వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌ | Will hang officials upside down, Shivraj Singh Chouhan warns | Sakshi
Sakshi News home page

వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌

Published Mon, Jul 24 2017 3:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌

వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహన్‌ తాజాగా కలెక్టర్లకు ఘాటు వార్నింగ్‌ ఇచ్చారు. రెవెన్యూ కేసులను నెలలోపే విచారించాలని, నెల గడిచినా ఏదైనా రెవెన్యూ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిస్తే.. ఆ కేసుకు సంబంధించిన రెవెన్యూ అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానని హెచ్చరించారు. భోపాల్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఫిర్యాదుల అంశాన్ని బీజేపీ నేతలు లేవనెత్తారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎంను కోరారు.

దీంతో ఈ సమావేశంలో సీఎం చౌహాన్‌ ఈమేరకు అధికారులకు తీవ్రమైన హెచ్చరిక చేసినట్టు తెలిసింది. నవంబర్‌ నెలలో సీఎం చౌహాన్‌ తాను అధికారంలోకి వచ్చి 12 ఏళ్ల పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అప్పటిలోగా రెవెన్యూ కేసులను నిర్దిష్ట గడువుతో పరిష్కరించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అయితే, మరోవైపు కలెక్టర్లపై ముఖ్యమంత్రి అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement