అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా | 19 Bombs Planted Across Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో కలకలం..19 చోట్ల బాంబులు అమర్చిన ఉల్ఫా

Published Thu, Aug 15 2024 1:57 PM | Last Updated on Thu, Aug 15 2024 2:34 PM

19 Bombs Planted Across Assam

అస్సాంలో రాష్ట్ర సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా) కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు 19 బాంబులు అమర్చినట్లు గురువారం ప్రకటించింది.  

ఎగువ అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొద్ది సేపటికే శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో తమ ఉనికిని  చాటుకుంటామని తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆపరేషన్‌ను విరమించుకుంది.  

పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని వెలికితీసి నిర్విర్యం చేయాలని అభ్యర్థించింది. బాంబులు ఎక్కడెక్కడ అమర్చిందో వాటి ప్రాంతాల్ని సైతం వెల్లడించింది.

కానీ టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు చెప్పింది. కానీ కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించలేకపోయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement