PMO Refuses to Give Information About Black Money - Sakshi
Sakshi News home page

బ్లాక్‌మనీ వివరాల వెల్లడికి పీఎంవో నిరాకరణ

Published Mon, Nov 26 2018 9:52 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

PMO Refuses Info To IFS Officer On Black Money - Sakshi

ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి పీఎంవో నిరాకరించింది.

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు విదేశాల నుంచి తిరిగొచ్చిన నల్లధన వివరాలు వెల్లడించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వివరాలు బహిర్గతమైతే దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వెల్లడించలేమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సెక్షన్‌ 8 (1) (హెచ్‌) ప్రకారం దర్యాప్తునకు ఆటంకం కలిగే సమాచార వెల్లడికి మినహాయింపు ఉందంటూ.. ఈ విషయమై తమ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు సాగిస్తున్నట్లు వివరించింది.

అక్టోబర్‌ 16న సీఐసీ జారీ చేసిన ఆదేశాలకు పీఎంవో ఈ మేరకు సమాధానం ఇచ్చింది.  అయితే, అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) సంస్థ అధ్యయనం ప్రకారం.. 2005–14 మధ్య రూ.5.44 లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా దేశంలోకి రాగా, రూ.1.16 లక్షల కోట్లు విదేశాలకు తరలిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement