18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు
ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్లోని కల్యాణ్పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు.
మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ.
Breadcrumb
మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
Published Tue, May 26 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Related news by tags
-
పసికూనను చిత్తు చేసిన పాక్... సెమీస్ రేసులో
వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్తో తలపడింది. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్లో నేపాల్పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్రేటు +3.298)గా ఉంది.పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు -
దేశ బడ్జెట్ని మార్చగలిగేది మహిళలే! ఎలాగంటే..!
గృహిణిగా ప్రతి ఇల్లాలు తన ఇంట్లో చేసే ప్రతి పని కుటుంబ బడ్జెట్నే గాక దేశ బడ్జెట్ని కూడా మార్చగలదు. వంటింట్లో మండే గ్యాస్ నుంచి తినే ఆహార పదార్థాలు, తాగిపడేసి బాటిల్ దాక ఆమె చేసే ప్రతి పని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కడైనా ఆమె అజాగ్రత్తగా వృధా చేసిందా అది కుటుంబ బడ్జెట్నే కాదు దేశ ఆర్థికవ్యవస్థపైనే భారం పెంచేస్తుంది. ఓ మహిళగా మనం ఆచరిస్తేనే..మన కుటుంబం దాన్ని ఫాలో అవుతుంది. అదికాస్త దేశ బడ్జెట్నే మారుస్తుంది. అదెలాగో చూద్దామా..!ఫుడ్: ఇంట్లో వండిన అన్నం పిల్లలు తినకపోవడం వల్లనో వృధా అయిపోతుందా. ప్రతిరోజూ వండిన అన్నం కూరలు డస్ట్బిన్ పాలు చేస్తున్నారా!. ఇలా దేశంలోని లక్షలాది మంది చేస్తే వృధా అవుతున్న ఆహార పదార్థాల విలువ ఏకంగా ఏటా రూ. 92 వేల కోట్లుకి చేరుతుంది. ఇది మన జీడీపీలో ఒక శాతం కన్నా ఎక్కువ. అంతేగాదు గణాంకాల ప్రకారం..దేశంలోని ప్రతి ఒక్కరూ ఏటా కిలోల కొద్ది ఆహార పదార్థాలను మట్టిపాలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి దీన్ని పండించడానికి రైతు ఎంత శ్రమ పడతాడో తెలుసా..!. అది మన మన దాకా చేర్చడానికి ఎంతమంది, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వస్తుందో తెలుసుకుంటే కచ్చితం వృధా చేసే సాహసం చేయరు. ఈ రోజు నుంచే ఈ వృధాని నివారిద్దాం.వాటర్: నీళ్లే కదా అని తీసి పారేయొద్దు. ప్రభుత్వం ఈ నీటి కోసం ఏటా రూ.69 వేల కోట్లు పైనే ఖర్చు చేస్తోంది. మనం నిర్లక్ష్యంగా కట్టికట్టనట్లుగా ట్యాప్ని వదిలేస్తున్నాం. ఇది వ్యర్థ జలంగా మారపోతుంది. ఇలా మన దేశంలో వృధాగా వెళ్తున్న నీరు ఏడున్నర కోట్ల లీటర్లని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి 60 శాతం పైగా నీరు మరుగునీరుగా మారిపోతున్నాయి. వీటిని వాడకంలోకి తీసుకురావాలంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే. మహిళలు ఇక్కడ కాస్త బాధ్యతతో వ్యవహరిస్తే కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకునేందుకు ముందుకొస్తారు. అలా కుటుంబంతో సహా మొత్తం దేశంలో అందరిలోనే నెమ్మదిగా మార్పు వస్తుంది.కరెంట్: దేశవ్యాప్తంగా కరెండ్ వృథా ఎంతంటే ..రోజూకి ఐదు కోట్ల యూనిట్లు. ఈ విద్యుత్ శక్తి తయారీకి అయ్యే ఖర్చు చూస్తే ఏకంగా రూ. 12 కోట్లుపైనే. మరీ ఈ భారం పడేది మనపైనే. అలాగే రేపు విద్యుత్ కొరత తలెత్తితే ఇబ్బంది పడేది కూడా మనమే. అందుకే ఇప్పటి నుంచే ఇంట్లో ప్రతి గదిని చెక్ చేసి మరీ లైట్లు, ఫ్యాన్ల స్విచ్లను ఆపేద్దాం.ప్లాస్టిక్ పనిపడదాం: ఇంట్లో ఏ సరకులు తేవాలన్నా క్యారీ బ్యాగ్ తప్పనిసరి. వాటర్ బాటిల్ నుంచి పాల ప్యాకెట్ వరకు ప్రతిదీ ప్లాస్టికే. ఏటా 74 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తగా మారుతుంది. దీన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత నష్టాన్నీ... కాలుష్యం వల్ల వచ్చే కష్టాన్నీ అన్నింటినీ మనమే భరించాల్సి వస్తోంది. అందువల్ల ఈ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు తెలుసుకుని వాటిని అలవాటు చేసుకుందాంవంట గ్యాస్: మన వంటింట్లో వెలిగే గ్యాస్ పొయి అంటే మనకు ఎంత నిర్లక్యమో చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఏదో కూర మాడడం లేదా వెలిగించి కట్టడం మర్చిపోవడం వంటివి చేస్తూ అగ్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. నిజానికి కాస్త తెలివితో నాణ్యమైన స్టౌ ఎంచుకుంటే చక్కగా ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చు. మనకు కూడా గ్యాస్కి పెట్టే ఖర్చు తగ్గుతుంది కూడా. ముఖ్యంగా బర్నర్లు, పైపులు, రెగ్యులేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవన్నీ సక్రమంగా ఉన్నాయా..ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కోట్లాది రూపాయాలు ఖరీదు చేసే ఇంధనం వృధా కాకుండా నివారించొచ్చు. అందువల్ల ప్రతి ఇల్లాలు ఇంట్లో చేసే ప్రతి పనిని జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించి.. వృధాకు అడ్డుకట్ట వేస్తే కుటుంబ బడ్జెటే కాదు దేశ బడ్జెట్ని అదుపు చెయ్యొచ్చు..లాభాలు పొందొచ్చు.(చదవండి: Union Budget 2024-25: మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్) -
మహిళలను వేధిస్తున్న జుట్టు రాలిపోయే సమస్య
వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్, మనం తినే ఆహారపు అలవాట్లు, నీరు, వాయు కాలుష్యం, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో ఒత్తిడి, నిద్రలేమి, చుండ్రు, పీసీఓఎస్, మాతృత్వం, ఇలా ఎన్నో కారణాల వల్ల పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రాయా అనే సంస్థ చేట్టిన సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఏడెనిమిది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. ఆ వివరాలను పరిశీలిస్తే.. జుట్టు రాలడంపై ట్రాయా సంస్థ దేశంలో మొత్తం 2.8 లక్షల మంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. అందులో మొత్తం 71.19 శాతం మహిళలు జట్టు రాలిపోతుందని తెలిపారు. దీనికి గల కారణాలను, వారి అనుభవాలను సైతం పంచుకున్నారు. 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు గల మహిళల్లో 51 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నామన్నారు. దాదాపు ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి కేశ సంపద పోతుందని తేలింది. అయితే మహిళలు జుట్టు రాలిపోవడంపై బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరని సర్వేలో స్పష్టమైంది. అనేక కారణాలుకురులు రాలిపోవడానికి ప్రధానంగా పని ఒత్తిడి, ఆరోగ్యం పరంగా బలహీనంగా ఉండటం, హార్మోన్ హెచ్చుతగ్గులు వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. జుట్టు రాలిపోయే సమస్య ఉన్న మహిళల్లో ఏకంగా 88.6 శాతం మంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది. ఒత్తిడి, అధికంగా ఆందోళన వంటి అంశాలు జుట్టు రాలిపోవడానికి అధికంగా దోహదపడతాయని స్పష్టమయ్యింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారిలో 48.14 శాతం స్త్రీలు నిద్రలేమితో బాధపడుతున్నారట. కురులు రాలిపోవడానికి చుండ్రు కారణమని 70 శాతం మంది చెబుతున్నారు. అంతే కాకుండా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల మహిళల్లో పీసీఓఎస్ హెచ్చుతగ్గులు కారణంగా కనిపిస్తోంది.పరిష్కార దిశగా..‘జుట్టు రాలడం అనేది ప్రధానంగా పురుషులు మాత్రమే ఎదుర్కొనే సమస్యగా కాదు. చాలా మంది మహిళలు శిరోజాలు రాలడాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకోవడం, సమర్థవంతంగా పరిష్కరించడంలో మా అధ్యయనం సహాయపడాలన్నది లక్ష్యం. – సలోనీఆనంద్, ట్రాయా సహ వ్యవస్థాపకురాలుసరైన ఆహారం తీసుకోవాలిజుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పోషకాహర లేమి, హార్మోన్లలో మార్పులు, ఒత్తడితో జుట్టు రాలిపోతోంది. దీర్ఘకాలిక సమస్యలకు వాడే మందులూ దీనికి కారణమే. సరైన డైట్ పాటించి.. జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, పండ్లు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి మంచిది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టుఏ వయసు వారిలో ఎందుకు జుట్టు రాలిపోతోంది.. 18 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో ఒత్తిడి, పీసీఓఎస్, చుండ్రు 31 నుంచి 40 ఏళ్లు వయసు వారిలో ఒత్తిడి, పీసీఓఎస్, ప్రసవానంతరం 40 ఏళ్లు పైబడిన వారిలో ఒత్తిడి, మోనోపాజ్, థైరాయిడ్ -
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం
జమ్ముకశ్మీర్లోని బట్టాల్ సెక్టార్లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు. -
జమ్మూలో 40 మందికి పైగా పాక్ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు
భారత్లో పాక్ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్ ప్రారంభించాయి..పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.
Related News by category
-
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.
Advertisement