్యయనం చేస్తే.. నోట్లరద్దు వల్ల ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం పెరగడం తాత్కాలికమేనని, భవిష్యత్తులో వాటిపై నోట్లరద్దు ప్రభావం ఉండబోదన్న విషయం తేలుతుంది. ఇదే విషయాన్ని నోట్లరద్దు సమర్థకులు ప్రస్తావిస్తున్నారు. నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగమనంలోనో లేక ప్రతికూల గమనంలోనో సాగినా.. దీర్ఘకాలంలో మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఎంతమాత్రం ఆర్థికవ్యవస్థపై, జీడీపీ వృద్ధి రేటుపై ఉండబోదని వారు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్లో నగదు లభ్యత, జీడీపీ మధ్య నిష్పత్తి ఎక్కువగా ఉంటుందన్నది గమనించాల్సిన విషయం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఆగస్టుకు ఏకంగా 5.7 శాతానికి చేరడం తెలిసిందే. నోట్లరద్దు జరగకపోయుంటే వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా ఉండేదని కొందరు ఆర్థిక వేత్తలు అంటున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించేవారు జీడీపీ వృద్ధిరేటులో చోటు చేసుకున్న భారీ తగ్గుదలను ఉదాహరణగా చూపుతుండగా.. రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తున్నవారు ‘నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం లేదా ప్రతిద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలంలో జీడీపీ సాధారణ వృద్ధి స్థాయికి వస్తుంది’ అన్న ఫ్రీడ్మన్ సిద్ధాంత ఫలితాలను ఉటంకిస్తూ.. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా వర్తిస్తుందని వాదిస్తున్నారు. అయితే, దీర్ఘకాలంలో ఒనగూడే ప్రయోజనాలను పక్కనపెడితే, తాత్కాలికంగానైనా.. జీడీపీ వృద్ధిరేటుపై నోట్ల రద్దు చూపిన ప్రతికూల ప్రభావాన్ని విస్మరించలేం. -
అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది.
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
-
నోట్ల రద్దుతో లభించిన ప్రయోజనాలివే...
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ''యాంటీ బ్లాక్ మనీ డే'' గా డీమానిటైజేషన్ వార్షికోత్సవం నిర్వహిస్తోంది. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా నిర్ణాయక యుద్ధంలో పోరాడి 125 కోట్ల మంది భారతీయులు విజయం సాధించినట్టు కూడా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో సాధించిన విజయాలను ప్రభుత్వం వివరించింది. అవేమిటో ఓసారి చూద్దాం... భారత దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా అత్యధికంగా నల్లధనం వెలికితీయబడింది. భారతదేశ జనాభాలోని 0.00011% మంది దేశంలోని మొత్తం నగదులో దాదాపుగా 33% డిపాజిట్ చేశారు. 17.73 లక్షల కేసులలో నగదు లావాదేవీలు పన్ను ప్రొఫైల్తో సరిపోల్చబడలేదు. 23.22 లక్షల ఖాతాలలో రూ.3.68 లక్షల కోట్ల నగదు డిపాజిట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. అధిక డినామినేషన్ నోట్లు సుమారుగా రూ.6 లక్షల కోట్లకు తగ్గించబడినవి. ఉగ్రవాదానికి, నక్సలిజానికి నిర్ణాయకమైన ఎదురుదెబ్బ కాశ్మీరులో రాళ్ళు రువ్వే సంఘటనలు 75 శాతానికి పైగా తగ్గాయి. వామపక్ష తీవ్రవాద సంఘటనలు 20 శాతానికి పైగా తగ్గాయి. 7.62 లక్షల దొంగనోట్లు కనుగొనబడినవి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థ విస్తృత ప్రక్షాళన నల్లధనం, హవాలా వ్యవహారాలు నిర్వహించే షెల్ కంపెనీల గుట్టు బయట పెట్టడం జరిగింది. షెల్ కంపెనీలపై సర్జికల్ దాడులలో 2.24 లక్షల కంపెనీలు మూసివేశారు. 35వేల కంపెనీలకు చెందిన 58వేల బ్యాంకు ఖాతాలు నోట్ల రద్దు తర్వాత రూ.17వేల కోట్ల లావాదేవీలు జప్తు చేయబడినవి. నిర్ధిష్ట రూపకల్పన వలన అధిక అభివృద్ధి, పేదలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి జీతం నేరుగా బదిలీ 1.01 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్లో చేర్చబడ్డారు. 1.3 కోట్ల మంది కార్మికులు ఈఎస్ఐసీ వద్ద నమోదు చేసుకున్నారు. దీని ద్వారా సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరనున్నాయి. నోట్ల రద్దు కారణంగా పన్ను అమలులో అనూహ్యమైన పెంపుదల కొత్త పన్ను చెల్లింపుదార్లు 2015-16లో 66.53 లక్షల నుంచి 2016-17లో 84.21 లక్షలకు 26.6 శాతం మేరకు పెరిగారు. దాఖలు చేసిన ఇ-రిటర్నుల సంఖ్య 2016-17లో 2.35 కోట్ల నుంచి 2017-18లో 3.01 కోట్లకు 27.95 శాతం పెరిగాయి. తక్కువ నగదు ఉపయోగించే విధానానికి మారడం ద్వారా దేశంలో స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ 2016 ఆగస్టులో డిజిటల్ లావాదేవీలు 87 కోట్లు ఉండగా.. 2017 ఆగస్టులో 138 కోట్లకు పెరిగాయి. ఇది 58 శాతం వృద్ధి. నోట్ల రద్దు వరకు మొత్తం 15.11 లక్షల పీఓఎస్ మెషిన్లు ఉండగా.. కేవలం 1 సంవత్సరంలో 13 లక్షలకు పైగా పీఓఎస్ మెషిన్లు చేర్చబడినవి. నోట్ల రద్దు కారణంగా ప్రజల రుణాలకు వడ్డీరేటు తగ్గింపు, రియల్ ఎస్టేట్ ధరలలో తగ్గుదల పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలను పొందారు. -
నోట్ల కష్టాలు రద్దయ్యాయా!
అప్పటిదాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు రద్దవుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి... ఇప్పటికి సరిగ్గా ఏడాది. ఆ తరవాత కొన్ని నెలలపాటు జరిగిన సంఘటనల్ని బహుశా... దేశం ఎన్నటికీ మరిచిపోలేదేమో!! డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరటం... బ్యాంకుల్లో కొట్లాడుకోవటం... పెళ్లిళ్ల వంటి కార్యాల్ని కూడా వాయిదా వేసుకోవటం... ఇలా చెప్పలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి. ఇదే అవకాశంగా డిజిటల్ మనీ విజృంభించింది. కొత్త వాలెట్లు పుట్టుకొచ్చాయి. డిజిటల్ లావాదేవీలూ పెరిగాయి. కాకపోతే మెల్లగా డబ్బులు అందుబాటులోకి వచ్చేసరికి పరిస్థితి సర్దుమణిగింది. మరి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల వాస్తవంగా ఒనగూరిన లాభనష్టాలేంటి? ప్రధాని కార్యాలయం ఏం చెబుతోంది? వివిధ కంపెనీలు, వాటి ప్రతినిధులు ఏం చెబుతున్నారు? ఒకసారి చూద్దాం... – న్యూఢిల్లీ నోట్ల రద్దుకు ఏడాదైన సందర్భంగా ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. దాన్లో పేర్కొన్నదాని ప్రకారం... ⇒ డీమోనిటైజేషన్ తరువాత బ్యాంకులు ఒక శాతం వడ్డీతగ్గించాయి. ఇది దేశాభివృద్ధికి దోహపడే అంశం. ⇒ నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన భారీ నగదు డిపాజిట్లు– బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపునకు దారితీశాయి. ⇒ జనవరి 1న ఎస్బీఐ అనూహ్యంగా ఎంసీఎల్ఆర్ను 0.9 శాతం తగ్గించింది. ఇతర బ్యాంకులూ దీనిని అనుసరించాయి. ⇒ నవంబర్ 8 నాటికి చెలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ రూ.15,44 లక్షల కోట్లు. దాదాపు రూ.15.28 లక్షల కోట్లు (దాదాపు 99%) వెనక్కు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్బీ) ఆదాయాలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. తమ బకాయిలను వినియోగదారులు పాత నోట్లతో తీర్చేయటం దీనికొక కారణం. ఈ తరహా ఆదాయాలు 4 రెట్లు పెరగ్గా, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఈ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు. డిజిటల్ పేమెంట్ల గణనీయ వృద్ధి... డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. డెబిట్ కార్డ్ లావాదేవీల సంఖ్య వృద్ధి రేటు ఆగస్టులో 50 శాతం పెరిగి 26.55 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఆగస్టులో డెబిట్ కార్డ్ లావాదేవీల వృద్ధి కేవలం 13.05 శాతం. లావాదేవీల విలువ సైతం 48 శాతం పెరిగి, రూ.35,413 కోట్లకు ఎగసింది. బ్యాంకులు మహా హ్యాపీ... భారత్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే బ్యాంకులకు నోట్ల రద్దు తగిన సానుకూల ఫలితాలనే అందించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం తమకు లాభం కలిగించిందని, డిపాజిట్లు పెరగడంతోపాటు, డిజిటలైజేషన్ వేగం పుంజుకుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఎంతో ధనం అధికారిక వ్యవస్థలోకి వచ్చిందని, డిపాజిట్లు 2.5–3 శాతం పెరిగాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్, బీమా రంగాల్లోకి నిధుల వెల్లువ పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్ చెప్పారు. రెండు స్థానంలో నాలుగు కొత్తవి... నోట్ల రద్దు తరువాత పాత రూ.500, రూ.1,000 నోట్లు వ్యవస్థలోంచి బయటకు వెళ్లిపోయాయి. కొత్త రూపురేఖలతో నాలుగు కొత్తనోట్లు ఆర్థికవ్యవస్థలోకి వచ్చాయి. డీమోనిటైజేషన్ తరువాత కేంద్రం తక్షణం కొత్త రూ.2,000 రూ.500 నోట్లను ఆవిష్కరించింది. ఎనిమిది నెలల తర్వాత కొత్తగా రూ.50, రూ.200 నోట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. విమర్శలూ ఉన్నాయ్... నోట్ల రద్దు నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకూ దారితీసింది. అవి చూస్తే... ⇒ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగమనంలోకి జారిపోయింది. నోట్ల రరద్దు జరిగిన తొలి రెండు నెలల కాలంలో ఏటీఎంలు పనిచేయక, చేతుల్లో డబ్బులేక ప్రజలు, వినియోగదారులు త్రీవ కష్టాలు పడ్డారు. చిన్న వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయి. ⇒ మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయ వృద్ధి రేటు (ఏప్రిల్–జూన్) ఆందోళనకరమైన స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి 5.7 శాతానికి పడిపోయింది. త్రైమాసిక పరంగా చూస్తే, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ తిరిగి చైనాకు కోల్పోయింది. ⇒ పలు ఆర్థిక, రేటింగ్, బ్యాంకింగ్ సంస్థలు దేశ వృద్ధిరేటు అంచనాలను దాదాపు 7 శాతానికి కుదించేశాయి. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ నిర్ణయం మంచిదని పేర్కొంటూనే తక్షణ అంశాల ప్రాతిపదికన దేశానికి ప్రతికూల ఆర్థిక సంకేతాలను ఇచ్చాయి. ⇒ రద్దయిన నోట్లలో 99 శాతానికి పైగా ఆర్బీఐకి చేరిపోవడం కూడా చర్చనీయాంశమైంది. దేశంలో ఇంతకీ నల్లధనం ఉన్నట్లా, లేనట్లా అన్న సందేహాలు విస్తృతమయ్యాయి. బ్యాంకుల్లో జమైన డబ్బు మొత్తం సక్రమమైనదేననుకుంటే పొరపాటేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. రియల్టీకి వచ్చే 18 నెలలూ కీలకం... నోట్ల రద్దుతో రియల్టీపై పిడుగు పడినట్లయింది. తరవాత వచ్చిన రెరా, జీఎస్టీ కూడా తొలుత ప్రతికూల ప్రభావాలే చూపించాయి. అయితే ఈ రంగం పురోగతిపై మాత్రం అన్ని వర్గాలూ విశ్వాసంతో ఉన్నాయి. ఇందుకు వచ్చే 12 – 18 నెలలు కీలకమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ సెంటిమెండ్ ఇండెక్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి కొంత మెరుగుపడటం ఊరటనిచ్చింది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా ఆన్లైన్ సేవలు మెరుగయ్యాయి... నోట్ల రద్దుతో చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ సేవలవైపు ఉత్సాహం చూపించారు. బ్యాంక్ రుణ మంజూరీలో మందగమనం ఆన్లైన్ లెండింగ్ పురోగతికి కూడా దోహదపడింది. మా సంస్థ ఇపుడు నెలకు దాదాపు 400 రుణాలను ప్రాసెసింగ్ చేస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో మేం నెలకు 130 రుణాలను మాత్రమే ప్రాసెసింగ్ చేసేవారం. – రజత్ గాంధీ, ఫెయిర్సెంట్.కామ్ సీఈఓ ఆర్థిక వ్యవస్థకు మేలే... భారత ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల ఫలితాలే అందించింది. ప్రతికూలతలు క్రమంగా సడలిపోయాయి. అసంఘటిత రిటైలర్లు కూడా ఆన్లైన్ వైపు మళ్లారు. దీనితో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత మెరుగుపడింది. డిజిటల్ పేమెంట్లు ఆర్థిక వ్యవస్థపై వ్యయ భారాన్ని తగ్గిస్తాయి. ఇక మా వ్యాపారానికి సంబంధించి చూసినా, ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ వార్షికంగా 220 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోంది. –సందీప్ అగర్వాల్, సీఈఓ ఆన్లైన్ ఆటోమొబైస్ స్టోర్ డ్రూమ్ -
ఆ దేశాలు.. నల్ల కుబేరులకు స్వర్గాలు
స్విస్ బ్యాంక్లో తగ్గిన డిపాజిట్లు ఆసియాదేశాల్లో డబ్బు దాస్తున్న నల్ల కుబేరులు 53 శాతం డబ్బును నాలుగు దేశాల్లో పెట్టిన వైనం జీడీపీలో నల్లధనం వాటా 3.1 శాతం ఫలించని ప్రభుత్వ ప్రయత్నాలు పనామా పేపర్ల లీకేజీతో స్విస్బ్యాంక్కు దూరం న్యూఢిల్లీ : 2007 నుంచి 2015 మధ్యకాలంలో దేశంనుంచి బయటకి వెళ్లిన ధనం ఎంతో మీకు తెలుసా? ఊహకందని అంత సొమ్మును దేశం ఎలా దాటించారు? నల్ల కుబేరులకు, పన్ను ఎగవేత దారులకు స్వర్గధామంలా ఉన్న దేశాలు ఏవి? కోట్లకొద్ది ధనాన్ని నల్లకుబేరులు ఎలా తీరం దాటించగలుగుతున్నారు? అన్న ప్రశ్నలు సాధారణంగా అందరికీ వస్తుంటాయి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఈ స్టోరీని కొంచెం చదవాల్సిందే. 2007-15 మధ్య కాలంలో మన దేశం నుంచి బయటకు తరలివెళ్లిన మొత్తం అక్షరాలా 4 లక్షల కోట్ల రూపయాలు. ఈ మొత్తాన్ని నల్ల కుబేరులు, పన్ను ఎగవేత దారులు వివిధ మార్గాల్లో దేశాన్ని దాటించారు. ఈ మొత్తం విలువ.. 2015 నాటి మన దేశ జీడీపీలో 3.1 శాతం. ఎక్కడ దాస్తున్నారు? గతంతో పోలిస్తే స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంక్ అంత సురక్షితం కాకపోవడంతో.. ఆసియాలోని సింగపూర్, మలేషియా, హాంగ్కాంగ్, బహ్రెయిన్ దేశాల్లోనే నల్ల కుబేరులు ధనాన్ని దాస్తున్నారు. పన్ను ఎగవేత దారులు కేవలం ఈ నాలుగు దేశాల్లోనే 53 శాతం మొత్తాన్ని మళ్లించినట్లు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషన్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) సంస్థ ప్రకటించింది. ఇక స్విస్ బ్యాంక్ళక్ష 38 శాతం మేర మొత్తాలను దాచినట్లు బీఐఎస్ తెలిపింది. 2007లో ఈ మొత్తం 58 శాతం ఉండగా.. కొంతకాలంగా తగ్గుముఖం పట్టింది. ఫలించని ప్రయత్నాలు నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వలేదని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. పనామా పేపర్ల లీకేజీ తరువాత స్విట్జర్లాండ్ కొంత వరకూ పారదర్శకంగా ఉన్నా అదేమంత ఆశించి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. స్విట్జర్లాండ్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్నఆలోచనతోనే పన్ను ఎగవేతదారులు తమ డబ్బును మలేషియా, సింగపూర్, హాంగ్కాంగ్వంటి దేశాలకు మళ్లించారు. ప్రపంచ దేశాల్లోనూ..! నల్లధనం అనేది ఒక్క భారత్నేకాక ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్, నార్వేయన్ యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ల అంచనాల మేరకు 2007-15 మధ్య కాలంలో ప్రపంచ దేశాల నుంచి.. సరిహధ్దుల దాటిన నల్లధనం విలువ 8.6 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తం ప్రపంచ జీడీపీలో 11.6 శాతం. ఇందులో రియల్ ఎస్టేట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ఆస్తులను కలపలేదు.. వాటిని కూడా జోడిస్తే.. ఈ మొత్తం ఊహలకు అందదు. -
షెల్ కంపెనీలపై కొరడా..
లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు!! న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెల్ కంపెనీలతో సంబంధమున్న దాదాపు 1.06 లక్షల మంది పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు పడనుంది. సెప్టెంబర్ 12 నాటికి కంపెనీల చట్టంలోని సెక్షన్ 164 కింద అనర్హత వేటు వేయతగిన డైరెక్టర్లుగా 1,06,578 మందిని గుర్తించినట్లు, వీరిపై ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు అదే కంపెనీలో పునర్నియామకానికి గాని లేదా ఇతర కంపెనీల్లో గానీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గానీ అర్హత కోల్పోతారు. ఈ నెలాఖరు నాటికల్లా షెల్ కంపెనీలతో సంబంధమున్న డైరెక్టర్ల పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాగలదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెప్పారు. చాన్నాళ్లుగా వ్యాపార కార్యకలాపాలు జరగని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇటీవలే రద్దు చేసిన దరిమిలా తాజా ప్రతిపాదిత చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటు పరమావధి, డైరెక్టర్లు, లబ్ధిదారుల నిగ్గు తేల్చే దిశగా ఆయా సంస్థల డేటాను కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. ఈ సంస్థల ఆధ్వర్యంలో మనీల్యాండరింగ్ కార్యకలాపాల్లాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. సదరు డిఫాల్ట్ కంపెనీలతో సంబంధమున్న వృత్తి నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లు మొదలైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారిపై ఐసీఏఐ, ఐసీఎస్ఐ తదితర వృత్తి నిపుణుల సంస్థలు తీసుకున్న చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 2.09 లక్షల సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు అయిన తర్వాత ప్రస్తుతం 11 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. -
తమిళనేత అకౌంట్లో భారీగా నల్లడబ్బు
సాక్షి, చెన్నై : పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా నల్లధనం బయటికి వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక బినామి అకౌంట్లలో జమఅయిన బ్లాక్మనీ భరతం కూడా ఐటీ అధికారులు పడుతున్నారు. బ్లాక్మనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో తమిళనాడులో భారీగా నల్లధనం బయటికి వచ్చింది. ఓ ప్రముఖ తమిళనేత బినామి అకౌంట్లో రూ.246 కోట్ల బ్యాంకు డిపాజిట్ను ఐటీ అధికారులు గుర్తించారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు జరిగిన డీమానిటైజేషన్ కాలంలో ప్రముఖ తమిళనేత అకౌంట్లో ఇవి డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారు. అంతేకాక రాష్ట్రంలో 441 మంది ఖాతాదారులు బ్యాంకు డిపాజిట్లు రూ.240 కోట్లు కూడా వెలుగులోకి వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కస్టమర్ల వివరాలను మాత్రం బ్యాంకులు అందించలేకపోయాయి. పెద్ద మొత్తంలో అనుమానిత లావాదేవీలు చేసిన 27,739 ఖాతాదారులకు కూడా ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు జారీచేసినట్టు తెలిపింది. తాజాగా తమిళనేత బినామి అకౌంట్లో డిపాజిట్ అయిన రూ.246 కోట్ల బ్లాక్మనీ బ్యాంకింగ్ గంటల తర్వాత బ్యాంకు అకౌంట్లో జమఅయినట్టు ఐటీ చెప్పింది. డీమానిటైజేషన్ కాలంలో చేసిన అత్యధిక డిపాజిట్లలో ఇదీ ఒకటి. ఈ తమిళనేతకు తాము నోటీసు పంపామని, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో ఈ మొత్తాన్ని జమచేయడానికి అంగీకరించినట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తానికి పన్నులు, జరిమానా, పెనాల్టీ కూడా ఆయన కట్టడానికి సిద్దమైనట్టు తెలిసింది. ఆర్బీఐ అందించిన అనుమానిత డిపాజిట్ల ప్రకారం ప్రస్తుత ప్రక్రియ కొనసాగుతోంది. 27,739 మంది బ్యాంకు ఖాతాదారులకు ఐటీ అధికారులు నోటీసులు పంపారు. అయితే వీరిలో కేవలం 18,220 మంది మాత్రమే స్పందించినట్టు తెలిసింది. -
నోట్ల రద్దు : రూ.246 కోట్ల డిపాజిట్
బినామీ అకౌంట్లలో భారీగా డిపాజిట్లు తమిళనాడు రాజకీయనేతవిగా అనుమానాలు విస్తృతంగా శోధిస్తున్న ఐటీ శాఖ చెన్నై: పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా నల్లధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన ఘటన తాజాగా తమిళనాడులో వెలుగు చూసింది. తమిళనాడులో నల్లధనం గుట్టు విప్పే పనిలో సీరియస్గా పనిచేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్.. పెద్దనోట్ల రద్దు సమయంలో 246 కోట్ల రూపాయల డిపాజిట్లను గుర్తించింది. ఈ డబ్బు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడివిగా ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సింగిల్ అకౌంట్.. సింగిల్ ట్రాన్సాక్షన్ 246 కోట్ల రూపాయలను ఒకేసారి డిపాజిట్ అదికూడా బ్యాంకింగ్ అవర్స్లోనూ డిపాజిట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. డిమానిటైజేషన్ సమయంలో డిపాజిట్ అయిన అతి పెద్ద మొత్తం కూడా ఇదేనని ఇటీ అధికారులు అంటున్నారు. 441 అకౌంట్లలో.. తమిళనాడులోని పలు బ్యాంకుల్లో సుమారు 441 అకౌంట్లలో కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగాయని ఐటీ శాఖ చెబుతోంది. దురదృష్టం ఏమిటంటే.. ఆయా ఖాతాదారుల వివరాలు కూడా బ్యాంకుల్లో లేవని.. ఇవన్నీ బినామీ, అక్రమ ఖాతాలని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాలు లేని ఖాతాల్లో పెద్దపెద్ద మొత్తాలు డిమానిటైజేషన్ సమయంలో డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 27,739 మందికి నోటీసులు డిమానిటైజేషన్ సమయంలో అనుమానాస్పదంగా భారీ స్థాయిలో మొత్తాలను డిపాజిట్ చేసిన 27,739 మంది ఖాతాదారులను గుర్తించి వారికి నోటీసులు పంపినట్లు ఐటీ అధికారులు చెప్పారు. -
బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడికి మోదీ సర్కారు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకానికి స్పందన స్వల్పంగానే ఉంది. 21 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. రూ.4,900 కోట్ల మేర నల్లధనం వివరాలను వీరు స్వచ్ఛందంగా వెల్లడించారు. ఈ పథకం మార్చి 31తో ముగిసిపోయింది. ఇవి తుది వివరాలని, వీటి ఆధారంగా రూ.2,451 కోట్ల పన్ను రాబట్టినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని కేసుల్లో వివరాల ఆధారంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం లెక్కల్లో చూపని ఆదాయాన్ని (బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు సైతం) గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద స్వయంగా వెల్లడించి 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడొచ్చని కేంద్ర సర్కారు సూచించింది. మిగిలిన మొత్తంలో సగాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహితంగా ప్రభుత్వం వద్ద కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. నల్లధనం కలిగిన వారికి ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత అధికారులు గుర్తిస్తే 200 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ దశలో హెచ్చరిక కూడా చేసింది. ఈ పథకం మార్చిలో ముగియగా, వచ్చిన స్పందన ఆశాజనకంగా లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రూ.4900 కోట్ల బ్లాక్మనీ బహిర్గతం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం వెల్లడికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' (పీఎంజీకేవై) కింద భారీగా బ్లాక్మనీ బహిర్గతమైంది. ఈ స్కీమ్ కింద 21వేల మంది ప్రజలు రూ.4900 కోట్ల విలువైన బ్లాక్మనీని బయటికి వెల్లడించినట్టు ప్రభుత్వ అధికారులు గురువారం చెప్పారు. ఈ వెల్లడితో ఇప్పటి వరకు వీటిపై రూ.2451 కోట్ల పన్నులను కూడా వసూలు చేసినట్టు ఆదాయపు పన్ను అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవే తుది గణాంకాలుగా కూడా అధికారులు పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో ఈ నగదు వెల్లడించిన వారిపై(డిక్లరెంట్లపై) న్యాయప్రక్రియను కూడా ఆదాయపు పన్ను శాఖ చేపట్టినట్టు వివరించారు. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం ఈ స్కీమ్ను లాంచ్ చేసింది. 50 శాతం పన్ను, జరిమానాలను ఈ స్కీమ్ కింద బహిర్గతం చేసిన బ్లాక్మనీపై చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక 25 శాతం బ్లాక్మనీని జీరో వడ్డీరేటుతో నాలుగేళ్ల పాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే. మార్చి 31తో ఈ పథకం ముగిసింది. పీఎంజీకేవై మాదిరిగానే మరిన్ని పథకాలను తీసుకురానున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చెప్పారు. ఐడీఎస్(ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్) తర్వాత పీఎంజీకేవైను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2016 జూన్ 1 నుంచి 2016 సెప్టెంబర్ 30 వరకు తెరచి ఉంచిన ఐడీఎస్ స్కీమ్ కింద రూ.67,382 కోట్ల బ్లాక్మనీ బయటికి వచ్చింది. -
కంపెనీల నిధుల్ని మింగితే ఇక పదేళ్ల జైలు!
షెల్ కంపెనీల డైరెక్టర్లకు కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్లు రద్దయిన కంపెనీల డైరెక్టర్లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కఠిన హెచ్చరికలు చేసింది. కంపెనీల తాలూకు బ్యాంకు ఖాతాల నుంచి నిధులను సొంత ఖాతాలకు మళ్లించాలని ప్రయత్నించే వారు పదేళ్ల వరకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సోమవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, షెల్ కంపెనీల డైరెక్టర్లు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు రిటర్నులు ఫైల్ చేయకపోతే ఆ పదవిని కోల్పోతారని, ఇతర ఏ కంపెనీలో పదవులున్నా అనర్హతకు గురవుతారని సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ విధమైన కార్యకలాపాలు లేకుండా రికార్డులపైనే కొనసాగుతున్న 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను కార్పొరేట్ వ్యవహారాల శాఖ తాజాగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కొన్ని కేసుల్లో షెల్ కంపెనీలకు సహకారం అందించిన చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీల సెక్రటరీలు, కాస్ట్ అకౌంటెంట్లను సైతం కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇక నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగంగా మరిన్ని షెల్ కంపెనీలను గుర్తించే పని కొనసాగుతోందని, ఈ సంస్థల వెనుక అసలు లబ్ధిదారులు, వ్యక్తులు ఎవరన్నది తెలుసుకునే చర్యలు కూడా కొనసాగుతున్నాయని కేంద్రం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ రద్దయిన కంపెనీల డైరెక్టర్లు సంస్థ నిథులను కాజేస్తే, ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఇందులో ప్రజాధనం ఉంటే మూడేళ్లు తక్కువ కాకుండా శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు రద్దు కావటానికి ముందు నిధులు కాజేసినట్టు తేలినా చర్యలు తప్పవని హెచ్చరించింది. -
2లక్షల కంపెనీలపై సర్కారు వేటు
-
2లక్షల కంపెనీలపై వేటు
ఆర్వోసీ నుంచి తొలగింపు ► బ్యాంక్ ఖాతాల స్తంభన కేంద్రం ఆదేశాలు ► రెగ్యులేటరీ నిబంధనలను పాటించని నేపథ్యం ► మరికొన్ని కంపెనీలపైనా చర్యలకు సమాయత్తం ► నల్లధనంపై మరో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: నల్లధనం నిరోధించే దిశలో కేంద్రంలోని మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) నుంచి తొలగించింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంక్ ఖాతాల స్తంభనకూ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరికొన్ని కంపెనీలపైనా ఇదే విధమైన చర్యలకు అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిబంధనలు పాటించకుండా, చాలాకాలం నుంచి వ్యాపారం చేయకుండా ఉంటున్న కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా ఆయన తెలిపిన అంశాలు క్లుప్తంగా... ♦ తప్పు చేసిన కంపెనీలను వదిలిపెట్టడం జరగదు. కార్పొరేట్ ప్రమాణాల మెరుగుదలకు ఈ చర్యలు దోహదపడతాయి. వ్యవస్థ ప్రక్షాళన దిశలో ఇదొక ముందడుగు. ♦ కంపెనీల చట్టంలోని 248 (5) సెక్షన్ ప్రకారం మొత్తం 2,09,032 కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి తొలగించడం జరిగింది. ఈ చర్యతో ఆయా కంపెనీల ప్రస్తుత డైరెక్టర్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ తమ హోదాలను కోల్పోయి, మాజీలుగా మారతారు. ♦ డీమోనిటైజేషన్ సమయంలో నల్లడబ్బును వ్యవస్థలోకి తీసుకురావడానికి ఈ కంపెనీలు (తాజా డీరిజిస్టర్డ్) తమ అకౌంట్లను వినియోగించుకున్నాయా? ఆయా అంశాలకు సంబంధించి ఈ కంపెనీల కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? అన్న అంశంపై సైతం సమగ్ర విశ్లేషణ ప్రారంభమైంది. ♦ ఆర్ఓసీ నుంచి తొలగించిన కంపెనీల బ్యాంక్ అకౌంట్లపై ఆంక్షల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే ఆర్థిక సేవల శాఖ నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ద్వారా వర్తమానం అందింది. ♦ నిజానికి ప్రస్తుత చర్యలను ఎదుర్కొంటున్న కంపెనీల్లో కొన్ని కార్పొరేట్ మంత్రిత్వశాఖ వెబ్సైట్కు సంబంధించి క్రియాశీలంగానే ఉన్నాయి. అయితే తగిన సమయంలో తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు లేదా వార్షిక రిటర్న్స్ తదితర ఇతర రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ♦ ఏదైనా కంపెనీ అకౌంట్ స్తంభించిపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తిరిగి బ్యాంక్ను సంప్రదించి, తగిన కారణాలు చూపి అకౌంట్ను తిరిగి పునరుద్ధరించుకునే వీలూ ఉంది. నల్లధనమే లక్ష్యం... నల్లధనాన్ని నిర్మూలించాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన సర్వశక్తులనూ ఒడ్డుతుంది. ఇందుకు అనుగుణంగా నల్లధనం తదుపరి యుద్ధంలో భాగంగానే బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ చర్యలు అమల్లోకి వస్తాయి. – ట్వీటర్లో పీపీ చౌదరి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి -
నల్లధనం ఎంత వెలికివచ్చిందో తెలియదు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత ఎంత నల్లధనం వెలికివచ్చిందో తమకు సమాచారం లేదని ఆర్బీఐ పార్లమెంటు స్థాయి సంఘానికి తెలిపింది. అదేవిధంగా రద్దైన నోట్ల బదిలాయింపులో ఎంత అక్రమధనం చట్టబద్ధరూపంలో మార్పిడి అయిందో కూడా తెలియదని పేర్కొంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. వెయ్యి, 500 నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 15.28 లక్షల కోట్ల రద్దైన నోట్లు తిరిగి బ్యాంకుకు వచ్చాయని, ప్రస్తుతం వీటి ధ్రువీకరణ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ లెక్కల్లో మార్పులు ఉండవచ్చునని ఆర్బీఐ వివరించింది. రానున్న కాలంలో రెగ్యులర్గా పెద్దనోట్ల రద్దు ప్రక్రియను కొనసాగించే అవకాశముందా? అని పార్లమెంటు స్థాయి సంఘం ప్రశ్నించగా.. సమాచారం లేదని ఆర్బీఐ బదులిచ్చింది. దాదాపు రద్దైన నోట్లన్నీ తిరిగి కేంద్ర బ్యాంకుకు వివిధ రూపాల్లో రావడంతో పెద్దనోట్ల రద్దు విఫలమైందని, ఇది అర్థరహితమైన ప్రక్రియ అని మండిపడుతున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని అణచివేసేందుకు నవంబర్ 8, 2016న పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు వ్యవహారాన్ని పరిశీలిస్తున్న ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం.. వివరాలు కోరడంతో ఆర్బీఐ ఈమేరకు తెలిపింది. -
ఆ నల్లధనంపై సమాచారం లేదు
► జమయిన నోట్ల ధృవీకరణ పూర్తికి మరింత సమయం ► డీమోనిటైజేషన్పై పార్లమెంటరీ ప్యానెల్కు ఆర్బీఐ వివరణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా చలామణీ నుంచి ఎంత మేర నల్లధనం తొలగిపోయినదీ తమ దగ్గర ‘ఎలాంటి సమాచారమూ’ లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదే విధంగా లెక్కల్లో చూపని ఎంత ధనం చట్టబద్ధంగా ఖాతాల్లోకి వచ్చినదీ కూడా తమ దగ్గర వివరాలు లేవని పేర్కొంది. ఆర్థిక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లో జమ అయిన డబ్బు గణాంకాలు పక్కాగా తేల్చే ప్రక్రియ అత్యాధునిక వెరిఫికేషన్ మెషీన్స్ సాయంతో ఇంకా కొనసాగుతోందని ఆర్బీఐ తెలిపింది. ఇందుకోసం చాలా మటుకు రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని వివరించింది. బ్యాంకుల్లోకి జమయిన పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15.28 లక్షల కోట్లు ఉంటుందని, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో కొంత మార్పులు, చేర్పులు ఉండొచ్చని తెలిపింది. తదుపరి మళ్లీ మళ్లీ డీమోనిటైజేషన్ ప్రణాళికలేమైనా ఉన్నాయా అన్న దాని గురించీ తమకు సమాచారం లేదని పేర్కొంది. నల్లధనం అరికట్టే దిశగా కేంద్రం గతేడాది నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ తర్వాత వ్యవస్థలోకి రూ. 15,280 కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు తిరిగొచ్చాయంటూ ఆర్బీఐ ఇటీవలే వార్షిక నివేదికలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుపై స్థాయీ సంఘం లేవనెత్తిన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ తాజాగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సంఘటిత, అసంఘటిత రంగాలపై డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాల గురించి రిజర్వ్ బ్యాంకు నేరుగా సమాధానం చెప్పలేదు. పారిశ్రామిక, సేవల రంగాల్లో బలహీనతల కారణంగా 2016–17లో వృద్ధి మందగమనం.. డీమోనిటైజేషన్ కన్నా ముందే మొదలైందని పేర్కొంది. వర్చువల్ కరెన్సీలతో రిస్కే.. బిట్కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో ‘బ్లాక్ మనీ’ ముప్పు పొంచి ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. టెర్రరిస్టులు, మోసగాళ్లు ఇలాంటి మార్గాల్లో మనీల్యాండరింగ్కు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. బిట్కాయిన్ లేదా ఇతరత్రా ఏ వర్చువల్ కరెన్సీతో సంబంధమున్న లావాదేవీలు నిర్వహించడానికి దేశీయంగా ఏ సంస్థకూ తాము అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ లావాదేవీలు జరిపేవారు సొంతంగా రిస్కు భరించాల్సి ఉంటుందని పార్లమెంటరీ ప్యానెల్కి ఆర్బీఐ తెలిపింది. వర్చువల్ కరెన్సీలపై నియంత్రణలపరమైన విధి విధానాలను రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైనట్లు తెలిపింది. -
5పార్లమెంటరీ కమిటీకి నల్లధనం నివేదికలు
న్యూఢిల్లీ: దేశంలో, విదేశాల్లో భారతీయుల నల్లధనం వివరాలపై మూడు అధ్యయన నివేదికల్ని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. నల్లధనం వివరాల అంచనా బాధ్యతల్ని యూపీఏ హయాంలో మూడు సంస్థలకు అప్పగించారు. ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ ఫరీదాబాద్లు నల్లధనం లెక్కల్ని రూపొందించి 2013, 2014ల్లో ప్రభుత్వానికి సమర్పిం చాయి. ఆ నివేదికల్నే ఇప్పుడు ఆర్థిక శాఖపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం పంపింది. భారత్లో నల్లధనంపై ప్రభుత్వం తరఫున ఇంతవరకూ అధికారిక నివేదికల్లేవు. అమెరికా సంస్థ జీఎఫ్ఐ అధ్యయనం ప్రకారం 2005–14 మధ్య రూ.48.28 లక్షల కోట్ల నల్లధనం భారత్లోకి వచ్చింది. -
నల్లధనంపై మూడు రిపోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనూ, విదేశాల్లోనూ దాగున్న నల్లధనం వివరాలు బహిర్గతం కానున్నాయి. నల్లధనానికి చెందిన మూడు అధ్యయన రిపోర్టులను ఆర్థికమంత్రిత్వ శాఖ, పార్లమెంట్ ప్యానల్కు పంపించింది. మూడేళ్ల తర్వాత ఈ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికారులు చెప్పారు. యూపీఏ హయాంలోనే ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ ఫరిదాబాద్లు ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీకి తమ రిపోర్టులు అందించాయని అధికారులు తెలిపారు. ఒక్కసారి కమిటీ కూడా వీటిని క్లియర్చేసిన అనంతరం, ఇవి పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం భారత్లో, విదేశాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటిగ్రిటీ అధ్యయనం ప్రకారం 2005-14 కాలంలో 770 బిలియన్ డాలర్ల నల్లధనం భారత్లోకి ప్రవేశించిందని పేర్కొంది. -
మోదీనే అత్యుత్తమ ప్రధాని
-
నల్లధనం వెలికి తీస్తున్నారా.. తరలిస్తున్నారా ?
మోదీకి తమ్మినేని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు దేశ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెలికి తీస్తున్నారా, లేక దేశం నుంచి బయటకు తరలిస్తున్నారా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘ప్రధానికి అత్యంత సన్నిహిత మిత్రుడైన ఆదానీ కుటుంబం దేశం నుంచి నల్లధనాన్ని పలు రూపాల్లో తరలించిందని ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పరిశోధన బట్టబయలు చేసింది. విద్యుత్ ప్లాంట్ పరికరాల కొనుగోలులో ఆదానీ గ్రూప్ కంపెనీలు విదేశీ దిగుమతులపై విలువకు మించి అదనపు విలువను చెల్లించాయి. ఆ అదనపు మొత్తాలను నల్లధనంగా మార్చినట్లు ఈపీడబ్ల్యూ నివేదిక స్పష్టం చేస్తోంది. ’’అని పేర్కొన్నారు. -
మోదీనే అత్యుత్తమ ప్రధాని
ఇండియా టుడే–కార్వీ ఇన్సైట్స్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 349 సీట్లు ► ప్రధానిగా మోదీకే 63 శాతం మంది మద్దతు ► అవినీతి రహిత పాలనపైనే సంతృప్తి.. ఉద్యోగ కల్పనపై అసంతృప్తి న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా నరేంద్ర మోదీకి భారతీయులు పట్టంగట్టారు. ఇండియా టుడే– కార్వీ ఇన్సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డా.. నల్లధనంపై మోదీ ప్రయోగించిన అస్త్రంగా ప్రజలు భావించారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని వెల్లడించింది. అత్యుత్తమ ప్రధానిగా.. సర్వేలో పాల్గొన్న వారిలో ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్పేయిల కన్నా మోదీపైనే ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఐదు సార్లు దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. తాజా (జూలై 2017) ఫలితాల్లో 33శాతంతో మోదీ ముందంజలో ఉన్నారు. ఇందిరా గాంధీ 17శాతంతో రెండో స్థానంలో, వాజ్పేయి 9శాతం, నెహ్రూ 8శాతంతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. తొలిసారి ఆగస్టు 2015లో జరిగిన సర్వేలో ఇందిర 21 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. మోదీ 20 శాతంతో రెండో స్థానం సంపాదించారు. దేశంలో పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీని అమల్లోకి తేవటం ద్వారా లంచం, పన్ను ఎగవేతలకు మోదీ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హవా కొనసాగితే 2019లోనూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే 349 సీట్లు ఎన్డీయే ఖాతాలో చేరతాయన్న సర్వే.. ఇదే జోరు కొనసాగితే 2019లోనూ ఇదే కూటమి అధికారాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు రాకముందే ఈ సర్వే జరిగింది. అయితే.. తర్వాత పరిణామాలతో ఎన్డీయేకు 400 సీట్ల రావొచ్చని సర్వే అభిప్రాయపడింది. తాజా సర్వే వివరాల ప్రకారం యూపీఏకు 75, ఇతర విపక్షాలకు 119 సీట్లు వస్తున్నాయి. మోదీ పాపులారిటీతో బీజేపీ 298 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. పశ్చిమ, ఉత్తర భారత్లలోనే బీజేపీ 249 సీట్లు పొందనుండగా.. తూర్పు, దక్షిణ భారత్లో 107 (286 స్థానాలకు గానూ) స్థానాలు దక్కనున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎన్డీయే, యూపీయేతర పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అవినీతి రహిత పాలనతోనే! సర్వేలో వివిధ అంశాలపై ప్రజలు తమ స్పందన తెలిపినా.. అవినీతి రహిత పాలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అత్యధికులు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ్ భారత్, పాకిస్తాన్పై సర్జికల్ దాడులు, మౌలికవసతుల కల్పన, పేదలు, రైతుల అనుకూల పథకాలు కూడా మోదీపై ప్రజాభిమానానికి కారణాలుగా సర్వే వెల్లడించింది. అందుకే దేశవ్యాప్తంగా 63 శాతం మంది ప్రధానిగా మోదీకే పట్టంగట్టగా.. కేవలం 12 శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 23 శాతం మంది కేంద్రపాలన పర్వాలేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటూ సర్వే అడిగిన ప్రశ్నల్లో 24 శాతం మంది.. ప్రధాని ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నచ్చిందని పేర్కొన్నారు. అయితే 23 శాతం మంది మోదీవి మాటలే తప్ప చేతలు కనిపించటం లేదని అభిప్రాయపడ్డారు. పేదలు, రైతుల పక్షపాతి అని 15 శాతం, మైనారిటీ వ్యతిరేకి అని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్లలో మోదీకి ఎవరు సరైన పోటీ అని అడిగిన ప్రశ్నకు 13 శాతం మంది యోగి ఆదిత్యనాథ్కు ఓటేయగా.. కేంద్ర మంత్రులు సుష్మ, జైట్లీ, రాజ్నాథ్లు చెరో 10 శాతం ఓట్లు సంపాదించారు. నిరుద్యోగం ఓ హెచ్చరిక ఈ సర్వే ఎన్డీయేకు, బీజేపీకి సానుకూల పవనాలను చూపించటంతోపాటుగా ప్రజల్లో పలు అంశాలపై ఉన్న అసంతృప్తినీ గుర్తుచేసింది. ఉద్యోగకల్పనపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరికగా పేర్కొంది. ఆగస్టు 2015లో సర్వే మొదలైనప్పటినుంచీ తాజా సర్వే (జూలై 2017) వరకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధాని కూడా యువకులు ఉద్యోగం కోసం వెతకటం కన్నా స్వయం ఉపాధితోపాటుగా ఉద్యోగాలు సృష్టించే ఆలోచన చేయాలని చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలనూ ఆయన ప్రారంభించారు. వీటి ఫలితం వచ్చే ఎన్నికల వరకు కనబడితే యువతలో అసంతృప్తి దూరం అవుతుందని సర్వే పేర్కొంది. అటు 2014 ప్రచారంలో మోదీ చెప్పిన అచ్ఛేదిన్పై 39 శాతం మంది సానుకూలత, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. -
జీఎస్టీతో కొత్త చరిత్ర..నల్లధనంపై యుద్ధమే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో మువ్వన్నెల జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించిన అనంతరం జాతినుద్దేశించిన ప్రసంగిస్తూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు ప్రధాని నివాళులర్పించారు. నోట్ల రద్దుద్వారా తమ అవినీతిని,నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. జీఎస్టీ ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తామని, నల్లధనంపై తమ పోరు కొనసాగుతుందని ప్రధాని తెలిపారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారనీ, 2022 నాటికి నవభారత నిర్మాణానికి అందరం కృషి చేయాలని ప్రధాన మోదీ జాతికి పిలుపునిచ్చారు. నోట్ల రద్దుతో దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద అడుగు వేశామని ప్రధాని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా నగదు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందని మోదీ తెలిపారు. రెండు లక్షల కోట్ల నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ కొత్త చరిత్ర సృష్టించామన్నారు. నల్లధనం అవినీతిని అంతం చేస్తామని దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. షెల్ కంపెనీల విషయానికి వస్తే 3 లక్షల కంపెనీలను కనుగొన్నామనీ, 1.75 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని ప్రధాని ప్రకటించారు. 2019 నాటికి 19 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే గోరఖ్పూర్ విషాదం చాలా బాధాకరమని స్పందించిన మోదీ చనిపోయిన చిన్నారులకు నివాళులర్పించారు. ప్రసంగం అనంతరం అక్కడున్న పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లతో ఉత్సాహంగా కలిసిపోయారు. వారితో చేతులు కలిపారు. ముచ్చటగా తయారైన బాలబాలికలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. -
వైరల్ వీడియో : అబ్బో ఏం దాచారు...!
-
పట్టుబడ్డ బ్లాక్ మనీ 1429 కోట్లు!
మూడు నెలల్లో ఐటీశాఖ దాడుల్లో పట్టివేత సాక్షి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన భారీ దాడులలో వెయ్యికోట్లకుపైగా నల్లధనం పట్టుబడింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో కేవలం మూడు నెలల్లో రూ. 1429 కోట్లు పన్నుకట్టని ఆదాయం దొరికింది. కాగా, ఈసారి చెన్నైలో ఆదాయ పన్నువసూళ్లు కాస్త తగ్గినట్టు సమాచారం. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు గత ఏడాది చివర్లో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్రమార్కులు పాత నోట్లను మార్చే క్రమంలో ఐటీ గురి నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో పడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున లెక్కలోకి రాని నగదు పట్టుబడ్డట్టు సమాచారం. ముఖ్యంగా మూడునాలుగు నెలల్లో ఐటీశాఖ దాడులు హోరెత్తాయి. ఐటీ వలలో చిక్కినవారిలో అధికార పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఓ వైపు సీబీఐ, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్, ఇంకోవైపు ఐటీ దాడులు రాష్ట్రంలో దుమారం రేపాయి. రూ. 1429 కోట్లు కోట్లు.. ఆదాయ పన్ను శాఖ సాగించిన దాడుల్లో ఈ నాలుగు నెలల్లో రూ. 1429 కోట్లు తమిళనాడు,పుదుచ్చేరిలో పట్టుబడ్డాయి. మంగళవారం ఐటీ శాఖ వార్షికోత్సవం సందర్భంగా ఆ విభాగం ఉన్నతాధికారి మురళీకుమార్ తమ దాడులు, పట్టుబడ్డ నగదు వివరాలను వెల్లడించారు. 2016-17లో తమ ఐటీ సిబ్బంది వంద దాడులు జరిపిందని తెలిపారు. ఇందులో రూ. 3,210 కోట్లు లెక్కలోకి రాని నగదు పట్టుబడిందని చెప్పారు. ఇందులో గడిచిన మూడు నాలుగు నెలల్లోనే రూ. 1429 కోట్లు పట్టుబడిందని చెప్పారు. మొత్తం నగదులో 50 శాతం మేరకు ఈ మూడు నాలుగు నెలల్లో పట్టుబడిందని తెలిపారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 42 ప్రత్యేక దాడులు జరిపినట్టు, ఇందులో రూ. 428 కోట్లు పట్టుబడ్టట్టు చెప్పారు. ఆదాయ పన్ను వసూళ్ల గురించి కమిషనర్ పళని వేల్రాజ్ వివరిస్తూ.. గత ఏడాది రూ. 60,606 కోట్లు వసూలు అయ్యాయని, ఈ సంవత్సరం రూ. 71,400 కోట్ల మేరకు వసూలుచేయాలన్న టార్గెట్తో ముందుకుసాగుతున్నామని తెలిపారు. అయితే, చెన్నైలో మాత్రం పన్ను వసూళ్లు తగ్గినట్టు సమాచారం. రూ.428 కోట్ల మేరకు పన్నువసూళ్లు తగ్గుముఖం పట్టడం చూస్తే.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆదాయ పన్ను వసూళ్ల మీద కూడా పడిందేమోనని అంటున్నారు. -
దోచుకున్నది కక్కిస్తాం!
ప్రజల సొమ్మును లూటీ చేసిన వారిని వదలం ► పన్ను ఎగవేసే కంపెనీలకు ప్రధాని హెచ్చరిక ► సీఏల సంతకం విలువైంది.. దుర్వినియోగం చేయొద్దు న్యూఢిల్లీ: ప్రజల సొమ్మును లూటీచేసిన వారంతా తిరిగి ప్రజలకు ఆ మొత్తాన్ని అందజేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇకపై తప్పుడు లెక్కలు చూపించే, పన్ను ఎగవేసే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నోట్లరద్దు తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దుచేశామని స్పష్టం చేశారు. నల్లధనాన్ని దాచటంలో సహకరించినవారిపైనా కొరడా ఝుళిపిస్తామన్నారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఏలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘మీ క్లయింట్లను పన్ను పరిధిలోనుంచి బయటపడేశామని గొప్పలు చెప్పుకోవటం కన్నా.. వారంతా పన్ను చెల్లించేలా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి’ అని సీఏలకు ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకంతోపాటుగా దేశాన్ని లూటీ చేసిన వారినుంచి భారత ఆర్థిక వ్యవస్థను స్వచ్ఛ పరిచే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందన్నారు. ఓ రాజకీయ పార్టీగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమేనని అయితే.. దేశం కోసం ఎవరో ఒకరు చొరవతీసుకుంటేనే ముందడుగు పడుతుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏలతోపాటుగా ఆర్థికమంత్రి జైట్లీ, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతా సీఏల చేతుల్లోనే! జీఎస్టీ అమల్లో తద్వారా నవభారత నిర్మాణంలో సీఏల పాత్ర కీలకమని మోదీ అన్నారు. ‘దేశాభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో చాలా మంది న్యాయవాదులు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు దేశ ఆర్థిక ప్రగతి ప్రయాణంలో సీఏలు కూడా మూలస్తంభంగా నిలవాలి’ అని ప్రధాని కోరారు. దశాబ్దాలుగా ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ప్రజలకు చెల్లించాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వెలువడిన తర్వాత అందరికన్నా ఎక్కువగా కష్టపడి పనిచేసింది సీఏలేనని చమత్కరించారు. నల్లధనం ఉన్న వారిని గుర్తించినట్లయితే.. సీఏలు వారిని హెచ్చరించాలని మోదీ సూచించారు. ‘దేశవ్యాప్తంగా ఏడాదికి రూ.10లక్షల ఆదాయం దాటిన వాళ్లు కేవలం 32 లక్షల మందే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కానీ కొన్ని కోట్ల మంది ఉన్నతశ్రేణి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నారు. రెండున్నరకోట్ల మంది విదేశీ పర్యటనలకు వెళ్లారు. వీరందరి సంగతేంటి’ అని మోదీ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా దేశంలో అక్రమాలకు పాల్పడిన సీఏలపై విచారణ సందర్భంగా కేవలం 25 మందినే దోషులుగా గుర్తించారని.. కేవలం ఇంతమందే అక్రమాలకు పాల్పడ్డారా అనే అనుమానం వస్తుందన్నారు. చాలా ఏళ్లుగా సీఏలకు సంబంధించి 1,400 కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఒక్కదెబ్బతో లక్ష కంపెనీలు ఔట్! పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత 3 లక్షలకుపైగా రిజిస్టర్ అయిన కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా గుర్తించామని మోదీ తెలిపారు. ‘డీమానిటైజేషన్ తర్వాత అక్రమాలకు పాల్పడినట్లు తేలిన లక్ష కంపెనీల రిజిస్ట్రేషన్ను ఒక్కదెబ్బతో రద్దుచేశాం. మరో 37వేల షెల్ కంపెనీలను గుర్తించాం. వాటిపైనా కఠినమైన చర్యలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. సీఏలు సమాజ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. క్లయింట్లు నిజాయితీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఏల ఒక్క తప్పుడు ఆడిట్ కారణంగా లక్షల మంది ఇన్వెస్టర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ‘మీ సంతకం ప్రధాని సంతకం కంటే శక్తివంతమైంది. మీ సంతకాన్ని ప్రభుత్వం కూడా విశ్వసిస్తుంది. అందుకే దీన్ని సరిగ్గా వినియోగిస్తూ.. కోట్లమంది ప్రజల సొమ్ము అవినీతిపరుల పాలుకాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే. మీ సంతకాన్ని దుర్వినియోగం చేయకండి’ అని ప్రధాని సూచించారు. ‘స్విస్’ లో తగ్గిన జమ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న నోట్లరద్దు చేపట్టాక స్విస్ బ్యాంకుల్లో భారతీయులు జమచేసుకునే డబ్బు 45 శాతం తగ్గిందని మోదీ వెల్ల డించారు. గతంలో కన్నా 2013లో (యూపీఏ హయాం) పెద్దమొత్తంలో భారతీయుల డబ్బు పలు అకౌంట్లలో జమైందన్నారు. వచ్చే రెండేళ్లలో స్విట్జర్లాండ్ అధికారులు భారత్కు సమాచారం ఇవ్వటం మొదలుపెట్టాక నల్లధనం దాచుకున్న వారంతా ఇబ్బందులు పడతారని మోదీ సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు అతిపెద్ద అకౌంటింగ్ సంస్థల్లో ఒక్క భారత సంస్థ కూడా లేకపోవటం బాధాకరమన్నారు. -
నల్లధనం వెల్లడికి స్విస్ ఆమోదం
2015 నాటి ఒప్పందం ఖరారు బెర్న్/న్యూఢిల్లీ: మరో రెండేళ్లలో స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. ఆ మేరకు నల్లధనం వివరాల్ని తక్షణం భారత్తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్ అధికారికంగా ఖరారు చేసింది. వివరాలు ఎంత రహస్యం, భద్రంగా ఉంచాల్సినవైనా వాటిని భారత్కు అందించేందుకు ‘ఆటోమెటిక్ ఎక్సే్ఛంజ్ ఫైనాన్సి యల్ అకౌంట్’(ఏఈఓఐ) ఒప్పందం వీలుకల్పిస్తుంది. పన్ను అంశాలపై కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ‘ఏఈఓఐ’ అమలు వివరాల్ని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ వెల్లడిస్తూ.. ‘ఈ సమాచార మార్పిడి 2018 నుంచి అమల్లోకి వస్తుంది. తొలి దశ వివరాల్ని 2019లో భారత్తో పంచుకోవచ్చ’ని పేర్కొంది. శుక్రవారం కౌన్సిల్ ఆమోదించిన ముసాయిదా నివేదిక ప్రకారం ‘తాజా నిర్ణయంపై ఇక రిఫరెండం ఉండదు. అందువల్ల ఒప్పందం అమలులో విధానపరంగా ఎలాంటి జాప్యం జరిగే అవకాశముండద’ని స్పష్టం చేశారు. అన్నీ నిర్ధారించుకున్నాక.. అవసరమైతేనే: స్విట్జర్లాండ్ నల్లధనానికి సంబంధించిన సమాచారం ఆయా దేశాలకు అవసరమా? కాదా? అన్న విషయం సరిచూసుకున్నాకే ఫెడరల్ కౌన్సిల్ సమాచారాన్ని అందించనుంది. నల్లధనం వివరాలు తెలపాలంటూ చాలాకాలంగా స్విట్జర్లాండ్తో భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఏఈఓఐ ఒప్పందంఅమలుపై చర్చలు ఫలించడంతో నల్లధనం వెల్లడికి మార్గం సుగమమైంది. -
గరీబ్ కల్యాణ్తో 5 వేల కోట్లే!
ఈ పథకానికి స్పందన అంతంతే: అధియా న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ, ఈ పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే లభించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా గురువారం చెప్పారు. నల్లధనం వెల్లడికి అక్రమార్కులకు అవకాశమిస్తూ ప్రభుత్వం గత డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయం తమ వద్ద ఎంత ఉందో అవినీతిపరులు ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ ఏమీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు మార్చి 31తో ముగిసింది. అక్రమార్కులు ముందుగానే పలు ఇతర ఖాతాల్లో డబ్బు జమ చేసి ఉండటం, పన్ను, సర్చార్జి రేట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని హస్ముఖ్ అధియా చెప్పారు. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం హస్ముఖ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పీఎంజీకేవై కింద వచ్చిన మొత్తాన్ని మాత్రమే వేరుగా చూసి తక్కువగా ఉందనుకోకూడదన్నారు. అదే ఏడాది అంతకన్నా ముందే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని తీసుకొచ్చామనీ, అలాగే ప్రజలు కూడా నల్లధనాన్ని బ్యాంకు ఖాతా ల్లో జమచేసి పన్ను చెల్లించారని జైట్లీ పేర్కొన్నారు. అందువల్లే పీఎంజీకేవై కింద వెల్లడించిన మొత్తం తక్కువగా ఉందన్నారు. -
పీ నోట్స్ ద్వారా స్పెక్యులేషన్పై నిషేధం!
► పీ నోట్ ఇష్యూపై 1,000 డాలర్ల ఫీజు ► మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: నల్లధన ప్రవాహానికి, స్పెక్యులేషన్కు పీ–నోట్స్ వాహకంగా ఉపయోగపడకుండా సెబీ కీలక ప్రతిపాదన చేసింది.విదేశీ ఇన్వెస్టర్లు జారీ చేసే పీ నోట్పై 1,000 డాలర్ల ఫీజుగా విధించాలని పేర్కొంది. అలాగే, ఈ విధమైన డెరివేటివ్ ఇనుస్ట్రుమెంట్ను స్పెక్యులేషన్కు ఉపయోగించుకోకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు సంప్రదింపులు, ప్రజల సూచనలు కోరుతూ సంబంధిత పత్రాలను సెబీ సోమవారం విడుదల చేసింది. పార్టిసిపేటరీ నోట్స్ లేదా ఆఫ్షోర్ డేరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ (ఓడీఐ) ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులు నాలుగు నెలల కనిష్ట స్థాయి రూ.1.68 లక్షల కోట్లకు చేరిన సమయంలో సెబీ ఈ ప్రతిపాదనలు చేయడం గమనార్హం. ఒకప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పీ నోట్స్ ద్వారానే సగానికిపైగా వచ్చేవి. ఇప్పుడు అవి 6 శాతానికి తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ విదేశాల నుంచి నల్లధన ప్రవాహానికి పీ నోట్స్ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓడీఐ మార్గాన్ని దుర్వినియోగం చేయకుండా ఎప్పటికప్పుడు నియంత్రణపరమైన చర్యలు చేపడుతున్నట్టు సెబీ స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్ నుంచి మూడేళ్లకు ఒకసారి ప్రతీ ఓడీఐపై 1,000 డాలర్లను నియంత్రణపరమైన ఫీజు కింద వసూలు చేయాలని ప్రతిపాదించినట్టు సెబీ వివరించింది. ఓడీఐలను జారీ చేసే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల కోసం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘‘కొంత మంది ఇన్వెస్టర్లు ఒకటి కంటే ఎక్కువ ఓడీఐల ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిపాదిత ఫీజు వారిని నిరుత్సాహపరచడంతోపాటు ఓడీఐకి బదులు నేరుగా ఎఫ్పీఐగా నమోదు చేసుకుని ఇన్వెస్ట్ చేసేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం’’ అని సెబీ వెల్లడించింది. పీ నోట్స్ విదేశీ పోర్ట్ ఫోలియో (ఎఫ్పీఐ) ఇన్వెస్టర్లు జారీ చేసేవి. భారత స్టాక్ మార్కెట్లో నమోదు చేసుకోకుండా నేరుగా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న విదేశీ ఇన్వెస్టర్లకు ఎఫ్పీఐలు వీటిని జారీ చేస్తుంటారు. -
నోట్లరద్దు కఠిన నిర్ణయం
► ప్రజల మద్దతుతోనే విజయవంతం ► మూడేళ్ల పాలన సంబరాల్లో ప్రధాని మోదీ ► ఈశాన్య భారతంతోనే ‘సూపర్ పవర్’ ► నదిపై నిర్మించిన అతిపొడవైన వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని ► ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్న మోదీ గువాహటి/సదియా: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం కఠినమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరగుతున్న దేశవ్యాప్త సంబరాలను గువాహటిలో శుక్రవారం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. నోట్లరద్దు నిర్ణయం సాహసోపేతమని తెలిపారు. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు తెలిపిన 125 కోట్ల మంది భారతీయులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నోట్లరద్దు కఠినమైన నిర్ణయం. కానీ ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. కానీ ప్రజలు అన్ని సమస్యలు ఎదుర్కొని అండగా నిలిచారు. ప్రజలు మార్పును గమనిస్తున్నారు’ అని మోదీ తెలిపారు. నల్లధనంపై తమ ప్రభుత్వ నిర్ణయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని.. అవినీతి పరులనుంచి తీసుకున్న డబ్బును ప్రజలకే పంచుతామన్నారు. ‘నాకు సమస్యలు ఎదురవుతాయని తెలుసు. కానీ, ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించను’ అని ప్రధాని స్పష్టం చేశారు. తను నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు. ఓబీసీ కమిషన్ ఏర్పాటు, గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు ప్రభుత్వ పథకాలను మోదీ ప్రస్తావించారు. ఈశాన్యం.. ఆగ్నేయాసియా వ్యాపార కేంద్రం నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీని ద్వారా భారత్ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. శుక్రవారం అస్సాంలో సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే నదిపై అతిపొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను శుక్రవారం ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇందుకోసం ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనతోపాటుగా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్, రోడ్లు, రైలు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో దేశంలోని ఈ రాష్ట్రాల్లోని ప్రతి మూలనుంచి దేశమంతా అనుసంధానమయ్యేలా చేస్తామన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లను కలిపే సదియా వంతెన ద్వారా ప్రయాణ దూరం, డబ్బులు ఆదా కావటంతోపాటుగా కొత్త ఆర్థిక విప్లవానికి బీజం పడిందన్నారు. ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత–గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మౌలికవసతులతోనే అభివృద్ధి భౌతిక, సామాజిక మౌలిక వసతుల కల్పన వల్లే శాశ్వత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన అల్లాన్ని పండిస్తున్న రైతులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుందన్నారు. అవసరాన్ని బట్టి మిలటరీ, ఆయుధాలను సరిహద్దుల్లోకి వీలైనంత త్వరగా తరలించేందుకు ఈ వంతెన చాలా ఉపయోగపడుతుంది. యుద్ధ ట్యాంకులను తరలించే సామర్థ్యం ఈ వంతెనకుంది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ‘సంపద’ను ప్రారంభించిన మోదీ నవభారత నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాలను సరికొత్త ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో–మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో–ప్రాసెసింగ్) పథకాన్ని అస్సాం శుక్రవారం ఆయన ప్రారంభించారు. అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘రూ.6వేల కోట్ల సంపద పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి జరుగుతుంది. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి’ అని వెల్లడించారు. ఎన్ఈ అంటే! ‘ఈశాన్యరాష్ట్రాలు (నార్త్–ఈస్ట్) నవభారతానికి కొత్త ఇంజన్ లాంటివి. ఎన్ఈ అంటే న్యూ ఎకానమీ, న్యూ ఎనర్జీ, న్యూ ఎంపవర్మెంట్’ అని మోదీ అన్నారు. పంచమార్గాల (హైవే, రైల్వే, జలమార్గం, వాయుమార్గం, ఐ (సమాచార)వే) ద్వారా ఈ మార్పు తీసుకొస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ఈశాన్యరాష్ట్రాల్లో చాలా అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సిక్కిం పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తోందని.. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తామన్నారు. పంట బీమా, పంటలకు నీటి సరఫరా కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన చాలా కీలకమైన పరిణామాలని మోదీ తెలిపారు. రైతులు పొలాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. -
కొంచెం మోదం! కొంచెం ఖేదం!!
-
కొంచెం మోదం! కొంచెం ఖేదం!!
► మోదీ మూడేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు ► మళ్లీ అభివృద్ధి పథంలోకి ఆర్థికవ్యవస్థ ► ఉద్యోగాల కల్పన అంతంత మాత్రమే ► దిగివచ్చిన ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ► బ్యాంకుల్లో పెరిగిన మొండి బకాయిలు ► ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు ► నత్తనడకన నల్లధనం వెలికితీత పనులు ‘అచ్ఛే దిన్’ హామీతో ఎన్నికల్లో గెలిచిన నరేంద్రమోదీ సరిగ్గా మూడేళ్ల కిందట ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోదీ మంచి రోజుల మాటను విశ్వసించిన జనం 2014 ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య మెజారిటీని కట్టబెట్టారు. అనంతరం ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ దేశంలో మోదీ హవా తగ్గలేదని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఇంకో రెండేళ్ల తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ రెండోసారి గెలవడం నల్లేరు మీద నడకేనని రాజకీయ పండితులంతా జోస్యం చెప్తున్నారు. మరి.. అవినీతిని అంతం చేస్తామని, పరిగెడుతున్న ధరలను అదుపు చేస్తామని, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోదీ సర్కారు ఈ మూడేళ్లలో ఎంతవరకూ అమలు చేసింది? మోదీ మూడేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక సంస్కరణల అమలు విషయంలో, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి మార్గంలోకి మళ్లించడంలో మోదీ సర్కారు విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు. అయితే.. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెలికితీత, బ్యాంకుల్లో మొండి బకాయిల వంటి విషయాల్లో ఇంకా బలమైన ముందడుగు పడలేదనే చెప్పాలి. మోదీ మూడేళ్ల పాలన తీరుతెన్నులపై నిపుణల విశ్లేషణల సారాంశం ఇదీ... ధరలకు ముకుతాడు: మోదీ సర్కారు ఈ మూడేళ్లలో హోల్సేల్, రిటైల్ధరలు రెండిటినీ గణనీయంగా తగ్గించిందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సరుకుల సరఫరా పెంచడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పంట కోతల తర్వాత పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం, నిత్యవసరాల ఎగుమతులను నియంత్రించడం, రాష్ట్రాల్లో అక్రమ నిల్వలపై చర్యలకు పిలుపునివ్వడం తదితర చర్యలు చేపట్టింది. సరుకుల రవాణాకు ఉపయోగించే చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో తగ్గడం కూడా.. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కలిసివచ్చింది. దీంతో.. బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు సుమారు 10 శాతం ఉన్న రిటైల్ద్రవ్యోల్బణం ప్రస్తుతం అటూ ఇటూగా మూడు శాతానికి తగ్గిపోయింది. ద్రవ్యలోటు నియంత్రణ: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినపుడు ద్రవ్యలోటు జీడీపీలో 5.31గా ఉండగా.. ఇప్పుడు అది 3.2 శాతానికి తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం. దానివల్ల ప్రభుత్వ పెట్రోలియం రాయితీ వ్యయం తగ్గడంతో ఆమేరకు ద్రవ్యలోటు కూడా గణనీయంగా తగ్గింది. సంస్కరణల పరుగులు: అవినీతిని నిర్మూలించడం కోసం, వాణిజ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం, ప్రజల జీవన పరిస్థితులను బాగు చేయడం కోసం మోదీ సర్కారు పలు సాహసోపేత సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది. ⇒ అందులో భాగంగా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు దేశాన్ని ఒక కుదుపు కుదిపినప్పటికీ దీర్ఘకాలంలో అది సానుకూల ఫలితాలనిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ⇒ డిజిటిల్లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం చేస్తున్న కృషి కూడా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ⇒ దేశంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించే లక్ష్యంతో రూపొందించిన వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ను జూలై 1వ తేదీ నుంచి అమలులోకి తేనుంది. ఇందుకోసం ఎన్నో అవరోధాలను సమర్థవంతంగా అధిగమించిన సర్కారు.. దేశ ప్రజలను ఈ కీలక సంస్కరణ కోసం సమాయత్తం చేస్తోంది. ⇒ రైల్వే మౌలిక సదుపాయాలు, రక్షణ, వైద్య పరికరాలు, నిర్మాణ అభివృద్ధి, ప్రసార, బీమా, పెన్షన్, విమానయాన తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)పై పరిమితిని తొలగించడంతో పాటు.. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘మేక్ఇన్ఇండియా’ వంటి పథకాలను మోదీ సర్కారు అమలు చేయడంతో ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్కు పదిలమైన స్థానం లభించింది. వృద్ధి పథంలో ఆర్థికరంగం: మోదీ సర్కారు చేపట్టిన చర్యలతో 201617 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 6000 కోట్ల డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు తగ్గిపోయాయి. దీని ఫలితంగా భారత దేశంలో స్టాక్మార్కెట్లు గణనీయంగా లాభపడ్డాయి. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి కూడా బలపడింది. భారతదేశం ఇప్పుడు 7 శాతం వార్షికాభివృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2013లో బ్రెజిల్, ఇండొనేసియా, టర్కీ, దక్షిణాఫ్రికాలతో పాటు ప్రపంచంలో ‘ఫ్రాగైల్ఫైవ్’ (బలహీనమైన పంచ దేశాలు)గా అభివర్ణించిన ఐదు దేశాల్లో ఒకటిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ మూడేళ్లలో తిరిగి అభివృద్ధి పట్టాలెక్కింది. ‘స్మార్ట్’గా.. ‘స్వచ్ఛ’ంగా.. ముందుకు... జన్ధన్యోజన: ప్రజలందరినీ ముఖ్యంగా పేద వర్గాల వారిని కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించేందుకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఆయా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ ధన్యోజనను మోదీ సర్కారు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకూ 28.38 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. అందులో 63,960 కోట్ల మేర నిధులు కూడా ఉన్నాయి. స్మార్ట్సిటీలు: దేశంలో 2019 నాటికి 100 స్మార్ట్సిటీల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించన మోదీ సర్కారు 60 నగరాల్లో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడులను మంజూరు చేసింది. మరో 20 నగరాల్లో రూ. 1,600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తికావస్తున్నాయి. ఇంకో 40 నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలు పెట్టాల్సి ఉంది. స్వచ్ఛ భారత్: ఈ కార్యక్రమం కింద దేశంలో మొత్తం 4,041 నగరాలు, పట్టణాలను 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహితం (ఓడీఎఫ్)గా మార్చాలన్నది లక్ష్యం. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్రాష్ట్రాలతో పాటు 633 నగరాలు ఓడీఎఫ్గా ప్రకటితమయ్యాయి. రూ. 62,009 కోట్ల వ్యయంతో 32 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు, 1.25 లక్షల పబ్లిక్టాయిలెట్లు నిర్మించారు. ఇంకా 3,400 నగరాల్లో ఈ పథకం అమలు చేయాల్సి ఉంది. అందుబాటు ధరలో ఇల్లు: పట్టణ ప్రాంత పేదలకు 2019 నాటికి రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకూ 18.76 లక్షల ఇళ్లు మంజూరు చేయగా మూడేళ్లలో 3.55 లక్షల ఇళ్లు పూర్తిచేశారు. ఇంకా 1.78 కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మోదీ ప్రధాన వైఫల్యాలివీ... ఉద్యోగాల కల్పనలో విఫలం: మోదీ సర్కారు వైఫల్యాల్లో ప్రధానమైనది ఉద్యోగాల సృష్టి. బీజేపీ అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తుందని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కారు మేక్ఇన్ఇండియా, స్టార్టప్ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. షాపులు, రెస్టారెంట్లు, సినిమాలు వంటి వాణిజ్య సంస్థలు 24 గంటల పాటూ తెరిచి ఉంచేలా మోడల్చట్టాన్నీ తెచ్చింది. కానీ దేశంలో తయారీ రంగం అభివృద్ది చెందుతుందని, భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన ఫలితాలు రాలేదు. దేశంలో ‘ఉద్యోగ కల్పన రేటు మందకొడిగా ఉంద’ని 201617 ఆర్థిక సర్వే వెల్లడించింది. 201314లో 4.9 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 201516 నాటికి 5 శాతానికి పెరిగింది. మోదీ సర్కారు మొదటి మూడేళ్లలో ఎనిమిది ప్రధాన రంగాల్లో కొత్తగా సృష్టించిన ఉద్యోగాల సంఖ్య 15.1 లక్షలు. ఇది అంతకుముందు మూడేళ్లలో కల్పించిన ఉద్యోగాల సంఖ్య 24.7 లక్షల కన్నా 39 శాతం తక్కువ. ఈ రంగంలో ఎన్డీఏ సర్కారు మరింత కృషి చేయాల్సిన అవసరముంది. కొలిక్కిరాని నల్లధనం వెలికితీత: విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తామని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కూడా పెద్దగా ముందడుగు పడలేదు. నిజానికి 2014లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. దోపిడీదారులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బునంతటినీ వెనక్కు తెస్తే దేశ ప్రజలు ఒక్కొక్కరికి 15, 20 లక్షల రూపాయలు వస్తాయని కూడా మోదీ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ఎం.బి.షా సారథ్యంలో మోదీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ఆ తర్వాత నల్లధనం విషయంలో కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించడానికి 2015లో నల్ల ధనం చట్టం చేసింది. దీనికింద రూ. 4,164 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మళ్లీ 2016లో తెచ్చిన ఆదాయ ప్రకటన పథకం కింద మరో రూ. 55,000 కోట్ల ఆస్తులను వెల్లడించారు. అలాగే.. బినామీ లావాదేవీల చట్టం, రాజకీయ విరాళాల్లో సంస్కరణలు, షెల్కంపెనీలపై దాడులు, నగదు లావాదేవీలపై పరిమితులు వంటి చర్యల వల్ల మున్ముందు నల్లధనం పోగుపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ.. విదేశాల్లో దాచిన నల్లధనం విషయంలో మాత్రం ఏమాత్రం ముందడుగు పడలేదు. నోట్ల రద్దుతో తిప్పలు: కరెన్సీ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కారు అమలు చేసిన నిర్ణయం దేశ ప్రజలను ఒక కుదుపు కుదిపింది. అసంఘటిత రంగాన్ని గట్టిగా దెబ్బతీసింది. తాత్కాలికంగానే అయినా సరఫరా వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. డిమాండ్పడిపోయింది. ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశంలో దాచిన నల్లధనం వెలికితీస్తామని, అవినీతిని అంతమొందిస్తామని చెప్తూ అమలు చేసిన ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో మోదీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కొత్త నోట్లను మార్కెట్లోకి పంపించిన తర్వాత ఆర్నెల్లకు కానీ పరిస్థితి కుదుటపడలేదు. అయితే.. నోట్ల రద్దు నేపథ్యంలో అధిక మొత్తంలో నగదు జమచేసిన 60,000 మంది వ్యక్తులను ఆదాయ పన్నుశాఖ గుర్తించి అందులో చాలా మందికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ఆదాయ పన్ను చెల్లింపులు పెరగడం, ఎక్కువ మంది ఆదాయ పన్ను పరిధిలోకి రావడం, డిజిటల్లావాదేవీల వైపు ప్రజలు పయనించడం వంటి సానుకూల ఫలితాలూ వచ్చాయి. బ్యాంకుల బకాయిల భారం: బడా కార్పొరేట్సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన అప్పులు భారీగా పేరుకుపోవడం, అప్పుల ఎగవేతలతో నిరర్థక ఆస్తులు పోగుపడటం వంటి పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా కనిపిస్తోంది. దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2014 జూన్నాటికి రూ. 2.34 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2016 డిసెంబర్నాటికి రూ. 6.46 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక వీటికి పనర్వ్యవస్థీకరించిన రుణాలు, కొట్టివేసిన బకాయిలు తదితరాలన్నీ కలిపితే రూ. 20 లక్షల కోట్ల వరకూ ఉంటాయని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్కె.సి.చక్రవర్తి లెక్కిస్తున్నారు. ఇక వేల కోట్ల మేర అప్పులు ఎగవేసిన విజయ్మాల్యా సర్కారు బ్రిటన్కు పారిపోవడం మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయనను వెనక్కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఇంకా ఫలించలేదు. ఈ మొండి బకాయిలన్నీ యూపీఏ సర్కారు పుణ్యమేనని ఆరోపిస్తున్న మోదీ సర్కారు.. బ్యాంకులను గట్టెక్కించేందుకు నిరర్థక ఆస్తులను గుర్తించి పరిష్కరించే అధికారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకుకు కట్టబెడుతూ ఆర్డినెన్స్జారీ చేసింది. (మరిన్ని వివరాలకు చదవండి) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) (ఇండియా ఫస్ట్) (మోదీ ప్రజల ప్రధానే..!) (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
భారత్లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు
-
భారత్లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు
2005–14 మధ్య ప్రవేశం - అమెరికా సంస్థ నివేదిక న్యూఢిల్లీ: భారతదేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) తాజా నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 165 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) నగదు దేశం నుంచి అక్రమంగా వెళ్లిపోయినట్లు జీఎఫ్ఐ పేర్కొంది. ‘ఇల్లిసిట్ ఫైనాన్షియల్ ఫ్లోస్ టు అండ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్: 2005–2014’ అనే శీర్షికతో జీఎఫ్ఐ నివేదికను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం.. లోక్సభ ఎన్నికలు జరిగిన 2014 సంవత్సరంలోనే 101 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6 లక్షల కోట్లు) నల్లధనం భారత్లోకి రాగా.. 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్షన్నర కోట్లు) నగదు భారత్ నుంచి విదేశాలకు వెళ్లినట్లు తేలింది. ఈ పదేళ్లలో భారత దేశానికి వచ్చిన నల్లధనం.. దేశం మొత్తం వ్యాపార లావాదేవీల టర్నోవర్లో 14 శాతమని, దేశం నుంచి వెళ్లిపోయిన నల్లధనం మూడు శాతమని నివేదిక వెల్లడించింది. నల్లధనాన్ని గుర్తించేందుకు.. అన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని నివేదిక సూచించింది. బహుళజాతి కంపెనీలు ఆదాయం, లాభాలు, నష్టాలు, అమ్మకాలు, పన్నుల చెల్లింపు, సిబ్బంది తదితర వివరాలు వెల్లడించేలా ఆయా దేశాల పాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. -
కమోడిటీల్లో ఇక ఆప్షన్ల ట్రేడింగ్
కీలక ప్రతిపాదనకు సెబీ పచ్చజెండా ► వ్యాలెట్ల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు ► కాకపోతే ఏడాదికి రూ.50వేలకు మాత్రమే పరిమితం ► క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లో వేస్తే కొనుగోలుకు నో ► నల్లధనం నియంత్రణకు పి–నోట్ల నిబంధనలు కఠినతరం కేపిటల్ మార్కెట్ల మరింత పారదర్శకతే లక్ష్యం ముంబై: కమోడిటీ డెరివేటివ్లలో ఇకపై ఆప్షన్ల కొనుగోలు, అమ్మకానికి లైన్ క్లియర్ అయింది. దీనికితోడు డిజిటల్ వ్యాలెట్ల నుంచే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కూడా ద్వారాలు తెరుచుకోనున్నాయి. కార్పొరేట్ బాండ్ల సెకండరీ మార్కెట్ సైతం కొత్త పుంతలు తొక్కనుంది. కేపిటల్ మార్కెట్లను మరింత పారదర్శకంగా, పటిష్ట పరిచే దిశగా నియంత్రణ సంస్థ సెబీ బుధవారం పలు కీలక సంస్కరణలకు తెరతీసింది. ఐపీవో మార్కెట్కు మరింత జోష్నిచ్చే నిర్ణయాలనూ ప్రకటించింది. అన్ని విభాగాలకూ కలిపి బ్రోకర్లకు యూనిఫైడ్ లైసెన్స్నూ ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ బ్యాంకులకు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ నిబంధనలను సులభతరం చేయాలని నిశ్చయించింది. సెబీ నూతన చైర్మన్ అజయ్ త్యాగి అధ్యక్షతన తొలిసారిగా ముంబైలో జరిగిన సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. భేటీలో తీసుకున్న నిర్ణయాలివీ... కమోడిటీల్లో ఇక ఆప్షన్లు కమోడిటీ మార్కెట్లలో ట్రేడింగ్ పరిమాణం పెంచే దిశగా సెబీ ఆప్షన్ల ట్రేడింగ్కు అనుమతించింది. ‘‘కమోడిటీ ఎక్సే్ఛంజీలు డెరివేటివ్ ఆప్షన్ల ట్రేడింగ్ చేపట్టేందుకు వీలుగా సెక్యూరిటీస్ కాంట్రాక్టు రెగ్యులేషన్స్ 2012ను సవరించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదించింది’’ అని సెబీ తెలిపింది. ఆప్షన్ల ట్రేడింగ్కు సంబంధించి సవివర మార్గదర్శకాలను జారీచేయనున్నట్టు పేర్కొంది.. వ్యాలెట్ల నుంచే మ్యూచ్వల్ ఫండ్స్ ఇకపై ఇన్వెస్టర్లు తమ స్మార్ట్ఫోన్లోని డిజిటల్ వ్యాలెట్ల నుంచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. గృహస్తుల పొదుపును కేపిటల్ మార్కెట్ల వైపు మళ్లించడంతోపాటు ఫండ్ పరిశ్రమలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ప్రతిపాదన చేశారు. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఈ వ్యాలెట్ల ద్వారా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు’’ అని సెబీ తెలిపింది. బాండ్లలో లిక్విడిటీ పెంపు కార్పొరేట్ బాండ్ల సెకండరీ మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు పెరిగేందుకు వీలుగా సెక్యూరిటీల గుర్తింపునకు జారీ చేసే ఐఎస్ఐఎన్ల(ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ ఐడెంటిఫికేషన్ నంబర్) విషయంలో సెబీ కొత్తగా పరిమితి తీసుకొచ్చింది. బాండ్లను జారీ చేసే కంపెనీకి ఏడాదికి 12 ఐఎస్ఎన్లను మించి వినియోగించుకోవడానికి లేదు. బ్రోకర్లకు ఒకటే లైసెన్స్ బ్రోకర్లు, క్లియరింగ్ మెంబర్లు కమోడిటీ డెరివేటివ్లు, ఈక్విటీ మార్కెట్లకు వేర్వేరు లైసెన్స్ల స్థానంలో సెబీ యూనిఫైడ్ లైసెన్స్ జారీ చేయాలని సెబీ నిర్ణయించింది. ఐపీవోల్లో మరింత పారదర్శకత ఐపీవోల్లో క్యూఐబీ (అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లు) కోటాలో పెట్టుబడులకు ఎన్బీఎఫ్సీలను అనుమతిస్తూ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీవో రూట్లో మరిన్ని పెట్టుబడులకు వీలు కల్పించనట్టయింది. ఆర్బీఐ వద్ద నమోదై రూ.500 కోట్ల నెట్వర్త్ కలిగి ఉన్న ఎన్బీఎఫ్సీలకే ఈ అర్హత లభించనుంది. ఇక పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) పేరిట నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు సెబీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఐపీవోల రూట్లో రూ.500 కోట్లకు పైగా నిధులను సేకరించేట్టు అయితే పర్యవేక్షణకు గాను ఒక ఏజెన్సీని (బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ) నియమించాల్సి ఉంది. దీన్ని ఇకపై రూ.100కోట్లకు మించి నిధులు సేకరించే అన్ని ఇష్యూలకు సెబీ అమలు చేయనుంది. పీ నోట్స్ పటిష్టం అక్రమ నిధులు పీ నోట్ల మార్గంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు గాను దేశీయులు, ప్రవాస భారతీయులు (రెసిడెంట్, నాన్ రెసిడెంట్) పార్టిసిపేటరీ నోట్లలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధం విధించింది. ఎఫ్పీఐ నిబంధనల్లో కొత్త నిబంధన చేర్చనుంది. ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్(ఓడీఐ) వీటినే పీ నోట్లుగా పేర్కొంటారు. -
కెమెరామెన్గా...
జోషి దర్శకత్వంలో మోహన్లాల్ కెమెరామెన్గా, అమలాపాల్ జర్నలిస్ట్గా నటించిన మలయాళ హిట్ ‘రన్ బేబి రన్’ను మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ‘బ్లాక్మనీ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్నీ కొత్త నోట్లే... అనేది ఉపశీర్షిక. రతీష్ వేగ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరోయిన్ సోనీ చరిస్టా విడుదల చేశారు. ‘‘మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వృత్తి నిర్వహణలో తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారనేది కథ. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు సయ్యద్ నిజాముద్దీన్. రచయిత వెన్నెలకంటి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: నిజామ్. -
నల్లధనం కేసుల విచారణకు కొత్త సాఫ్ట్వేర్
-
నల్లధనం కేసుల విచారణకు కొత్త సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణలో సీబీఐకి సాయపడేలా కొత్త సాఫ్ట్ వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్యాంకులు, ఆదాయపు పన్నుశాఖ, ఫైనాన్షి యల్ ఇంటెలిజెన్స్ యూనిట్తో పాటు మరికొన్ని సంస్థల నుంచి అవసరమైన సమాచారం సేకరించేందుకు, సరిచూ సుకునేందుకు సీబీఐకి ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నియమించిన కమిటీ సూచన మేరకు ప్రస్తుతం అనుసరిస్తున్న విచారణ పద్ధతుల్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత విధానంలో సమా చార సేకరణ పరిధి చాలా తక్కువగా ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైంది. అక్రమాస్తుల కేసుల్లో నిర్ణీత కాల వ్యవధిలో ఆదాయం, ఖర్చుకు సంబంధించి అన్ని అంశాల్ని నమోదు చేసేలా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించడంతో పాటు, మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని సీవీసీ అధికారి ఒకరు వెల్లడించారు. -
అప్పటి నుంచే గోల్డ్ దిగుమతులు పెరిగాయ్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారానికి భారీగా డిమాండ్ ఎగిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ హోల్డర్స్ అందరూ తమ నగదును వైట్ గా మార్చేసుకుని, బంగారం కొనుగోలుపై ఎగబడ్డారు. బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. అక్రమంగా కొనుగోళ్లు జరిగినట్టు కూడా తెలిసింది. 2013 తర్వాత మొదటిసారి బంగారం దిగుమతులకు బెస్ట్ క్వార్టర్ గా జనవరి-మార్చి 2017 నమోదైనట్టు తెలిసింది. గత క్వార్టర్లో బంగారం దిగుమతలు దాదాపు 230 టన్నులకు పెరిగినట్టు రిపోర్టులు వెల్లడించాయి. కేవలం మార్చిలోనే 100 టన్నులకు పైగా బంగారం దిగుమతి అయిందని పేర్కొన్నాయి. అంటే గతేడాది కంటే మార్చిలో ఏడింతలు దిగుమతులు పెరిగినట్టు బ్లూమ్ బర్గ్ కూడా నివేదించింది. రాబోతున్న పెళ్లిళ్ల సీజన్, ఏప్రిల్ నెలలో అక్షయ తృతియ ఈ దిగుమతులను పెంచినట్టు పేర్కొంది. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో 264 టన్నుల బంగారం దిగుమతి కాగ, తర్వాతి ఐదు నెలల కాలంలో ఏకంగా 360 టన్నులకు పైగా బంగారం దిగుమతి జరిగిందట. గత క్వార్టర్లో బంగారం దిగుమతుల బిల్లులు కూడా పైకి ఎగిసినట్టు రిపోర్టుల్లో తెలిసింది. ఓ వైపు డీమానిటైజేషన్, మరోవైపు బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరగడం ఈ బిల్లులపై పడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో చాలామంది బ్లాక్ మనీ హోల్డర్స్, పాత నోట్లతో బంగారం కొన్నట్టు చెప్పారు. నవంబర్ నెలలోనే 100 టన్నుల దిగుమతులు జరిగాయని నివేదికల్లో వెల్లడైంది. ప్రభుత్వ దాడులతో కొంత మేర దిగుమతులు డిసెంబర్ లో తగ్గిపోయాయి. అనంతరం, ఫిబ్రవరి, మార్చిల్లో ఈ దిగుమతులు మళ్లీ పుంజుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్ లోనూ బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందని కొటక్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బండారి చెప్పారు. -
ఆపరేషన్ క్లీన్ మనీ – 2
-
ఆపరేషన్ క్లీన్ మనీ – 2
► 60 వేల మందికి నోటీసులు ► నల్లధన అక్రమార్కులపై ఐటీ కొరడా న్యూఢిల్లీ: నల్లధన అక్రమార్కులపై ఐటీ శాఖ విరుచుకుపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరిట రెండో దశ చర్యలకు శుక్రవారం శ్రీకారం చుట్టింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో 1,300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా 60 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. వీరికి ఆన్లైన్లో నోటీసులు పంపనున్నారు. అత్యధిక నగదు డిపాజిట్లు చేసిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థలపై విచారణ చేపడతామన్నారు. ఆపరేషన్ తొలిదశలో స్పందించని వారిపైనా విచారణ ఉంటుందన్నారు. అనుమానితులెవ్వరినీ తాజా ఆపరేషన్లో వదలమని స్పష్టం చేశారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత అంటే 2016, నవంబర్ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 9,334 కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 17 లక్షలకు పైగా అనుమానిత ఖాతాదారులకు ఐటీ శాఖ ఎస్సెమ్మెస్ – ఈ మెయిల్స్ ను పంపించింది. బెంగళూరులో 15 కోట్ల పాత కరెన్సీ సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా రూ. 14.80 కోట్ల పాత కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. నాగరాజు అలియాస్ బాంబ్నాగ బెంగళూరులోని శ్రీరాంపురలో మూడంతస్తుల ఇంట్లో ఉంటున్నాడు. కిడ్నాప్, బెదిరింపుల కేసు విషయమై ఇతనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా నోట్ల వ్యవహారం బయటపడింది. బాంబ్నాగ ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేయగా పాత రూ. 500, రూ. 1,000 నోట్లు బయటపడ్డాయి. 10 బాక్సులు, 3 బ్యాగుల్లో నోట్ల కట్టలు పేర్చి వాటిపై పరువును ఉంచారు. నోట్లు లెక్కించే యంత్రాలను తెప్పించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దు పోయే వరకూ లెక్కించారు. -
'బ్లాక్ మనీ ఎంతుందో మాకూ తెలియదు'
న్యూఢిల్లీ : బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రయిక్ ప్రకటిస్తూ ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ రూ.500, రూ.1000 రద్దు అనంతరం ఎంత మొత్తంలో బ్లాక్ మనీ డిపాజిట్ కాకుండా బయటనే ఆగిపోయిందో తెలియదని ప్రభుత్వం ప్రకటించింది. నోట్ల రద్దు కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్ కాని బ్లాక్ మనీ మొత్తం ఎంతన్నది అధికారిక అంచనాలు ఏమీ లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శుక్రవారం పార్లమెంట్ తెలిపారు. లోక్ సభకు రాతపూర్వక సమాధానంగా ఈ విషయాన్ని చెప్పారు. 2016 నవంబర్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 మధ్యలో కాలంలో 23.87 లక్షల అకౌంట్లలో 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయినట్టు వెల్లడించారు. పాత, కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలను వేరువేరుగా పొందపర్చలేదని పేర్కొన్నారు. అకౌంట్ బుక్స్ కరెక్ట్ చేయాలని ఏ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేయలేదని మంత్రి చెప్పారు. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లను ప్రీపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్ల సప్లై విషయంలో ఏ బ్యాంకుకు తమ అసమర్థత చూపలేదని, నగదు ఇవ్వమని ఏ రోజు చెప్పన్నట్టు కూడా ఆర్బీఐ తెలిపినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. -
అవినీతిపై పోరాటం ఆగదు: మోదీ
సాహిబ్గంజ్(జార్ఖండ్): అవినీతి, నల్లధనంపై పోరాటం ఆగదని ప్రధాని మోదీ పునరుద్ఘా టించారు. భారత్లో ప్రజాస్వా మ్యాన్ని ఈ రెండూ చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని, అయితే ప్రజల ఆశీస్సులతో దీనిపై పోరాటం కొనసాగిస్తానని గురువారం జార్ఖండ్ సాహిబ్ గంజ్లో జరిగిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత మోదీ చెప్పారు. ‘2022 నాటికి భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ ఓ అడుగు ముందుకు వేస్తే దేశ అభివృద్ధి దిశగా 125 కోట్ల అడుగులు పడతాయి’అని అన్నారు. మరోకార్యక్రమంలో స్వయం సహాయక బృందాలకు మొబైల్ ఫోన్లు అందించారు. పర్యటనలో భాగంగా ప్రధాని సాహిబ్గంజ్ వద్ద గంగానదిపై 4 లేన్ల వంతెన, 50 వేల లీటర్ల డైరీ ఫామ్కు శంకుస్థాపన చేశారు. 311 కిలోమీటర్ల గోవిందపూర్ – సాహిబ్గంజ్ రహదారిని ప్రారంభించారు. పేదల కోసమే బీజేపీ.. పేదలు, అట్టడుగు వర్గాల వారికి సేవచేయడాన్ని బీజేపీ కొనసాగిస్తుందని మోదీ అన్నారు. గురువారం పార్టీ 37వ వ్యవస్థాపక దినం సందర్భంగా పార్టీ కార్యకర్తల కృషిని అభినందించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో దీన్దయాల్ ఉపాధ్యాయ్కు నివాళులు అర్పించారు. మరో ట్వీట్లో దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
స్విస్ ఖాతాదారులకు నోటీసులు
-
స్విస్ ఖాతాదారులకు నోటీసులు
♦ రెండు ప్రముఖ సంస్థలు సహా 10 మందికి జారీ ♦ గెజిట్ విడుదల చేసిన స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అధికారులు ♦ 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో భారత కంపెనీలు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగుముందుకు పడింది. భారత్లో పన్ను చెల్లించకుండా స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బుదాచుకున్న పదిమంది ఖాతాలకు సంబంధించిన వివరాలివ్వాలని భారత్ కోరటంతోపాటుగా ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేసింది. దీనికి స్పందించిన స్విస్ పన్ను విభాగం ఆ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్ వివరాలు కోరిన పది ఖాతాల్లో రెండు లిస్టెడ్టెక్స్టైల్ కంపెనీలు (నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్) ఉండగా కొన్ని ఆర్ట్ క్యురేటర్, కార్పెట్ ఎక్స్పోర్టు వ్యాపారుల అకౌంట్లున్నాయి. ఈ కంపెనీలు విదేశాల్లోనూ వ్యాపారం చేస్తున్నట్లు రికార్డుల్లో వెల్లడించాయి. పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో కంపెనీలు స్థాపించిన సంస్థలూ జాబితాలో ఉన్నాయి. అబ్దుల్ రషీద్ మిర్, ఆమిర్ మిర్, సబేహా మిర్, ముజీబ్ మిర్, తబస్సుమ్మిర్ పేర్లతోపాటుగా కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్స్పొజిషన్, మోడల్ ఎస్ఏ, ప్రొగ్రెస్ వెంచర్స్ గ్రూప్లు కూడా నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. ఇందులో పేర్లు కొన్ని పనామా పేపర్స్ లీక్ వ్యవహారంలో తెరపైకి వచ్చాయి. పక్కా వ్యూహంతో.. భారత్ వివరాలు కోరిన ఖాతాదారులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) నోటీసులు జారీ చేసింది. ఇందులో 30 రోజుల్లో వివరణతోపాటుగా వ్యక్తులు/కంపెనీలు తమ ప్రతినిధులను పంపించాలని కోరింది. భారత్కు సమాచారాన్ని చేరవేసేముందు ఖాతాదారుల వాదన వినాలనుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా స్విస్ బ్యాంకు అకౌంట్లున్న వారి వివరాలివ్వాలని, పాలనాపరమైన సహాయం అందించాలంటూ భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతోంది. భారత్తో పన్ను ఎగ్గొట్టి ఆ మొత్తాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్నారనే వ్యక్తులు/కంపెనీలపై అనుమానాలను బలపరుస్తూ పలు ఆధారాలనూ అందించింది. -
విదేశాల్లో నల్లధనంపై దృష్టి
⇔ స్విస్ బ్యాంకుతో సంప్రదింపులు ⇔ పది మంది వ్యక్తులతోపాటు సంస్థల వివరాలు కోరిన స్విస్ ⇔ నోటీసులు జారీ చేసిన పన్ను విభాగం ⇔ నెలలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ/బెర్న్: విదేశాల్లో నల్లధనంపై కేంద్రం దృష్టిసారించింది. పదిమంది వ్యక్తులతోపాటు సంస్థలు బ్యాంకుల్లో దాచిఉంచిన పన్ను చెల్లించని సొమ్ము తాలూకు వివరాలు అందజేయాల్సిందిగా స్విట్జర్లాండ్కు విన్నవించింది. ఇందులో టెక్స్టైల్ కంపెనీలతోపాటు తివాచీ ఎగుమతి వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. భారత్ విన్నపం నేపథ్యంలో స్విట్జర్లాండ్ పన్ను విభాగం ఆయా వ్యక్తులు, సంస్థలకు గత వారం నోటీసులు పంపింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్విట్జర్లాండ్ నిబంధనల ప్రకారం అనుమానిత పన్ను నేరాలకు సంబంధించి విదేశీ ప్రభుత్వాలు వివరాలు కోరినట్టయితే ఆ సమాచారాన్ని వారితో పంచుకునే ముందు ఆయా సంస్థలు, వ్యక్తులకు ఒక ఒకే అవకాశం ఉంటుంది. సంబంధిత వ్యక్తులు నేరుగాగానీ లేదా ఆయా బ్యాంకులద్వారాగానీ అందుబాటులో లేకపోతే ఈ నోటీసులను గెజిట్ నోటిఫికేషన్లద్వారా బహిర్గతం చేస్తుంది. ఒకేసారి ఇలా పదిమంది వ్యక్తులు, సంస్థలకు నోటీసులు పంపడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ నోటీసులు అందుకున్న సంస్థల్లో నియో కార్పొరేషన్ ఇంటర్నేషనల్, ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనం తాలూకు కొన్ని ఆధారాలను సేకరించిన కేంద్రం...ఇందుకు సంబంధించి పాలనాపరమైన చేయూత ఇవ్వాలంటూ ఆ దేశంపై కొంతకాలంగా ఒత్తిడి చేస్తుండడం తెలిసిందే. స్విట్జర్లాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలోనూ కొంతమంది భారతీయుల పేర్లు బయటపడడం తెలిసిందే. -
నగదు తక్కువగా వాడండి
⇒ అవినీతిపై పోరును ఉధృతం చేయండి ⇒ మన్కీ బాత్లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిపై పోరును ఉధృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్ల రద్దు తర్వాత మొదలైన డిజిటల్ చెల్లింపుల ఉద్యమానికి మద్దతు కొనసాగించాలని, దైనందిన జీవితంలో తక్కువ నగదు వాడాలని ఆదివారం తన ‘మన్కీ బాత్’ ప్రసంగంలో సూచించారు. ‘నల్ల ధనం, అవినీతిపై మన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలి... నగదు వాడకాన్ని తగ్గించేందుకు మనవంతు కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. స్కూలు ఫీజుల చెల్లింపు, మందులు, రేషన్ సరుకుల కొనుగోలుకు, విమానం, రైలు టికెట్లకు డిజిటల్ చెల్లింపులు చేయాలని కోరారు. ‘ఇలా దేశానికి ఎంత సేవచేయగలరో, నల్లధనం, అవినీతిపై పోరులో ధీర సైనికుడిలా ఎలా మారగలరో మీరు ఊహించలేరు’ అని పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే.. ఈ ఏడాది 2,500 కోట్ల డిజిటల్ లావాదేవీలు ఉండగలవని బడ్జెట్లో అంచనా వేశారని, అయితే 125 కోట్లమంది దేశ ప్రజలు పూనుకుంటే ఈ లక్ష్యాన్ని ఆరునెలల్లోనే సాధించగలరని మోదీ అన్నారు. గత కొన్ని నెలల్లో ప్రజలు డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ‘నగదు రహిత లావాదేవీలను నేర్చుకోవడానికి పేదలు యత్నిస్తున్నారు.. భీమ్ యాప్ను కోటిన్నరమంది డౌన్లోడ్ చేసుకున్నారు’ అని వెల్లడించారు. శిశువుకు అమ్మప్రేమ పూర్తిగా దక్కాలి ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచడం ద్వారా కార్మిక మహిళల సంక్షేమం దిశగా దేశం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ‘భావి భారత పౌరులైన నవజాత శిశువులకు తల్లిప్రేమ, సంరక్షణ పూర్తిగా దక్కాలి’ అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, నవ భారత్ లక్ష్యాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆహారాన్ని వృథా చేయడం పేదలకు అన్యాయం చేయడమేనన్నారు. నవ భారత్ ప్రభుత్వ పథకం కానీ, రాజకీయ పార్టీ కార్యక్రమం కానీ కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తే నవ భారత నిర్మాణానికి అదే శుభారంభమవుతుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ వాసులకు శుభాకాంక్షలు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, అభివృద్ధి కోసం చేసే పోరులో ఆ దేశ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ‘భారత్, బంగ్లాల జాతీయగీతాలను రచించిన రవీంద్రనాథ్ టాగూర్ జిలియన్వాలా బాగ్ మారణకాండకు నిరసనగా నైట్హుడ్ బిరుదును త్యజించడం గర్వకారణం. అంతవరకు మైదానంలో ఆటలకే పరిమితమైన ఓ కుర్రవాడికి ఇది ప్రేరణను, జీవితాశయాన్ని అందించింది. అమరుడిగా మారిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, 12 ఏళ్ల భగత్సింగ్’ అని కొనియాడారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన చంపారణ్ సత్యాగ్రహాన్నీ మోదీ ప్రశంసించారు. గాంధీ తన ఆచరణతో దేశ ప్రజలను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తెచ్చారన్నారు. ఎవరిపైనా అభిప్రాయాల్ని రుద్దం బ్రహ్మకుమారీల సదస్సులో మోదీ మౌంట్ అబూ(రాజస్తాన్): భారత్ తన అభిప్రాయాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్లో సుసంపన్నమైన భిన్నత్వం ఉందని, దేవుడొక్కడే అన్నది దేశ సంప్రదాయ సారాంశమని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ జరిగిన బ్రహ్మ కుమారీల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘భారత్లో హిందువులు, ముస్లింలు, పార్సీలకు దేవుడంటే ఒక్కడే. సత్యం ఒకటే.. భిన్న వర్గాల ప్రజలు దాన్ని భిన్నరకాలుగా వ్యక్తీకరిస్తారు.. తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంలో భారత్కు విశ్వాసం లేదు’ అన్నారు. 2030 నాటికి దేశ ఇంధనోత్పత్తిలో శిలాజేతర ఇంధనం 40 శాతంగా ఉండాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. బ్రహ్మకుమారీస్ సంస్థ నగదు రహిత లావాదేవీలు, శిశువులకు పోషకాహార ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను తప్పనిసరి చేయాలని బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యదర్శి రాజయోగి బీకే నిర్వాయర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. -
నల్లధనానికి కౌంట్డౌన్ మొదలు!
⇒ బ్లాక్మనీ వెల్లడి స్కీమ్.. ‘పీఎంజీకేవై’కు ఇంకా వారం రోజులే గడువు ⇒ నల్ల కుబేరులకు ఐటీ శాఖ హెచ్చరికలు న్యూఢిల్లీ: నల్ల కుబేరులు ఈ నెలాఖరులోగా స్వచ్ఛందంగా తమ దగ్గరున్న బ్లాక్మనీ వివరాలు వెల్లడించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదాయ పన్ను(ఐటీ) శాఖ హెచ్చరించింది. అక్రమ డిపాజిట్ల గురించిన సమాచారం అంతా తమ దగ్గరుందని పేర్కొంది. అక్రమ సంపద గురించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసేందుకు మార్చి 31తో ముగిసిపోనున్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకాన్ని వినియోగించుకోవాలని నల్లకుబేరులకు సూచించింది. ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలిచ్చింది. బ్లాక్మనీ హోల్డర్లపై చర్యలకు ‘కౌంట్డౌన్‘ మొదలైందని, ఇప్పుడైనా వివరాలు వెల్లడించని వారు తర్వాత బాధపడాల్సి వస్తుందని వాటిలో పేర్కొంది. ‘ఐటీ శాఖ వద్ద మీ డిపాజిట్ల పూర్తి సమాచారం ఉంది‘ అంటూ సాగే ఈ ప్రకటనలో.. అక్రమ సంపదను స్వచ్ఛందంగా వెల్లడించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసానిచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్మనీ వెల్లడి కోసం కేంద్రం పీఎంజీకేవై స్కీమ్ను గతేడాది డిసెంబర్ 17న ప్రవేశపెట్టింది. బినామీ చట్టం కింద కూడా చర్యలు.. సందర్భాన్ని బట్టి డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల నిరోధక చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉందని ఐటీ అధికారి ఒకరు చెప్పారు. పీఎంజీకేవై కింద స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించిన వారు సదరు ఆదాయంపై 49.9% పన్ను కడితే చాలన్నారు. ఒకవేళ పీఎంజీకేవైని ఎంచుకోకుండా ఆదాయ పన్ను రిటర్న్స్లో బ్లాక్మనీని చూపిన పక్షంలో పన్ను, దానికి అదనంగా 77.25% పెనాల్టీ కట్టాల్సి ఉంటుందన్నారు. ఇక ఏ విధంగానూ తమ అక్రమ ఆదాయాన్ని చూపించకుండా ఊరుకుని, ఆ తర్వాత స్క్రూటినీ అసెస్మెంట్లో పట్టుబడితే పన్నుకు తోడు జరిమానా 83.25% ఉంటుంది. ఒకవేళ తనిఖీల్లో పట్టుబడి, ఆ మొత్తాన్ని సరెండర్ చేస్తే పన్ను, పెనాల్టీలు 107.25% మేర ఉంటాయి. సోదాల్లో కూడా తమ అక్రమ సంపదను సరెండర్ చేయని వారు అత్యధికంగా పన్నుకు తోడు 137.25% పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.. దీనికి తోడుగా బినామీ చట్టం కూడా ప్రయోగిస్తే... ఏడేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష , ఐటీ చట్టం కింద విచారణ, బినామీ ఆస్తుల మార్కెట్ రేటు ప్రకారం 25% దాకా పెనాల్టీతో పాటు ఇతరత్ర పెనాల్టీలు కూడా ఉంటాయి. -
కౌంట్ డౌన్: బ్లాక్ మనీ హోల్డర్స్కు వార్నింగ్స్
న్యూఢిల్లీ : బ్లాక్మనీ హోల్డర్స్కు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీచేసింది. బ్లాక్మనీ హోల్డర్స్ కోసం అందుబాటులో ఉంచిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) గడువు ముగుస్తుందని.. ఇదే ఆఖరి అవకాశమని హెచ్చరించింది. మార్చి 31 ముగియనున్న డెడ్ లైన్కు కౌంట్ డౌన్ ప్రారంభించినట్టు అన్ని రకాల న్యూస్ డైలీస్లో ప్రకటించింది. ఈ గడువు ముగిసే లోపలే బ్లాక్ మనీ వివరాలు వెల్లడించాలని, లేని పక్షంలో బినామీ చట్టాల కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. డిఫాల్డర్ల పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి కేంద్ర విచారణ సంస్థలకు షేర్ చేస్తామని, పన్ను, జరిమానాలు భారీగా ఉంటాయని వెల్లడించింది. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకోలేని వారి నగదు డిపాజిట్లకు 137 శాతం కంటే ఎక్కువ పన్ను, జరిమానాలే ఉండనున్నాయని సీనియర్ అధికారి చెప్పారు. డిపాల్టర్లకు వ్యతిరేకంగా బినామి చట్టాలను ప్రయోగించడంలో అసలు వెనక్కు తగ్గబోమని హెచ్చరించారు. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకునే బ్లాక్ మనీ హోల్డర్స్ వివరాలను బయటపెట్టమని, కానీ వారి ఆదాయంపైన 49.9 శాతం పన్ను ఉంటుందన్నారు. ఈ స్కీమ్ ను వాడుకోకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్ లో నల్లధన వివరాలు తెలిపితే వారికి పన్ను, పెనాల్టి కింద 77.25 శాతం విధించనున్నారు. ఒకవేళ, తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు అంగీకరించడంతో పాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చిన పక్షంలో 107.25 శాతం దాకా పన్నులు, జరిమానా ఉండగలవని ఆదాయ పన్ను విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తనిఖీల్లో దొరికిన నల్లధనాన్ని సరెండర్ చేయని వారికి ఏకంగా 137.25 శాతం పన్ను విధించేస్తామని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీ హోల్డర్స్ కోసం ప్రభుత్వం ఈ పీఎంజీకేవై పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తుది అవకాశంగా ప్రభుత్వం హెచ్చరించింది. -
‘బ్లాక్మనీ’పై దర్యాప్తు పూర్తి
♦ హెచ్ఎస్బీసీ, లీక్టెన్స్టీన్ జాబితాలపై విచారణ జరిపాం ♦ రూ. 15 వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించాం: జైట్లీ న్యూఢిల్లీ: విదేశాల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించి హెచ్ఎస్బీసీ, లీక్టెన్స్టీన్ బ్యాంకుల జాబితాల్లో ఉన్న వారిపై ప్రభుత్వం దర్యాప్తును పూర్తి చేసిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం రూ. 15వేల కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించామని మంగళవారం రాజ్యసభకు తెలిపారు.‘హెచ్స్బీసీ జాబితాలోని 628 మందిపై దర్యాప్తు పూర్తయింది. 409 కేసుల్లో రూ. 8,437 కోట్ల డబ్బు ఉన్నట్లు అంచనా వేశారు. 190 విచారణలు మొదలయ్యాయి’ అని వెల్లడించారు. లీక్టెన్స్టీన్ జాబితాలోని వారిపై జరిపిన దర్యాప్తులో రూ. 6,500 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడిందన్నారు. పనామా పత్రాల్లోని ఖాతాలపై దర్యాప్తు మొదలైందని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్రవాదోపవాదాలు జరిగాయి. జైట్లీ అబద్ధాలాడుతున్నారని జెఠ్మలానీ ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రులు, అధికార పక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత డబ్బు చేరిందో ప్రస్తుతానికి చెప్పలేమని జైట్లీ తెలిపారు. జైట్లీకి ఆరోగ్యం బాగుండదా: జైరాం ‘రేపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జబ్బుపడతారా?’ అని రాజ్యసభలో జైరామ్ రమేశ్(కాంగ్రెస్) ఎద్దేవా చేశారు. బుధవారం సభలో చర్చకు రావాల్సిన ఆధార్ అంశాన్ని వాయిదావేయడంతో ఇలా ప్రశ్నించారు. ఆర్థికమంత్రికి ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన బుధవారం చర్చలో పాల్గొనరని తమకు సమాచారం అందిందని జైరామ్ తెలిపారు. సభలో చలాకీగా కనిపిస్తున్న జైట్లీ ఈ అంశం ఎందుకు వాయిదాపడిందో చెప్పాలంటూ.. ‘రేపు ఆయనకు ఆరోగ్యం బాగుండదా? అని అన్నారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా’ వాయిదా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగింపు, దీని కోసం జాతీయ అభివృద్ధి మండలి భేటీ ప్రతిపాదనపై మంగళవారం రాజ్యసభలో జరగాల్సిన చర్చ..ఆర్థిక మంత్రి జైట్లీ లేకపోవడంతో వాయిదాపడింది. దాడుల్లో 21,454 కోట్లు రెండేళ్లలో ఆదాయపు పన్ను అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో రూ.21,454 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో చెప్పారు. మొత్తం 992 కంపెనీలు/వ్యక్తుల స్థావరాల్లో అధికారులు సోదాలు చేశారన్నారు. ఆర్మీలో సహాయకులుగా పనిచేస్తున్న వారు కూడా యుద్ధవీరులేననీ, వారిని చిన్న పనులకు వినియోగించ కుండా ఆదేశాలిచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఎయిడ్స్ రోగులు చికిత్స, విద్య, ఉద్యో గాలు తదితరాల్లో ఇతరులతో సమానం గా హక్కులను పొందేందుకు ఉద్దేశించిన ‘హెచ్ఐవీ/ఎయిడ్స్(ప్రివెన్షన్, కంట్రోల్) బిల్లు’ను రాజ్యసభ ఆమోదించింది. -
బ్లాక్మనీ వెలికితీతపై ఐటీ శాఖ విఫలం: కాగ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన పలు సంస్థలు పన్నులు ఎగ్గొట్టాయనేందుకు రుజువులు చిక్కినా ఆదాయ పన్ను శాఖ తగిన చర్యలు తీసుకోలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వ్యాఖ్యానించింది. నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలమైందని పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. మహారాష్ట్రకు చెందిన 2,059 మంది డీలర్లు వ్యాట్ సహా సుమారు రూ. 10,640 కోట్ల పన్ను ఎగవేసేలా బోగస్ ఇన్వాయిస్లు జారీ చేశాయని కాగ్ పేర్కొంది. -
నల్లధనంపై ఐటీ కఠిన చర్యలు
-
నల్లధనంపై ఐటీ కఠిన చర్యలు
న్యూఢిల్లీ: నల్లధనం కేసుల్లో విచారణను ఆదాయపన్ను శాఖ వేగవంతం చేసింది. జనవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతలకు సంబంధించిన కేసుల్లో 570 చార్జ్షీట్లను దాఖలు చేసింది. ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమంలో గుర్తించిన భారీ డిపాజిట్లకు సంబంధించి తీవ్రమైన అవకతవకలు జరిగిన కేసులను విడిచిపెట్టవద్దని... ఆయా సంస్థలు, వ్యక్తులపై కోర్టుల్లో చార్జ్షీట్లను దాఖలు చేయాలని క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఆదేశాలందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలకు సంబంధించి కోర్టుల్లో దాఖలైన చార్జ్షీట్లు 196 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే అవి మూడు రెట్లు పెరిగి 570కు చేరాయి. ఆదాయపన్ను చట్టం కింద పన్ను నేరాల్లో కోర్టు దోషిగా నిర్ధారిస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో దాఖలు చేసిన 570 కేసుల్లో అధిక శాతం సెక్షన్ 276 సీఈ (ఆదాయ రిటర్నులు దాఖలు చేయకపోవడం), సెక్షన్ 276బీ (టీడీఎస్ను డిపాజిట్ చేయకపోవడం), సెక్షన్ 276సీ(1) (ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత) కింద ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. హెచ్ఎస్బీసీ బ్యాంకు జాబితా, ఐసీఐజే, పనామా పేపర్లలో ఉన్న వారి కేసులూ ఇందులో ఉన్నాయి. ఇక, పన్ను ఎగవేతలకు పాల్పడిన వారి నుంచి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ కోరుతూ 1,195 దరఖాస్తులు ఆదాయపన్ను శాఖకు వచ్చాయి. -
నగదు రహిత విరాళాలే పరిష్కారం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధనం వాడకాన్ని అడ్డుకునేందుకు పార్టీలకు నగదు రహిత విరాళాలే పరిష్కారమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ పేర్కొన్నారు. నగదురహిత విరాళాలు అత్యుత్తమమైనా అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేమని శుక్రవారం ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. మన సమాజం కూడా పార్టీలకు విరాళాలు నగదు రహితంగా ఉండాలనే కోరుకుంటుం దన్నారు. ఆ విధానంపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించలేద న్నారు. డిజిటల్ లావాదేవీల కోసం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పార్టీలకు ఒక వ్యక్తి ఇచ్చే విరాళాన్ని రూ. 2 వేలకు పరిమితం చేస్తూ తెచ్చిన సంస్కరణను పార్టీలు దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జైలుశిక్ష, భారీ జరిమానా: ఐటీ తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ: అక్రమలావాదేవీలు జరిపిన ఖాతాదారులపై కఠిన శిక్షలు, భారీ జరిమానా తప్పవని ఆదాయ పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బినామీ చట్టాల్ని ఉల్లఘించిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదంటూ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. బినామీ ఆస్తి లావాదేవీలు చట్టం, 1988 ప్రకారం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ జాతీయ దినపత్రికలకు జారీ చేసిన ప్రకటనల్లో ఆదాయం పన్ను శాఖ హెచ్చరించింది. నల్లడబ్బును కలిగి ఉండటం అమానవీయమని,నేరమని పేర్కొంది. అక్రమ లావాదేవీలకు పాల్పడ వద్దంటూ ప్రజలకు సూచించింది. నల్లధనాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. నవంబర్ 1, 2016నుంచి ఆయా ఖాతాల్లో అక్రమ డిపాజిట్లపై ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు, బినామీ ప్రాపర్టీపై మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం జరిమానాకు అర్హులని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బినామీ దారుడు, లబ్దిదారుడు ఇద్దరికీ శిక్షలు తప్పవని హెచ్చరించింది. 1961 ఆదాయచట్టం ప్రకారం ఆయా ఆస్తులను ఎటాచ్ చేయడం లేదా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం లాంటి అదనపు చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఖాతాదారులు అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తే..బినామీ చట్టం ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్షకు అర్హులవుతారని హెచ్చరించింది. అలాగే బినామీ ఆస్తి మార్కెట్ వాల్యూపై 5 శాతం జరిమానా విధించనున్నామని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యకాలం 235 కేసులు, ఘటనలు నమోదయ్యాయని ఐటీ తెలిపింది. రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించి 140 షోకాజ్ నోటీసులు జారీ చేశామంది. 124 కేసుల్లో రూ .55 కోట్లకుపైన బినామీ ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసినట్టు ఐటీ శాఖ చెప్పింది. వీటిల్లో బ్యాంకు ఖాతాల డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూమి, ఫ్లాట్లు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించింది. గత సంవత్సరం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లోని జమలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి వాటిపై ఐటి నిఘా పెంచిన సంగతి తెలిసిందే. -
పన్ను ఎగ్గొడితే కఠిన చర్యలు
– ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ జగదీష్బాబు కర్నూలు (రాజ్విహార్): సంపాదనపై ఆదాయ పన్నును ఎగ్గొడితే కఠిన చర్యలు తప్పవని ఆదాయపన్ను శాఖ కర్నూలు రేంజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం. జగదీష్ బాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక కప్పల్ నగర్లోని తనిష్ కన్వెన్షన్లో ఆదాయ పన్నుపై కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల (రేంజ్) వ్యాపారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, చార్టెడ్ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపు దారులు, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఆదాయానికి తగ్గట్లు చెల్లింపులు తప్పని సరి అన్నారు. నల్లధనం, లెక్కలు చూపని ఆదాయంపై ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన–2016 (పీఎంజీకేవై) కింద పన్ను చెల్లించాలన్నారు. వారిపై ఎలాంటి దాడులు ఉండవన్నారు. పైగా ఈ పథకం కింద చెల్లించే పన్ను సొమ్మును పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. మార్చి 31లోపు పన్నులు చెల్లించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తరువాత నెల రోజుల్లో ప్రిన్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఫారం–2 జారీ అవుతుందన్నారు. ట్యాక్సు, సర్చార్జీ, పెనాల్టీతోపాటు లెక్కల్లో చూపని ఆదాయంలో కనీసం 25శాతం రిజర్వు బ్యాంకు ఆధీకృత బ్యాంకుల్లో జమ చేయాలన్నారు. ఈ పథకం కింద వెల్లడించిన విషయాలను ఆదాయపన్ను, ఇతర ఏ చట్టాలకు సాక్ష్యాలుగా తీసుకోవన్నారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాల్లో రాణించే వ్యక్తులు ఐటీ హోల్డర్లుగా మారాలని సూచించారు. ఏటా తమ ఆదాయ, జమ, ఖర్చుల వివరాలు వివరిస్తూ రిటర్న్స్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, అనంతపురం అడిషనల్ కమిషనర్ మల్లికార్జునరావు (కడప ఇన్చార్జ్), కేఈ.సునీల్బాబు, ట్యాక్స్ బార్స్ అధ్యక్షులు జి. బుచ్చన్న, ఎస్ఐఆర్సీ చైర్మన్ కెవి కృష్ణయ్య పాల్గొన్నారు. -
నల్లధనం, అవినీతిని కక్కిస్తారా? : నారాయణ
ఖమ్మం సహకారనగర్: ‘‘దేశంలో పెరుగుతున్న నల్లధనం, అవినీతిని కక్కిస్తారా..? ఈ రెండింటిలో మోదీ ప్రభుత్వం ఏది చేసినా సంతోషమే.. అదానీ, అంబానీలంతా ఆయన పక్కనే ఉన్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోదీని విమర్శిస్తే దేశద్రోహులంట, రాష్ట్రం లో కేసీఆర్ను విమర్శిస్తే తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం జరగటం సరికాదన్నారు. ప్రస్తుత పాలన కంటే కాంగ్రెస్ పాలనే నయం అనేలా కన్పిస్తుందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్యాదవ్లకు మంత్రి పదవులు దక్కగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కోదండరాంసహా కమ్యూనిస్టు పార్టీల నేతలకు విమర్శలు మిగిలాయన్నారు. మహిళా సాధికారిత సదస్సుకు ఎమ్మెల్యే రోజాను అనుమతించిఉంటే బాగుండేదని, అలా చేయకపోవటం వల్లే ఆమె హైలెట్ అయిందన్నారు. -
విదేశాల్లో 16 వేల కోట్ల నల్లధనం
రాజ్యసభకు తెలిపిన ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: హెచ్ఎస్బీసీ (హాంకాంగ్ షాంఘై బ్యాకింగ్ కార్పొరేషన్), ఐసీఐజేలు ఇచ్చిన జాబితాలపై విచారణ జరిపి భారతీయులు విదేశాల్లో దాచిన రూ.16,200 కోట్ల నల్లడబ్బును గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. హెచ్ఎస్బీసీ బ్యాంకు విదేశీ శాఖల్లో భారతీయులు దాచిన రూ.8,200 కోట్ల నల్లడబ్బును గత రెండేళ్లలో పన్ను పరిధిలోకి తెచ్చామని జైట్లీ రాజ్యసభలో తెలిపారు. మరో రూ.8,000 కోట్లను రుణంగా తీసుకున్నట్లు గుర్తించామన్నారు. భారతీయులు దాచిన నల్లడబ్బుపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదన్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు రూ.7.3 కోట్ల నగదు, 5.5 కిలోల బంగారాన్ని జప్తుచేశామని కేంద్రం ప్రకటించింది. 18 మంది అరెస్టయ్యారనీ, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో 17 మందిని గుర్తించినట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. అక్రమ పద్ధతులను గుర్తించడం, నిఘా సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ 2016 నవంబర్ 9 నుంచి 2017 జనవరి 19 మధ్య కాలంలో 1100 కేసుల్లో దాడులు జరిపిందని వివరించారు. అదే కాలంలో బ్యాంకుల్లోకి వచ్చిన అనుమానాస్పద డిపాజిట్లపై వివరణ కోరుతూ 5,100 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. కొత్త నోట్లు రూ. 6.78 లక్షల కోట్లు న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో 2016 నవంబర్ 10 నుంచి జనవరి 13 మధ్య రూ. 6.78 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 9.1 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. 2016 డిసెంబర్ 10 నాటికి రద్దయిన రూ. 500, రూ.1,000 నోట్లు రూ. 12.44 లక్షల కోట్ల మేర ఆర్బీఐకి చేరాయి. నగదు బదిలీతో 21వేల కోట్లు మిగులు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడం వల్ల 3.3 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను అరికట్టామని, తద్వారా ప్రభుత్వానికి రెండేళ్లలో రూ.21 వేల కోట్ల సబ్సిడీ మిగిలిందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి ఎల్పీజీ సబ్సిడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. 2014లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఎల్పీజీ సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలకే వెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీనివల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకమైందని, తద్వారా నకిలీ కనెక్షన్ల ద్వారా జరుగుతున్న సబ్సిడీ వృథాను నియంత్రించగలిగినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో 17.6కోట్ల మంది వినియోగదారులకు సబ్సిడీ కింద రూ.40 వేల కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడించారు. కాగా, 1.2కోట్ల మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులు కున్నట్లు తెలిపారు. 2015 – 16లో దాదాపు 60లక్షల బీపీఎల్ కుటుంబాలకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే మూడేళ్లలో 5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. డెబిట్ కార్డు చార్జీలు తగ్గే అవకాశం: జైట్లీ డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో డెబిట్ కార్డు చార్జీల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైట్లీ తెలిపారు. రూ. 2 వేలకు మించి జరిపే డెబిట్ కార్డు లావాదేవీలపై మార్జినల్ డిస్కౌంట్ చార్జీల్ని తగ్గించే దిశగా ఆర్బీఐ కృషిచేస్తుందన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగితే చార్జీలు తగ్గుతాయన్నారు. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ మేరకు రూ. వెయ్యి వరకూ ఎండీఆర్ చార్జీల్ని 0.25 శాతంగా ఆర్బీఐ నిర్ణయించిందని, రూ. 2 వేల వరకూ 0.5 శాతం వసూలు చేస్తున్నారని జైట్లీ తెలిపారు. ఈ చార్జీలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వచ్చాయని, మార్చి 31, 2017 వరకూ అమల్లో ఉంటాయన్నారు. -
ఐటీకి చిక్కిన రూ.16,200 కోట్ల బ్లాక్మనీ
న్యూఢిల్లీ : భారతీయులు విదేశాల్లో గుట్టగుట్టలుగా నగదు దాచారనే దానిపై అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన లీకేజీలపై ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విచారణలో భారీగా బ్లాక్మనీ పట్టుబడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఐటీ అధికారుల విచారణలో విదేశాల్లో దాగిఉన్న రూ.16,200 కోట్లకు పైగా నల్లధనం వెలికితీశామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మంగళవారం పార్లమెంట్కు చెప్పారు. ఓ క్రమ పద్ధతిలో జరిపిన దాడుల్లో రూ.8,200 కోట్ల లెక్కలో చూపని నగదు పట్టుబడిందని, హెచ్ఎస్బీసీలో వీటిని దాచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన రహస్యపత్రాలకు సంబంధించిన దానిలో భారతీయులకు సంబంధించిన పలు విదేశీ అకౌంట్లను వెలికితీశామన్నారు. వీటిలో మరో రూ.8000 కోట్లు పట్టుబడిందని జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే ఇంకా ఎంత మొత్తంలో భారతీయుల బ్లాక్మనీ విదేశాల్లో దాగివుందో అధికారిక అంచనాకు రాలేదని వివరించారు. విదేశాల్లో దాచిఉంచిన భారతీయుల బ్లాక్మనీపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
పెద్ద నోట్ల దందా
వరంగల్ పోస్టల్ శాఖలో అక్రమాలు అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో జరిగిన అక్రమాల వ్యవహారం వరంగల్ నగరానికి తాకింది. నల్లధనం వెలికితీత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులతోపాటు పోస్టాఫీసులలో మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా పెద్ద నోట్ల మార్పిడి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్ నగరంలోని పోస్టల్ శాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కేసు నమోదు చేసింది. వరంగల్ పోస్టల్ విభాగంలో పనిచేస్తున్న ఎ.సోమయ్య(ట్రెజరర్), పి.ఎ.సురేశ్కుమార్(అసిస్టెంట్ ట్రెజరర్), ఎన్.శివకుమార్(క్లర్క్), జి.కేదారి(క్లర్క్) పెద్ద నోట్ల మార్పిడిలో కమీషన్లు పొంది అక్రమాలు చేసినట్లు అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ శేషగిరిరావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 2016 నవంబరు 9 నుంచి 24 వరకు వీరంతా కలిసి రూ.11 లక్షల కొత్త నోట్లను మార్పిడి కోసం వినియోగించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అంశాలను పరిశీలించిన సీబీఐ వీరిపై కేసు నమోదు చేసింది. వరంగల్ నగరంలోని వీరి ఇళ్లలో బుధవారం సోదాలు జరిపి వివరాలను సేకరించారు. మొత్తంగా సీబీఐ కేసు నమోదు, అధికారుల ఇళ్లలో సోదాలతో పోస్టల్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన మరికొందరు అధికారులలో భయాందోళన మొదలైంది. మరోవైపు తొర్రూరు పోస్టల్ అధికారులు సైతం పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇప్పటికే దృష్టిసారించాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత కేసు నమోదు చేసేందుకు నిఘా అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన పోస్టల్ శాఖ అధికారుల ఆస్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి. -
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
-
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
అవినీతి, నల్లధనంపై కేంద్రం సాహసోపేత నిర్ణయం ► సంయుక్త పార్లమెంటు భేటీలో రాష్ట్రపతి ప్రశంస ► ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలన్న ప్రణబ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్హాల్లో ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, సమాజంలో మార్పుకోసం తెచ్చిన పథకాలను అభినందించారు. ‘దేశం ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి అంశాలపై దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాద చొరబాట్లపై సర్జికల్దాడులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. దీన్ని విజయవంతంగా అమలుచేసిన సైన్యం ధైర్య సాహసాలను ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకమేర్పడుతుంది. దీంతోపాటు అత్యవసర సేవలకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలనే అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీలకు నిధులివ్వటం ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకూ ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ► నాలుగు దశాబ్దాలుగా భారత్కు సవాల్గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. భారత్లో విధ్వంసానికి ప్రయత్నించిన చొరబాటుదారులకు సరైన సమాధానమిచ్చేలా వారి స్థావరాలపై సెప్టెంబర్ 29న భారత ఆర్మీ సర్జికల్దాడులు చేపట్టింది. ఈ దాడులను విజయవంతంగా పూర్తిచేయటంలో భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలు అభినందనీయం. ► బలమైన భారత స్థూల ఆర్థిక విధానాల వల్ల సుస్థిర అభివృద్ధికి వేదిక ఏర్పడింది. దీనివల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఓ వెలుగుదివ్వెలా మారింది. ఈ దిశగా నల్ల ధనాన్ని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం భేష్. కేంద్రం నిర్ణయాల కారణంగా 2014 నుంచి ద్రవ్బోల్బణం రేటు, చెల్లింపులు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు వంటివి మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ► డిసెంబర్ 30న ప్రధాని ప్రారంభించిన భీమ్ యాప్ చాలా ప్రాచుర్యం (జనవరి 15 వరకు 1.1 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు) పొందింది. త్వరలో ఆవిష్కరించనున్న ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థ దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేయనుంది. ► యువతే మన దేశానికి బలం. ఈ యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా 50 భారత–అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను కేంద్రం ప్రారంభించింది. కేంద్రం రూ.6 వేల కోట్లతో చేపట్టిన పథకాల వల్ల 1.1 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది. ► భవిష్యత్ భారతం కోసం అత్యాధునిక మౌలికవసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయం. సాగరమాల, గ్రామీణ భారతంలో వెలుగులు తీసుకురావటం, స్మార్ట్ సిటీలు, హైవేలు, రైల్వేలు, గ్యాస్ పైప్లైన్లు, ఐ–వేల (కంప్యూటర్ అనుసంధానం) వంటి పలు అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. మావోయిస్టులప్రభావం ఉన్న 44 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకోసం 5వేల కి.మీ. రోడ్లు వేస్తున్నారు. మౌలికవసతుల కల్పన కోసం ఇప్పటికే రూ. లక్షకోట్ల విలువైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ►దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే యత్నంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్రం ‘అష్టలక్ష్మి’గా భావిస్తోంది. ఆగ్నేయాసియాతో భారత్ను కలిపే ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనే కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎంపీ ఈ.అహ్మద్ (78) గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహి యా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పార్లమెంట్ సైడ్లైన్స్ ⇒ రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగంలో పెద్ద నోట్లరద్దు, సర్జికల్ దాడులను ప్రస్తావించినప్పుడు అధికార ఎన్డీఏ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ⇒ గతంలో ఉమ్మడి సమావేశాలకు పార్లమెంట్ సెంట్రల్హాల్ నిండి, అదనపు కుర్చీలు వినియోగించేవారు. చాలా మంది ఎంపీలు నిలబడి రాష్ట్రపతి ప్రసంగాన్ని వినేవారు. మంగళవారం మాత్రం అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ⇒ ఈసారి సభ్యుల హాజరు కూడా తక్కువగా నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశాలకు హాజరుకాలేదు. ⇒ గంట సేపు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సమయంలో పలువురు ఎంపీలు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. ⇒మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కలసి మొదటి వరుసలో కూర్చున్నారు. ⇒ రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు సభ నుంచి వెళ్తుంటే రాహుల్ గాంధీ మాత్రం మల్లికార్జున ఖర్గే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్లువాలియాతో సంభాషిస్తూ కనిపించారు.