
'స్వచ్ఛ భారత్' కు యూనిసెఫ్ ప్రశంస
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి యూనిసెఫ్ ప్రశంస లభించింది. అంతేకాదు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు ముందుకువచ్చింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అండదండలు అందిస్తామని యూనిసెఫ్ భారత్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ ప్రకటించారు. 'స్వచ్ఛ భారత్ పథకాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి మా వంతు మద్దతు ఇస్తాం' అని లూయిస్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పరిసరాల పరిశుభ్రతపై భారతీయుల్లో చైతన్యం పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.