రాంగియా: అసోంలో ఏడుగురు దుండగులు నవదంపతులపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు. భర్తను విచక్షణరహితంగా కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కంరూప్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది.
గురువారం సాయంత్రం బక్సా జిల్లాకు చెందిన యువతి, తన భర్తతో కలసి కంరూప్ జిల్లా కెకెనికుచి ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చింది. దారిలో ఏడుగురు దుండగులు వీరిపై దాడి చేశారు. భర్తను తీవ్రంగా కొట్టి, భార్యను సమీప అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్రేప్
Published Fri, Oct 16 2015 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement