income tax raids
-
ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన
-
ముగిసిన ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
-
దిల్రాజు వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్ వారెంట్తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.డాకు మహారాజ్ సినిమాకు దిల్రాజు డి్రస్టిబ్యూటర్గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతోపాటు ఎస్వీసీ ఆడిటర్, అకౌంటెంట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలుసినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్కు సంబంధించిన ఆఫీస్కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్్కలు, ఆడిట్ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. గురువారం సైతం సుకుమార్తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు సాగుతుండగానే దిల్రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. -
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్గోపాల్వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
సినీ ప్రముఖులపై 3 రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన సుకుమార్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
హైదరాబాద్ లో సినీ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ సోదాల్లో వెలుగులోకి కీలకాంశాలు
-
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు
-
తెలుగు సినీ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు
-
ఏపీ, తెలంగాణాలో ఐటీ సోదాలు
-
HYD: రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్నగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్లో కంపెనీ చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ట్రూకాలర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. అసలేమైంది?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కాలర్ ఐడీ ప్లాట్ఫాం ట్రూకాలర్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో లొసుగులు, పన్ను ఎగవేతల ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని సమీకరించేందుకు, పత్రాలను పరిశీలించేందుకు సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.విచారణకు పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వివరించాయి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన విధానాలనే పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి. స్వీడిష్ కంపెనీ అయిన ట్రూకాలర్కు భారత్లో ముంబై, గురుగ్రామ్, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
హైదరాబాద్ లో ఐటీ సోదాలు
-
HYD: ఏక కాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్చుత్రావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్చుత్రావు, బొప్పన శ్రీనివాస రావు, బొప్పన అనుప్ ఇంట్లో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రస్తుతం కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.రాయదుర్గంలోని అన్విత బిల్డర్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. జీ స్క్వేర్ కమర్షియల్ కాంప్లెక్స్లోని ఆరో అంతస్తులో అన్విత బిల్డర్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. ఇతరులను లోపలికి అనుమతించని సీఆర్పీఎఫ్ సిబ్బంది. సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్న బొపన్న కుటుంబ సభ్యులు. విదేశాల నుండి అన్విత బిల్డర్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను ఐటీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఇక, ఇటీవలే కొల్లూరులో ఫ్రీ లాంచ్ ఆఫర్ను కూడా అన్విత బిల్డర్స్ ప్రకటించింది. ఇక, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. -
హైదరాబాద్లో ఐటీ సోదాల కలకలం
సాక్షి, హైదారాబాద్: నగరంలో మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కలకలం రేగింది. తెల్లవారుజాము నుంచే 10 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్, మూసాపేట్, కూకట్పల్లి ఏరియాల్లో పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కూకట్ పల్లిలోని రెయిన్బో విస్టాస్లోని ఓ అపార్ట్మెంట్లో 8 మంది ఐటీ సభ్యుల బృందం ఉదయం 5గం.30ని. నుంచే సోదాలు నిర్వహిస్తోంది. ఆ ఇంటి ఓనర్ ఓ మీడియా సంస్థకు ఓనర్ అని సమాచారం. -
నాసిక్లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) 72 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తు లభ్యమైంది. పట్టణంలోని భండారీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదినాథ్ అర్బన్ మలీ్టస్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈ నెల 10వ తేదీన సోదాలు ప్రారంభించారు. 12వ తేదీ ఈ సోదాలు ముగిశాయి. వందలాది మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. రూ.14 కోట్ల నగదు, 8 కిలోల బంగారం సహా మొత్తం రూ.170 కోట్ల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగదును లెక్కించడానికి 14 గంటలు పట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. నాందేడ్ టౌన్లో ఈ స్థాయిలో ఐటీ సోదాలు జరగడం, భారీగా సొమ్ము దొరకడం ఇదే మొదటిసారి. -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
IT, ED: నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు చెందిన కొందరు నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో.. మరోవైపు కొందరు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకుని ఆదాయ పన్నుల శాఖ దాడులు కొనసాగిస్తోంది. చెన్నై సహా 35కు పైగా ప్రాంతాల్లో ఈడీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలకు దిగింది. డీఎంకే బహిష్కృత నేత.. సినీ నిర్మాత జాఫర్ సాదిక్కు సంబంధించిన ఆఫీసులతో పాటు, అతనితో పరిచయం ఉన్నవాళ్ల ఇళ్లు, ఆఫీసులకు ఈడీ బృందాలు చేరుకున్నాయి. ఇందులో డీఎంకే నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాఫర్ సాదిక్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మార్చి 9వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డీఎంకేలో పని చేసిన సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే అరెస్ట్ తర్వాత డీఎంకే అతన్ని పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు సినీ పరిశ్రమలో, వ్యాపార వర్గాల్లో సాదిక్తో పరిచయాలు ఉన్నవారిపై కూడా ఎన్సీబీ దృష్టి సారించింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర దర్శకుడు, నటుడు అమీర్తో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఇటీవలె ఢిల్లీలో విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శన నటుడు అమీర్ ఇంట్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ తీసిన మూడు చిత్రాల్లోనూ సాదిక్ నిర్వాణ భాగస్వామ్యం ఉండడం గమనార్హం. అలాగే పలువురు డీఎంకే ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్సీబీ నమోదు చేసిన కేసును, మరికొన్ని ఎఫ్ఐఆర్లను పరిగణలోకి తీసుకుని సాదిక్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రూ.32 కోట్లు స్వాధీనం మరోవైపు.. తమిళనాడులో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కొనసాగుతున్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్ పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అరుల్మురుగన్, శరవణ మురుగన్, ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
హైదరాబాద్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మంగళవారం ఉదయం ఐటీ సోదాల కలకలం రేగింది. ప్రముఖ ఫుడ్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హోటల్స్తో పాటు వాటి యజమాని ఇండ్లలోనూ ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్తో పాటు బెంగళూరులోనూఈ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఐటీ సోదాలకు సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్కుమార్కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్గా శంషాబాద్కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
కవిత ఇంట్లో సోదాలు.. కేసీఆర్ ఆకస్మిక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్లతో భేటీ అయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొనసాగుతున్న ఐటీ, ఈడీ సోదాలపై ఆరా తీశారు. ఇక హైదరాబాద్లో ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, కవిత నివాసంలో సోదాలు జరగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటలకుపైగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళా అధికారులతో కలిపి మొత్తం 12 మంది అధఙకారులు సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర బలగాలు కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. సోదాలు జరుగుతున్న కవిత ఇంటికి ఆమె అడ్వకేట్ భరత్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్నాని, ఇప్పుడు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనిఖీలు మరికొంత సమయం కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామని, అప్పుడు లోపలికి పిలుస్తామని కేంద్ర బలగాలు చెప్పాయి. -
BRS MLC Kavitha Arrest: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు
IT ED Raids, MLC Kavitha Arrest Updates: BREAKING @ 09.00 PM అరెస్ట్ ప్రొసీజర్కు సంబంధించి పంచనామా తయారుచేసిన ఈడీ లాఠీచార్జ్ మధ్య కవిత అరెస్ట్ కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి రూట్ క్లియర్ చేసిన పోలీసులు కవితను ఢిల్లీకి తీసుకెళ్తున్న పోలీసులు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:40 వరకు సెర్చ్ చేసినట్లు పేర్కొన్న ఈడీ. సాయంత్రం 5.20కి కవితను అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపిన ఈడీ పీఎమ్ఎల్ఏ యాక్ట్ 19 కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ. అనుమతి లేకుండా వచ్చి గొడవపడ్డారు: ఈడీ సాయంత్రం 6 గంటలకు అనుమతి లేకుండా 20 మంది లోపలికి వచ్చారు: ఈడీ BREAKING @ 08.31 PM ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్ ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించిన ఢిల్లీ పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఈడీ కేసు నమోదు. కవిత నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన ఈడీ. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం కవిత అరెస్టు రాజకీయ ప్రేరేపితం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఈ చర్యలు అనైతికం. విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే ఈ చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం.. రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ అరెస్టు. ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే.. భవిష్యత్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కవిత అరెస్టుపై ఒక ప్రకటనలో స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. BREAKING @ 08.11 PM కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారు: హరీష్రావు అంతా పథకం ప్రకారమే జరిగింది ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం కవితను అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం 19కి కేసు విచారణ ఉన్నప్పటికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్నదే ప్లాన్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ కుట్ర చేస్తోంది BREAKING @ 08.00pm రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తన అరెస్ట్ను సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం నిందితుడు అమిత్ అరోరా సమాచారంతో కవిత అరెస్ట్ 4 రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్న ఈడీ సౌత్ లాబీ కీలక సమాచారాన్ని ఈడీకి అందించిన అరోరా లిక్కర్ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ లాబీ రేపు ఉదయం అమిత్ అరోరాతోపాటు కవితను ప్రశ్నించనున్న ఈడీ రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత హాజరు ఢిల్లీ ఎయిర్పోర్టు నేరుగా ఈడీ ఆఫీస్కు కవిత రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే బీఆర్ఎస్ నాయకురాలు రేపు ఉదయం కవితకు మెడికల్ టెస్టు రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ విచారణ కోసం కవితను కస్టడీ కోరనున్న ఈడీ BREAKING @ 07.20pm కవితను ఢిల్లీ తరలిస్తున్న ఈడీ అధికారులు కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవిత. రాత్రి. 8:45కి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లనున్న అధికారులు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ. కవిత ఇంటి దగ్గర ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. కవితను తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నం. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి వాహనానికి రూట్ క్లియర్ చేసిన పోలీసులు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత పార్టీ శ్రేణులను సముదాయించిన సీనియర్ నాయకులు ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి. BIG BREAKING @ 07.00pm కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్తున్న ఈడీ అధికారులు. కవితను తీసుకెళ్లే రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు రాత్రి. 8:55కి ఫ్లైట్ బుక్ చేసిన అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల హెచ్చరికతో పోలీసుల భారీ బందోబస్తు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలు BIG BREAKING @ 6.30pm ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై ఈడీ ప్రకటన సాయంత్రం 5:20 నిమిషాలకు కవిత అరెస్ట్ చేశాం. మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం. ఆమె అరెస్ట్ చేసినట్లు భర్త అనిల్కు తెలిపాం. BIG BREAKING @ 5.45pm ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కవిత ఫోన్లు, పీఏ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాత్రి 8.45గంటల విమానంలో కవితను ఢిల్లీకి తరలించనున్న ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్కు ముందు ED అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. కవితను ఢిల్లీ తరలించే అవకాశముంది. BRS MLC K Kavitha is being brought to Delhi by ED: Sources (file pic) pic.twitter.com/23NM1P7cEc — ANI (@ANI) March 15, 2024 ఛార్జ్షీట్లో కవితపై మోపిన అభియోగాలు ఏంటంటే.? ఆప్ నేతలకు సౌత్గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది. అరుణ్పిళ్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు, రవిశంకర్ చెట్టి రూ.5 కోట్లకు హైదరాబాద్లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్పిళ్లైను కలవలేదు. ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూప్నకు చెందిన శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు. భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చేస్తారని చెప్పిన శ్రీహరి.. ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ చెట్టికి చెప్పలేదు. అయితే, ఎన్గ్రోత్ కాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూపునకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సీవోవోగా శ్రీహరి ఉన్నారు. దీంట్లో కవిత భర్త అనిల్కుమార్ కూడా భాగస్వామి. కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు. దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు. 25వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్ను బుచ్చిబాబు, శ్రీహరి పూర్తిచేశారు. మార్కెట్ ధర చదరపు అడుగు రూ.1,760 ఉంటే రూ.1,260 మాత్రమే చెల్లించారు. కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలున్న వ్యక్తి రవిశంకర్తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం. ఇండోస్పిరిట్స్లో కవిత తరఫున అరుణ్ పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించి రూ.32.86 కోట్లు అందుకున్నారు. పిళ్లై సూచన మేరకు రూ.25.5 కోట్లు నేరుగా ఇండోస్పిరిట్స్ నుంచి పిళ్లై ఖాతాకు బదిలీ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో మద్యం దుకాణం నిమిత్తం ఎన్వోసీ కోసం జీఎంఆర్ గ్రూపునకు చెందిన బీవీ నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ, ఎంపీ ఎంస్ రెడ్డి చర్చలు జరిపారు. ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది. వ్యాపారంలో భాగస్వాములై ఎన్వోసీ ఇవ్వాలని జీఎంఆర్ను కోరినట్లు తేలింది. ఇండోస్పిరిట్స్లో అరుణ్ పిళ్లై ప్రాక్సీ భాగస్వామి. ఇండోస్పిరిట్స్ నుంచి లాభాలు తన నుంచి కవితకు చేరడంపై అరుణ్పిళ్లై సేట్మెంట్ల ద్వారా వెల్లడైంది. ఏప్రిల్ 2022లో ఢిల్లీలోని ఓ హోటల్లో విజయ్నాయర్తో కవిత, అరుణ్పిళ్లై సమావేశమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు కుంటుపడుతున్న నేపథ్యంలో చెల్లించాల్సిన లంచాలు రికవరీ చేయడంపై చర్చించారు. హోటల్ రికార్డుల దీన్ని ధ్రువీకరించుకున్నాం. దినేష్ ఆరోరా, అరుణ్పిళ్లై వాంగ్మూలాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. కిక్బ్యాక్ల రూపంలో సొమ్ములు వెనక్కి మళ్లించే పనులను అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై నిర్వహించినట్లు ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలమిచ్చారు. సౌత్గ్రూప్ నుంచి కిక్బ్యాక్లను విజయనాయర్ అందుకుంటున్నారన్నారు. విజయ్నాయర్కు డబ్బు అవసరమని బుచ్చిబాబు ఫోను నంబర్ల ద్వారా చేసిన వాట్సాప్ సందేశాల ద్వారా ధ్రువీకరణ అయింది. దీంట్లో ‘వీ’కి డబ్బు కావాలి అంటే విజయ్నాయర్కు డబ్బు అవసరమని అర్థమని బుచ్చిబాబు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్లలో జరిగిన సమావేశాల్లో సౌత్గ్రూపు నుంచి విజయ్నాయర్కు డబ్బులు పంపడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా బుచ్చిబాబు తెలిపారు. క్రియేటివ్ డెవలపర్స్ ఖాతాకు డబ్బు మళ్లించడం కూడా బుచ్చిబాబు నోట్స్ ద్వారా తెలిసింది. కవిత తరఫున ఇండోస్పిరిట్స్ నుంచి వచ్చిన లాభాలను అరుణ్ పిళ్లై అందుకొని ఆమె ఆదేశాల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ధ్రువీకరణ అయింది. భూముల కొనుగోలులో శ్రీహరి సూచనల మేరకు కవిత తరఫున సొమ్ములు బదిలీ చేయడం వరకే పిళ్లై పాత్ర పరిమితమని తేలింది. అయితే, మే 2022 నుంచి రిజిస్టర్ కాకుండా ఉన్న భూమి 11.10.22న అరుణ్పిళ్లై భార్య పేరు మీద రిజిస్టర్ కావడం అరుణ్పిళ్లై ప్రయోజనం కోసమేనని, కవితకు లాభదాయకం కాదని దర్యాప్తులో తేలింది. అరుణ్పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్, ఇండియా అహెడ్లకు రూ.కోటి, రూ.70 లక్షలు బదిలీ చేసినట్లు సమీర్ మహేంద్రు తెలిపారు. దీనికి మద్దతుగా ఎలాంటి రికార్డు లేదు. అయితే, అరుణ్ పిళ్లై చెప్పినట్లుగా ఈ సంస్థలు ఇండో స్పిరిట్స్ లేదా అరుణ్ పిళ్లైకి ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆయా సంస్థలకు ఇచ్చిన సొమ్ము ఇప్పటివరకూ వెనక్కి ఇవ్వలేదు. గౌతమ్ ముత్తాకు అరుణ్పిళ్లై బదిలీ చేసిన రూ.4.76 కోట్లు, అభిషేక్కు రూ.3.85 కోట్లు బదిలీ రుణం తిరిగి ఇవ్వమని చెప్పినప్పటికీ కాలక్రమేణా ఎలాంటి రుణం లేదని పిళ్లై పేర్కొన్నారు. BIG BREAKING @ 5.30pm కవితకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ED కాసేపట్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం కవిత నివాసం వద్ద కవిత అనుచరుల నిరసన బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కవిత ఇంటి ముందు గేటు బయట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసే దిశగా ED అడుగులు వేస్తోంది. ఇప్పటికే కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆమెకు అరెస్ట్ వారంట్తో పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. లాయర్లు, కవిత వర్గం ఏమంటోంది? ఒక మహిళను సాయంత్రం 6గంటలకు అరెస్ట్ చేయరాదు సుప్రీంకోర్టుకు ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించారు CrPC సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారు, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు దర్యాప్తు సంస్థకు ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో ఇస్తారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్ట్ చేయడం రాజకీయ కక్షే నాలుగు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ కేసు కోర్టులో ఉండగా.. దాడులు ఎలా చేస్తారు?: సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్లో ఉంది. కేసు పెండింగ్లో ఉండగా ఈడీ అధికారులు కవిత ఇంటికి ఎలా వస్తారు? ఢిల్లీ నుంచి ఈడి అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదు. ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టులో ఈడీ చెప్పింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు. కవిత ఇంటికి చేరుకున్న అడ్వకేట్ భరత్ కవిత నివాసంలోకి అనుమతించని అధికారులుజ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్వకేట్ భరత్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అనుమతించే ప్రసక్తి లేదని తెలిపిన అధికారులు. మరికొంత సమయం పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడి ఈడీ సోదాలు ముగిసిన తర్వాత సమాచారం ఇస్తామన్న అధికారులు. అప్పుడు లోపలికి పిలుస్తామని అడ్వకేట్కు చెప్పిన అధికారులు. మూడు గంటలుగా కొనసాగుతున్న సోదాలు ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు మూడు గంటలకుపైగా కొనసాగుతున్న తనిఖీలు కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న 12 మంది అధికారులు. ఇద్దరు మహిళా అధికార్లతోపాటు పదిమంది అధికారుల తనిఖీలు. కవిత ఇంట్లో 16 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు కవిత సిబ్బంది ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం ఇంట్లోకి ఎవరినీ అనుమతించని ఈడీ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కవితతోపాటు ఆమె భర్త వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ అధికారుల ఆరా తీస్తున్నారు. ఐటీ, ఈడీ సోదాల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. చదవండి: కవిత పిటిషన్పై విచారణ 19కి వాయిదా -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
IT Raids: ఆ డబ్బు నాది కాదు: ఎంపీ ధీరజ్ ప్రసాద్
ఢిల్లీ: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఓ సంస్థకు సంబంధించి పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ(ఐటీ) సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన అధికారులు ఆశ్చర్యపోయే విధంగా ఏకంగా రూ.351 కోట్లు పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ మద్యం వ్యాపార సంస్థతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూకు సంబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మొదటిసారిగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ప్రసాద్ స్పందించారు. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు తనది కాదని తెలిపారు. ఆ డబ్బు తన కుటుంబ సభ్యులు, వారి వ్యాపార సంస్థలకు చెందినవని స్పష్టం చేశారు. కావాలంటే తన అకౌంట్ వివరాలను వెల్లడించడానికి సిద్ధమని తెలిపారు. #WATCH | Delhi | First reaction of Congress MP Dhiraj Prasad Sahu on I-T raids and recovery of hundreds of crores of rupees in cash from premises linked to him. On BJP's allegation of the cash being black money, he says, "I have already said that the money is from the business… pic.twitter.com/W8PEx1DHlN — ANI (@ANI) December 15, 2023 ‘నాపై వస్తున్న ఆరోపణలకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఐటీ దాడుల్లో పట్టుబడిన డబ్బు నాకు చెందినవి కావు. దాడుల్లో పట్టబడిన డబ్బుకు కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలతో ఎటువంటి సబంధం లేదు. ఆ సొమ్ము నాది కాదు. నా కుటుంబ సభ్యులకు చెందిన మద్యం సంస్థలది. నేను నా అకౌంట్ వివరాలు ఇవ్వడానికి సిద్ధం’ అని అన్నారు. ఐడీ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము తనది కాదని, అది తన కుటుంబ సభ్యులకు చెందినవారిదని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. ఐటీ శాఖ ఆ ధనాన్ని.. నల్లధనం అంటుందని తెలిపారు. తాన వ్యాపార రంగంలో లేనని స్పష్టం చేశారు. ఆ డబ్బుపై తన కుటుంబ సభ్యులు సమాధానం చెబుతారని అన్నారు. ఈ విషయంలో ఎవరు ఏం అనుకున్న పట్టుబడిన డబ్బు.. కాంగ్రెస్పార్టీకి గానీ, మరే ఇతర పార్టీలకు గాని సంబంధం లేదనని వెల్లడించారు. #WATCH | Delhi | First reaction of Congress MP Dhiraj Prasad Sahu on I-T raids and recovery of hundreds of crores of rupees in cash from premises linked to him. On BJP's allegation of the cash being black money, he says, "I have already said that the money is from the business… pic.twitter.com/W8PEx1DHlN — ANI (@ANI) December 15, 2023 -
ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో ఇంతటి భారీస్థాయిలో కరెన్సీ బయటపడటం ఇదే తొలిసారి! బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని ప్రమోటర్లు, ఇతరులకు సంబంధించిన చోట్ల ఐటీ అధికారుల సోదాలు ఐదోరోజైన ఆదివారమూ కొనసాగాయి. మద్యం వ్యాపారం ద్వారా పొందిన దాంట్లో లెక్కల్లో చూపని ఆదాయం గుట్టుమట్లను ఐటీ శాఖ రట్టుచేస్తోంది. తనిఖీల్లో భాగంగా రాంచీలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహూ సంబంధిత ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు చెక్చేశారు. ఇక్కడ ఎంత మొత్తంలో నగదు, ఇతర పత్రాలు లభించాయనేది అధికారులు వెల్లడించలేదు. ‘ఈ అంశం ధీరజ్ సాహూ కుటుంబ విషయం. దాదాపు వందేళ్లకు పైగా వారి కుటుంబం ఉమ్మడి వ్యాపారం చేస్తోంది. అందులో సాహూకు చిన్న వాటా ఉంది. ఏదేమైనా ఆయనకు సంబంధించిన చోట్ల సోదాలు జరిగాయికాబట్టి ఆయన ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన నుంచి వివరణ తీసుకున్నాం. కాంగ్రెస్ పారీ్టకి ఈ సోదాలకు సంబంధం లేదు’’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అవినాశ్ పాండే ఆదివారం స్పష్టంచేశారు. విపక్షాలపై అమిత్ విమర్శలు ఐటీ దాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ దర్యాప్తు సంస్థలను కేంద్రం దురి్వనియోగం చేస్తుందని ఇన్నాళ్లూ విపక్షాలు ఎందుకు అన్నాయో ఇప్పుడు అర్థమవుతోంది. విపక్షాలు తమ అవినీతి, అక్రమ సొమ్ము వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే ఇన్నాళ్లూ విషప్రచారం చేశాయి. తీరా ఇప్పుడు కరెన్సీ కట్టలు బయటపడ్డాక కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు మౌనం వహిస్తున్నాయి’’ అమిత్ వ్యాఖ్యానించారు. -
ఐదో రోజుకు ఒడిషా ఐటీ దాడులు..బయటపడ్డ సంచలన విషయం
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒడిషా ఇన్కమ్ట్యాక్స్(ఐటీ) దాడులు ఐదో రోజు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.జార్ఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత ధీరజ్సాహుకు చెందిన లిక్కర్ కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.300 కోట్ల లెక్కల్లోకి రాని నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్సాహుకు చెందిన బౌధ్ డిస్టిలరీతో పార్టనర్షిప్లో ఉన్న బల్దేవ్ సాహు గ్రూపు కంపెనీల్లో ఉన్న ఐటీ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు నిర్వహించారు.ఐటీ అధికారులు ఈ కంపెనీల కార్యాలయాల నుంచి మరింత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సాహు, ఆయన బంధువుల కంపెనీల కార్యాలయాలు, ఇళ్ల నంచి బయటపడుతున్న గుట్టలు గుట్టల సొమ్మును లెక్కించడానికి ఐటీ అధికారులు చెమటోడ్చాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ డబ్బు లెక్కించేందుకు 40 కౌంటింగ్ మెషీన్లు వినియోగిస్తుండగా తాజాగా మరిన్ని మెషీన్లను, సిబ్బందిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి రప్పించారు.సోదాల్లో దొరికిన మొత్తం అక్రమ నగదు రూ.350 కోట్ల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఐదో రోజు సాహూ కంపెనీలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో సంచలన విషయం బయటపడింది.నగదులోఉన్న రూ.5 లక్షల పాలిథిన్ బ్యాగుపై ఇన్స్పెక్టర్ తివారీ అని పేరు రాసి ఉండడం విశేషం. కాగా, ఇదే విషయమై బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోవాల్సిందే..మిమ్మల్ని విడిచిపెట్టం’ అని పోస్టులో నడ్డా పేర్కొన్నారు. ఇదీచదవండి..యువకుడి సెల్ఫ్ ‘రిప్’ పోస్టు..వెంటనే సూసైడ్ -
దాడుల్లో దొరికింది 290 కోట్లు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారు లు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా రూ. 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన రూ. 250 కోట్లను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబ డటం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. మొరాయిస్తున్న కౌంటింగ్ మెషిన్లు ‘ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో, ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్నా పెద్దా కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా రూ. 500 నోట్ల రూపంలోనే ఉంది. ఇప్పటి వరకు రూ. 250 కోట్లను లెక్కించి బ్యాంకుల తరలించాం. శనివారం సాయంత్రానికి లెక్క పెట్టడం పూర్తవుతుంది. మొత్తం రూ. 290 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నాం. అదేవిధంగా, ఈ డబ్బును సంభాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించాం’ అని అధికారులు వివరించారు. స్పందించని కాంగ్రెస్ ఎంపీ ఇప్పటి వరకు సోదాలు జరిపిన ప్రాంతాల్లో జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందింది కూడా ఉందని ఐటీ వర్గాలు తెలిపాయి. ‘మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టాం’అని ఐటీ వర్గాలు వివరించాయి. సోదాల్లో పాల్గొన్న 150 మంది అధికారులతోపాటు ఆయా ప్రాంతాల్లో లభ్యమైన డిజిటల్ డాక్యుమెంట్ల పరిశీలనకు హైదరాబాద్ నుంచి మరో 20 మంది అధికారులు కూడా వచ్చారన్నారు. దాడులు జరిగిన కంపెనీల అధికారుల వాంగ్మూలాలను సేకరిస్తున్నామన్నారు. ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు వెలుగులోకి రావడంపై ఎంపీ సాహు స్పందన కోసం తమ ప్రతినిధి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు పీటీఐ తెలిపింది. 10 అల్మారాల నిండా డబ్బుల కట్టలు ‘బొలంగీర్ జిల్లాలోని ఓ కంపెనీ ఆవరణలోని సుమారు 10 అల్మారాల్లో రూ. 230 కోట్ల నగదు దొరికింది. మిగతాది తిత్లాగఢ్, సంబల్పూర్, రాంచీల్లో లభ్యమైంది. శనివారం బొలంగీర జిల్లా సుదపారకు చెందిన దేశవాళీ మద్యం తయారీదారుకు చెందిన ఇంట్లో మరో 20 బ్యాగుల నిండా ఉన్న డబ్బు లభ్యమైంది. ఇందులో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నాం. దీన్ని లెక్కించాల్సి ఉంది. అదేవిధంగా, శుక్రవారం వెలుగు చూసిన 156 బ్యాగుల్లోని డబ్బును బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన బ్రాంచికి తరలించి, లెక్కిస్తున్నాం’అని వివరించారు. ఐటీ డీజీ సంజయ్ బహదూర్ మూడు రోజులుగా భువనేశ్వర్లో మకాం వేసి, పర్యవేక్షిస్తున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని పెంచి పోషిస్తోంది: బీజేపీ ఐటీ దాడుల్లో నమ్మశక్యం కాలేని రీతిలో నగదు బయటపడటంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అవినీతి సంప్రదాయాన్ని తరాలుగా ఎలా సజీవంగా ఉంచిందో దీన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడారు. ‘కేవలం ఒక్క కాంగ్రెస్ నేత వద్ద రూ.300 కోట్ల నగదు దొరికింది. కాంగ్రెస్ నేతలందరి దగ్గరా కలిపితే ఎంత డబ్బు దొరుకుతుందో దీన్నిబట్టి ఊహించుకోవచ్చు’అని ఆమె అన్నారు. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని, ఎంతగా అవినీతికి పాల్పడొచ్చో కాంగ్రెస్ నేతలు నిరంతరం అన్వేషిస్తుంటారని పేర్కొన్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీ అయిన సాహ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రూ.300 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిన మద్యం వ్యాపారి ధీరజ్ సాహు ఏటీఎం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
-
పాతబస్తీ బడా వ్యాపారులు టార్గెట్ గా ఐటీ సోదలు
-
పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్గా ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఓనర్ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్పై ఐటీ సోదాలు జరుపుతున్నారు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు మరుతాయని ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం. చదవండి: సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
నా పై ఐటీ దాడులు వారి కుట్రే : వివేక్
సాక్షి, మంచిర్యాల : ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు పదిగంటలకుపైగా జరిగి సాయంత్రం ముగిశాయి. అనంతరం బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసిన వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్పై ఐటీ దాడులు జరిపే దమ్ము లేదు కానీ తనపై మాత్రం చేశారని ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన మీద కుట్ర చేశాయని, తనపై ఎన్ని దాడులు చేసినా ఏం కాదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు గెలవబోతోందని, చెన్నూరు నుంచి తాను గెలవబోతున్నానని వివేక్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారని ఆరోపించారు. ఇటీవలే విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో జమైన నగదు గురించి ఐటీ అధికారులు ఈ సోదాల్లో వివేక్ను ఆరా తీసినట్లు సమాచారం. కాగా, సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ఉదయమే ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత వెంటనే ఆయనకు చెన్నూరు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడిన కొద్ది రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరగడం ఆయన అనుచరులను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణలో పవర్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయకుండా కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులు జరుగుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఐటీ సోదాలు ముగిసిన వెంటనే వివేక్ కూడా ఇదే రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్ర చేసి తనపై ఐటీ దాడులు చేయించాయని ఆరోపించారు. ఇదీచదవండి.. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
ఐటీ సోదాల్లో రూ. 5 కోట్ల నగదు పట్టివేత.. ఎన్నికల కోసమేనా?
నల్లగొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాకు చెందిన పలువురు రైస్ మిల్లర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహాశక్తి, వైదేహి, వజ్రతేజ, సుమాంజలి, కీర్తి, వెంకటసాయి రైస్ మిల్లర్ల వద్ద నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం ఈ డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నిడమనూరు, త్రిపురారంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు
-
ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాల కలకలం
-
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంటిపై ఐటీ సోదాలు
-
ఎన్నికల వేళ ట్విస్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐడీ దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 40 బృందాలు దాడులు చేస్తున్నాయి. దీంతో, పొలిటికల్గా ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. మొత్తం 40 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. పవర్ ప్రాజెక్టుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. బంధువుల ఇళ్లలో సోదాలు.. మరోవైపు.. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కర రావు బావమరిది రంగా శ్రీధర్తో పాటు మరొక నాలుగు చోట్ల మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. భాస్కర రావు ప్రధాన అనుచరులు, రైస్ మిల్ అసోసియేషన్ నేతల ఇళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయం శ్రీధర్, కుశలయ్య ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. అటు, పొంగులేటి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
IT Raids: మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన ఛైర్మన్, సీఈవో, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్లీక్ సొమ్ము రాజస్తాన్లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?
సాక్షి, హైదరాబాద్: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆదాయపన్నుల విభాగం(ఐటీ) సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం అధికారులు తమ వెంట కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. శుక్రవారం జూబ్లీహిల్స్లోని పొంగులేటి నివాసంలో రెండు బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోని ఓ రూంలో అధికారులు చాలాసేపు ఉన్నారు. ఆఖర్లో ఆ గది నుంచి మూడు బ్యాగులు, బ్రీఫ్ కేసు, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రాఘవా ప్రైడ్ ఆఫీస్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, లాంకోహిల్స్, రాయదుర్గం, బషీర్బాగ్ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో ఈ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ ఈ ఐటీ రైడ్స్ను ప్రతీకార రాజకీయ చర్యగా అభివర్ణించింది. తాను నామినేషన్ వేసిన సమయంలోనే ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, అధికారులు తమల్ని ఇబ్బందిపెట్టారంటూ సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు
-
ఐటీ దాడులకు బీజేపీకి సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలన తడిబట్టలతో గొంతుకోసేలా తయారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్కు ప్రజలపై కంటే మాఫియాపైనే ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దున్నపోతులను తినే రకం అయితే... కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఏనుగులను తినే రకం అని విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో బీజేపీ తరపున పోటీచేసే లంకల దీపక్రెడ్డి (జూబ్లీహిల్స్), నవీన్కుమార్ (వికారాబాద్), శ్రీకాంత్రెడ్డి (సిద్దిపేట), మొగిలయ్య (నకిరేకల్), పూస రాజు (ముషీరాబాద్)కు బీ–ఫారాలను అందచేసిన సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడారు. దీపావళి తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామని చెప్పారు. ఐటీ దాడులు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయని, వారున్నదే దాడులు చేయడానికని వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని సమాచారం వచ్చిన వారిపై దాడులు చేస్తారని, ఆ దాడులకు బీజేపీకి, కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ముందే ఎలా తెలుసని నిలదీశారు. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్ఫోన్, కంప్యూటర్ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్రెడ్డి కొట్టిపారేశారు. ఈ సర్వేలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 11న మోదీ.. : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 11న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తరువాత మరో రెండు మూడు సభల్లో పాల్గొంటారని కిషన్రెడ్డి తెలిపారు. -
ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
-
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొంగులేటి అనుచరుడు ఉపేందర్ ఆయన ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా, ఉదయం 5 గంటల నుండి పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటికి మద్దతుగా అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పొంగులేటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయంటూ నిరసన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇవాళ నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనుసైగల్లో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానని ప్రకటించాను. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రుల 30 మంది ఇళ్లపై 400మంది అధికారులు దాడులు చేస్తున్నారు. నారాయణపురంలోని మా తల్లి ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. కనీసం లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. నా దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు, బంధువులపై మాన్ హ్యండలింగ్ చేశారు. నా భార్యను, కుమారుడిని వాళ్ల ఆఫీస్కి తీసుకెళ్లారు. నన్ను ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లపై సోదాలు ఎందుకు జరగట్లేదు?. ఈ పరిణామాలను ప్రజలంతా గమనించాలి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆర్ఎస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. చదవండి: ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం -
నన్ను జైలుకు పంపుతారా?.. ఐటీ దాడులపై పొంగులేటి రియాక్షన్
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూరల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డి నామినేషన్కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందించారు. శ్రీనివాస్రెడ్డి నామినేషన్ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా పంపించడంతో పోలీసులు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, నామినేషన్ దాఖలు అనంతరం సాక్షి టీవీతో మాట్లాడిన పొంగులేటి.. తన ఇంటిపై జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందించారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి నా ఇళ్లు, బంధువుల ఇళ్లపై, సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నా బంధువులు, మిత్రులు 32 ఇళ్లపై 400 మంది అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు’’ అని తెలిపారు. నామినేషన్ వేస్తానని తెలిసి ఐటీ అధికారులు వచ్చారు. నన్ను నామినేషన్ వేయడానికి వెళ్లకూడదన్నారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న 10వేల మంది కార్యకర్తలు, నాయకులు నా ఇంటికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ, కేంద్ర ప్రభుత్వాలు భయపడ్డాయి. అందుకే నాకు నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారు’’ అంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వేస్తే బీఆరెస్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం. ఏ వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా నామినేషన్ వేయవచ్చు. ఐటీ అధికారులకు సహకరిస్తాను. నియోజకవర్గంలో పర్యటిస్తాను. నా ఆస్తులను సీజ్ చేస్తారా? నన్ను జైలుకు పంపుతారా.? నన్ను ఏం చేసినా వెనుకడుగు వేయను. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
ఐటీ దాడులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. పొంగులేటి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను ఇబ్బంది పెట్టేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయి. వారిపై దాడులు చేయకుండా.. నాపై, కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. నాపై ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. తనను విమర్శించే వారిని వేధించడం కేసీఆర్కు అలవాటే. . బీఆర్ఎస్ లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే తనిఖీలు ఎందుకు చేయడంలేదు. ఐటీ దాడులు ఊహించినవే. కాంగ్రెస్ నేతలే టార్గెట్ ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలపైనే దాడులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. అర చేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఐటీ దాడులపై రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని… — Revanth Reddy (@revanth_anumula) November 9, 2023 మరోవైపు.. ఖమ్మం, హైదరాబాద్లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎనిమిదికిపైగా వాహనాల్లో ఐటీ అధికారులు ఖమ్మం చేరుకుని పొంగులేటీ ఆఫీస్, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అధికారులకు పొంగులేటి సహకరిస్తున్నట్టు సమాచారం. దీంతో, పొంగలేటి అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్
-
పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
-
పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత పొంగులేటికి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియాలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, నేడు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. -
అవి రాజకీయ దాడులే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అవి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రైడ్స్ కాదు.. రాజకీయ దాడులు. ఎన్నికల్లో ఓటమికి భయపడే అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీతో కలిసి మా ఇళ్లపై దాడులు చేయించారు. 48 గంటలు నిర్బంధించి, సోదాలు జరిపించారు.’అని మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎ మ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ‘‘అయినా అధికారులు మా వద్ద ఏం పట్టుకోలేకపోయారు. నా వ్యాపారాలన్నీ పారదర్శకమే. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు కనీస డిపాజిట్ కూడా దక్కనివ్వం’’అని తేల్చి చెప్పారు. రెండు రో జుల ఐటీ దాడుల అనంతరం శనివారం ఆయన ‘సాక్షి ప్రతి నిధి’తో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నో భూ దందాలు, అక్రమాలకు పాల్పడినా ఐటీ దాడులు చేయలేద నీ, తాను నిజాయితీ గల అభ్యర్థి కావడం వల్లే ఐటీ దాడులు చేశారని పేర్కొన్నారు. ఓ విధంగా దాడుల వల్ల నాకు మంచే జరిగింది ‘‘ఈ దాడులు నాకు మంచే చేశాయి. పైసా ఖర్చు లేకుండా తక్కువ కాలంలో నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రెండు రోజుల పాటు ఇంటింటా తిరిగినా రాని ప్రచారం కేవలం ఈ దాడులతో వచ్చింది. ఇందుకు ఐటీశాఖ అధికారులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.’’అని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ’’మంత్రి సబిత కాంగ్రెస్లో గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికల్లో ఆమెను కచ్చితంగా ఓడించి తీరుతా... సేవకుడిగా ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే నన్ను ఎన్నికల్లో గెలిపిస్తుంది.’’అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
తిరుపతిలో డాలర్స్ గ్రూప్ పై ఐటీ సోదాలు
-
కాంగ్రెస్ నేత ఇళ్లల్లో ఐటీ సోదాలు
-
జానారెడ్డి కుమారుడి ఇంట ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయపరమైన చర్చకు దారి తీశాయి. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు అర్ధరాత్రి దాకా జరగ్గా.. శుక్రవారం ఉదయం కూడా అవి కొనసాగుతున్నాయి. పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి దాకా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఉదయం మరోసారి చేపట్టారు. నార్సింగ్లోని ఇంటితో పాటు మదాపూర్లోని కేఎల్ఆర్ హెడ్క్వార్టర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఇంట అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడి నిన్న ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగాయి. -
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
-
ఐటీ సోదాల్లో రూ.102 కోట్ల సొత్తు స్వాధీనం
న్యూఢిల్లీ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.102 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఆదాయ పన్ను(ఐటీ)శాఖ తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి బెంగళూరు సహా 55 ప్రాంతాల్లో దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 ఖరీదైన విదేశీ తయారీ గడియారాలు కలిపి మొత్తం రూ.102 కోట్ల సొత్తును పట్టుకున్నామని వివరించింది. అక్రమ సొత్తుకు సంబంధించి డాక్యుమెంట్ల హార్డు కాపీ, డిజిటల్ డేటా తదితర సాక్ష్యాధారాలను కూడా చేజిక్కించుకున్నామని తెలిపింది. బోగస్ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు గురైనట్లు కూడా గుర్తించామంది. -
పరుపు కింద నోట్ల కట్టలు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఓట్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలు పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన నేటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇది ఊహించిందేనని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 'స్కామ్ గ్రెస్'కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి చేసిన మరో ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్నూ రీట్వీట్ చేశారు. The intellectually bankrupt Congress and it’s leadership is pumping hundreds of crores of rupees from Karnataka to purchase votes in Telangana Their PCC Cheap was the one who was caught on camera bribing in Vote for Note scam and now since this criminal is now leading the pack… https://t.co/tVX3MnpyFu — KTR (@KTRBRS) October 13, 2023 పరుపు కింద నోట్ల కట్టలు.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కిస్తే.. రూ.42 కోట్లుగా తేలింది అది. ఈ డబ్బు వ్యవహారానికి సంబంధించి.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఇవాళ బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించట్లేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. కాగా.. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ అధికారుల సోదాలు
-
ఫైనాన్స్, చిట్ఫండ్ సంస్థలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పలు ఫైనాన్స్, చిట్ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా.. ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్ఫండ్స్లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్పేట్లోని సన్షైన్ అపార్ట్మెంట్లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు. చిట్ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్డిస్్కలు, పలు ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్ఫండ్, ఈ–కామ్ చిట్ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
100 టీమ్ లతో ఐటీ సోదాలు
-
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం
-
ఐటీ నోటీసులతో కంటిమీద కునుకు కరవైన చంద్రబాబు
‘ఐటీ నోటీసులతో చంద్రబాబులో భయం మొదలైంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తనను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయచ్చన్న భయంతో కుత కుత లాడిపోతున్నారు. అరెస్టే కాదు 118 కోట్ల రూపాయల మేరకు బయట పడ్డ లూటీ వ్యవహారంపై ఈడీ.. సీబీఐ దాడులు కూడా జరగచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు ఇలానే తనను అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశాలున్నాయని ప్రజల సాక్షిగానే అన్నారు. తనని అరెస్ట్ చేస్తే తనకి సంఘీభావంగా రక్షణ వలయంలా మీరే ఉండాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇపుడు మళ్లీ ఎన్నికల ఏడాదిలో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది. వెలుగులోకి నిజస్వరూపం కేంద్ర ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల లూటీ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ నోటీసులు రావడంతోనే దేశ వ్యాప్తంగా చంద్రబాబు నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. ఐటీ నోటీసుల్లోని అంశాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా చంద్రాబును దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి. దుబాయ్లో అక్కడి కరెన్సీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు అందుకున్న చంద్రబాబుపై ఈడీ కేసులు పెట్టే అవకాశాలున్నాయి. ఏం చేయాలో పాలుపోక.. రేపో మాపో అరెస్ట్ అంటూ మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తులు జరుగుతాయంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఊహించుకుంటోన్న చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా మౌన వ్రతంలో ఉండిపోయారు. అయితే రోజు రోజుకీ తనపై వచ్చిన ఆరోపణలకు సరిపడ సాక్ష్యాలు కూడా బయట పడ్డంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారని ఆయనకు సిక్త్స్ సెన్స్ హెచ్చరిస్తోన్నట్లుంది. అందుకే నన్ను రేపో మాపో అరెస్ట్ చేయచ్చు అంటూ చంద్రబాబు చాలా ఆందోళనగా భయం భయంగా అంటున్నారు. చదవండి: ‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’ అప్పుడు కూడా అదే మాట 2019 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన కొత్తలో కూడా తనపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగే అవకాశాలున్నాయని ప్రతీ సభలోనూ భయం వ్యక్తం చేసేవారు. తనను అరెస్ట్ చేస్తే జైలుకెళ్తానని కూడా అన్నారు. తనకు రక్షణ వలయంగా ఉండి కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని దబాయించారు కూడా. రూ. 118 కోట్లు పైనే లూటీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఇంచుమించు 400 కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేయించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ నోటీసుల్లో చంద్రబాబు అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టులు అప్పగించిన షాపూర్ జీ పల్లోంజీ నుంచి డొల్ల కంపెనీల ద్వారా రూ. 118 కోట్లు పైనే లూటీ చేసినట్లు సాక్ష్యాలు బయటకు వచ్చాయి. చదవండి: చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ అవినీతికి సాక్ష్యాలు లేకుండా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా చంద్రబాబు తాను నిప్పే అంటున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను దొరక్కపోడానికి కారణం తనపై ఆరోపణలకు సాక్ష్యాలు పట్టుకోలేకపోవడమేనని చంద్రబాబు గడుసుగా అన్నారు. తద్వారా తాను అరెస్ట్ కాకపోడానికి కారణం తాను తన అవినీతికి సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడటమేనని చాటి చెప్పారు. సీబీఐ అడుగు పెట్టకుండా ప్రత్యేక జీవో తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు గత ఎన్నికల ముందు తన అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందేమోనని భయపడ్డారు. ఎందుకైనా మంచిదని ఏపీలో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేకుండా ప్రత్యేక జీవో జారీ చేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఆయన ఏ తప్పూ చేయకపోతే సిబిఐ అంటే అంత భయం దేనికని ఆర్ధిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో తన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఇక తనను అరెస్ట్ చేయచ్చని చంద్రబాబుకు అర్ధం అవుతోన్నట్లుంది. అందుకే ఆయన ముందస్తుగానే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అరెస్టు చేస్తారని.. ఈడీ, సీబీఐ దాడులు కూడా చేయించవచ్చునని ముందస్తుగానే భయపడుతున్నారుని విశ్లేషకులు అంటున్నారు. -యాజులు, సీనియర్ జర్నలిస్టు -
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్!
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్! -
హైదరాబాద్లో మరో భారీ ఐటీ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో భారీ ఐటీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 40 కోట్ల ఆదాయపుశాఖ పన్ను రీ ఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం బట్టబయలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈ స్కాం వెనక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లతోపాటు, రైల్వే, పోలీస్శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మేరకు హైదరాబాద్, విజయవాడలోని పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు జరిపారు. నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని ఐటీ కన్సల్టెంట్స్పై దాడులు చేపట్టారు.ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు ఐటీ అధికారులు రంగం సిద్దం చేశారు. నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10శాతం కమీషన్ కోసం ఐటీ కన్సల్టెంట్లు తప్పుడు రిటర్న్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించిన అధికారులు.. 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు. చదవండి: సాయి చంద్ భార్యను ఓదార్చిన సీఎం కేసీఆర్ -
నాకు ఇతర ఏ వ్యాపారాలు లేవు: పైళ్ల రాజశేఖర్ రెడ్డి
-
హైదరాబాద్: నేతల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ సోదాల పేరిట హడావిడి చేశారంతే!: పైళ్ల శేఖర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు ముగిశాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుగంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, మర్రి జనార్థన్రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు మొదలైన సంగతి విదితమే. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోదాలు ముగిసినట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు రోజుల సోదాల్లో.. కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ఐటీ ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. అలాగే పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. ఇక చివరగా సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల పరిణామంపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పందించారు. బురదజల్లే ప్రయత్నం BRS నేతలను లక్ష్యంగా చేసుకుని.. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు జరిగాయన్న ఆయన.. సోదాల వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. ‘‘ఐటీ సోదాల గంటలోనే ముగిసినప్పటికీ.. అధికారులు 3రోజుల పాటు కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారలతో నాకు సంబంధం లేదు. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలున్నాయన్నది పచ్చి అబద్ధం. మర్రి జనార్దన్, కొత్త ప్రభాకర్లతో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించి పైల్స్ తీసుకున్నారంతే. సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నాం. నేను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారు అధికారులు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు...అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు... కానీ ఏమీ దొరకలేదు. ఐటీ అధికారులకు మా సీఏ పూర్తి వివరాలు ఇచ్చారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారాయన. డాక్యుమెంట్లు కీలకమైనవే! ఇదిలా ఉంటే.. ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్కు డైరెక్టర్గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా?