assam
-
లవ్లీనా సహా అసోం బాక్సర్లను ఆడన్విట్లేదు: బీఎఫ్ఐ అధ్యక్షుడు
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్... సస్పెన్షన్కు గురైన మాజీ కార్యదర్శి హేమంత కలితాపై కొత్త ఆరోపణలు చేశారు. అసోంకు చెందిన హేమంత తమ రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బాక్సర్లను జాతీయ మహిళా చాంపియన్షిప్లో ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బొర్గొహైన్తో పాటు ఇతర బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన ఆదేశించారంటూ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్ గురువారం ప్రారంభం కానుంది. ‘ఇందులో ఆడేందుకు లవ్లీనా సిద్ధమైంది. అయితే వారు పాల్గొనకుండా చూడాలని హేమంత అధికారులకు ఫోన్లు చేశారు.ఎన్నో ట్రైన్, ఫ్లయిట్ టికెట్లు రద్దు చేశారు. సహజంగానే తమ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి స్థితిలో లవ్లీనాలాంటి బాక్సర్లు పునరాలోచనలో పడ్డారు’ అని ఆయన వెల్లడించారు. దీనిని హేమంత కలితా కొట్టిపారేశారు. తాను ఏ ప్లేయర్ను ఆపలేదని, దానికి తనకు సంబంధం లేదన్న హేమంత...టోర్నీ కోసం ప్రకటించిన తేదీల పట్ల అసంతృప్తితో వివిధ రాష్ట్ర సంఘాలు తప్పుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దు: కోర్టు ఆదేశాలు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వివిధ రాష్ట్ర సంఘాల నుంచి ఎన్నికైన వారికి మాత్రమే ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉందంటూ బీఎఫ్ఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది.ఫలితాల ప్రకటన తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28 బీఎఫ్ఐ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 7న జారీ చేసిన నియమావళిలో తాజా నిబంధనలు ఉన్నాయి. అయితే దీనిని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ను తమ ప్రతినిధిగా ఓటు వేసేందుకు హిమాచల్ప్రదేశ్ బాక్సింగ్ సంఘం ప్రతిపాదించగా... ఆయన ఎంపికైన వ్యక్తి కాదంటూ రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారు. తాజా అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బీఎఫ్ఐని కోర్టు ఆదేశించింది. -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్లోని జైపూర్లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం
దెర్గావ్జ్వాల్: అస్సాంలో శాంతియుత వాతావరణం నెలకొల్పి, మౌలిక వనరులను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయేనని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో శాంతి నెలకొనకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రానికి ఎటువంటి గ్రాంట్లు అందకపోవడంతో ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలకు, వెనుకబాటుకు మారుపేరుగా మారిందని విమర్శించారు.శనివారం మంత్రి అమిత్ షా గోలాఘాట్ జిల్లా దెర్గావ్లోని లచిత్ బార్పుకాన్ పోలీస్ అకాడెమీ పునరుద్ధరణ మొదటి దశ పనులను ప్రారంభించడంతోపాటు రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అస్సాంలో 10 వేల మందికి పైగా యువకులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో శాంతి నెలకొంది. ఆందోళనలు, హింస, వేర్పాటువాదానికి పేరున్న అస్సాంలో నేడు రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తోంది. ఇది అస్సాం భవిష్యత్తునే మార్చనుంది’అని అన్నారు.ఇటీవల ముగిసిన అడ్వాంటేజ్ అస్సాం 2.0లో మరో రూ.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు అందాయి. ఇవి ఏర్పాటైతే యువతకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’అని మంత్రి చెప్పారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. విద్యార్థిగా ఉండగా అస్సాంకు వచ్చినప్పుడు జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేసుకుంటూ.. ‘అప్పట్లో కాంగ్రెస్ నేత హితేశ్వర్ సైకియా సీఎంగా ఉండేవారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అరెస్టయిన వారిలో నేనూ ఉన్నా. అస్సాం జైలులో వారం పాటు నన్ను ఉంచారు’అని తెలిపారు.అప్పటి కాంగ్రెస్ హయాంతో, ఇప్పటి బీజేపీ పాలనతో పోల్చుకుంటే అస్సాంలో గుర్తు పట్టలేనన్ని మార్పులు సంభవించాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లచిత్ బార్పుకాన్ పోలీస్ అకాడెమీ దేశంలోనే అగ్రగామిగా మారనుందని చెప్పారు. అనంతరం అమిత్ షా మిజోరం రాజధాని ఐజ్వాల్లో అస్సాం రైఫిల్స్ క్యాంప్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మిజోరంలో అభివృద్ధి పనుల పురోగతిపై స్వయంగా ప్రధాని మోదీయే సమీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు.అస్సాం రైఫిల్స్ క్యాంప్ను ఐజ్వాల్ వెలుపలికి మార్చడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. మిజో ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేంద్రం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన తెలిపారు. 2014కు పూర్వం ప్రధానమంత్రులంతా కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది 21 సార్లు మాత్రమే రాగా, ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో 78 పర్యాయాలు పర్యటించారని అమిత్ షా చెప్పారు. -
Earthquake: అస్సాంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే..
గౌహతి: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూమి కంపించింది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 2:25 గంటలకు 5.0 తీవ్రతతో భూ ప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి. ఇది సంభవించినప్పుడు చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ ప్రకంపనలు వారిని నిద్ర నుంచి మేల్కొలిపి, ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తేలా చేశాయి.భూకంప కేంద్రం అస్సాం(Assam)లోని మోరిగావ్లో ఉన్నట్లు గుర్తించారు. గౌహతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మోరిగావ్లో 16 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. అయితే, ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు. An earthquake with a magnitude of 5.0 on the Richter Scale hit Morigaon, Assam at 2.25 am today(Source - National Center for Seismology) pic.twitter.com/iowhZjOJHk— ANI (@ANI) February 26, 2025ఎన్సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంతో పాటు, మేఘాలయ(Meghalaya), పశ్చిమ బెంగాల్, బీహార్ వరకు భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డేటా ప్రకారం భూకంపాల పరంగా ఈశాన్య భారతదేశం జోన్- 5లోకి వస్తుంది. ఇటువంటి జోన్ 5లో తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి -
అస్సాంలో నూతన శకం
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర భూమి అస్సాంలో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి, సౌభాగ్యంలో ఈశాన్య భారతదేశం కీలక పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు. ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ఈశాన్య రాష్ట్రాలు పూర్తి శక్తిసామర్థ్యాలు ప్రదర్శించబోతున్నాయని పేర్కొన్నారు. అస్సాం రాజధాని గౌహతిలో మంగళవారం ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0’ పేరిట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సదస్సును మోదీ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రెండు రెట్లు వృద్ధిచెంది, రూ.6 లక్షల కోట్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ వేగం వల్ల వచ్చే ఫలితాలేమిటో ప్రత్యక్షంగా చూస్తు న్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటకీ ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని, ఆర్థిక నిపుణులు సైతం ఈ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారని తెలి పారు. ఈ శతాబ్దంలో రాబోయే 25 ఏళ్ల ప్రగతి కోసం సుదీర్ఘ దార్శనికతతో పని చేస్తున్నామని చెప్పారు.నైపుణ్యాలు, నవీన ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్న మన యువతపై ప్రపంచ దేశాలు ఎనలేని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సప్లై చైన్లను బలోపేతం చేశామని, ప్రపంచ దేశాలతో స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. తూర్పు ఆసియాతో మనకు బలమైన అనుసంధానం ఉందని, ఇండియా–మిడిల్ ఈ స్టు–యూరప్ ఎకనామిక్ కారిడార్తో నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీలో ముందంజ సెమీకండక్లర్ల తయారీ రంగంలో మన దేశం ముందుకు దూసుకెళ్తుండడం శుభ పరిణామం అని ప్రధానమంత్రి తెలిపారు. సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణల కోసం ఐఐటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ ఈ దశాబ్దం ఆఖరు నాటికి 500 బిలియన్ డాలర్లకు(రూ.43.59 లక్షల కోట్లు) చేరనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి మరో 500 గిగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2030 నాటికి వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని 5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఉ్రత్పేరకంగా నిలిచేలా నేడు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి చెప్పారు. సులభతర వాణిజ్యాన్ని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణల సంస్కృతికి ఊతం ఇవ్వడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. స్టార్టప్లు, తయారీ రంగ పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం అద్భుతమైన విధానాలు ప్రవేశపెట్టామని తెలియజేశారు. సంస్థాగత సంస్కరణలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలన్నీ కలిసి మన దేశాభ్యుదయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..) -
గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్ -
కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేక నినాదాలు.. క్రికెట్ బ్యాట్లతో దాడి
గౌహతి: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్తోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎంపీ క్షేమంగా బయటపడగా, ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ స్పందిస్తూ ఎంపీ రకిబుల్కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.అస్సాంలోని నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సైన్పై దాడి జరిగింది. రకీబుల్ హుస్సైన్ అస్సాంలో దూబ్రీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుపోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని గునమారీ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి దిగారు. క్రికెట్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. గుర్తుపట్టకుండా ముఖాలకు నల్లరంగు వ్రస్తాలు కప్పుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపీకి రక్షణగా నిల్చున్నారు. అయినా దుండుగులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో చుట్టుముట్టి దాడి చేయడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ముష్కరులు వీరంగం సృష్టించారు.ఈ క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించడంతో వారంతా పారిపోయారు. అనంతరం ఎంపీ రకీబుల్ యథావిధిగా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీపై దాడి ఘటనపై అస్సాం కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముష్కర మూకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ గురువారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఎంపీ రకీబుల్కు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారికపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక, రకీబుల్ గతేడాది లోక్సభ ఎన్నికల్లో 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనపై దాడికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. బీజేపీ పాలనలో తమకు రక్షణ లేకుండాపోయిందని అస్సాం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీనియర్నేత గౌరవ్ గొగోయ్ ధ్వజమెత్తారు. గూండారాజ్ సంస్కృతి నుంచి రాష్ట్ర ప్రజలు స్వాతంత్య్రం కోరుకుంటున్నారని చెప్పారు. Brutal attack on @INCAssam MP Shri @rakibul_inc and his son Shri Tanzil Hussain, who faught recently concluded by-election as a MLA Candidate from Samuguri Constituency is highly condemnable. pic.twitter.com/XPzmF3MQ44— Gautam Bhattacharjee (@GautamB58738095) February 20, 2025 -
కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ తండవానికి ముల్లోకాలూ వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటున్నాయి. ఇందులో 18 ముఖ్యమైనవాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య.ఇక్కడ అమ్మవారు మహిళల జననాంగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు సంబంధించి సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఆలయాన్ని ఏటా నాలుగు రోజులపాటు మూసి ఉంచుతారు.ఏటా ఆషాఢ మాసంలో ఏడో రోజు నుంచి పదోరోజు వరకు అమ్మవారు ఋతుస్రావం లో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ 2025లో జూన్ 22 నుంచి 25 వరకు ఆలయం తలుపులు మూసేసి ఉంచుతారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబుబాచీ మేళా పేరిట భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నాలుగు రోజులు ఆలయ గర్భ గుడిని తెల్లని వస్త్రాలతో .. అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రాలతో కప్పి ఉంచుతారు. నాలుగో రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రాలు కాస్తా ఎర్రబారతాయి..అంతేకాకుండా. అమ్మవారి ప్రతిరూపం ( జననాంగం) వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది.ఎర్రని వస్త్రం మహా ప్రసాదంఆ రోజుల్లో ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో.. పూజా మందిరంలోనుంచుకుంటే శుభాలు కలుగుతాయని.. మహిళల ఆరోగ్యం బాగుంటుందని భక్తుల విశ్వాసం.పాంచ్ బలిఅమ్మవారి ఆలయంలో ఇంకో విశిష్టమైన బలి పూజ. జరుగుతుంది. పాంచ్ బలి.. అంటే కామాఖ్యకు ఐదు రకాల పదార్థాలను అర్పిస్తారు. ఎనుబోతు.. మేక.. బాతు ఈ మూడింటిని ఆలయంలో బలి ఇస్తారు..వీటితోబాటు బూడిద గుమ్మడి కాయను. చెరుకు గడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఐదింటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభీష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచలం.. వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకుని స్వామికి దూడలు సమర్పించినట్లు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకలు సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతుంటాయి. ఉచిత దర్శనం కోసం కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. లేదా పరిమిత సంఖ్యలో ఇచ్చే రూ.500 టికెట్ల కోసం వేకువజామున లైన్లో ఉంటే తెల్లవారేసరికి ఆ టిక్కెట్ తీసుకుని రెండు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. దీంతోబాటు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే కొండపై ఉండే ఉమానంద శివాలయాన్ని లాంచీలో వెళ్ళి చూసి రావడం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. గౌహతికి దేశంలోని అన్ని మూలల నుంచి రైళ్లు.. విమాన సౌకర్యాలు ఉన్నాయి. హోటళ్లు.. లాడ్జిలు.. టాక్సీలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.-కామాఖ్య నుంచి సిమ్మాదిరప్పన్న -
‘నా భార్య పాక్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్ని’
డిస్పూర్ : అవునా? నా భార్య పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్ను’అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం హేమంత్ బిశ్వశర్మలో కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా నాపై, నా కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. సీఎం హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఎంపీ సతీమణికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలు, యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారిని బ్రెయిన్వాష్ చేయడం, తీవ్రవాదం వైపు మళ్లించడం, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలనేది’ ఆ ట్వీట్లోని సారాశాం.In 2015, the Pakistani High Commissioner to India, Mr. Abdul Basit, invited a first-term Member of Parliament (MP) and his startup, Policy for Youth, to discuss India-Pakistan relations at the Pakistan High Commission in New Delhi. Notably, this MP was not a member of the…— Himanta Biswa Sarma (@himantabiswa) February 13, 2025హిమంత్ బిశ్వశర్మ ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. హిమంత బిశ్వశర్మ, ఆయన పార్టీ (బీజేపీ)లోని ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. నా భార్య పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అయితే, నేను ఇండియన్ రా ఏజెంట్ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు (గౌవర్ గోగోయ్ పార్లమెంట్) జోర్హాట్ పార్లమెంట్ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.అదే సమయంలో అస్సాం సీఎం హిమంత శర్మపై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా హిమంత భిశ్వశర్మ తన పదవిని కోల్పోతానేమోనన్న భయం వెంటాడుతోంది. ఆ భయం బీజేపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే భయపడి, నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేసి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని గొగోయ్ ఆరోపించారు. 👉చదవండి : ‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ -
‘రణ్వీర్ అలహాబాదియా’పై అస్సాం సీఎం కీలక ట్వీట్
గువహతి:ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో అశ్లీల వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. ఎఫ్ఐఆర్లో రణ్వీర్ అలహాబాదియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్లో పాల్గొన్న ప్యానెలిస్టుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలిపారు.Today @GuwahatiPol has registered an FIR against against certain Youtubers and social Influencers, namely 1. Shri Ashish Chanchlani2. Shri Jaspreet Singh3. Shri Apoorva Makhija4. Shri Ranveer Allahbadia5. Shri Samay Raina and othersfor promoting obscenity and engaging in…— Himanta Biswa Sarma (@himantabiswa) February 10, 2025 అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికే రణ్వీర్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసు దర్యాప్తులో భాగంగా షో జరిగిన సెట్లోకి కూడా పోలీసులు వెళ్లి పరిశీలించారు. రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణ్వీర్పై దుమ్మెత్తిపోశారు.రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా జాతీయ మనావహక్కుల సంఘం ఇప్పటికే యూట్యూబ్ను కోరింది. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రణ్వీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. -
ఫేర్వెల్ పార్టీలో పిల్లల రచ్చ
-
చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు
సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్లో గురువారం అసోంతో రాజ్కోట్ వేదికగా రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్ దేశాయ్, చిరాగ్ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.144వ సిక్సర్ఇక వన్డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా బ్యాట్ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్కు ఇది 144వ సిక్సర్.ఆల్టైమ్ రికార్డుఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్ రంజీల్లో ఆల్టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్ జాక్సన్ నమన్ ఓజాను అధిగమించాడు.పటిష్ట స్థితిలో సౌరాష్ట్రఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్ పుజారా 95, అర్పిత్ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్ జాక్సన్.. టీమిండియా యువ సంచలనం రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం గమనార్హం.అద్బుతమైన రికార్డులు ఉన్నాఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్ జాక్సన్కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్, ఛతేశ్వర్ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు షెల్డన్ జాక్సన్ ఖాతాలో 21 ఫస్ట్క్లాస్ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.ఇటీవలే గుడ్బైఅంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్ 588 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్ జాక్సన్ ఇటీవలే వైట్బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 86 మ్యాచ్లు ఆడిన షెల్డన్ జాక్సన్ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి! -
అస్సాం సత్రియా చారిత్రాత్మక అరంగేట్రం
యాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాలో అస్సాం సత్రియా సంస్కృతిని ప్రదర్శించనున్నారు. మజులిలోని ఔనియాతి సత్రం నుంచి 40 మంది సభ్యుల బృందం సాంప్రదాయ సత్రియా నృత్యం, సంగీతం, నాటకాన్ని ప్రదర్శిస్తుంది, ఇది రాష్ట్ర ఆధ్యాత్మిక, కళాత్మక వారసత్వంలోకి ఒక ప్రత్యేకమైన విండోను అందిస్తుంది. ఈ ప్రదర్శనలలో శ్రీమంత శంకరదేవుని భక్తి నాటకం రామ్ విజయ్ భావోనా, దిహా నామ్ (సామూహిక గానం), సాంప్రదాయ బోర్గీత్, ఖోల్, సింబల్స్, ఫ్లూట్, వయోలిన్, దోతర వంటి వాయిద్యాలతో కూడిన నృత్యం ఉంటుంది. ఈ బృందం పురుష (పారశిక్ భాంగి), స్త్రీ (స్త్రీ భాంగి) నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. 2000 సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటిగా గుర్తింపు పొందిన సత్రియాను 15వ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవుడు నృత్యం, నాటకం, సంగీతం ద్వారా శ్రీకృష్ణుని బోధనలను వ్యాప్తి చేయడానికి భక్తి మార్గంగా ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ప్రదర్శనలు సత్రియాకు కేంద్రంగా ఉన్న గొప్ప కథ చెప్పడం, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రతిబింబిస్తాయి. ఔనియాతి సత్రం సత్రాధికార్ పీతాంబర్ దేవ్ గోస్వామి, అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిష్టాత్మక వేదికపై ప్రాతినిధ్యం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ బృందం జనవరి 31 నుండి ఫిబ్రవరి 10, 2025 వరకు ప్రయాగ్రాజ్లో ఉంటుంది. భగవత్ పఠనాన్ని నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం అస్సాంకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు జరిగే పవిత్ర కుంభమేళాలో ప్రపంచ ప్రేక్షకులతో దాని సాంస్కృతిక సంప్రదాయాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. (చదవండి: సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!) -
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
గూగుల్ మ్యాప్తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్లోని నాగాలాండ్లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్లో కోల్మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్లో భయానక ఘటన
Viral Video మృత్యువు.. ఎటు నుంచి, ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అలాంటిది చావు ముఖం ఇలా ఉంటుందా? అని ఆ తల్లీకూతుళ్లు గజగజ వణికిపోయారు కాసేపు. అసోం కజిరంగా నేషనల్ పార్క్లో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఖడ్గమృగం.. చూడడానికి ఎంతటి భారీకాయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. ఉగ్రరూపంలో అది చేసే దాడి.. పెద్ద పెద్ద వాహనాలను సైతం కూలదోస్తుంది. అలాంటి జీవి కళ్లెదుట ఆ తల్లీకూతుళ్లు ప్రాణ భయంతో రోదనలు పెడుతూ కాసేపు గడిపారు.కజిరంగా నేషనల్ పార్క్లో ఖడ్గమృగం మంద నడుమ.. టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. అయితే మరి దగ్గరగా ఉండడంతో.. వేగంగా వెళ్లేందుకు రెండు జీపులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో హఠాత్తుగా మలుపు తిరిగిన రెండో జీపు వెనుక నుంచి తల్లీకూతుళ్లు కిందపడిపోయారు. అంతే.. ఒక్కసారిగా అటు టూరిస్టులు.. ఇటు ఆ తల్లీకూతుళ్ల అరుపులతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆ ఇద్దరికీ అతిసమీపంలోనే ఉన్న ఖడ్గమృగం(Rhino).. వెనక్కి తిరిగివాళ్లను చూసింది. ఈలోపు.. అక్కడే ఉన్న మరో ప్రయాణికుల జీపు వైపుగా ఇంకో రైనో దూసుకెళ్లింది. కట్ చేస్తే..ఆ తల్లీ తన కూతురిని అదిమి పట్టుకుని నేలపై పడుకునిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది.క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.కాస్త దూరంలో మరో టూరిస్టు వాహనంలో ఉన్న వ్యక్తి.. అదంతా చిత్రీకరించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పర్యాటకుల భద్రత గురించి చర్చ మొదలైంది. తమదాకా విషయం రావడంతో అధికారులు వైరల్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు.. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కజిరంగాలో బాగోరీ రేంజ్లో ఈ మధ్యే ఈ ఘటనచోటు చేసుకున్నట్లు సమాచారం.అసోం కజిరంగా(Kaziranga) నేషనల్ పార్క్లో 2,613 రైనోలు ఉన్నాయి(2022 లెక్కల ప్రకారం..). ప్రపంచంలోని ఖడ్గమృగాల జనాభాలోనే ఇది దాదాపు 70 శాతం.పైగా ఒంటి కొమ్ము రైనోలకు కజిరంగా నేషనల్ పార్క్ సుప్రసిద్ధం. కొమ్ము 57 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది.బరువు.. 2,200 కేజీల నుంచి 3 వేల కేజీల బరువు దాకా పెరుగుతాయి. ఎత్తు 5.7-6.7 ఫీట్లు Horrible incident at the Kaziranga National Park in Assam. Two women fell off a safari jeep as a rhino could be seen in very close proximity. Moments later, a second rhino came running towards another jeep safari, forcing it to take a reverse gear. The women escaped unharmed… pic.twitter.com/6s9zz8WHSZ— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2025అంత భారీకాయం ఉన్నప్పటికీ.. గంటకు 25 మైళ్ల వేగంతో(40 కిలోమీటర్లు) పరిగెడుతాయి. ఇవి బాగా ఈదగలవు కూడా.ఇవి హెర్బివోర్స్. గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి.వీటి చర్మం దళసరిగా ఉండి.. ముడలతో ఉంటుంది. వీటి జీవితకాలం 40 సంవత్సరాలుప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీని వరల్డ్ రైనో డేగా నిర్వహిస్తారు.ఈ భూమ్మీద ఐదు జాతుల ఖడ్గమృగాలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం అవగాహనగా ఈ రోజును నిర్వహిస్తుంటారు. 2024లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహించారుకీప్ ద ఫైవ్ ఎలైవ్(ఆ ఐదింటిని బతకనిద్దాం) పేరుతో డేను నిర్వహించారు. -
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
అలాంటి ఆంక్షలు నన్ను ఆపలేవు.. కళ నా స్వరం
మార్పు రావాలనుకున్న వ్యక్తి చిత్రకారుడు అయితే అతని కుంచె నుంచి పుట్టే చిత్రం జనాలను ఆలోచింపజేస్తుంది. అస్సాంలో గ్రాఫిటీ అనేది కళ కంటే గొప్పది అని నిరూపిస్తుంది. రాజకీయ, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి దృశ్యమాన స్వరాన్ని వినిపిస్తోంది. సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, రాజకీయ పరిణామాలతో నిండిన ప్రాంతంగా అస్సాం పేరొందింది. అలాంటి చోట చాలా కాలంగా కేవలం స్వీయ వ్యక్తీకరణ రూపమే కాకుండా సామాజిక మార్పు కోసం ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది కళ. ఇక్కడ గ్రాఫిటీ, స్ట్రీట్ ఆర్ట్ సామాజిక పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా నిరసనకు పదునైన రూపాలుగా ఉద్భవించాయి.ఆకర్షించిన జాతీయ దృష్టిగ్రాఫిటీ ఇప్పుడు అక్కడ నిరసన మాధ్యమంగా ఉంటోంది. అటవీ నిర్మూలన, ప్రభుత్వ విధానాలు, సహజ వనరులు కలుషితం అవడం.. వంటి విషయాలపై ఆరోపణలే కాదు సమస్యలను పరిష్కరించడానికి స్థానిక కళాకారులు గ్రాఫిటీని ఉపయోగిస్తున్నారు. స్థానిక కళాకారుడు మార్షల్ బారుహ్. అతని బోల్డ్ గ్రాఫిటీ కళాఖండాలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో వాడి, వేడి సంభాషణలకు దారితీశాయి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలపై దృష్టిని ఆకర్షించాయి. బారుహ్ ఇటీవల జోర్హాట్లోని హోలోంగపర్ గిబ్బన్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రతిపాదిత చమురు అన్వేషణను వ్యతిరేకిస్తూ తన కళాకృతి కోసం జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రాజెక్ట్ అంతరించిపోతున్న గిబ్బన్ల నివాసాలను బెదిరించింది. గౌహతి, ఎగువ అస్సాంలోని గోడలు, ఫ్లైఓవర్లపై అతని అద్భుతమైన విజువల్స్ ఈ సమస్య గురించి ప్రజలకు అవగాహన కల్పించాయి. ఇది చివరికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL)కు చేరింది.కళకు సంకెళ్లు‘నా కళాఖండాలు రాజకీయ విధాన నిర్ణయాలు వాయిదా వేయడానికి ఎంతవరకు దోహదపడ్డాయో నాకు తెలియదు. కానీ నా రచనలను గమనించిన తర్వాత ప్రజలు ఈ సమస్య గురించి తెలుసుకున్నారని నేను సంతృప్తి చెందాను. కళకు ప్రజలను ఆలోచింపజేసే సామర్ధ్యం ఉంది. ఉపరితలం దాటి చూసేలా వారిని ప్రేరేపించగలదు’ అని బారుహ్ చెబుతాడు. అతని ఈ నినాదం ఉద్యమం తేవడానికి కాదు. హింస, నిరుద్యోగం, చెట్ల నరికివేత, ప్రభుత్వ విధానాలకు సంబంధించి చాలా మంది పౌరులు అనుభవించిన నిరాశకు ప్రతిబింబం ‘కళ కేవలం సామాజికంగా ప్రతిబింబించాలి వాస్తవాలు నగరాన్ని సుందరీకరించడంపై మాత్రమే దృష్టి సారిస్తే, క్లిష్టమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించే ప్రమాదం ఉంది’ అని యువ కళాకారుడు గట్టిగానే సమాధామిస్తాడు. అన్నింటికంటే, బారుహ్ అరెస్టు కళాత్మక వ్యక్తీకరణ, ప్రభుత్వ అధికారం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను హైలైట్ చేస్తుంది.కళా శక్తిప్రకృతి విధ్వంసంపై దృష్టి సారించే అతని రచనలు, చెట్ల నరికివేత, గౌహతిలోని జలుక్బరి ఫ్లైఓవర్లోని గోడలపై అడవుల సమస్యలు, పేలవంగా ఉండే ప్రజా మౌలిక సదుపాయాల స్థితి వంటి పర్యావరణ సంబంధిత ఆందోళనల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నిరసన కళతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఈ కళాకారులు అధైర్యపడలేదు. ‘కళకు అపారమైన శక్తి ఉంది. జాతీయ రహదారులపై కళాఖండాలను రూపొందించకుండా ఒక సంవత్సరం పాటు నన్ను నిషేధించారు. కొన్ని నిరసనల సమయంలో నేను గౌహతిలో ఉండి ఉంటే నన్ను అరెస్టు చేసి ఉండేవారని తెలుసు. కానీ అలాంటి ఆంక్షలు నన్ను ఆపలేవు. కళ నా స్వరం’ అని చెబుతాడు అతను. చదవండి: ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం.. పిడుగులతో జాగ్రత్త!‘నిరసన కళ రాజకీయాలు అస్సాంలోని వివాదాస్పద స్వభావాన్ని చట్టాన్ని అమలు చేసే అధికారులు గుర్తించారు. రాజకీయ నాయకులు మద్దతు కూడగట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ అదే సాధనాలను వారి ప్రత్యర్థులు ఉపయోగించినప్పుడు, బెదిరింపులకు గురవుతారు’ అంటూ ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో ప్రస్తావించారు. అస్సాంలో కళాత్మక స్వేచ్ఛ, రాజకీయ అధికారం మధ్య ఉద్రిక్తత రాష్ట్రానికి మాత్రమే కాదు. ఇది భారతదేశం అంతటా విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ నిరసన కళ వివాదాస్పద సమస్యగా మారింది. జాతి కలహాలు, పర్యావరణ క్షీణత, రాజకీయ అశాంతి వంటి సమస్యలతో రాష్ట్రం చాలా కాలంగా పోరాడుతోంది. అస్సాంలో కళ అసమ్మతి స్వరంగా మారింది. న్యాయం కోసం పిలుపునిచ్చే శక్తివంతమైన అహింసా మార్గంగా రూపు కట్టింది.ఆర్టిస్ట్స్ వర్సెస్ అథారిటీ కళను నిరసన సాధనంగా, విధ్వంసకరంగా భావించే రేఖ దీంతో మరింత అస్పష్టంగా మారింది. మరొక ప్రముఖ గ్రాఫిటీ కళాకారుడు నీలిమ్ మహంత (Neelim Mahanta) ఈ భావాలను ప్రతిధ్వనిస్తూ, నిరసన కళ గురించి మరింత బహిరంగ సంభాషణకు పిలుపునిచ్చారు. ‘కళను నిరసన రూపంగా స్వాగతించాలి. దీనికి వ్యతిరేకంగా చట్టాలు విధించే బదులు, కళాకారులు హైలైట్ చేస్తున్న సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలను ప్రభుత్వం ప్రోత్సహించాలి’ అని మహంత అన్నారు. బారుహ్, గ్రాఫిటీని సృష్టించడం అనేది కేవలం ఒక కళాత్మక ప్రయత్నం కాదు. ప్రభుత్వ చర్యల పట్ల అసంతృప్తిని తెలియజేయడానికి ఒక మార్గం.‘మేము మా అసమ్మతిని పదాలకు బదులుగా చిత్రాల ద్వారా వ్యక్తపరుస్తున్నాం’ అని భేజల్ అనే స్థానిక గ్రాఫిటీ కళాకారుడు పర్యావరణ సమస్యలను ఎత్తిచూపారు. -
తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఒక ఇంట్లో ఉంటూ..
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది. జైదీప్ దేవ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్ పైనుంచి పడి యువకుడు మృతి -
అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు
-
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
గువహాటి: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తలా నుంచి ముంబయికి బయలుదేరిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. అస్సాంలోని దిబలోంగ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదం మధ్యాహ్నం 3.55 గంటలకు జరగ్గా, సమాచారం అందగానే సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రమాదం కారణంగా లుమ్డింగ్-బాదర్పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్లో రైళ్ల రాకపోకలు నిలివేశారు.ఇదీ చదవండి: వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని.. -
సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: భారత పౌరసత్వ చట్టం–1955లోని ‘సెక్షన్ 6ఏ’ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం సమరి్థంచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనో మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 4:1 మెజారీ్టతో గురువారం తీర్పు వెలువరించింది. జస్టిస్ పార్దివాలా మాత్రమే ఈ తీర్పుతో విభేదించారు. సెక్షన్ 6ఏ రాజ్యాంగవిరుద్ధమని ఆయన చెప్పారు. చట్టవిరుద్ధమైన వలసలకు అస్సాం అకార్డ్(ఒప్పందం) ఒక రాజకీయ పరిష్కారంగా తోడ్పడిందని ధర్మాసనం వెల్లడించింది. అసోంలోకి వలసలకు, వలసదార్లకు పౌరసత్వం ఇవ్వడానికి 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైందేనని పేర్కొంది. సెక్షన్ 6ఏ చట్టబద్ధమేనని సీజేఐ తన తీర్పులో వివరించారు. చట్టంలో ఈ సెక్షన్ను చేర్చడానికి పార్లమెంట్కు చట్టబద్ధమైన అధికారం ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అసోంలోకి వలసలు అధికం కాబట్టి అక్కడికి ఎంతమంది అక్రమంగా వచ్చారన్నది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపింది. అసోంలో భిన్నమైన గిరిజన తెగలు, సమూహాలు, వర్గాలు ఉన్నాయని, ఆయా వర్గాల ప్రజలకు తమ సంస్కృతిని కాపాడుకొనే హక్కును ఆర్టికల్ 29(1) కింద రాజ్యాంగం కల్పించిందని, సెక్షన్ 6ఏ ఈ హక్కును ఉల్లంఘిస్తోందంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆరి్టకల్ 29(1)ను ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో వేర్వేరు తెగల ప్రజలు ఉన్నారని చెప్పడం ఒక్కటే సరిపోదని స్పష్టంచేసింది. Supreme Court’s five-judge Constitution bench upholds the constitutional validity of Section 6A of the Citizenship Act inserted by way of an amendment in 1985 in furtherance of the Assam Accord. pic.twitter.com/I2waFAKhbl— ANI (@ANI) October 17, 2024ఏమిటీ సెక్షన్ 6ఏ? 1985 నాటి అస్సాం అకార్డ్ తర్వాత అప్పటి ప్రభుత్వం సెక్షన్ 6ఏను ప్రత్యేక ప్రొవిజన్గా పౌరసత్వ చట్టంలో చేర్చింది. అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రపుల్ల కుమార్ మహంత నేతృత్వంలోని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే అస్సాం అకార్డ్. ఈ అకార్డ్ కింద ఎవరెవరికి భారత పౌరసత్వం కలి్పంచాలన్నది సెక్షన్ 6ఏ నిర్దేశిస్తోంది. ఈ సెక్షన్ ప్రకారం.. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 దాకా బంగ్లాదేశ్తోపాటు నిర్దేశించిన ఇతర ప్రాంతాల నుంచి అసోంలోకి వలసవచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వొచ్చు. అలాంటివారు పౌరసత్వం కోసం సెక్షన్ 18 కింద రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, అక్రమ వలసదార్లుగా గుర్తించిన తేదీ నుంచి పది సంవత్సరాల దాకా భారత పౌరసత్వం కోసం రిజిస్టర్ చేసుకోవడానికి వీల్లేదు. పదేళ్లు పూర్తయిన తర్వాతే అవకాశం ఉంటుంది. అలాగే 1971 మార్చి 25 తర్వాత వలస వచి్చనవారిని సెక్షన్ 6ఏ ప్రకారం వెనక్కి పంపించాలి. ఈ సెక్షన్ను అసోం సని్మలితా మహాసంఘతోపాటు మరొకొన్ని గ్రూప్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అసోంలోకి సామూహిక వలసలను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించాయి. చదవండి: పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర -
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
17 మంది బంగ్లాదేశీయులను వెనక్కి పంపిన పోలీసులు
గౌహతి: బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన దగ్గరి నుంచి భారత్లోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు పెరిగిపోయాయి. మనదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న బంగ్లాదేశీయులను సరిహద్దుల్లోని సైనికులు, పోలీసులు తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు.తాజాగా ఎనిమిది మంది చిన్నారులు సహా 17 మంది బంగ్లాదేశీయులను అస్సాం రాష్ట్ర పోలీసులు సరిహద్దుల నుంచి వెనక్కి పంపించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఒక ట్వీట్లో తెలిపారు. భారతదేశంలోకి బంగ్లాదేశీయుల చొరబాటు యత్నాలు గణనీయంగా పెరిగాయన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొంత భాగాన్ని మాత్రమే అస్సాం కాపాడుతోందని అన్నారు. పోలీసులు బంగ్లాదేశీయులను వెనక్కి పంపడాన్ని సీఎం మెచ్చుకున్నారు. కరీంగంజ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుండి చొరబడుతున్న బంగ్లాదేశీయుల ప్రయత్నాన్ని రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారని శర్మ పేర్కొన్నారు.ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 25 మంది చొరబాటుదారులను అస్సాం నుండి బంగ్లాదేశ్కు తిరిగి పంపించినట్లు శర్మ తెలిపారు. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులు టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేందుకు దక్షిణాది నగరాలకు చేరుకోవడానికి అస్సాంను రవాణా మార్గంగా ఉపయోగిస్తున్నారన్నారు. కాగా ఈశాన్య ప్రాంతంలోని 1,885 కి.మీ పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిఘా మరింతగా పెంచింది. Taking firm stance against infiltration, @assampolice pushed back 9 Bangladeshis and 8 children across the border in the wee hours today-Harul Lamin-Umai Khunsum-Md. Ismail-Sansida Begum-Rufiya Begum -Fatima Khatun-Mojur Rahman-Habi Ullah-Sobika BegumGood job 👍 pic.twitter.com/Q3DeQBr6kj— Himanta Biswa Sarma (@himantabiswa) September 28, 2024ఇది కూడా చదవండి: Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్? -
రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్లో సినీ నటి అరెస్ట్
ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్తో భారీ స్కామ్ గుట్టును అస్సాం పోలీసులు ఛేదించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణంలో అస్సామీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ కొరియోగ్రాఫర్,నటి 'సుమీ బోరా' ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు. రెండురోజులుగా పరారీలో ఉన్న ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో తాజాగా పోలీసులకు లొంగిపోయింది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ రాబడి వస్తుందని నమ్మించి ప్రజలను మోసం చేసిన నిందితుడు బిషల్ ఫుకాన్ (22)ను అస్సాం పోలీసులు మొదట అరెస్టు చేశారు. ఫుకాన్ అరెస్టు తర్వాత తన బంధువు అయిన సుమీ బోరా, ఆమె భర్త తార్కిక్ బోరా పేర్లు తెరపైకి వచ్చాయి. అసలైన ప్రధాన సూత్రధారులు వారిద్దరేనని పోలీసులు గుర్తించారు. అస్సామీ చిత్ర పరిశ్రమలో తన పరిచయాల ద్వారా నటులు, గాయకులు, రాజకీయ నాయకులు, సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో సహా అనేక మందిని టార్గెట్ చేస్తూ.. భారీ మొత్తంలో ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టించింది. ఇదీ చదవండి: సందీప్, సాయి ధరమ్తేజ్తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్ఆమెకు మంచి గుర్తింపు ఉండటంతో చాలామంది మధ్యతరగతి వారు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. అలా సుమారు రూ. 2,200 కోట్ల భారీ స్కామ్కు పాల్పడ్డారు. కొంతకాలం క్రితం రాజస్థాన్లోని ఉదయపూర్లో సుమీ బోరా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. అందుకు రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. బోరా తరచుగా విహారయాత్రలు చేస్తూ తన భర్తతో విలాసవంతమైన జీవితం గడిపేది. ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ కావడం విశేషం. ఇలా ఈ జంట రూ. 2,200 కోట్ల బిగ్ స్కామ్కు పాల్పడింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో వారిద్దరూ ఉన్నారు. -
ఆధార్కార్డుల జారీకి ‘ఎన్ఆర్సీ’ మెలిక
గువహటి: ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)కి దరఖాస్తు చేసుకున్న నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అస్సాంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నంబర్ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు. ఇందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. -
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ భారీ ఆన్లైన్ స్కామ్ అస్సాంలో వెలుగుచూసిందిరాష్ట్ర పోలీసులు రూ. 22 వేల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తామంటూ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసగాళ్లు ఈ సొమ్మును సేకరించారు.ఈ కేసులో దిబ్రూఘఢ్కు చెందిన 22 ఏళ్ల ఆన్లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.వ్యాపారవేత్త అయిన విశాల్ ఫుకాన్ తన పరపతిని ఉపయోగించి పెట్టుబడిదారులకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం అధిక లాభాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు.దిబ్రూగఢ్లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్వర్క్తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మోసపూరిత ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను హెచ్చరించారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామనే మాటలు అబద్దమని పేర్కొన్నారు. -
మమ్మల్నే బెదిరిస్తారా.. మీకు ఎంత ధైర్యం? దీదీపై హిమంత శర్మ ఫైర్
డిస్పూర్ : ‘మా రాష్ట్రాన్నే అంటారా? మీకు ఎంత ధైర్యం?’ అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)పై నిప్పులు చెరిగారు.సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంగళవారం అభయ ఘటన నేపథ్యంలో దీదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది.బంగ్లాదేశ్ తరహాలో పశ్చిమ బెంగాల్లో సైతంఈ ఘటన గురించి బుధవారం కోల్కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో దీదీ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర సచివాలయానికి బంద్ (సమ్మె), నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు.. వెరసీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. दीदी, आपकी हिम्मत कैसे हुई असम को धमकाने की? हमें लाल आंखें मत दिखाइए। आपकी असफलता की राजनीति से भारत को जलाने की कोशिश भी मत कीजिए। आपको विभाजनकारी भाषा बोलना शोभा नहीं देता।দিদি, আপনার এতো সাহস কীভাবে হলো যে আপনি অসমকে ধমকি দিচ্ছেন? আমাদের রক্তচক্ষু দেখাবেন না। আপনার অসফলতার… pic.twitter.com/k194lajS8s— Himanta Biswa Sarma (@himantabiswa) August 28, 2024‘ఇది (ఆందోళన) బంగ్లాదేశ్లోని నిరసనల మాదిరిగానే ఉందని కొందరు అనుకుంటున్నారు. నేను బంగ్లాదేశ్ను ప్రేమిస్తున్నాను. వారు మా (బెంగాలి) లాగా మాట్లాడతారు. మా సంస్కృతి కూడా ఒకటే. అయితే, బంగ్లాదేశ్ వేరే దేశం’అని బెనర్జీ అన్నారు. మోదీ జీ.. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితేఅంతేకాదు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. ‘మోదీ జీ, మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని అన్నారు.దీదీ.. మీకెంతా ధైర్యంఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దీదీ అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? మీ రక్తపు కళ్ళు మాకు చూపించవద్దు. మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించవద్దు. విభజన భాష మాట్లాడటం మీకు సరిపోదు’ అని విమర్శించారు. అదే సమయంలో దీదీ వ్యాఖ్యానించినట్లుగా అస్సాంలో అల్లర్లు జరగవు. అందుకు నేను హామీ’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. -
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’
దిస్పూర్:అసోంలోని నాగావ్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం నాగావ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం జరిగిన అనంతరం ఆమెను నిందితులు రోడ్డు పక్కన వదిలేశారు. ఆమె స్పృహ కోల్పోయి స్థానికులకు కనిపించగా ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్పందించారు. గౌహాతిలో పనిచేస్తున్న ఆయన సమాచారం అందగానే తమ గ్రామానికి వచ్చారు. తన కూతురుకు ఇలా జరగటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నేను నా కూతురును చూసినప్పడు ఆమె కనీసం మాట్లాడలేకపోయింది. ఈ దారుణ ఘటనతో మా గ్రామంలోని ప్రజలంతా తీవ్రమై భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే.. తమ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతాయనే భయంతో జనం బతకాల్సి వస్తుంది’’ అని అన్నారు.మరోవైపు.. ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు. -
అసోం అత్యాచారం కేసు: నిందితుడు మృతి
దిస్పూర్: అసోంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చి, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక.. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
ఆగని అఘాయిత్యాలు.. ట్యూషన్ నుంచి వస్తుండగా బాలికను అడ్డగించి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా
అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది. ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్ను విరమించుకుంది. These are the areas in #Assam claimed by ULFA (I) where bombs have been allegedly planted1. In an old car lying at the DTO office in Shivsagar2. Shivsagar BG Road ONGC 5th gate crossing the old ambulance on the roadside3. Lakua Tin Ali, near the police station4. Assam… pic.twitter.com/QijCEdFMFD— Nibir Deka (@nibirdeka) August 15, 2024పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది. -
అసోం మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
గువాహటి: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీ(సూచనలు)పై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అయ్యారు. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.ఆస్పత్రి విడుదల చేసిన అడ్వైజరీలో.. ‘మహిళా డాక్టర్లు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు తక్కువగా, జనాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. అత్యంత అవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో హాస్టల్స్ విడిచి బయటకు వెళ్లవద్దు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అధికారులకు సమాచారం అందించాలి. అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. ఏదైనా వేధింపుల సమస్య ఎదురైతే.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించండి’’ అని పేర్కొంది. ఈ అడ్వైజరీని డాక్టర్లు, విద్యార్థులు తీవ్రగా వ్యతిరేకించారు. అడ్వైజరీలో వాడిన పదజాలం తమను బాధించిదని కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.తమను రూంలకే పరిమితం కావాలని చెప్పే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. క్యాంపస్లో లైటింగ్తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తమను బాధించిన అడ్వైజరీని సైతం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొదట ఆస్పత్రిలో మహిళా సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపినా.. విద్యార్థుల విమర్శల ఒత్తిడితో వెనక్కి తీసుకున్నట్లు సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రకటించింది. మరోవైపు.. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ).. దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు, హాస్టల్స్లో ఉండేవారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య కళాశాలలకు అడ్వయిజరీ జారీ చేసిన విషయం తెలిసిందే. -
విషాదం: అసోంలో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, నల్లగొండ: తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్ అసోంలో మృతిచెందాడు. నేడు అతడి భౌతికకాయం స్వగ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. రేపు అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం మాదరిగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్(24) అసోంలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మహేష్కు ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు. దీంతో, నేడు అతడి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. రేపు స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
ముస్లింల జనాభా పెరుగుదల జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత
రాంచీ: జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు. జీవన్మరణ సమస్య. మనం ఎన్నో జిల్లాలను కోల్పోయాం’ అని హిమంత వ్యాఖ్యానించారు. 2021 జూన్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక హిమంత మాట్లాడుతూ.. ‘జనాభా విస్పోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు మూలకారణం’ అని అన్నారు. రాంచీలో బుధవారం బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బంగ్లా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. జార్ఖండ్ను సీఎం హేమంత్ మినీ బంగ్లాదేశ్గా మార్చేశారన్నారు. -
అస్సాంలో ఎన్కౌంటర్
అస్సాం: రాష్ట్రంలోని కాచర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ నుమాల్ మహట్టా తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపూర్ రోడ్డు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం కాచర్లోని ధలై గంగా నగర్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను, ఒక సాధారణ రైఫిల్, ఒక పిస్టల్ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పట్టుబడిన ముగ్గురూ హ్మార్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన క్యాడర్గా ప్రాథమిక విచారణలో తేలింది. భుబన్ హిల్స్లోని సమీపంలోని అడవిలో మరికొందరున్నట్టు, అసోం–మణిపూర్ సరిహద్దుల్లో విధ్వంసాలకు సిద్ధమవుతున్నట్లు పట్టుబడిన ముగ్గురు వెల్లడించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున అదనపు ఎస్పీ నేతృత్వంలోని బృందం అరెస్టయిన ఉగ్రవాదులతో పాటు భుబన్ హిల్స్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో భుబన్హిల్స్లో ఉన్న కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు కాచర్కు చెందినవారు కాగా ఒకరు మణిపూర్కు చెందినవారు. మరో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
ప్రపంచవ్యాప్తంగా రైట్వింగ్ నేతలపైనే టార్గెట్: అస్సొం సీఎం
ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ నేతలను లెఫ్ట్ వింగ్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ నేతలపై లెఫ్ట్ పార్టీ దాడులతో టార్గెట్ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్ ట్రంప్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024 ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్ను షూట్ చేసినట్లు ఎఫ్బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. -
అస్సాంలో గాంధీ విగ్రహం తొలగింపు.. తనకు తెలియదన్న సీఎం
గువాహతి: అస్సాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు. టిన్సుకియా జిల్లా దూమ్దూమా లోని గాంధీ చౌక్లో ఉంచిన 5.5 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్కడి నుంచి తొలగించడం వివాదానికి దారి తీసింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడంపై విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశాయి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఏఏఎస్యూ) నిరసనలు చేపట్టింది.అయితే, విగ్రహం తొలగింపు నిర్ణయం గురించి తనకు తెలియదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. ‘జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు. వాస్తవం ఏంటో తెలుసుకుంటా. అస్సాం మహాత్మా గాంధీకి చాలా రుణపడి ఉంది. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అస్సాంను పాకిస్తాన్లో చేర్చాలని కోరినప్పుడు ఆయన భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్కు గాంధీ అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు.మరోవైపు గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు. ‘అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు’ అని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ప్రభుత్వం చర్యను తప్పుబట్టింది.తాము నగర సుందరీకరణ ప్రాజెక్ట్ను వ్యతిరేకించడం లేదని, కానీ అందుకు గాంధీ విగ్రహాన్ని తొలగించడం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గ భూమిజ్. విగ్రహాన్ని తొలగించడాన్ని అంగీకరించమని.. విగ్రహాన్ని అలాగే ఉంచి, క్లాక్ టవర్ను నిర్మించాలని సూచించారు. -
Assam govt: తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవు
గువాహటి: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది. -
అస్సాంలో రాహుల్.. కాంగ్రెస్, బీజేపీ ట్వీట్ వార్
గువహతి: లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ సోమవారం ఉయదం (జులై 8) అస్సాంలో పర్యటించారు. సిల్చార్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అస్సాం నుంచి రాహుల్గాంధీ మణిపూర్కు పర్యటనకు బయల్దేరారు. ఈ సీజన్లో వచ్చిన వరదలకు అస్సాంలో కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..నాన్ బయాలజికల్ ప్రధాని సోమవారం ఉదయం మాస్కో వెళ్లారని ఎక్స్(ట్విటర్)లో జైరాంరమేష్ ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ మాత్రం అస్సాంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారన్నారు. మణిపూర్లో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారని తెలిపారు. మరోపక్క బీజేపీ ఐటీ అమిత్ మాలవ్య జైరాంరమేష్ ట్వీట్పై స్పందించారు. అసలు మణిపూర్లో జాతుల మధ్య వైరానికి కాంగ్రెస్సే కారణమన్నారు. రాహుల్గాంధీది ట్రాజెడీ టూరిజం అని విమర్శించారు. -
క్లాస్ రూంలో దారుణం.. లెక్చరర్ ప్రాణం తీసిన ఇంటర్ విద్యార్ధి
విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్ను రన్ చేస్తున్నారు.అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెట్ చెప్పేందుకు క్లాస్కు వచ్చాడు. అనంతరం క్లాస్ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్ డ్రెస్తో క్లాస్కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.దీంతో అప్పటికే పక్కా ప్లాన్తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్ రాజేష్పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వరదలకు అసోం అతలాకుతలం
-
అస్సాంలో వరదలు: పలువురిని కాపాడిన ఆర్మీ
దిస్ఫూర్: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలు రాష్ట్రంలోని పలు జిల్లాలను ప్రభావితం చేశాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ.. జూన్ 29 నుంచి పలు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది.#SpearCorps, #IndianArmy, @sdma_assam, and @ComdtSdrf, jointly carried out relentless rescue & relief operations in the flood affected areas in Dhemaji District of #Assam and East Siang district of #ArunachalPradesh. Over 35 citizens were evacuated, provided critical aid &… pic.twitter.com/xLxSYQ8kzw— SpearCorps.IndianArmy (@Spearcorps) July 1, 2024 ‘అసోంలోని ధేమాజీ జిల్లాలోని శివగురి, అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని మెర్ గ్రామాలు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ (SDRF) సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాం. జూన్ 29 నుంచి వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని భారత్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.Troops of #AssamRifles & #IndianArmy under #SpearCorps, safely rescued 800 personnel, including women and children from the inundated areas in Imphal East and Imphal West districts of #Manipur. The rescue columns also strengthened the embankments of the Imphal and Iril Rivers in… pic.twitter.com/3zDgwLIOda— SpearCorps.IndianArmy (@Spearcorps) July 3, 2024 అస్సాంలోని శివగురి, నామ్సింగ్ ఘాట్, పగ్లామ్, ఓరియన్ ఘాట్ ప్రాంతాల్లో 72 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టాం. సహాయక చర్యల్లో 17 మంది పిల్లలతో సహా మొత్తం 48 మందిని రక్షించినట్లు తెలిపారు. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో స్థానిక అధికార యంత్రాంగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలతో కలిసి.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందించామని ఆర్మీ అధికారులు తెలిపారు.#IndianArmy is conducting joint rescue & relief ops in the flood affected areas of #Assam & #ArunachalPradesh; 35 people evacuated so far. pic.twitter.com/WhGMwMiqPL— News IADN (@NewsIADN) July 1, 2024 -
అసోంలో వరదలు.. 60 మంది మృతి
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్, డిబ్రుగఢ్ తదితర జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.మరోవైపు ఉత్తరాఖండ్లోని అలకనందా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సమీపప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొంది. -
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!) -
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్గా కెరీర్ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్మేకర్గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్గా, ఫొటోగ్రాఫర్గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
అమృత్పాల్ నిర్భందం ఏడాది పొడగింపు
చండీగఢ్: సిక్కు తీవ్రవాద ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ నిర్భందాన్ని ఏడాది పాటు పొడగిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. అయితే బుధవారం వీటిని బహిరంగ పర్చారు. వారిస్ దే పంజాబ్ చీఫ్ అమృత్పాల్, అతని తొమ్మిది మంది అనుచరులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయ్యి ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. జైలులో ఉంటూనే అమృత్పాల్ లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి సమీప కాంగ్రెస్ ప్రత్యరి్థపై 1.97 లక్షల మెజారిటీతో ఎంపీగా విజయం సాధించాడు. ఫలితాలు ఈనెల 4న వెలువడగా.. 3వ తేదీనే అమృత్పాల్ నిర్భందాన్ని ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
భార్య మృతి.. ఐసీయూలో ఐపీఎస్ భర్త ఆత్మహత్య
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటుంటారు. పెళ్లితో ముడిపడిన జంట తాము జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేస్తారు. ఎన్ని కష్టనష్టాలొచ్చినా కలిసి నడుస్తారు. పరస్పరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్న దంపతుల్లో విధివశాత్తూ ఒకరు మరణిస్తే, మరొకరు ఆ ఎడబాటును తట్టుకోలేక విలవిలలాడిపోతుంటారు.అసోం హోమ్శాఖ సెక్రటరీ శిలాదిత్య చెతియా(44) తన భార్య మరణంతో తీవ్రంగా కలతచెంది, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త అసోంలోని అందరినీ షాక్నకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో తన భార్య మృతదేహం ముందు శిలాదిత్య చెతియా తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతిచెందిన కొద్ది నిమిషాలకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య కొంతకాలంగా అదే ఆసుపత్రిలో క్యాన్సర్కు చికిత్సపొందుతున్నారు. శిలాదిత్య చెతియా రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్న ఐపీఎస్ అధికారి. రాష్ట్ర హోమ్శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేప్టటడానికి ముందు ఆయన టిన్సుకియా, సోనిత్పూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా, అసోం పోలీసు నాల్గవ బెటాలియన్కు కమాండెంట్గా పనిచేశారు. ఆయన భార్య అగమోని బోర్బరువా(40) నామ్కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.ఈ ఘటన గురించి నామ్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా మాట్లాడుతూ ‘బుల్లెట్ శబ్దం వినగానే మేమంతా పరిగెత్తుకుంటూ ఐసీయూలోని వెళ్లాం. అక్కడ శిలాదిత్య చెతియా తన భార్య మృతదేహం పక్కనే రక్తపు మడుగులో పడివున్నారు. మేము అతని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని’ అన్నారు. కాగా చెతియా మృతిపై అసోం డీజీపీ జీపీ సింగ్ విచారం వ్యక్తం చేశారు. -
క్యాన్సర్తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్ భర్త సూసైడ్
గువహతి: భార్య క్యాన్సర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన మంగళవారం(జూన్18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య క్యాన్సర్తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. -
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
కేన్స్ రెడ్ కార్పెట్పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్పై వివిధ రకాల గౌనులు, డిజైనర్వేర్లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్కార్పెట్పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?) -
అసోం కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్లో టెస్లా లోగో.. ఏం జరిగిందంటే..
అసోం కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా బుధవారం హ్యాక్ అయింది. ప్రొఫైల్ పేరు 'టెస్లా ఈవెంట్'గా మారిపోయింది. ప్రొఫైల్ ఫొటోగా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా లోగోను పెట్టారు హ్యాకర్లు.ఈ మేరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాతా హ్యాక్కు గురైందని ఏపీసీసీ సోషల్ మీడియా & ఐటీ చైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని, ఇప్పుడే పునరుద్ధరించామని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ పోస్ట్లో తెలిపింది. పూర్తి భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమీక్షలో ఉందని పేర్కొంది. ఇది ప్రభుత్వ పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.We would like to inform you that our official Twitter handle, Assam Pradesh Congress Committee, was hacked but has now been restored and is currently under review to ensure full security. This attempted silencing by the fascist government will not deter us. We remain committed to… pic.twitter.com/DE7vWGXWcv— Tesla Event (@INCAssam) May 8, 2024 -
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే... జాంగీపూర్ (పశి్చమ బెంగాల్) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్కు టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్) ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్) ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.మాధేపుర (బిహార్) మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.అరారియా (బిహార్) బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.గువాహటి (అసోం) ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు. డుబ్రి (అసోం) ఈ లోక్సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. రాయ్గఢ్ (ఛత్తీస్గఢ్) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్గఢ్ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
Citizenship Amendment Act: సీఏఏ ఎవరికి లాభం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకేరాష్ట్రంలో 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్ఆర్సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్ఆర్సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది. కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి. ఇదీ విపక్షాల వాదన!సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఏమిటీ సీఏఏ చట్టం...?► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు. -
రాజ్యాంగానికి రుణపడి ఉన్నా..
పూర్ణియా/రాయ్గంజ్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానని ప్రధాని మోదీ అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన తాను రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మంగళవారం బిహార్, పశ్చిమ బెంగాల్ల్లోని పలు పట్టణాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాలుపంచుకున్నారు. అస్సాంలోని గువాహటిలో రోడ్లో పాల్గొన్నారు. రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నవారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, తాను ఆ వర్గాల నుంచి రావడమే అందుకు కారణమని పేర్కొన్నారు. సీఏఏను అమలు చేసి తీరుతాం... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు తాము భయపడడం లేదని, చట్టాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారంతా మోదీ పట్టుదల గురించి తెలుసుకోవాలని చెప్పారు. ప్రతిపక్షాలు ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశంలోకి అక్రమ చొరబాట్లు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల పేదలకు, దళితులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని పెద్ద ఘనతగా మోదీ అభివర్ణించారు. రాజ్యాంగం అంటూ గగ్గోలు పెడుతున్నవారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్లో ఎందుకు అమలు చేయలేదని మండిపడ్డారు. -
వివాదాలకు కేరాఫ్.. ఫైర్బ్రాండ్ మహువా
చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి. ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశి్నస్తారు. పార్లమెంటులో బలమైన స్వరం. ఎంపీగా ఎన్నికైన నాటినుంచే మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అంతే వివాదాస్పద రీతిలో నోటుకు ప్రశ్నల కేసులో లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు కూడా. కాంగ్రెస్లో మొదలై... దాదాపు 15 ఏళ్ల క్రితం ‘ఆమ్ ఆద్మీ కా సిపాహీ’ ప్రచారానికి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపిక చేసిన యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తొలిసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు మహువా. 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్లో జన్మించిన ఆమె అమెరికాలోని మసాచుసెట్స్లో మౌంట్ హోలియోక్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్లో బ్యాంకర్గా న్యూయార్క్లో, లండన్లో పనిచేశారు. 2009లో ఉద్యోగం వదిలి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్లో చేరినా 2010లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2016 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. 2019లో కృష్ణానగర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అక్కడా అదే వాగ్ధాటి కొనసాగించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ సంబంధం గురించి పదేపదే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈసారీ కృష్ణానగర్ నుంచే పోటీ చేస్తున్నారు... కొత్త రోల్ మోడల్స్ కావాలి.. ఖరీదైన బూట్లు, బ్రాండెడ్ బ్యాగులు కొనడానికి తనకు లంచాలు అవసరం లేదంటూ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు మొయిత్రా. తనపై ఆరోపణలను భారత రాజకీయాల్లో ఇమిడి ఉన్న స్త్రీ ద్వేషంలో భాగంగా అభివర్ణించారు. ‘‘నేను ప్రగతిశీల కుటుంబంనుంచి వచ్చాను. భారతీయ స్త్రీ ఇలాగే ఉండాలనే మూస పద్ధతిలో పెరగలేదు. తృణమూల్ ఓ మహిళ సారథ్యంలో ఉంది. మమత మహిళలను ప్రోత్సహిస్తారు. అందుకే ఆ పార్టీలో చేరా. పార్లమెంటులో సగం మంది మహిళా ఎంపీలు టీఎంసీ వాళ్లే. ఎందుకంటే బెంగాల్లో స్త్రీలను శక్తిగా భావిస్తాం. మెదడున్న, గా చదువుకున్న, ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసమున్న స్త్రీని సగటు భారతీయ పురుషుడు, నాయకుడు ఎదుర్కోలేడు’’ అంటూ కుండబద్దలు కొడతారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు సరికొత్త రోల్ మోడల్స్ అవసరమంటారు. ‘కుక్కపిల్ల కస్టడీ’ తో సీటుకే ఎసరు... పెంపుడు కుక్కపిల్ల కస్టడీ వ్యవహారం పార్లమెంటు నుంచి మొయిత్రా బహిష్కరణకు దారితీసింది. మాజీ సహచరుడు జై అనంత్ దెహద్రాయ్ నుంచి తమ పెంపుడు కుక్కపిల్ల కస్టడీ కోరుతూ కోర్టుకెక్కారు. ప్రతిగా అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మొయిత్రా భారీగా లంచం, బహుమతులు తీసుకుంంటున్నారంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. వ్యవహారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణ దాకా వెళ్లింది. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులతో పంచుకున్నందుకు ఆమెను దోషిగా తేల్చి 2023 డిసెంబర్ 8న లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Happy Bihu 2024: అంబరాన్నంటే సంబరాలు.. (ఫోటోలు)
-
అస్సాం సీఎం పచ్చి అవకాశవాది
డిస్పూర్ : మేనిఫెస్టో భారత్లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్కు సంబంధించిన మేనిఫెస్టో అంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అస్సాం సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వకు రాజకీయబిక్ష పెట్టింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో హిమంత్ బిశ్వకు గుర్తింపు, హోదా తమ పార్టీ ఇచ్చిందని అన్నారు. జై రాం రమేష్ పీటీఐ ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన మరుక్షణం హిమంత్ బిశ్వ బీజేపీలో చేరారని అన్నారు. అస్సాం సీఎం తరుణ్ గోగోయ్ బాధ్యతలు చేపట్టినంత కాలం దాదాపూ 15ఏళ్ల పాటు హిమంత్ బిశ్వకు గుర్తింపు, సముచిత స్థానం కల్పించడంతో పాటు అధికారం ఇచ్చిందని గుర్తు చేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వారికి బాధ్యతలు అప్పగించడం చాలా బాధాకరం. పదవులు అవకాశవాదంగా మారాయి. కానీ అవి మా ఆత్మవిశ్వాసాన్ని ఛిన్నాభిన్నం చేయలేదు అని అన్నారు. అవకాశవాదులు కాంగ్రెస్ను విడిచిపెట్టడం వల్ల మంచే జరిగిందని, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన యువకులకు అవకాశం కల్పించినట్లువుతుందని జై రామ్ రమేష్ వ్యాఖ్యానించారు. -
Impact and Dialogue Foundation: పల్లవించిన రక్షణ
‘బాలికల అక్రమ రవాణా’ ఈ హెడ్డింగ్తో వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ‘అయ్యో’ అనుకుని మరో వార్తలోకి వెళ్లిపోవడం కూడా చాలా మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. మన కళ్ల ముందు ఉండే అమ్మాయిని ఎవరో అపహరించుకుని వెళ్లారని తెలిస్తే మనసంతా పిండేసినట్లవుతుంది. రోజులపాటు బాధపడతాం. కానీ ఏమీ చేయం. అక్రమాల మీద గళమెత్తలేకపోయి నప్పటికీ కనీసం నోరు తెరిచి మనకు తెలిసిన విషయాన్ని చెబితే ఆ సమాచారం దర్యాప్తుకు దోహదమవుతుందని తెలిసినా పోలీసు ముందు పెదవి విప్పడానికి భయం. కానీ, అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ అలా చూసి ఊరుకోలేదు. పన్నెండేళ్ల వయసులో ఆమె కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన ఆమెను కదిలించింది. సమాజానికి అంకితమయ్యేలా ఆమెను ప్రభావితం చేసింది. అప్పుడు పల్లవి ఘోష్కు పన్నెండేళ్లు. ఆమె నివసిస్తున్న గ్రామానికి సమీపంలో ఉన్న మరో చిన్న గ్రామానికి చెందిన బాలికను దుండగులు అపహరించుకు వెళ్లడం ఆమె కంట పడింది. పెద్దగా అరుస్తూ పెద్దవాళ్లను అప్రమత్తం చేయడం ద్వారా ఆ బాలికను రక్షించగలిగింది పల్లవి. ట్రాఫికింగ్ని స్వయంగా చూడడం ఆమెకది తొలిసారి. కానీ బాలికలు, మహిళల అక్రమ రవాణా పట్ల అస్పష్టంగానైనా కొంత అవగాహన ఉందామెకి. అక్రమ రవాణాను నిరోధించాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంది పల్లవి. వయసు పెరిగేకొద్దీ ఆమెలో ట్రాఫికింగ్ పట్ల స్పష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకుంది. ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ’ స్థాపించి బాలికలు, మహిళల కోసం పని చేయడం మొదలుపెట్టింది. వేదిక మీద ప్రసంగం చాలదు! ‘‘బాలికలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరించి చెప్పడానికి, ఆ బారిన పడకుండా కాపాడడానికి వేదికల మీద ఎన్ని ప్రసంగాలు చేసినా వాటితో అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదని కొద్దికాలంలోనే తెలిసింది. ఇలా ప్రసంగాలతో కనీసం ఆలోచననైనా రేకెత్తించగలుగుతున్నానా అనే సందేహం కూడా కలిగింది. అప్పటి నుంచి నేరుగా ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టడం మొదలుపెట్టాను. వాళ్ల ఉద్ధరణ కోసం నిజంగా చేయాల్సిన పని ఏమిటనేది అప్పుడు తెలిసింది. మహిళలు గతంలోకి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, జరగబోయి తప్పించుకున్న దురాగతాలను ఏకరువు పెట్టారు. ప్రమాదాలు ఎన్ని రకాలుగా చుట్టుముడతాయనే విషయాన్ని వారికి విడమరిచి చెప్పడంతోపాటు ప్రమాదాన్ని శంకించినప్పుడు రక్షణ కోసం ఏమి చేయాలో వివరించాను. కొన్ని ఇళ్ల నుంచి అప్పటికే మాయమైపోయిన బాలికల అన్వేషణ కోసం పోలీస్ శాఖను ఆశ్రయించాను. అలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే క్రమంలో కానిస్టేబుళ్లను భాగస్వాములను చేశాను. వారిని దగ్గరగా చూడడం, వారు చెప్పే ధైర్యవచనాలను వినడం ద్వారా బాలికలు తమకు ప్రమాదం ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసుల సహాయాన్ని కోరగలుగుతారు. ఇలా ఎన్నో ప్రయత్నాల ద్వారా అక్రమ రవాణా పట్ల బాలికల్లో చైతన్యం తీసుకువచ్చాను. అపహరణకు గురైన పదివేలకు పైగా బాలికలను తిరిగి వారి ఇళ్లకు చేర్చగలిగాను. అంతటితో సరిపోదని ఆ తర్వాత తెలిసింది. రక్షించిన బాలికలకు ఉపాధి కూడా కల్పించాలి. ఆ పని చేయలేకపోతే ట్రాఫికింగ్ మాఫియా పని పేరుతో ఆ బాలికలను తిరిగి తమ గుప్పెట్లోకి తీసుకుపోతుంది. అందుకోసం మా ఫౌండేషన్ ద్వారా వారికి పనుల్లో శిక్షణ ఇచ్చి పని కల్పించడం కూడా మొదలు పెట్టాను. పది వేలకు పైగా బాలికలను కాపాడడంతోపాటు 75 వేల మందిలో చైతన్యం తీసుకురాగలిగాను. వారి భవిష్యత్తు అంధకారంలోకి తోసేసే ముఠాల నుంచి వారికి జాగ్రత్తలు తెలియచేశాను. కానీ మాఫియా ముఠాలను కూకటి వేళ్లతో పెకలించి వేయడం అనే పనిని ప్రభుత్వాలు చేయాలి. అప్పుడే ఈ భూతం తిరిగి నిద్రలేవకుండా ఉంటుంది’’ అని వివరించింది పల్లవి ఘోష్. -
అస్సాంలో లోక్సభ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
డిస్పూర్ : ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో మూడో విడతలో పోలింగ్ జరగనున్న గౌహతితో సహా నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.దేశవ్యాప్తంగా మూడో దశకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ వెల్లడించింది. మూడో దశలో మే 7న గౌహతి, బార్పేట, ధుబ్రి, కోక్రాఝర్ (ఎస్టీ) నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 19,అదే సమయంలో దాని పరిశీలన మరుసటి రోజు జరుగుతుంది. ఏప్రిల్ 22న నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజుగా నిర్ణయించారు ఎన్నికల అధికారులు. కాగా, రాష్ట్రంలోని ప్రస్తుత లోక్సభలో బీజేపీ తొమ్మిది మంది ఎంపీలు ఉండగా, దాని మిత్రపక్షాలైన ఏజీపీ, యూపీపీఎల్లకు సభ్యులే లేరు. కాంగ్రెస్కు మూడు సీట్లు, ఏఐయూడీఎఫ్కు ఒకటి, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో: ఆ దేశానికి కరెక్ట్గా సరిపోతుందని హిమంత సెటైర్లు
దిస్పూర్:కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోఫై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్లోని ఎన్నికల కంటే పాకిస్థాన్లో ఎన్నికలకు తగినట్లు ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. శనివారం జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే.. భారత్లో ఎన్నికల కంటే పాకిస్తాన్లో ఎన్నికలు సరిపోయేటట్టు ఉంది. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలనుకోవటమే కాంగ్రెస్ స్వాభావం. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు బీజేపీ ఉద్యమాన్ని చేపట్టింది’ అని హిమంత అన్నారు. హిమంత విమర్శలపై కాంగ్రెస్ కౌంటర్... అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీ లైకిక, సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కావని కౌంటర్ ఇచ్చింది. ఇక.. హిమంత 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ‘హిమంత ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నా.. పార్టీ విలువలు అర్థం చేసుకోలేపోయారు. అందుకే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ లో ఉన్నప్పటకీ కేవలం తన నిజాయితీని చాటుకోవటం కోసమే కాంగ్రెస్పై విమర్శలు చేస్తారు’ అని అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రతా బోరా అన్నారు. మరోవైపు.. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్లాండ్ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. ఇక.. అస్సాంలో మూడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. -
Lok sabha elections 2024: కజిరంగాలో సీట్ల వేట!
అసోం పేరు చెప్పగానే ఖడ్గమృగాలు, బెంగాల్ టైగర్స్, ఏనుగు సఫారీలతో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ కళ్లముందు కదలాడుతుంది. బ్రహ్మపుత్ర నది పరవళ్లతో పాటు తేయాకు తోటలకు కూడా ప్రసిద్ధి. ఈశాన్య భారత్కు గేట్వేగా నిలుస్తున్న ఈ రాష్ట్రంలో దశాబ్దకాలంగా సమూల రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్, అసోం గణ పరిషత్ (ఏజీపీ) కంచుకోటగా ఉన్న అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో ఇప్పుడు కాషాయజెండా రెపరెపలాడుతోంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్.. మూడు దేశాలతో సరిహద్దు పంచుకోవడం వల్ల కూడా అసోం దేశ రాజకీయాల్లో కీలకంగా నిలుస్తోంది. ‘సెవెన్ సిస్టర్స్’లో పెద్ద తోబుట్టువుగా.. 14 లోక్సభ నియోజకవర్గాలు ఉండటంతో సార్వత్రిక సమరంలో పార్టిలన్నీ సీట్ల వేటకు సై అంటున్నాయి. గతేడాది కేంద్ర ఎన్నికల సంఘం అసోంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను పూర్తిచేసిన నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత సీట్ల స్వరూపం స్వల్పంగా మారింది. కొలియాబార్ నియోజకవర్గానికి బదులు కొత్తగా కజిరంగా నియోజకవర్గం వచ్చి చేరింది. అలాగే, 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 స్థానాల పేర్లు మారాయి. 2009 నుంచి కమలనాథులు ఈశాన్యానికి విస్తరణ బాట పట్టారు. 2014లో అత్యధికంగా 7 సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2019లో బలాన్ని మరింత పెంచుకుని 9 సీట్లు కొల్లగొట్టింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ 3 చోట్ల, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఒక స్థానంలో పోటీ చేయగా, వాటికి ఒక్క సీటు కూడా రాలేదు. మరోపక్క, కాంగ్రెస్ ఒంటరి పోరు చేసి 3 చోట్ల విజయం సాధించింది. 2014లోనూ మూడే సీట్లు దక్కాయి. ఇక రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టిగా నిలుస్తున్న ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) 3 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట విజేతగా నిలిచింది. 2014లో గెలిచిన 3 సీట్లలో రెండు కోల్పోయింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో, 2 సీట్లను ఎస్టీలకు, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. బీజేపీ పాగా... ఉత్తరాదిన గట్టి పట్టున్న కమలనాథులు ఈశాన్యంలో ఎలాగైనా పాగా వేయాలని 2009 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టిగా ఉన్న ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్ను 2011లో పార్టిలో చేర్చుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. 2014లో సోనోవాల్ సారథ్యంలో అసోం లోక్సభ ఎన్నికలను ఎదుర్కొన్న కమలనాథులు బంపర్ ఫలితాలను సాధించారు. బీజేపీకి ఏకంగా 7 సీట్లు (2009లో 2 సీట్లే) లభించాయి. రాష్ట్రంలో అధికార పార్టిగా ఉన్న కాంగ్రెస్ బలం 7 సీట్ల నుంచి 3 స్థానాలకు పడిపోయింది. మియా బెంగాలీ ముస్లింలకు దన్నుగా నిలుస్తున్న ఏఐయూడీఎఫ్ 2 స్థానాలను మెరుగుపరుచుకుని 3 చోట్ల విజేతగా నిలిచింది. ఇక, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ దన్నుతో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 126 అసెంబ్లీ సీట్లకు గాను 86 స్థానాలను ఖాతాలో వేసుకుంది. సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి బీజీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అసోంలో పాగా వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఎన్డీఏ 9 సీట్లను దక్కించుకుంది. ఇవన్నీ కూడా బీజేపీకే రావడం గమనార్హం. భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటూ రాలేదు. ఈ ఘన విజయం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ బరిలోకి దిగింది. కాంగ్రెస్ కూటమి భారీగా పుంజుకున్నప్పటికీ, మళ్లీ ఎన్డీఏ మెజారిటీ దక్కించుకుంది. అయితే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన హిమంత బిశ్వ శర్మకు కమలనాథులు సీఎం పగ్గాలు అప్పగించి, సోనోవాల్ను మళ్లీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాగా, మోదీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాలపై భారీగా వెచి్చంచింది. దీన్నే ఇప్పుడు అక్కడ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటోంది. మరోపక్క, ఇటీవల అమల్లోకి తెచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. పట్టుకోసం కాంగ్రెస్ ప్రయత్నం... రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ దశాబ్దకాలంగా తీవ్రంగా దెబ్బతింది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత తరుణ్ గొగోయ్పై అసమ్మతి, హిమంత బిశ్వ శర్మ వంటి నేతలు పార్టీని వీడటంతో కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అయితే, 2019లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు లభించిన ఓట్లలో తేడా 0.61 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2021 ఎన్నికల్లో తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ సారథ్యంలో బరిలోకి దిగిన హస్తం పార్టీ భారీగా పుంజుకుంది. అంతక్రితం ఎన్నికలతో పోలిస్తే 24 సీట్లు మెరుగుపరుచుకుని 50 స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. కాగా, అతిచిన్న వయస్సులో అసోం సీఎం పగ్గాలు చేపట్టిన ప్రఫుల్ల కుమార్ మహంతి (ఏజీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు) వంటి నేతలు ఎన్డీఏతో జట్టుకట్టడం కూడా కాంగ్రెస్పై ప్రభావం చూపుతోంది. అయితే, ఈసారి ఇండియా కూటమితో బీజేపీని ఢీకొట్టడం ద్వారా మెజారిటీ స్థానాలను చేజక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది హస్తం పార్టీ. కాగా, సీఏఏ అంశంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అసోం ప్రభుత్వంపై, మోదీ సర్కారు హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఎక్కుపెట్టారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మారణహోమానికి బీజేపీయే కారణమని కూడా ఇండియా కూటమి ప్రచారంలో హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ వల‘సలసల‘... ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల పార్టీ ఫిరాయింపులు, వలసలు కూడా జోరందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. లఖీంపూర్ లోక్సభ సీటును తన భార్యకు ఇవ్వకపోవడమే దీనికి కారణం. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రానా గోస్వామి కూడా బీజేపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్ ప్రసాద్ రాయ్, రతుల్ కురి్మ, కమలాఖ్య డే, బసంత దాస్ తదితర నాయకులు సైతం కాంగ్రెస్ నుంచి వలసబాట పట్టడం పార్టీని కలవరపెడుతోంది. కాగా, రాహుల్ గాంధీ అసోంలో ప్రచారానికి రావాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హిమంత బిశ్వ శర్మ సిల్చార్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. అసలు రాహుల్కు ప్రధాని మోదీతో పోటీ ఏంటని కూడా ఎద్దేవా చేశారు. రాహుల్ ప్రచారానికొస్తే బీజేపీకే లాభమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. మరోపక్క, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ హిమంత బాంబు పేల్చారు. అయితే, దీన్ని బోరా ఖండించడమే కాకుండా, రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయడం విశేషం. గొగోయ్ వర్సెస్ గొగోయ్ జోర్హాట్ లోక్సభ నియోజకవర్గంలో ఇద్దరు గొగోయ్లు తలపడుతున్నారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న గౌరవ్ గొగోయ్... సిట్టింగ్ బీజేపీ ఎంపీ, తపన్ కుమార్ గొగోయ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గౌరవ్ కలియాబోర్ నుంచి ఎంపీగా గెలిచారు. కాగా, తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ను మట్టి కరిపిస్తానని తపన్ గొగోయ్ సవాలు విసిరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నికల్లో బూచిగా చూపిస్తున్న ప్రతిపక్షాలను ఓటర్లు పట్టించుకోవడం లేదన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న గౌరవ్ గొగోయ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న వారంతా ఓట్లేస్తే తపన్ ఖచి్చతంగా ఓడిపోతారని అంటున్నారు. గౌరవ్ తండ్రి, అసోం సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన తరుణ్ గొగోయ్కు జోర్హాట్ నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. జోర్హాట్ ఓటర్లతో ఈ అనుబంధాన్ని గుర్తు చేయడంతో పాటు యువ ఓటర్లపై గౌరవ్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ 11 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఏజీపీకి 2 సీట్లు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు 1 సీటు ఇచ్చింది. ఇటీవల వెలువడిన పలు సర్వేలు ఎన్డీఏ 12 సీట్లను (బీజేపీ 10, ఏజీపీ 1, యూపీపీఎల్ 1) దక్కించుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్లకు చెరొక స్థానం రావచ్చని అంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నోట్ల కట్టలపై యుపీపీఎల్ నేత - ఫోటో వైరల్
అస్సాం: ఒక వైపు ఎలక్షన్ కోడ్.. మరో వైపు ప్రచార హోరు సాగుతున్న సమయంలో అస్సాం రాష్ట్రానికి చెందిన యూపీపీఎల్ నేత కరెన్సీ నోట్ల కట్టల మీద పడుకున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో వివాదానికి దారితీసింది. నోట్ల కట్టల మీద పడుకున్న వ్యక్తి 'బెంజమిన్ బాసుమతరీ'. ఇతడు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) పార్టీకి చెందిన విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ (VCDC) సభ్యుడని తెలుస్తోంది. క్రమశిక్షణా రహిత చర్యలకు పాల్పడటం వల్ల అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు యుపీపీఎల్ చీఫ్ ప్రమోద్ బోరో పేర్కొన్నారు. వైరల్గా మారిన ఫోటో ఐదేళ్ల నాటిది. రాజకీయ కుట్రతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ చేశారు. ఎవరు చేశారనేది తెలియదు, తప్పకుండా తెలుసుకుంటామని బెంజమిన్ బాసుమతరీ సన్నిహితులు పేర్కొన్నారు. బెంజమిన్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం మాత్రమే కాకుండా.. విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ (వీసీడీసీ) చైర్మన్ పదవి నుంచి కూడా కోల్పోయారు. అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ చాలా దిగజారింది. కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారాయి. ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని యుపీపీఎల్ చీప్ కోరారు. అస్సాంలో కాంగ్రెస్ ఈసారి జీరో అవుతుంది. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. In it's penchant to spread lies and fake news, Congress has stooped so low that they have become a fake news factory and will malign anyone. They will not even spare our nation in its quest to defame it. The people will not be misled by their fake news & false promises and will… pic.twitter.com/yQMK8I4YgZ — Pramod Boro (@PramodBoroBTR) March 27, 2024 -
‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’
దిస్పూర్, సాక్షి : లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఎలా ఉంటుంది. అచ్చం ఇక్కడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది. అస్సాం దిబ్రూఘర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా లూరింజ్యోతి గొగోయ్ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అస్సాం దిబ్రూఘర్ జిల్లా హల్దీబారి నగర్ థాన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖోవాంగ్లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఇరువురు నేతలు ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు చిందించారు. ‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’ రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి హద్దుల్లోనే ఉన్నాయనే సంకేతాలిచ్చారు ఇరు పార్టీల లోక్సభ అభ్యర్థులు. నిత్యం నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయ నాయకులు కాస్త ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్తే అన్నా అంటే.. బాగున్నావా తమ్మీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకుంటూ క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని టీ తాగుకుంటూ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందంటూ మాట్లాడుకోవడం ఎన్నికల సిత్రాలు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి. విద్యార్ధి సంఘానికి అధ్యక్షులుగా బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్లు సీనియర్, జూనియర్. వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యూ) అధ్యక్షులుగా పనిచేశారు. సోనావాల్ మా సీనియరే ‘ఈ సందర్భంగా లూరింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ.. మేం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రత్యర్ధులమే అయినా మేం విద్యార్ధి సంఘంలో కలిసి పనిచేశాం. అతను (సోనావాల్ని ఉద్దేశిస్తూ) మా సీనియర్ అంటూ సంభాషించారు. కాగా, డిబ్రూగఢ్ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. -
ఐసిస్తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్
గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ బయోసైన్స్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ టాస్్కఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్లో చేరేందుకు వెళ్తుండగా కామ్రూప్ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచి్చన ఐసిస్ భారత్ చీఫ్ హారిస్ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రేహాన్లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఐజీ వివరించారు. అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సీఎం చెప్పారు. -
పంజాబ్, అస్సాం జిల్లాల పోలీసు చీఫ్ల బదిలీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్(ఈసీ)మరికొందరు అధికారులకు స్థానచలనం కల్పించింది. తాజాగా అస్సాం, పంజాబ్ల్లోని జిల్లా పోలీసు చీఫ్లను బదిలీ చేసింది. పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమబెంగాల్లలో పనిచేసే అయిదుగురు నాన్ కేడర్ జిల్లా మేజిస్ట్రేట్లు(డీఎంలు), 8 మంది పోలీస్ సూపరింటెండెంట్ల(ఎస్పీలు)ను సైతం బదిలీ చేసింది. జిల్లా స్థాయిలో ప్రధానమైన పోస్టుల్లో ఐఏఎస్, ఐపీఎస్లు కాని నాన్–క్యాడర్ అధికారులను నియమించడంపై ఈసీ కఠినమైన వైఖరిని తీసుకుంది. -
కాంగ్రెస్లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
లోక్సభ ఎన్నికలు జరగటానికి ముందే అస్సాంలో బీజేపీ మైనారిటీ అగ్రనేత రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్లో చేరారు. అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అల్వార్ సమక్షంలో 'అమీనుల్ హక్ లస్కర్' పార్టీలో చేరారు. 'అమీనుల్ హక్ లస్కర్' 2016లో అస్సాం బీజేపీకి తొలి మైనారిటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన లస్కర్.. అస్సాం స్టేట్ కమిషన్ ఫర్ మైనారిటీకి చైర్పర్సన్గా కూడా విధులు నిర్వహించారు. 2021లో అతను ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) కరీం ఉద్దీన్ బర్భూయా చేతిలో ఓడిపోయాడు. అస్సాంలో బీజేపీ తన రాజకీయ భావజాలాన్ని కోల్పోయినందున అమీనుల్ హక్ లస్కర్ పేర్కొన్నారు. ఈ కారణంగానే తానూ పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. 13 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉన్నాను. అప్పటి బీజేపీకి.. ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉందని లస్కర్ అన్నారు. తాను పార్టీకి రాజీనామా చేయడం.. మైనారిటీ కమ్యూనిటీలో అధికార పార్టీకున్న విశ్వసనీయతను ప్రభావితం చేస్తుందని అమీనుల్ హక్ లస్కర్ అన్నార్తు. బీజేపీ సిద్ధాంతం బద్రుద్దీన్ అజ్మల్ ఏఐయూడీఎఫ్ మాదిరిగా మారిందని అన్నారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆ ప్రాంతం ముస్లిం సమాజానికి చెందినవాడిని నేనిక్కడే అని పేర్కొన్నారు. నేను పార్టీని విడిచిపెట్టడం వల్ల ముస్లిం జనాభాలో బీజేపీ మీద ఉన్న విశ్వాసం తగ్గుతుందని అన్నారు. బీజేపీ ఇప్పుడు అస్సాంలో ఎఐయుడిఎఫ్తో చేతులు కలిపిందని ఆయన అన్నారు. -
భారీ ఆపరేషన్.. ఐసిస్ ఇండియా చీఫ్, సహాయకుడు అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు ఐసిస్కు చెందిన మరో వ్యక్తి(సహాయకుడు)ని అదుపులోకి తిసుకున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం వెల్లడించింది. ఎన్ఐఏ జాబితా మోస్ వాంటెడ్గా ఉన్న హరీస్ ఫారూఖీ బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని ధుబ్రీలో ప్రవేశించి విధ్వంస కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఎస్టీఎఫ్ టీంకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ టీం చేపట్టిన భారీ ఆరేషన్లో హరీస్ ఫారూఖీ పట్టుబడ్డారు. బంగ్లాదేశ్లో ఉంటూ భారత్లోని అస్సాం ధుబ్రీ ప్రాంతంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలని ప్రణాళిక వేస్తున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించారు. హరీష్ ఫారూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫారూఖీ భారత ఐసిస్ చీఫ్గా ఉన్నారు. అయనతో పాటు మరో వ్యక్తి రెహ్మన్ను భారీ ఆపరేషన్ చేపట్టి ఆరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మా బృందానికి నమ్మదగిన సమాచారం అందింది. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నరని మేం కూడా నిర్ధారించుకున్నాం. వారు సరిహద్దును దాటే సమయంలో మా టీం ఉదయం వారిని పట్టుకొని అరెస్ట్ చేసింది’ అని స్పెష్ల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా తెలిపారు. ఐసిస్ విస్తరణలో భాగంగా.. భారత్లో నియామకాలు చేపట్టడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, ఐసిస్ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని ఐజీ పార్థసారధి వెల్లడించారు. ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో హరీష్ ఫారూఖ్ మీద పలు ఎన్ఐఏ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకోవటం కోసం అరెస్ట్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏకు అప్పగించినట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. చదవండి: బీజేపీతో పొత్తు: లోక్సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే? -
లోక్సభ ఎన్నికలపై అస్సాం సీఎం కీలకవ్యాఖ్యలు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 లోక్సభ స్థానాల్లో 13 స్థానాలను భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు గెలుచుకుంటాయి. ఈ విషయాన్ని గౌహతిలోని లోక్ సేవా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి 'హిమంత బిస్వా శర్మ' ప్రకటించారు. కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ సారి తప్పకుండా 13 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందని హిమంత బిస్వా అన్నారు. అంతే కాకుండా డిబ్రూగఢ్ (Dibrugarh)లో సర్బానంద సోనోవాల్ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. అయితే ధుబ్రి (Dhubri) సీటును గెలవలేమని ప్రస్తావించారు. అస్సాంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూసి చాలా సంతోషించాను. ఈ ఏట కాంగ్రెస్ పరాభవం తప్పదని.. మొత్తం ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క లోక్సభ సీటును కూడా గెలుచుకోలేకపోవచ్చని అస్సాం డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ అన్నారు. అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ (AGP) బార్పేట, ధుబ్రీ స్థానాల్లో, యూపీపీఎల్ కోక్రాఝర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే జోర్హాట్లో గౌరవ్ గొగోయ్, నాగావ్లో ప్రద్యుత్ బోరోడోలోయ్, గౌహతిలో మీరా బర్తకూర్ గోస్వామి, ధుబ్రిలో రకీబుల్ హుస్సేన్, దీపూలో జైరామ్ ఇంగ్లెంగ్ సహా అస్సాంలోని 12 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్ పవర్గా ఇండియా
గాందీనగర్: సెమీ కండక్టర్ల రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్ గ్లోబల్ పవర్గా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇండియాలో రూ.1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ బుధవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు గుజరాత్లో, ఒకటి అస్సాంలో రాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని పట్టించుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్పై మండిపడ్డారు. అభివృద్ధి పట్ల అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. దేశ శక్తి సామర్థ్యాలను, ప్రాధాన్యతలను, భవిష్యత్తు అవసరాలను గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆక్షేపించారు. మన దే శాన్ని సెమీ కండక్టర్ల తయారీ హబ్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. దేశీయంగా చిప్ల తయారీతో యువతకు ఎన్నెన్నో ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ రంగం దోహదపడుతుందని వివరించారు. సెమీ కండక్టర్ మిషన్ను రెండేళ్ల క్రితం ప్రకటించామని, తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈరోజు మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని వ్యాఖ్యానించారు. అనుకున్నది సాధించే శక్తి భారత్కు, ప్రజాస్వామ్యానికి ఉందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం–సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. దళిత, గిరిజన వర్గాలకు చెందిన రామ్నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్మును తాము రాష్ట్రపతులను చేశామని అన్నారు. అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్, రోజ్గార్ ఆధారిత్ జన్కల్యాణ్(పీఎం–సూరజ్) నేషనల్ పోర్టల్ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడిన తరగతులతోపాటు పారిశుధ్య కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లు.. శంకుస్థాపన చేయనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ‘ఇండియాస్ టేకేడ్ : చిప్స్ ఫర్ విక్షిత్ భారత్’లో భాగంగా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ‘సెమీ కండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధితో భారత్ను గ్లోబల్హబ్గా నిలబెట్టడం, దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ భారీ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టారు. రెండు గుజరాత్, ఒకటి అస్సాంలో ప్రధాని శంకుస్థాపన చేయనున్న సెమీ కండక్టర్ ప్రాజెక్ట్లు గుజరాత్లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (డీఎస్ఐఆర్)లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం, గుజరాత్లోని సనంద్లో అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ ,టెస్ట్ ఏర్పాటు చేయనుంది. అస్సాంలోని మోరిగావ్లో అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ యూనిట్లను నెలకొల్పనుంది. India is set to become a prominent semiconductor manufacturing hub. The three facilities will drive economic growth and foster innovation.https://t.co/4c9zV3G9HL — Narendra Modi (@narendramodi) March 13, 2024 100 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ జిల్లా ధొలేరా ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంల స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా తీర్చిదిద్దేలా నడుంభింగింది. ఈ 100 ఎకరాల్లో ఆయా సంస్థ సెమీ కండర్టర్ యూనిట్లను ఏర్పాటు చేయొచ్చు. తద్వారా యువతకు విస్త్రృత ఉపాధి అవకాశాలు, ఎకనమిక్ గ్రోత్ సాధించొచ్చుని కేంద్రం భావిస్తోంది. రూ91వేల కోట్లతో టాటా ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ ప్రాంతంలో దేశంలోనే తొలి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) సెంటర్ను ఏర్పాటు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) సిద్ధమైంది. రూ.91వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.ఈ సౌకర్యాలు సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారత్ సైతం సెమీ కండర్టర్ విభాగంలో రాణించడమే కాదు..వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయి.ఎలక్ట్రానిక్స్, టెలికాం మొదలైన సంబంధిత రంగాలలో ఉపాధి కలగనుంది. -
‘అలా జరిగితే.. నేను రాజీనామా చేస్తాను’.. అస్సాం సీఎం హిమంత
దిస్పూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తూ విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను అమలు చేస్తూ మళ్లీ తెరపైకి తీసుకురావటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా సీఏఏ అమలుపై వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) జాబితాలో నమోదు చేసుకోనివారికి ఒక్కరికైనా కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ కింద పౌరసత్వం కల్పిస్తే.. తన సీఎం పదవి రాజీనామ చేస్తామని తెలిపారు. ‘నేను అస్సాం పుత్రుడను. ఒక్క వ్యక్తి అయినా ఎన్ఆర్సీలో నమోదు కాకుండా సీఏఏ ద్వారా పౌరసత్వం పొందితే మొదట నేనే నా పదవికి రాజీనామా చేస్తా. సీఏఏ అనేది కొత్త చట్టం కాదు. గతంలో కూడా ఇలాంటి చట్టం ఉంది. పారదర్శంగా ప్రజలు నమోదు చేసుకునేందుకు పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ప్రజలు విధుల్లో నిరసన తెలపటంలో అర్థం లేదు. ఈ చట్టం సరైందో? కాదో? అని విషయాన్ని.. సమాచారంతో కూడిన పోర్టల్ తెలియజేస్తుంది’ అని శివసాగరల్లోని ఓ కార్యక్రమంలో సీఎం హిమంత అన్నారు. సీఏఏ అమలుపై నిరసన తెలుపుతున్న పలు సంఘాలపై పోలీసుల నోటీసులు పంపారు. అయినప్పటికీ నిరసనలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 16 పార్టీల యునైటెట్ అపోజిషన్ పోరం అస్సాం( యూఓఎఫ్ఏ) సీఏఏ అమలుపై నిరసన చేపడతామని ప్రకటన విడదల చేసిన విషయం తెలిసిందే. -
‘సీఏఏ’పై నిరసనలు.. అస్సాం పోలీసుల సీరియస్ వార్నింగ్
గువహతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం(మార్చ్11) నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏ చట్టంపై బంద్కు పిలుపిచ్చిన అస్సాం ప్రతిపక్ష పార్టీలకు ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఏఏ చట్టం రూల్స్ నోటిఫై చేసిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచే అస్సాంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళనలకు దిగాయి. రాజధాని గువహతితో పాటు చాలా ప్రాంతాల్లో సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు కాల్చివేశారు. చట్టం అమలు చేయడానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో పోలీసులు ఈ ఆందోళలపై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగే సర్బత్మక్ బంద్లో భాగంగా ఎవరైనా ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పౌరులను గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టాన్ని వారి నుంచే పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో పోలీసులు ఒక పోస్ట్ చేశారు. ఆదివారమే ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర హెచ్చరిక చేశారు. Guwahati police gave a legal notice to the Political parties who have called for a 'Sarbatmak Hartal' in Assam to protest against the CAA. "Any damage to public/ private property including Railway and National Highway properties or injury to any citizen caused due to 'Sarbatmak… pic.twitter.com/vnO6uin76t — ANI (@ANI) March 12, 2024 సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయ్యే చాన్స్ ఉందని సీఎం బిశ్వశర్మ హెచ్చరించారు. ఎవరికైనా చట్టం పట్ల అభ్యంతరాలుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కాగా, 2019 డిసెంబర్లో సీఏఏపై అస్సాంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఈ చట్టం అమలు చేస్తే బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా వలసలు ఉంటాయని పలు పార్టీలు, గ్రూపులు భావిస్తున్నాయి. ఇదే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇదీ చదవండి.. ఆ స్టేట్స్లో సీఏఏ చట్టం ఉండదు -
కజిరంగా నేషనల్ పార్కులో మోదీ విహారం
జోర్హాట్: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు. ఎలిఫెంట్ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. -
కజిరంగ నేషనల్ పార్క్ న్ను సందర్శించిన ప్రధాని మోదీ
-
PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ ప్రారంభించిన మోదీ
ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులను తాను పదేళ్లలో చేసిచూపించినట్టు మోదీ కామెంట్స్ చేశారు. కాగా, టన్నెల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఘన విజయం సాధించనుందని అర్థం అవుతోంది. ఎన్నికల్లో విజయం కోసం నేను పనిచేయను. ప్రజల కోసమే పనిచేస్తాను. యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi inaugurates the Sela Tunnel. pic.twitter.com/hSeI30lhqk — ANI (@ANI) March 9, 2024 70 ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని నేను పదేళ్లలోనే చేసి చూపించాను. అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, "Our vision is that of 'Ashta Lakshmi' for the development of the Northeast. Our Northeast is becoming a strong link for trade and tourism with South Asia and East Asia." pic.twitter.com/c1PyO37H7M — ANI (@ANI) March 9, 2024 కాగా, అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్ పార్క్లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు. #WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, You must have heard of 'Modi Ki Guarantee'. You will realize its meaning once you reach Arunachal. The entire Northeast is a witness to this. I laid the foundation of the Sela Tunnel here in 2019, and today… pic.twitter.com/tqjnNd2fh6 — ANI (@ANI) March 9, 2024 ఈ టన్నెల్ విశేషాలు ఇవే.. సేలా టన్నెల్ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది. -
కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
నేడు భారీ సొరంగాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం 13 వేల అడుగుల ఎత్తులో నిర్మితమయ్యింది. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. భారత్ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం. దీనితో పాటు ఇటానగర్లో 20కి పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తేజ్పూర్ చేరుకున్న ప్రధానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కజిరంగా నేషనల్ పార్క్కు ప్రధాని చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి అనంతరం (ఈరోజు)శనివారం ఉదయం కజిరంగా అభయారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని ఇటానగర్కు వెళతారు. ప్రముఖ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని శనివారం హోలోంగథర్లో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీనికి 'శౌర్య విగ్రహం' అని పేరు పెట్టారు. జోర్హాట్లోని మెలాంగ్ మెటెల్లి పొతార్లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అసోంలో రూ. 768 కోట్ల వ్యయంతో డిగ్బోయ్ రిఫైనరీ విస్తరణ కోసం గౌహతిలో ఐఓసీఎల్కు చెందిన బెత్కుచి టెర్మినల్ను ప్రధాని ప్రారంభించనున్నారు. -
‘అధికారంలోకి వస్తే ఆ పౌరసత్వ చట్టం రద్దు’
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ, "1971 కటాఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది. కానీ సీఏఏ దాన్ని తొలగిస్తుంది. 2014 కొత్త కట్-ఆఫ్ తేదీ అవుతుంది. ఇది అస్సాం ఆందోళనలో అమరవీరుల త్యాగాలను అగౌరవపరుస్తుంది " అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్చి 25, 1971 నాటి కటాఫ్ తేదీని ఆయన ప్రస్తావించారు. పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ కనీసం ఐదేళ్లు నివాసం ఉన్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వాన్ని అందిస్తుంది. ఇటీవల అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ పొరుగున ఉన్న మణిపూర్ను సందర్శించలేదని పవన్ ఖేరా విమర్శించారు. "మణిపూర్ను సందర్శించడానికి ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు? దయచేసి మణిపూర్ను సందర్శించండి, అది కూడా మన దేశంలో భాగమే. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం అరగంటైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరుతున్నాం" అన్నారాయన. ఇక లోక్సభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ఖేరా పేర్కొన్నారు. "కాంగ్రెస్ సర్వే ప్రకారం మేము ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తున్నాం. అస్సాం రికార్డులను బద్దలు కొడుతుంది. మా విజయం ఖాయం. అందుకే హిమంత బిస్వా శర్మ ప్రధానమంత్రిని క్రమం తప్పకుండా రాష్ట్రాన్ని సందర్శించాలని పిలుస్తున్నారు" అని ఖేరా పేర్కొన్నారు. -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
రాహుల్కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
‘ఇండియా’కు మరో షాక్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్ అన్నారు. ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. కాంగ్రెస్ బ్లాక్పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని -
‘వారు వేసే బిస్కెట్ తినకుండా రాజీనామా చేశా’
న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్శ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రస్తుతం జార్ఖండ్లో కొనసాగుతోంది. అక్కడ చోటుచేసుకున్న ఓ సంఘటనపై హిమంత ఎద్దేవా చేశారు. రాహుల్ చేట్టిన యాత్రలో భాగంగా ఒక కాంగ్రెస్ కార్యకర్త తన పెంపుడు కుక్కను తీసుకువచ్చారు. ర్యాలీ చేస్తున్న వాహనంపైకి తీసుకెవెళ్లగా.. రాహుల్ గాంధీ దానికి బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ పెంపుడు కుక్క రాహుల్ గాంధీ పెట్టిన బిస్కెట్ తినకుండా తిరస్కరించింది. దీంతో ఆయన కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్ను కాంగ్రెస్ కార్యకర్తకు అందించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A brief pause for a paw-some furry friend. 🐾#BharatJodoNyayYatra pic.twitter.com/ccysNDVIHr — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) February 4, 2024 ‘గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుక్కలతో పోల్చుతారు. ఇప్పుడేమే కుక్క తినకుండా నిరాకరించిన బిస్కెట్ను రాహుల్ గాంధీ కార్యకర్తలు ఇచ్చారు. వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లకు ఇచ్చే గౌరవం ఇదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. How shameless First, Rahul Gandhi made @himantabiswa ji eat biscuits 🍪 from same plate as his pet dog 🐕 Pidi Then Congress President Khargeji compares party workers to dogs 🐕 & now, Shehzada gives a biscuit 🍪 rejected by a dog 🐕 to a party worker This is the RESPECT… pic.twitter.com/hXZGwGa2Ks — PallaviCT (@pallavict) February 5, 2024 దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్వ స్పందించారు. ‘రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆ కుటుంబం.. వాళ్లు వేసే బిస్కెట్ను నేను తినేలా చేయలేకపోయారు. నేను గర్వించదగిన అస్సామీని, భారతీయుడిని. నేను ఆ బిస్కెట్ తినడానికి నిరాకరించాను. అందుకే కాంగ్రెస్కు రాజీనామా చేశాను’ అని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా తెలిపారు. Pallavi ji, not only Rahul Gandhi but the entire family could not make me eat that biscuit. I am a proud Assamese and Indian . I refused to eat and resign from the Congress. https://t.co/ywumO3iuBr — Himanta Biswa Sarma (@himantabiswa) February 5, 2024 ఇక.. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కవలడానికి వారి నివాసానికి వెళ్లితే.. రాహుల్ తన పెంపుడు కుక్క బిస్కెట్లు తినే ప్లేట్లోనే కాంగ్రెస్ నేతలకు బిస్కెట్లు ఇచ్చేవారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ కుక్క తినకుండా తిరస్కరించిన బిస్కెట్ను కుక్క యజమాని అయిన కాంగ్రెస్ కార్యకర్తకు ఇస్తే దాన్ని ఆ యజమాని కుక్కకు తినిపించినట్లు మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయటం గమనార్హం. -
టెంపుల్స్ చుట్టూ తిరుగుతున్న తమన్నా
-
శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా అసోం జట్టుపై బెంగాల్ ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని.. ఏకంగా ఇన్నింగ్స్ 162 పరుగుల తేడాతో రియాన్ పరాగ్ సేనను మట్టికరిపించింది. గువాహటి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన అసోం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ 405 పరుగులకు ఆలౌట్ అయింది. అనుస్తుప్ మజుందార్(125), కెప్టెన్, బెంగాల్ క్రీడా శాఖా మంత్రి మనోజ్ తివారి(100) శతకాలకు తోడు.. లోయర్ ఆర్డర్లో కరణ్ లాల్(52), సూరజ్ సింధు జైస్వాల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో ఈ మేరకు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అసోం.. బెంగాల్ బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే చాపచుట్టేసింది. దినేశ్ దాస్(50), సాహిల్ జైన్(40) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 5 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ ఆబ్సెంట్ హర్ట్(0)గా వెనుదిరిగాడు. బెంగాల్ బౌలర్లలో పేసర్ మహ్మద్ కైఫ్(మహ్మద్ షమీ తమ్ముడు) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సూరజ్ సింధు జైస్వాల్ మూడు, అంకిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ అసోంను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ అయి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈసారి సూరజ్ సింధు జైస్వాల్ 5 వికెట్లతో చెలరేగగా... అంకిత్, కరణ్ లాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈసారీ రియాన్ ఆబ్సెంట్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక ఆదివారమే ముగిసిన ఈ మ్యాచ్లో బ్యాట్, బాల్తో అదరగొట్టిన సూరజ్ సింధు జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్.. తన అన్నలాగే సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్కు కాకుండా బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన అతడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో తనదైన ముద్ర వేయడం విశేషం. చదవండి: శివమ్ దూబే మెరుపు శతకం -
అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో రాహుల్పై నమోదైన క్రిమినల్ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ట్విటర్ ద్వారా తెలిపారు. సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా మంగళవారం మేఘాలయా నుంచి అస్సాం గువాహటిలోకి రాహుల్ ప్రవేశించగా.. సిటీలోకి ఆయన యాత్రకు అనుమతి లేదని అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను దాటి దూసుకురావడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు.. హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గువాహటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్ను లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత హెచ్చరించారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇస్తూ బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాహుల్ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోనళ వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకేంద్రహోంమంత్రి అమిత్షాకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్
బార్పేట(అస్సాం): అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. నాగాలాండ్ నుంచి అస్సాంలోని గువాహటిలోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నపుడు జరిగిన ఘర్షణలకు రాహుల్ కారకుడంటూ హిమంత సర్కార్ కేసులు పెట్టడం తెల్సిందే. అస్సాంలో ఏడురోజుల యాత్ర బర్పెటా జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన తొలి బహిరంగ సభలో సీఎంపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కేసులు పెట్టి నన్ను బయపెట్టొచ్చన్న ఐడియా హిమంతకు ఎందుకు వచి్చందో నాకైతే తెలీదు. మీరు(హిమంత, పోలీసులు) ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. మరో పాతిక తప్పుడు కేసులు బనాయించండి. నేను అస్సలు భయపడను. బీజేపీ–ఆర్ఎస్ఎస్ నన్ను భయపెట్టలేవు’’ అని అన్నారు. హిమంతను అతిపెద్ద అవినీతి సీఎంగా అభివరి్ణంచారు. ‘‘ మీరు ఆయనతో మాట్లాడుతుంటే ఆలోపు మీ భూమి కొట్టేస్తారు. మీరు వక్కపలుకులు నమిలినంత తేలిగ్గా ఆయన సుపారీ బిజినెస్ కానచ్చేస్తారు. మీ జేబులో డబ్బు నొక్కేస్తారు. ఏకంగా కజిరంగా నేషనల్ పార్క్ స్థలాలనే సీఎం ఆక్రమించారు. సీఎంతో జాగ్రత్త’ అని జనాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలయ్యాక లోపలేస్తాం: సీఎం మంగళవారం నాటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్ను లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత చెప్పారు. -
రాహుల్ గాంధీ అరెస్ట్ ఖాయం: అస్సాం సీఎం
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం(అసోం)లో రాజకీయ వేడిని పెంచుతోంది. రాహుల్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా మారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయమని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం సిబ్సాగర్ జిల్లాలోని నజిరా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని సీఎం హిమంత చెప్పారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయని అన్నారు. మంగళవారం మేఘాలయా నుంచి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
Manipur: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి జవాన్ ఆత్మహత్య
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మణిపూర్లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: రాహుల్ భద్రతపై అమిత్షాకు ఖర్గే లేఖ -
Assam Clash: సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ
గువాహటి: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర దూకుడుతో.. అస్సాం(అసోం) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఈ క్రమంలో మరోమారు సంచలన ఆరోపణలే చేశారాయన. అసోంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కీలక నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు హిమంత శర్మ అని బుధవారం ఉదయం రాహుల్ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. అంతేకాదు అమిత్ షా గుప్పిట్లో శర్మ ఉండిపోయారని.. షానే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్కు ప్రమాదం పొంచి ఉంది.. షాకు ఖర్గే లేఖ బుధవారం ఉదయం బారాపేటలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్నే నేను అన్నట్లు ఆయనకు మీరు(మీడియాను ఉద్దేశించి..) తెలియజేయండి. అసోం ముఖ్యమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్నారు. షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే జోడో న్యాయ్ యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారాయన. -
రాహుల్ భద్రతపై అమిత్షాకు ఖర్గే లేఖ
అస్సాం ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న తాజా వివాదం నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. గువాహటిలో రాష్ట్ర పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్ ఎదుర్కొన్న భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు భద్రతా విషయంపై అమిత్ షా జోక్యం చేసుకోవాలనికోరారు. అస్సాంలో మంగళవారం చోటు చేసుకున్న పలు ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం జరిగింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు రాహుల్ , కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Shri @RahulGandhi and the #BharatJodoNyayYatra has faced serious security issues in Assam in the last few days. My letter to Home Minister, Shri @AmitShah underlining the same. pic.twitter.com/FHLG5pg5Bz — Mallikarjun Kharge (@kharge) January 24, 2024 అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని కేంద్ర హోంమత్రికి రాసిన లేఖలో ఖర్గే వివరించారు. కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. చదవండి: తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు వీటన్నింటి విషయాల్లో అస్సాం పోలీసులు బీజేపీ కార్యకర్తలవైపు పక్షాన నిలిచారని ఆరోపించారు. అంతేగాక కాషాయ శ్రేణులకు రాహుల్ కాన్వాయ్ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. రాహుల్, ఆయన సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారెవరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. న్యాయ యాత్ర కొనసాగుతున్న కొద్దీ రాహుల్కు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ఇకనైన అమిత్షా జోక్యం చేసుకొని రాహుల్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లను ఆదేశించాలని కోరారు. ఇదిలా ఉండగా భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అస్సాం పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
తగ్గేదేలే.. రాహుల్ గాంధీపై కేసు నమోదు
గువాహటి: అస్సాం(అసోం)లో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జాతీయ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అసోంలో పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా వెల్లడించారు. యాత్ర పేరుతో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారాయన. మంగళవారం తెల్లవారుజామున మేఘాలయా నుంచి తిరిగి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు అయ్యిందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని ఎక్స్ ఖాతాలో సీఎం శర్మ పేర్కొన్నారు. With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section… — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" రాహుల్పై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్కు సీఎం హిమంత శర్మ స్పందించడం గమనార్హం. These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture. I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h — Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024 మరోవైపు రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గువాహటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు. అడ్డుకుంటేనే మంచిది: రాహుల్ తాను కేసులకు భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు బీజేపీ ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్కు షాక్.. ఆలయంలోకి అనుమతి నిరాకరణ.. కారణం ఏంటంటే.. -
రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ను అస్సాం పోలీసులు అడ్డుకోవడంతో రాష్ట్ర రాజధాని గువాహటి ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాహుల్ మంగళవారం ఉదయం గువాహటి సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ ర్యాలీ గువాహటి రోడ్లపైకి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని కార్యకర్తలు దూసుకురావడంతో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. రూట్ చేంజ్ చేసుకోండి: సీఎం అంతకుముందు గువాహటి రోడ్లపై రాహుల్ యాత్రకు సీఎం హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ మార్గానికి బదులుగా ర్యాలీని దిగువ అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది. నగరం చుట్టూ రింగ్ రోడ్డుపై ఉన్న 27వ నెంబరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లాలని కోరింది. చట్టాన్ని ఉల్లంఘించలేదు:రాహుల్ దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. గతంలో భజరంగ్ దళ్ ఇదే మార్గంలో నడిచిందని, అంతేగాక బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడ ఇదే రూట్లోర్యాలీ చేపట్టారని గుర్తు చేశారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదా అని ప్రవ్నించారు. అయితే పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకొని వచ్చామన్న రాహుల్.. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. తామను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి నిదర్శనమన్నారు. రాహుల్పై కేసు నమోదుకు సీఎం ఆదేశం గువాహటి సరిహద్దుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గానూ కేసు ఫైల్ చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలనే సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు తెలిపారు. #BigBreaking Assam Chief Minister Himanta Biswa Sarma is trying hard to cause trouble for Rahul Gandhi and the Bharat Jodo Nyay Yatra in Assam by using brute force. Himanta Biswa Sarma has crossed all limits by using his administration. Himanta sent Assam police to detain… pic.twitter.com/cYQmKLzhoA — Sohom Banerjee (@Sohom03) January 23, 2024 అస్సాం ప్రజలను ప్రభుత్వం అణచివేస్తోందని రాహుల్ ఆరోపించారు. మేఘాలయాలో విద్యార్ధులతో తన ఇంటరాక్ట్ను రద్దు చేశారని ప్రస్తావించారు. విద్యార్ధులు నన్ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేత.. అయినప్పటికీ వారు తనను కలవడానికి బయటికి వచ్చినట్లు తెలిపారు. ఇకర అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. -
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
నేనేం నేరం చేశా: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ్ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోం ముఖ్యమంత్రిపైనా రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా.. ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదయం బటాద్రవ థాన్(సత్రం) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నాగోవ్లో స్థానిక నేతలు, కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన. మరోవైపు.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నాం 3.గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెబుతున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ. బటాద్రవ థాన్ ఆలయం 15వ శతాబ్దపు సన్యాసి.. అసోం సంఘసంస్కర్త అయిన శ్రీమంత శంకర్దేవ్కు జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బటాద్రవ థాన్కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో.. ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని.. ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని.. రూట్ మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్ని కోరారు. మరోవైపు అసోంలో.. ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. -
‘అస్సాం సీఎం మాకు తీవ్ర అన్యాయం చేశారు’
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై విమర్శలు గుప్పించారు. శనివారం బొంగైగావ్ ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న బద్రుద్దీన్.. సీఎం హిమంత బిస్వాను టార్గెట్ చేశారు. గతంలో హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్లో ఉన్న సమయంలో ముస్లింలు వేసిన ఓట్ల వల్లనే ఆయన గెలిచారని అన్నారు. హిమంత కాంగ్రెస్ ఉన్న సమయంలో ముస్లింల మద్దతు అధికంగా ఉండేదని తెలిపారు. కానీ.. ప్రస్తుత సమయంలో తమ వర్గానికి సీఎం హిమంత తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. తన గెలుపులో కీలకమైన తమకు హిమంత.. బీజేపీలో చేరిన తర్వాత తమకు చేయవల్సిన సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ కాకుండా కేంద్రంలోని హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదీ చెబితే.. రాష్ట్రంలో అది చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఇక.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ ఇద్దరూ.. దేశానికి ప్రధానమంత్రి అవుతామని పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కానీ.. వాళ్లు తమ రాష్ట్రాల్లో చేస్తున్న పరిపాలన రోజురోజుకు వారి ప్రభ కోల్పోయేలా చేస్తోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం హిమంత.. తన గెలుపులో కీలకమైన ముస్లీం వర్గం ఓట్లును కోల్పోవద్దని హితవు పలికారు. చదవండి: భారత్లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం -
గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అస్సాం సీఎ హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నడుసతోంది. రాహుల్ చేపట్టిన‘భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కూడా అస్సాం సర్కారే అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలోనే ప్రజా ధనం ఎక్కువ లూటీ అవుతున్నదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు.. ఇక్కడి ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని ఆరోపించారు. అస్సాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేస్తామన్నారు. తాజాగా రాహుల్ విమర్శలపై అస్సాం సీఎం స్పందించారు. అవినీతి సీఎం అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం కంటే ఎక్కువ అవినీతి పరులు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఏ విమర్శలైనా అవి తనకు ఆశీర్వాదంగా భావిస్తానని తెలిపారు. ఇది తమను తాము అత్యంత శక్తివంతమైన వారిగా భావించే (గాంధీ కుటుంబం) వారితో పోరాడేందుకు శక్తినిస్తుందని తెలిపారు. అయితే తానే ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాని.. గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా అని ఎద్దేవా చేశారు. బోఫోర్స్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ఘటన, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి కాగా మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ యాత్ర నాగాలాండ్ ఆ తరువాత అస్సాంలో సాగుతోంది. జనవరి 25 వరకు రాష్ట్రంలోనే పర్యటించనున్నారు. అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల మీదుగా ప్రయాణించనున్నారు. తరువాత మేఘాలయాలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్లో మార్పులు చేయడంతో పోలీసులు.. తాము ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు. -
బ్యాట్తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు
దిస్పూర్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. అసోం ముఖ్యమంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నాం రాహుల్ యాత్ర సాగిందన్నది అసోం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా.. జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టారు. అలాగే.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని అసోం పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు జోడో న్యాయ్ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపైనా కేసు నమోదు అయ్యింది. అంతకు ముందు.. అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆరో రోజుకి చేరింది. ఇవాళ అతిపెద్ద మంచి నీటి ద్వీపం మజూలీలో రాహుల్ యాత్ర సాగనుంది. జనవరి 25వ తేదీ దాకా రాహుల్ అసోంలోనే యాత్రలో పాల్గొంటారు. -
అస్సాం ప్రభుత్వం, సీఎం..
శివసాగర్/జోర్హాట్(అస్సాం): భారత్ జోడో న్యాయ్ యాత్రను అస్సాంలో మొదలుపెడుతూనే ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నాగాలాండ్ బుధవారం ముగిసిన యాత్ర అస్సాంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివసాగర్ జిల్లాలోని హాలోటింగ్ పట్టణంలో వందలాది మంది పార్టీ కార్యకర్తల సమక్షంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం ఉందంటే అది ఈ రాష్ట్ర సర్కారే. అతిపెద్ద అవినీతి సీఎం కూడా ఇక్కడే ఉన్నారు’’ అని ఆరోపించారు. జొర్హాట్ జిల్లాలోని దేబెరాపూర్లోని వీధి సమావేశంలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ అస్సాంలోని బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇక్కడి గిరిజనులు, తేయాకు కారి్మకులు, స్థానిక తెగలకు అన్యాయం చేస్తోంది. సంపదను కొల్లగొడుతూ విద్వేషాన్ని చిమ్ముతోంది. యాత్ర మొదలైన మణిపూర్లో జాతుల మధ్య వైరం కార్చిచ్చులా విస్తరించి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానిని చల్లార్చేందుకు కనీసం ఒక్కసారైనా మోదీ మణిపూర్కు రాలేదు. ఇక నాగాలాండ్లో నాగాల సమస్యను పరిష్కరిస్తామని మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ అది ఎంత వరకు సఫలమైందనేది మోదీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని రాహుల్ ఆరోపించారు. -
వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగిపోయాడు. చత్తీస్ఘడ్తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో 104 బంతుల్లో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. రియాన్ చేసిన ఈ రెండు శతకాలు తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. చత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. చత్తీస్ఘడ్పై రియాన్ చేసిన సెంచరీ రంజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (56 బంతుల్లో) కాగా.. కేరళపై చేసిన సెంచరీ అతని కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయేది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి సెంచరీతో (131) సత్తా చాటగా.. కున్నుమ్మల్ (83), కృష్ణ ప్రసాద్ (80), ప్రేమ్ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుసేన్, రాహుల్ సింగ్ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్ శర్మ 2, ఆకాశ్సేన్ గుప్తా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే రియాన్ మినహా అస్సాం ఇన్నింగ్స్లో ఎవరూ రాణించకపోడంతో ఆ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 207 పరుగులు వెనుపడి ఉంది. రాహుల్ హజారికా (9), సిద్దార్థ్ శర్మ (0), సుమిత్ (4), గోకుల్ శర్మ (12), సాహిల్ జైన్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రిషవ్ దాస్ 31 పరుగులు చేశాడు. ఆకాశ్సేన్ గుప్తా (6), ముక్తర్ హుస్సేన్ (6) క్రీజ్లో ఉన్నారు. -
100 పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఐపీఎం
గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్లెట్స్ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔట్లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్లో 25 ఔట్లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్నాథ్
తేజ్పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
అస్సాంలో కీలక పరిణామం.. ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), కేంద్రంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో శాంతి కోసం యూఎల్ఎఫ్ఏ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూఎల్ఎఫ్ఏ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా జరుగుతున్న (తిరుగుబాటు చర్యలకు) హింసాకాండకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అస్సాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ‘కాగా వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్) నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా, ప్రత్యేక అస్సాం డిమాండ్తో 1979లో ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. దీంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధిత సంస్థగా ప్రకటించింది. అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా కొనసాగుతుంది. చదవండి: గుజరాత్ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్లో మాత్రం.. అయితే ఫిబ్రవరి 2011లో అరబిందా రాజ్ఖోవా నేతృత్వంలోని వర్గం హింసను విడిచిపెట్టి, ప్రభుత్వంతో బేషరతు చర్చలకు అంగీకరించడంతో ఉల్ఫా రెండు గ్రూపులుగా విడిపోయింది. అరబింద సారథ్యంలోని ఉల్ఫా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2011 సెప్టెంబర్ 3న తొలిసారి శాంతి చర్చలు జరిపింది. అయితే పరేశ్ బారుహ్ నేతృత్వం వహిస్తున్న ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేశ్.. చైనా-మయన్మార్ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం. ఈరోజు అస్సాంకు చారిత్రాత్మకమైన రోజని హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయిందన్నారు. 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని అమిత్ షా తెలిపారు. -
క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ భగవద్గీత శ్లోకం భావం వివాదంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘తాను రోజు భగవద్గీత శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు సుమారు 668 శ్లోకాలు పోస్ట్ చేశాను. అయితే ఇటీవల నా సోషల్ మీడియా టీం.. భగవద్గీతలోని చాప్టర్ 18లో ఉన్న 44వ శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆ శ్లోకం అనువాద అర్థాన్ని తప్పుగా పోస్ట్ చేసింది. ఆ తప్పు నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ను నేను వెంటనే డిలీట్ చేశాను. అస్సాం ఎప్పుడూ కులాలకు అతీతమైన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటంది. దానికి మహాపురుష్ శ్రీమంత శంకరదేవకు నా కృతజ్ఞతలు. నేను డిలీట్ చేసిన పోస్ట్ వల్ల ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. వారికి ఇవే నా క్షమాపణలు’ అని సీఎం హిమంత బిశ్వశర్మ (ఎక్స్)ట్వీటర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. As a routine I upload one sloka of Bhagavad Gita every morning on my social media handles. Till date, I have posted 668 slokas. Recently one of my team members posted a sloka from Chapter 18 verse 44 with an incorrect translation. As soon as I noticed the mistake, I promptly… — Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2023 అయితే సీఎం హిమంత ట్వీటర్ టీం మొదటగా పోస్ట్ చేసిన భగవద్గీత శ్లోకం.. ‘బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల విధి’ అనే అర్థం వచ్చేలా ఉండటంతో ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించాయి. -
‘ఇక్కడ జంతువు ఎవరు? వారిని జంతు హంతుకులంటాం’
భారీ ఏనుగులను దగ్గర నుంచి చేస్తేనే.. సాధారణంగా భయమేస్తుంది! అయితే కొందరు ఓ భారీ ఏనుగును ఆటపట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇక వీడియో వివరాల్లోకి వెళ్లితే.. ఓ భారీ గుంత పైభాగంలో ఉన్న ఏనుగును, కొందరు వ్యక్తులు గుంత పైకి ఎక్కి ఆటపట్టిస్తూ రెచ్చగొట్టారు. అందులో ఓ వ్యక్తి కాలి చెప్పుతో దాన్ని బెదింరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ చర్యతో ఏనుగు కూడా అతనిపై దాడి చేయాడానికి ప్రయత్నించింది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి.. మరిసారి దానికి దగ్గర పోయి బెదిరించాడు. అయితే అతని చర్యలకు బెదిరిపోయిన ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. Identify the real animal here. Then these giants charge & we call them killers. Dont ever do this, it’s life threatening. Video is from Assam. pic.twitter.com/e1yltV4RQP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 7, 2023 ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడయోను ఎక్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇక్కడ నిజమైన జంతువు ఎవరో గుర్తించండి. ఇటువంటి వారిని మేము జంతుహంతకులు అని పిలుస్తాం. జంతువులను ఎప్పుడు ఆటపట్టించకూడదు. ఇటువంటి చర్యలకు పాల్పడటం ప్రాణాంతకం కూడా’ అని ఆయన కాప్షన్ జత చేశారు. ఈ ఏనుగు వీడియో అస్సాంకు చెందినట్లు పర్వీన్ పేర్కొన్నారు. ఆ వ్యక్తి చేసిన పనికి నెటినట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘అసలు వారు ఏనుగును ఎందుకు ఆటపట్టిస్తున్నారు’, ‘ అతను చేసిన పని సరైంది కాదు’, ‘వారి జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడవేసుకుంటున్నారు’, ‘వాడేమైనా బాహుబలినా చెప్పు చూపితే ఏనుగు భయపడటానికి.. దాడి చేస్తే తెలుస్తుంది ఎంటో?’ అని నెటిజనట్లు కామెంట్లు చేస్తున్నారు. -
‘చరిత్ర తెలియకపోతే మాట్లాడొద్దు.. అస్సాం సీఎం ఫైర్’
గౌహాతి: అస్సాంకు సంబంధించి సీనియర్ నాయ్యవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే అసలు మాట్లాడొద్దని మండిపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదిస్తూ.. అస్సాంకు సంబంధించి కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అస్సాం రాష్ట్రం.. మయన్మార్(బర్మా)లో భాగంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్పై సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం చరిత్రపై అవగాహన లేనివారు మాట్లాడొద్దని ఘాటుగా విమర్శించారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్లో భాగంగా లేదని అన్నారు. కేవలం ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగినట్లు తెలిపారు. అది ఒక్కటి మాత్రమే ఆ దేశానికి.. అస్సాంకి ఉన్న ఒక సంబంధమని పేర్కొన్నారు. అంతేకానీ, అస్సాం మయన్మార్లో భాగంగా ఉన్నట్లు ఎక్కడా చరిత్రలో రాసినట్లు ఉన్నట్లు తాను చూడలేదని మండిపడ్డారు. ఇక మణిపూర్లో అల్లర్లు జరగటానికి మయన్మార్ నుంచి వచ్చిన వలసదారులు కూడా ఓ కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిందే. ఇది చదవండి: ‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’ -
సెమీ కండక్టర్ తయారీలో టాటా గ్రూప్.. 40వేల కోట్ల పెట్టుబడులతో
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా అస్సాంలో దాదాపు రూ. 40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇది మాకు శుభపరిణామం. టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జాగీరోడ్లో ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తును సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ఆమోదం కోసం కేంద్రాన్ని సంప్రదించాం. త్వరలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని శర్మ చెప్పారు. ‘‘టాటా కంపెనీ అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సుమారు రూ.40 వేల కోట్లతో చిప్ కంపెనీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది.సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంట్పై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరిపిందని, ఇక్కడ చర్చల అనంతరం కేంద్రాన్ని సంప్రదించాం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వచ్చేలా చూస్తామని, పారిశ్రామికీకరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, ఒకట్రెండు నెలల్లో తుది ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. -
దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై మూడుగా నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. Earthquake of Magnitude:3.0, Occurred on 26-11-2023, 04:00:43 IST, Lat: 29.15 & Long: 76.97, Depth: 5 Km ,Location: Sonipat, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/71kQ5wTDF1@Dr_Mishra1966 @KirenRijiju @Indiametdept @ndmaindia @Ravi_MoES pic.twitter.com/AtUSHA5KJ5 — National Center for Seismology (@NCS_Earthquake) November 25, 2023 గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం -
శభాష్ కిషన్: ఒక్క డీల్తో వందల కోట్లు..అంతేనా..!
అసోంలోని డిబ్రూఘర్కు చెందిన యువకుడు కిషన్ బగారియా బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. కిషన్ రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను టెక్ట్స్డాట్కామ్ను అమెరికా పాపులర్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈడీల్ విలువ ఏకంగా రూ.416 కోట్లు. అంతేకాదు వర్డ్ ప్రెస్డాట్కామ్, ఆటోమాటిక్ ఇంక్ వ్యవస్థాపకుడు మాట్ ముల్లెన్వెగ్ కిషన్ బగారియాపై ‘టెక్ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీంతో టెక్నాలజీ రంగంలో భారతీయ యువత ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. చారియాలీ ప్రాంతానికి చెందిన మహేంద్ర బగారియా, నమితా బగారియా దంపతలు కుమారుడు కిషన్ బగారియా మెసేజింగ్ యాప్ టెక్ట్స్ డాట్కామ్ను డెవలప్ చేశాడు. ఇటీవల అమెరికా వెళ్లిన కిషన్ ఆన్లైన్ ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ టెక్ట్స్డాట్కామ్ను రూపొందించాడు. వాట్సాప్, మెసెంజర్, లింక్డిన్, సిగ్నల్, ఇన్స్ట్రాగ్రామ్, ట్విటర్ తో సహా మీ అన్ని మెసేజింగ్ యాప్లను ఒకే డ్యాష్బోర్డ్లో తీసుకువస్తుందీ యాప్. భిన్న వేదికల్లో మెసేజ్ చేసేందుకు ఆల్ ఇన్ వన్ యాప్ ద్వారా మెసేజ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని వాటి కోసం ప్లాన్లు ఉన్నాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. తాజా కొనుగోలుతో కిషన్ బగారియా, తన యాప్ బృందంలోని మిగిలిన వారితో పాటు మెసేజింగ్ కొత్త హెడ్గా కంపెనీలో చేరనున్నారు. ప్రస్తుతమున్న తమ యాప్ యూజర్ల సేవల్లో ఏమీ మార్పు ఉండదు. మరిన్ని ఫీచర్లు, మొబైల్ యాప్స్ అందుబాటులోకి రానున్నాయి అంటూ ట్విటర్లో వెల్లడించాడు కిషన్. కిషన్ బగారియా ప్రాథమిక విద్యను డిబ్రూఘర్లోనే పూర్తి చేసిన కిషన్ ఎపుడూ కాలేజీకి కూడా వెళ్లలేదట. తన విజ్ఞానం అంతా ఇంటర్నెట్నుంచి నేర్చుకున్నదే అంటాడు. అయితే అధునిక టెక్నాలజీలో మరిన్ని వెళకువలు నేర్చుకునేందుకు గత ఏడాది శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాడు. పన్నెండేళ్ల వయసులో స్మాల్ విండోస్ యాప్ తయారీపై దృష్టిపెట్టాడు. కిషన్ సోదరుడుకూడా అమెరికాలో యాప్ తయారీలో బిజీగా ఉన్నాడట. దీంతో బగారియా బ్రదర్స్ యాప్ ప్రపంచాన్ని రాక్ చేయనున్నారంటూ సన్నిహితులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. -
పొట్టి క్రికెట్లో కొనసాగుతున్న రియాన్ పరాగ్ విధ్వంసకాండ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఆల్రౌండర్) డ్రీమ్ రన్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో అతను వరుసగా ఏడో హాఫ్ సెంచరీ బాదాడు. గత మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు (టీ20ల్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా వార్నర్, సెహ్వాగ్, బట్లర్ల పేరిట ఉన్న రికార్డు బద్దలు) నెలకొల్పిన రియాన్.. తాజాగా హాఫ్ సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. బెంగాల్తో నిన్న (అక్టోబర్ 31) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-2లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన రియాన్.. తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో అస్సాం క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో రియాన్ 2 వికెట్లు పడగొట్టడంతో పాటు 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 50 పరుగులు చేశాడు. Riyan Parag celebration myan 😭😭😭.He fucking just said, these guy's aren't on my level. I am fucking couple level ahead of them 😭😭😭Proper Chad pic.twitter.com/Gd8fbECfM7— HS27 (@Royal_HaRRa) October 31, 2023 టీమిండియాలో చోటు దక్కేనా..? ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాది జోరుమీదున్న రియాన్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లో భారత జట్టులో చోటుపై కన్నేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు నుంచే భీకరమైన ఫామ్లో ఉన్న రియాన్.. బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అస్సాంతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లు ఆకాశ్ సేన్గుప్తా 3, రియాన్ పరాగ్ 2, మ్రిన్మోయ్ దత్తా, శివ్శంకర్ రాయ్, సౌరవ్ డే తలో వికెట్ పడగొట్టారు. బెంగాల్ ఇన్నింగ్స్లో ఎనిమిదో నంబర్ ఆటగాడు కరణ్ లాల్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం.. రిశవ్ దాస్ (31), బిషల్ రాయ్ (45 నాటౌట్), రియాన్ పరాగ్ (50 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నిన్ననే జరిగిన మరో ప్రీక్వార్టర్ ఫైనల్లో గుజరాత్పై ఉత్తర్ప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. నవంబర్ 2న మరో రెండు ప్రీ క్వార్టర్ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో రియాన్ పరాగ్ గణాంకాలు.. 45(19) & 0/53(4) 61(34) & 2/25(4) 76(37) & 3/6(4) 53(29) & 1/17(4) 76(39) & 1/37(4) 72(37) & 1/35(3) 57(33) & 1/17(4) 50(31) & 2/23(4) -
రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..
తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి. ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి
Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడం విశేషం. (19 ఏళ్లకే గ్యాంగ్స్టర్గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి) ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు) కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్లో ప్రవేశపెడతామని శర్మ హింటిచ్చారు. అలాగే ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. -
చరిత్ర సృష్టించిన రియాన్.. ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్ అయ్యాడు..!
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ, ఆటకంటే ఓవరాక్షన్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిన రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో అతిని పక్కకు పెట్టి ఆటపై మాత్రమే దృష్టి సారిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఫామ్లేమి కారణంగా గత ఐపీఎల్లో సరైన అవకాశాలు రాని రియాన్.. ఆతర్వాత జరిగిన అన్ని దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో (సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ-2023) ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్న రియాన్.. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్గా మారాడు. ఈ టోర్నీలో అస్సాం జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రియాన్.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో రియాన్కు ముందు ఏ ఇతర ఆటగాడు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించలేదు. ఈ టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొడుతున్న రియాన్.. ప్రతి మ్యాచ్లో వికెట్లు కూడా తీసి పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రదర్శనలతో ఓవరాక్షన్ స్టార్ కాస్త సూపర్ స్టార్గా మారిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా కేరళతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసిన రియాన్.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా (17 పరుగులు) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ తీసుకుని తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ ప్రదర్శనకు ముందు రియాన్ వరసగా 102 నాటౌట్, 95 (దియోదర్ ట్రోఫీ), 45, 61, 76 నాటౌట్, 53 నాటౌట్, 76, 72 పరుగులు స్కోర్ చేశాడు. ఈ ప్రదర్శనలతో రియాన్ త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2024 వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంటుంది. ఒకవేళ రియాన్ను రాయల్స్ టీమ్ రిలీజ్ చేయకపోతే.. ఆ జట్టులోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. -
ఈ స్కూళ్లో ఫీజులుండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉన్న ‘అక్షర్ స్కూల్’ ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్లో ఫీజులకు బదులు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకుంటారు. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు ఈ స్కూల్ను స్థాపించారు. ఫీజుల రూపంలో వచ్చిన బాటిల్స్ను వివిధ రూపాల్లో పునర్వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ను ఎలా రీసైకిల్ చేయాలో విద్యార్థులకు నేర్పుతున్నారు. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ‘గుడ్ ఐడియా’ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపించారు. If this doesn't surprise you, what does?#Incredible_NorthEast Credit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa — Temjen Imna Along (@AlongImna) October 12, 2023 -
పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్లు.. ఐదుగురి మృతి!
బక్సర్: నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్లు బిహార్లోని బక్సర్ జిల్లా రఘునాథ్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
అసోంలో భూకంపం.. భయంతో జనం పరుగులు!
అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదైంది. గత సోమవారం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Earthquake of Magnitude:3.1, Occurred on 01-10-2023, 03:01:33 IST, Lat: 26.08 & Long: 90.05, Depth: 17 Km ,Location: Dhubri, Assam, India for more information Download the BhooKamp App https://t.co/8bErjjuCfL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/1mxvy1CAQ5 — National Center for Seismology (@NCS_Earthquake) September 30, 2023 -
బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు
అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం -
అసోం సీఎం భార్య పై ఆరోపణలు..పరువు నష్టం దావా
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్పై.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఏకంగా రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమె గొగోయ్కు నోటీసులు పంపారు. కామ్రూప్ మెట్రోపాలిటన్లోని సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం కేసు దాఖలు చేశామని, ఇది సెప్టెంబర్ 26న విచారణకు రానుందని భుయాన్ తరఫు న్యాయవాది దేవజిత్ సైకియా చెబుతున్నారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా పలు ట్వీట్ల ద్వారా గౌరవ్ గొగోయ్ తన క్లయింట్ రినికి భుయాన్ శర్మకు నష్టం కలిగించారని, అందుకే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ తన క్లయింట్ రినికికి చెందిన కంపెనీ ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా, ఓ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందడం కోసం అవకతవకలకు పాల్పడ్డారని గొగోయ్ ఆరోపించారు. అయితే.. తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 -
కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్
డిస్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ఉన్న ఒక వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ వీడియోలో ఈశాన్య రాష్ట్రాలను తొలగిస్తూ ఉంచిన భారతదేశం మ్యాప్ ఫోటోను జత చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈశాన్య రాష్ట్రాలపై ఇదే కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చైనాకు అమ్మేశారా? హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే తొందరలో ఈశాన్య రాష్ట్రాలపై వారి అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టుకున్నారు. భారతదేశం పటంలో ఈశాన్య రాష్ట్రాలను తొలగించి విదేశాల్లో కలిపేశారు. బహుశా మొత్తం భూమిని ఏదైనా పొరుగుదేశానికి అమ్మెందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉంటారని అన్నారు. దీని కోసమేనా రాహుల్ గాంధీ ఇటీవల విదేశాలకు వెళ్లారు. లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి జైలు పాలైన షర్జీల్ ఇమామ్కు వారి పార్టీలో సభ్యత్వం ఏమైనా కల్పించారా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ చూడగానే షాకయ్యా. కాంగ్రెస్ పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలను చైనాకు అమ్మేసిందా ఏంటనుకున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగానే పాల్పడిన దేశ వ్యతిరేక చర్య అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగబోయే లోక్సభ ఎన్నికలు వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. Seems the Congress party has secretly struck a deal to sell the entire land of North East to some neighbouring country. Is this why Rahul went abroad? Or has the party given membership to Sharjeel Imam? pic.twitter.com/oO9fLp86p8 — Himanta Biswa Sarma (@himantabiswa) September 16, 2023 ఎగతాళి చేయబోయి.. అసలు వివాదం మొదలవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనే కారణం. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ బాలీవుడ్ క్లాసిక్ 'దీవార్' సినిమాలోని అమితాబ్ బచ్చన్ శశి కపూర్ మధ్య జరిగే సంభాషణను పేరడీ చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మోదీ మాట్లాడుతూ.. ' నా దగ్గర ఈడీ, పోలీస్, అధికారం, డబ్బు. స్నేహితులు అనీ ఉన్నాయి.. నీ దగ్గరఏముంది? అని అడగగా రాహుల్ పాత్ర సమాధానమిస్తూ నా దగ్గర తల్లి లాంటి యావత్ భారతదేశమే ఉందని సమాధానమిస్తారు. వీడియో వరకు అంతా బాగానే ఉంది కానీ వెనుక వైపున గోడకు తగిలించిన భారతదేశం మ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలను లేపేయడమే అసలు వివాదానికి తెరతీసింది. ఇంకేముంది ఈ స్క్రీన్షాట్ను తీసుకుని అదే సొషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాయి బీజేపీ వర్గాలు. नरेंद्र मोदी: मेरे पास ED है, पुलिस है, सत्ता है, पैसा है, दोस्त है.. क्या है तुम्हारे पास? राहुल गांधी: मेरे साथ पूरा देश है ❤️ pic.twitter.com/IMY6MHVz8q — Congress (@INCIndia) September 16, 2023 ఇది కూడా చదవండి: వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ.. -
భార్యపై ఆరోపణలు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: అస్సాం సీఎం
గువాహతి: తన భార్యపై వస్తున్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పొందినట్లు ఆధారాలు చూపిస్తే ప్రజా జీవితం నుంచి విరమణ పొందుతానని సవాల్ విసిరారు. అంతేగాక ఎలాంటి శిక్షనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘నా భార్య కానీ, ఆమెతో అనుబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు పొందలేదని నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలను చూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా ఏ శిక్షనైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ చేసిన పోస్ట్కు సమాధానంగా ట్వీట్ చేశారు. The reply itself clarifies the fact that the Government of India has not released any funds to the mentioned company. I want to emphasize once again that neither my wife nor the company she is associated with has received or claimed any amount from the Government of India. If… https://t.co/70zQ1DGHTe — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 అయితే లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, హిమంత బిస్వాశర్మ మధ్య ట్విటర్లో మాటల యుద్ధం నడుస్తోంది. అస్సాం బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానాన్ని గొగోయ్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. Please do not lecture me on what to do. Whether I decide to go to the assembly or a court of law against you, I will make that decision myself. https://t.co/38OAG2xy6T — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 ముఖ్యమంత్రి శర్మ తన పరపతిని ఉపయోగించి ఆయన భార్య నడుపుతున్న సంస్థకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కింద రూ.10 కోట్లు ఇప్పించారంటూ గొగోయ్ సంచలన ఆరోపణ చేయడంతో ఈ ఇద్దరు అసోం నేతల మధ్య వివాదం రాజుకుంది. పీఎం కిసాన్ యోజన కింద అస్సాం సీఎం భార్యకు రూ.10 కోట్ల రాయితీ అందినట్లు గొగోయ్ ఆరోపణలు చేశారు.సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో దయచేసి అస్సాం అసెంబ్లీకి హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని గొగోయ్ కోరారు. KMSY గురించి చర్చించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాన్ని సమర్పించారని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. గొగోయ్ ఆరోపణలను శర్మ ఖండించారు. ఏం చేయాలో తనకు ఉపన్యాయం ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనిపై అసెంబ్లీకి, న్యాయస్థానానికి వెళ్లాలో తానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. Please do not change the goal post now. Yes, all family members of BJP politicians have the right to run their own companies and seek government subsidies if they are entitled to them. This is true for everyone. However, I would like to clarify that in this particular case, my… https://t.co/4GW6NonRSN — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 శర్మ ట్వీట్కు గొగోయ్ వెంటనే స్పందించారు. ''మరీ అంత ఉద్రేకం తెచ్చుకోకండి. అసెంబ్లీకి మీరు రావాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన లింక్ను మీకు పంపుతున్నాను. కోర్టుకు మీరు వెళ్తే నేను సంతోషిస్తాను. అప్పుడు అన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తాయి'' అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు. Yes, I am agitated. There have been numerous reasons for my anger against your family since 2010. I am confident that we will meet in court, and once again, I will be able to prove my point. I have successfully done so in 2016 and 2021, and I am determined to do it again, both… https://t.co/pM0Kz8Eqw1 — Himanta Biswa Sarma (@himantabiswa) September 14, 2023 దీనిపై హిమంత శర్మ స్పందిస్తూ.. "అవును, నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. 2010 నుంచి మీ కుటుంబంపై అనేక కారణాల వల్ల ఆగ్రహంతో ఉన్నాను. మనం కోర్టులోనే మరోసారి కలవబోతున్నాం. నా వాదనను నేను నిరూపించుకుంటాను. 2016, 2021లో కూడా విజయవంతంగా నా వాదన వినిపించాను. మరోసారి అదే దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇద్దరం ఇటు ప్రజాకోర్టులోనూ, అటు న్యాయస్థానంలోనూ కలుద్దాం'' అని శర్మ ట్వీట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఫిర్యాదు చేస్తున్నారా? గోయల్ శర్మ తన భార్యకు మంజూరు చేయడాన్ని ఆమోదించారు. కానీ నిధులు విడుదల చేయలేదని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఇంకా ఎంత మంది బీజేపీ రాజకీయ నాయకులు తమ కుటుంబాలను సుసంపన్నం చేసేందుకు పీఎంకేఎస్వై పథకాన్ని ఉపయోగించుకున్నారు? అని గౌరవ్ గొగోయ్ అన్నారు. వెబ్సైట్ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
మహారణ్యానికి మహిళా బాస్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం. మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది. వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్కు ఫీల్డ్ డైరెక్టర్గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది. అడవి అంటే ప్రేమ సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్లో టాపర్గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది. స్త్రీలకు సవాలు ‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం. అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు. ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్. ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం. -
బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడు మృతి.. ఏం జరిగింది?
గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ బాలుడి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. అసోంలోని సిల్చార్ ఎంపీ రాజ్దీప్ రాయ్ నివాసంలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో పదేండ్ల బాలుడి మృతదేహం లభించింది. అతని మెడచుట్టూ బట్ట చుట్టి ఉన్నది. మృతుని తల్లి ఎంపీ ఇంట్లో గత రెండున్నరేండ్లుగా డొమెస్టిక్ హెల్పర్గా పనిచేస్తున్నారు. ఇక, బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రాజ్దీప్ రాయ్ మాట్లాడుతూ.. తన ఇంట్లో బాలుడి మృతదేహం వేలాడి ఉన్న స్థితిలో కనిపించిందన్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. కాగా, బాలుడు ఎలా చనిపోయడనేది తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు.. బాలుడిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Assam | A 10-year-old boy allegedly died by suicide by hanging himself. My staff called the police they broke open the locked room and took the body to the medical college, but he was declared dead. I immediately called SP Numal Mahatta and urged the police to follow SOPs for… pic.twitter.com/blbKG6KbOE — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. -
వైరల్ 75 కాదు 25!
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..
గౌహతి: కిసాన్ మోర్చా నాయకురాలు ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న ఓ నాయకుని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అసోం బీజేపీ. గత శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన ఓ మహిళ గౌహతిలో తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళా నాయకురాలు ఇతర పార్టీ నాయకునితో ఉన్న అశ్లీల ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితునిగా ఉన్న పార్టీ నాయకుని సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: 50 శాతం కమిషన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై కేసు.. -
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా క్షమాపణలు తెలియజేశారు. ప్రజల నుంచి క్షమాపణలు కోరుతూ వైష్ణవ్ ప్రార్థనకు చెందిన ఓ గీతాన్ని కూడా పాడారు. కాగా, గోలాఘాట్లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న బంధాన్ని ప్రస్తావించాడు. రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. దీనిపై ఒకవేళ పోలీస్ కేసు నమోదైతే అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. హజ్రత్ మహమ్మద్ను, జీసస్ క్రైస్ట్ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హితవు పలికారు. నేరపూరిత చర్యలను భగవంతుడితో పోల్చడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. చదవండి: ఉడిపి వాష్రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్ దీనిపై అసోం కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తమ తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని తెలిపారు. తను చేసిన స్టేట్మెంట్ తప్పని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టిందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా పార్టీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదన్నారు. వైష్ణవ్ భక్తులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధగా అనిపించిందని భూపేన్ చెప్పారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేగానీ బీజేపీ, సీఎంకు భయపడి క్షమించమని కోరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి. -
సంఘమిత్ర కుటుంబానికి అసోం సీఎం పరామర్శ
తీవ్ర చర్చగా మారిన అసోం ట్రిపుల్ మర్డర్ కేసులో బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరామర్శించారు. ఈ క్రమంలో లవ్ జిహాదీ అంశం ప్రస్తావించిన ఆయన.. నిందితుడు నజిబుర్ పైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొత్తంగా లవ్ జిహాద్ పరిణామమే. బాధిత కుటుంబం హిందూ.. అలాగే నిందితుడు ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఫేస్బుక్లో హిందూ పేరుతో పరిచయం పెంచుకుని.. ఆమెను ట్రాప్ చేశాడు. కోల్కతాలో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు ఆమెపై డ్రగ్స్ ప్రయోగించినట్లూ తేలింది అని తెలిపారాయన. నిందితుడు నజిబుర్ రెహమాన్ బోరా తన మతం మార్చేసి.. ఆమెను మోసం చేశాడు. అతను డ్రగ్స్కు బానిసైన వ్యక్తి. ఆమెకూ డ్రగ్స్ ఇచ్చి లోబర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆపై ఆమెను హింసించడంతో.. భరించలేకే పుట్టింటికి వచ్చేసింది అని సీఎం హిమంత వెల్లడించారు. కరోనా సమయంలో బాధితురాలి సోదరి అంకిత ఈ లవ్ జిహాదీ అంశంపై తనకు లేఖ రాసిందని.. కానీ, ఆ టైంలో ఆ లేఖ తన దాకా రాకపోవడం వల్ల ఇవాళ ఇంత ఘోరం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ గతంలో తన భర్తను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్ టైంలో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన సంఘమిత్ర, నజిబూర్లు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయారు. ఆపై ఆమెపై దొంగతనం కేసు పెట్టించి నెలపాటు జైలు పాలు చేసింది ఆమె కుటుంబం. తిరిగి మళ్లీ పారిపోయిన జంట.. ఈసారి వివాహం చేసుకుని కాపురం పెట్టింది. ఓ బాబు కూడా పుట్టాడు. అయితే మనస్పర్థలతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుని నజిబూర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జైలుపాలైన నజిబూర్.. కోపంతో రగిలిపోయి సోమవారం ఆమె ఇంటికి వెళ్లాడు. భార్య సంఘమిత్రను, ఆమె తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జునూ ఘోష్లను పదునైన ఆయుధంతో హతమార్చాడు నిందితుడు నజిబూర్ రెహమాన్ బోరా(25). ఆపై తొమ్మిది నెలల బిడ్డను చంకనెక్కించుకుని గోలాఘాట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో నిందితులను ఎవరినీ ఉపేక్షించం. 15 రోజుల్లో ఛార్జిషీటు నమోదుచేసి నిందితుణ్ని ఫాస్ట్ట్రాక్ కోర్టులో నిలబెడతామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోం హోం మంత్రిత్వ శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తుండడంతో.. ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమించి బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తానని చెబుతున్నారాయన. -
మూడేళ్ల బంధం.. ముగ్గురి హత్యలతో విషాదాంతమైన లాక్డౌన్ ప్రేమ..
కరోనా లాక్డౌన్లో చిగురించిన ప్రేమను పెళ్లితో భద్రపరుచుకున్నారు. కానీ వారి సంబరం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడేళ్ల ప్రేమ బంధం.. ముగ్గురి హత్యలతో షాదాంతంగా ముగిసింది. ట్రిపుల్ మర్డర్ అనంతరం నిందితుడు తొమ్మిది నెలల శిశువును చంకలో ఎత్తుకొని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్ రెహ్మాన్(25), 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్లు 2020లో ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అదే సంవత్సరం అక్టోబర్లో ఇద్దరూ కోల్కతాకు పారిపోయారు. తరువాత సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్కతా కోర్టులో నజీబుర్ను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాతి ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ రావడంతో తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చదవండి: హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంట్లో నుంచి పరారయ్యారు. అయిదు నెలలపాటు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉన్నారు. తరువాత ఆ జంట ఆగస్టులో గోలాఘాట్కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతిగా ఉంది. వీరిద్దరూ నజీబుర్ ఇంటిలో జీవించడం ప్రారంభించారు. గత నవంబర్లో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు నెలల తర్వాత సంఘమిత్ర తన కొడుకుతో ఈ ఏడాది మార్చిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. నజీబుర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నజీబుర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన కొడుకును కలిసేందుకు ప్రయత్నించగా.. సంఘమిత్ర కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అనంతరంఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్పై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల కొడుకును చేతిలో ఎత్తుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులపై హత్యా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
పిల్లల ఫొటోల్ని షేర్ చేయకండి
గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. -
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
బలవంతగా ఫోటోలు తీసి, బట్టలు తొలగించమని.. స్టేషన్లో ఎస్ఐ వికృత చేష్టలు
గువాహటి: పోలీసులను రక్షక భటులని అంటారు. అయితే కొందరు మాత్రం రక్షించాల్సింది పక్కన పట్టి భక్షిస్తున్నారు. ఓ కేసు విషయమై స్టేషన్లోకి తీసుకువచ్చిన బాలికపై కన్నేశాడు ఓ అధికారి. ఏకంగా పోలీస్స్టేషన్లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 21న బాల్య వివాహాల కేసులో మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు రావడంతో, పోలీసులు పట్టుకుని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారి.. స్టేషన్లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ‘స్టేషన్లో ఆ అధికారి నన్ను బెదిరించాడు, బట్టలు తొలగించమని బెదిరించాడు. ఎస్ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. ’ అని ఫిర్యాదు చేసింది. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో అస్సాం డీజీపీ ఈ కేసుపై స్పందించారు. అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి రాగా, సబ్ ఇన్స్పెక్టర్ బిమన్ రాయ్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాయ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతని ఆచూకీ గురించి నల్బారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఎవరైనా సమాచారం అందిస్తే తగిన రివార్డ్ ఉంటుంది" అని రాయ్ ఫోటోతో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మైనర్లను స్టేట్ హోమ్లో కాకుండా పోలీస్ స్టేషన్లో ఉంచడం పోలీసుల తప్పిదమేనని నల్బరీ జిల్లా ఎస్పీ అంగీకరించారు. "మైనర్ల విషయంలో, కొన్ని సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి, వాటిని అందరు పోలీసు సిబ్బంది పాటించాలి. మైనర్లను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు" అని, వారిపై కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్టేట్హోమ్లో ఉంచిన బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు. చదవండి: వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది... -
వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం?
అసోంలోని బార్పేట జిల్లాలో వేలాది పక్షులు ఉన్నట్టుండి మృతి చెందిన విషయం కలకలం రేపుతోంది. వాటికి విషం పెట్టి చంపేశారని పలువురు భావిస్తున్నారు. ఈ చర్యకు బాధ్యులైన అరాచక శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ అరణ్యక్ డిమాండ్ చేసింది. పంటపొలాల్లో చచ్చిపడి.. విషప్రయోగంతో వేలాది పక్షులు మృతి చెందాయనే వార్త తెలియగానే పర్యావరణ సంరక్షణాభిషులు, పక్షిప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న పర్యావరణ ప్రేమికుడొకరు మాట్లాడుతూ అసోంలోని బార్పేట్ జిల్లాలోని జానియా గ్రామంలో వేలాది పక్షులకు విషం ఇచ్చారని, అవి పంటపొలాల్లో చచ్చిపడివున్నాయని తెలిపారు. ‘కఠిన చర్యలు తీసుకోవాలి’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం ఆ పక్షులు పంటపొలాల్లోని ధాన్యపు గింజలను తిన్నాక మృతి చెందాయి. పంటపొలాల నుంచి పక్షులను తరిమివేసేందుకే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న అరణ్యక్ సిఈఓ డాక్టర్ విభాబ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ, విషం కారణంగా వేల సంఖ్యలో పక్షులు మృతి చెందడం తనను ఎంతో కలచివేస్తున్నదన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించాలన్నారు. పంటలకు పక్షులు చేసే మేలు ఇదే.. యంత్రాలతో పోల్చిచూస్తే పక్షులు పంట దిగుబడికి ఎంతో సాయపడతాయని డాక్టర్ విభాబ్ కుమార్ అన్నారు. పంటలకు నష్టం కలిగించే కీటకాలు,పురుగులను పక్షులు తింటాయని, ఫలితంగా పంటనష్ట నివారణ జరుగుతుందన్నారు. అదేవిధంగా పక్షుల కారణంగా పంటపొలాల్లో రసాయన మందుల వాడకం తగ్గుతుందన్నారు. పక్షులు పంటపొలాల్లో తిరుగాడుతూ.. పరపరాగ సంపర్కం చేస్తాయని, ఫలితంగా మొక్కల జాతుల ఉత్పత్తి మరింత సులభమవుతుందన్నారు. అందుకే ప్రతీఒక్కరూ పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా? భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్పూర్, ఉదల్గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది. గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది. గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం! -
పెళ్లికూతురు గారి రోలర్ స్కేట్స్ డ్యాన్స్
‘పెళ్లి కూతురు డ్యాన్స్’ అనేది మనకు కొత్తేమీ కాదు. అయితే అస్సాంకు చెందిన అమ్రిన్ ఖురానా ఒక అడుగు ముందుకు వేసి రోలర్ స్కేట్స్ ధరించి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘ఆస్మాన్’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్కు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆల్ ఎబౌట్ డ్యాన్స్’ అనే డ్యాన్స్ స్కూల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్లోనే 1.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ‘మైండ్ బ్లోయింగ్’ ‘ఎనర్జీ ప్యాక్డ్ డ్యాన్స్’ ‘బ్రైడ్ ఆన్ వీల్స్’... ఇలాంటి కామెంట్స్ మాట ఎలా ఉన్నా ‘పెళ్లి సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు!’ అని మందలించిన వారు కూడా ఉన్నారు. -
బాలికపై అమానుషం.. కాలితో తన్ని.. మినిష్టర్ భార్య నిర్వాకం
అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు. బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్. కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా? -
మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్ప్రెస్ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి
గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వ్యాన్ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. గువాహటిలోని జలూక్బరీ ప్రాంతంలో ఓ కారు(01 GC 8829) ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా గువాహటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. కారు.. వ్యాన్ను ఢీకొనే ముందు డివైడర్ను ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారు.. - అరిందమ్ భల్లాల్ - నియోర్ దేకా - కౌశిక్ మోహన్ - ఉపాంగ్షు శర్మ - రాజ్కిరణ్ భుయాన్ - ఎమోన్ గయాన్ - కౌశిక్ బారుహ్ తీవ్రంగా గాయపడిన వారు.. - అర్పాన్ భుయాన్ - అర్నాబ్ చక్రవర్తి బొంగైగావ్ - మృన్మోయ్ బోరా. ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..