kalyan
-
గ్రీన్ సిగ్నల్?
రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ‘మ్యాడ్’ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి, ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట.స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. దీంతో స్క్రిప్ట్పై మరింత ఫోకస్ పెట్టారట కల్యాణ్ శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని, అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం. -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
ముంబై లోకల్ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబై లోకల్ ట్రైన్లో ఘాట్కోపర్ నుంచి కళ్యాణ్ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. లోకల్ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్లో కేరళలో నిర్మల వందేభారత్ రైలులో ప్రయాణించి అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. -
'ఆ ఊరి అమ్మాయిలకు నల్లగా ఉండే వాళ్లంటేనే ఇష్టం'..!
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోల్డెన్ మీడియా, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మెగాస్టార్ ప్రశంసలు.. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని మెగాస్టార్ అభినందించారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్తోనే నవ్వులు తెప్పిస్తోన్న ఈ చిత్రం.. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. MEGASTAR #Chiranjeevi garu launched the trailer of #SundaramMaster @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA All The Best #SundaramMasterOnFeb23rd Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/OnmGjU2hVa — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2024 -
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ అవుట్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా అధీర అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు విడుదల చేశారు. ఈ ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ను హాలీవుడ్లో రెంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ను చూపించారు. చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. -
హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్కార్ట్ కొరియర్ బోయ్స్గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్కార్టు హబ్కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
8 కోట్ల ఖరీదైన కారు.. మరి 35 వేలకు కక్కుర్తి ఎందుకు?!
ముంబై: శివసేన నేత, కళ్యాణ్కు చెందిన వ్యాపారవేత్త సంజయ్ గైక్వాడ్కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఖరీదైన కార్లలో తిరిగే మీకు.. ఇదేం దొంగ బుద్ధి.. సార్’’ అంటూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ హితవు పలుకుతున్నారు. అసలేం జరిగిందంటే.. సంజయ్ గైక్వాడ్ విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎమ్ఎస్ఈడీసీఎల్) ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. తూర్పు కళ్యాణ్ ప్రాంతంలో గల కోక్సెవాడిలో ఉన్న గైక్వాడ్కు చెందిన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విద్యుత్ చైర్యం గురించి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రూ. 34,840 బిల్లుతో పాటు 15 వేల జరిమానా విధిస్తున్నట్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. జూన్ 30న ఎమ్ఎస్ఈడీసీఎల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం(జూలై 12)న సంజయ్ గైక్వాడ్ పెనాల్టితో కలిసి మొత్తం 49,840 రూపాయలు చెల్లించారు. ఈ మేరకు విద్యుత్ సంస్థ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన శివసేన శ్రేణులు.. సంజయ్ గైక్వాడ్పై వచ్చిన ఆరోపణలు సరికావని, ఆయనకు విద్యుత్ చౌర్యంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా సంజయ్ గైక్వాడ్ ఇటీవలే సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కారు ఖరీదును ప్రస్తావిస్తూ నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. -
ప్రభుదేవతో రొమాన్స్ చేయనున్న కాజల్..
‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇక్కడ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఆఫర్లును అందిపుచ్చుకుంటూ అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే కాజల్, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన హీరోయిన్లు సినిమాల్లో వేగం తగ్గించడం వల్ల వారికి అవకాశాలు తగ్గుతాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ కాజల్ మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అని పూర్తిగా సినిమాలకే అంకితం కాకుండా అటూ భర్త కిచ్లుకు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ సినీ కెరీర్ను బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది) దీనితో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. అంతేగాక డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’లో నటించేందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంంది కాజల్. తాజాగా ప్రముఖ కోరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నదంట ఈ ‘చందమామ’ బ్యూటీ. తమిళ చిత్రం ‘గులేబకావలి’ ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రోమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రభుదేవా 50వ చిత్రం ‘పోన్ మణికవేల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, దిషా పటానీలు జంటగా నటిస్తున్న ‘రాధే’ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!) -
చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు
సాక్షి, హైదరాబాద్: ‘సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయి’ అని నటుడు, నిర్మాత కల్యాణ్ ఆరోపించారు. దాదాపు రూ. 300 కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. సత్యమేవ జయతే అనే ప్యానల్ తరఫున ఒ.కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా చిత్రపురి కాలనీకి సంబంధించి అవినీతి జరుగుతూనే ఉందన్నారు. ఈ విషయంపై నిర్మాత సి. కల్యాణ్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.8 కోట్ల సబ్సిడీ ఇచ్చారని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.6 కోట్లు ఎటు పోయిందని ఒ.కల్యాణ్ ప్రశ్నించారు. హౌసింగ్ సొసైటీని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో అనిల్కుమార్ కావూరి, ఈశ్వరప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహారెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వైవి, శ్రీనివాస్ కూనపురెడ్డి, ఆత్మకూరు రాధ, మల్లికా టి, మధు జాటోత్ పాల్గొన్నారు. -
విజయశాంతిగారిలా పాయల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి
‘‘డబ్బులకోసం కాకుండా ప్యాషన్తో సినిమాలు తీస్తున్నారు కల్యాణ్గారు. ఈ కథని నమ్మి బడ్జెట్కి వెనకాడకుండా చాలా రిచ్గా ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ సాధింబోతున్నారు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. చాలా మంచి సినిమాలు చేశాడు, కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్గా తనకి పెద్ద బ్రేక్ రావాలి. తేజస్, పాయల్కి ఈ సినిమా మంచి పేరు తేవాలి. పాయల్ రాజ్పుత్ ఈ సినిమాతో విజయశాంతిగారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘యుక్త వయసులో జీవితాన్ని సరదాగా గడపాల్సిన టైమ్లో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుపక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఓ అమ్మాయి ఏ విధంగా పోరాడింది? అనేది మా చిత్ర కథాంశం. ఈ సినిమా తర్వాత పాయల్ మరో విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. ‘ఆర్డీఎక్స్ లవ్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నా. ఈ బ్లాస్టింగ్ హిట్తో కల్యాణ్గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపెనీ అవుతుంది’’ అని శంకర్ భాను అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన కల్యాణ్ గారికి, చక్కగా తెరకెక్కించిన శంకర్ భానుగారికి థ్యాంక్స్’’ అన్నారు తేజస్ కంచెర్ల. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ‘ఆర్డీఎక్స్ లవ్’ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. విద్య పరంగా ఆలోచింపచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. మనసును హత్తుకునే సినిమా ఇది’’ అని పాయల్ రాజ్పుత్ అన్నారు. నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా, సహ నిర్మాత: సి.వి. రావ్. -
ముంబై అతలాకుతలం.. వర్షాలకు 22మంది మృతి
సాక్షి, ముంబై/పుణె: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలకుతలమవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. ముంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడకూలి 13 మంది మృతిచెందారు. ఇంకో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే.. సంఘటన జరిగిన పింపరీపాడ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు స్పందించి పలువురినని శిథిలాల నుంచి బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేగావ్లోనూ.. పుణెలోని అంబెగావ్లోనూ విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు అంబేగావ్లోని సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుఝామున జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి తడిచిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మరోవైపు ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ్ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ కల్యాణ్ ప్రాంతంలోని దుర్గ ఆలయానికి అభిముఖంగా ఉన్న జాతీయ ఉర్దూ పాఠశాల గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
మరో థ్రిల్లర్కు హన్సిక రెడీ
అందాల భామ హన్సిక మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించనున్నారు. మహా చిత్రంతో అర్ధ సెంచరీ కొట్టేసిన ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం నటుడు అధర్వతో రొమాన్స్ చేసిన 100 చిత్రం 9వ తేదీన తెరపైకి రానుంది. కాగా మహా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. అంతే కాదు మహా చిత్రంలో హన్సిక పలు గెటప్లలో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కథ సొల్లపోరేర్, గులేభకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్ తాజాగా నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్పాట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్టైయిన్మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో తదుపరి చిత్రానికి కల్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఈ సారి కల్యాణ్ సూపర్ నేచులర్ థ్రిల్లర్ కథను తయారు చేసుకున్నారు. ఇందులో నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నారు. కల్యాణ్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన గులేభకావళి చిత్రలోనూ హన్సిక లీడ్ రోల్లో నటించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో హన్సిక మరోసారి కల్యాణ్ దర్శకత్వంలో నటించడానికి ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
యూఫోరియా
హంటగన్ దానా పాయింట్ దగ్గర కళ్యాణ్, నేను కారు దిగుతున్నాం. అప్పటికే వెన్నెల, అంజని దిగి పోయారు. పార్కింగ్ దొరక్కపోవడం వల్ల కళ్యాణ్ కారు పార్క్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పసిఫిక్ కోస్ట్ మీద అలా నడుస్తుంటే వాతావరణం సుందరంగా విచిత్రంగా అనిపించింది. తల వంచుకుని కళ్యాణ్, వెన్నెల వెంట కొంత దూరం నడిచాను. నడుస్తున్నానే కాని మనసంతా ఆలోచనతో మునిగి పోయింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లగునా హిల్స్లో మా అమ్మాయి వెన్నెల, అల్లుడు కళ్యాణ్ ఉంటారు. ఓ వారం క్రితం నేను అంజని అమెరికా వచ్చాం ఫసిఫిక్ ఓషియన్ చూడటానికి.ఫసిఫిక్ ఓషియన్ సందడిగా ఉంది. కొందరు అలలతో భలే సందడిగా రైడ్ చేస్తున్నారు. కొందరు అలలతో విన్యాసం చేస్తున్నారు. దీన్ని వాళ్ళు సర్ఫింగ్ అంటారట. పెద్ద గ్యాంగ్ మరొక చోట డోలక్ వాయిస్తున్నారు. వివిధ రకాలైన దుకాణాలు, అమ్మకాలు...విచిత్రమేమిటంటే ఎవరి మొహమైనా నిమిషం చూస్తే చాలు, హలో అంటూ పలకరిస్తారు.వెన్నెల మా ముగ్గురిని నిలబెట్టి ఫొటో తీసింది. తరువాత కళ్యాణ్, నన్ను వెన్నెలని అంజలిని ఫొటో తీశాడు. కాని నలుగురూ ఒకేసారి దిగాలంటే ఎలా ?‘‘షల్ ఐ టేక్ ఫొటోగ్రాఫ్ ?’’ ఒక తీయని గొంతు వినిపించింది. నేను వెంటనే ఆ వైపు చూశాను.ఓ..యూఫోరియా ... నేను పైకే అనేశాను. ఆమె దగ్గరగా వచ్చింది.యూఫోరియా...యూఫోరియా...అన్నాను. ఆమె మరీ దగ్గరగా వచ్చి వెన్నెల చేతిలోని కెమెరా తీసుకొంది. కాదు..ఆమె యూఫోరియా కాదు. వేరే అమ్మాయి. యూఫోరియా లాగే ఉంది కాని ఈమె కళ్ళు అంత విశాలంగా లేవు. ఆ అమ్మాయి మా నలుగురినీ ఫొటో తీసింది. నాకెందుకో నిట్టూర్పు వచ్చింది. యూఫోరియా మళ్లీ కనబడుతుందా? కనబడ్డా నన్ను గుర్తిస్తుందా ? ఎలా ఆమెను మళ్లీ చూడటం...కృతజ్ఞత వల్లనా...దానికంటే ఎక్కువ ఏదైనా ఉందా ? ఏమో మరి.కృతజ్ఞత అంటే కాదా మరి ? ఆమె చేసింది తక్కువేమిటి ? నేను ఇసుకలో పడుకొని కళ్ళు మూసుకున్నాను.లగునా హిల్స్లో రెటినా అపార్ట్మెంట్ చాలా పెద్దది. వెయ్యి అపార్ట్మెంట్లుంటాయి, దాదాపు అన్ని దేశాలవాళ్ళు అందులో అద్దెకుంటారు. ప్లాట్లకు మధ్యలో కింది భాగంలో ఒక స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో పైన చిన్న చిన్న గుడారాలు. దాని పైన ఈతలో అలసిపోయిన వాళ్ళు పడుకోవడానికి అనువైన చైయిర్లు, వాటి ప్రక్కన యాష్ ట్రే, ఈత తరువాత మళ్ళీ స్నానం చేయడానికి షవర్లు, బాత్ టబ్లు స్విమ్మింగ్ పూల్ పక్కనే జకూజీ ఉంది. జకూజీ ఆన్ చేసి లోపలి దిగాలి. మనిషికి పొట్ట పై భాగం వరకు నీళ్ళు ఉంటాయి. ఆన్ చేసిన వెంటనే వెచ్చని నీళ్ళు వస్తాయి. చిన్న హోల్స్ నుండి నీళ్ళు తడలు తడలుగా వస్తాయి. హోల్ పైన శరీరంలో ఏ భాగం ఆనించినా మసాజ్ చేసినట్టుగా ఉంటుంది.అమెరికా వచ్చే ముందు చాలా ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల నా కుడి భుజం విపరీతమైన నొప్పి లేచింది. డాక్టర్స్ మజిల్స్ ఫ్రీజ్ అయ్యాయని అన్నారు. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గలేదు. జకూజీలోకి దిగి కాసేపు వేడినీళ్ళ మసాజ్ పెట్టుకొని, పక్కనే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేవాణ్ని. ఎప్పుడో మా ఊరి మర్రిబావిలో ఈదినట్టు గుర్తు. మళ్ళీ ఈత కొట్టే అవకాశం అమెరికాలోనే వచ్చింది. ఇటు నొప్పి తగ్గుతుంది అటు ఈత కొట్టే సరదా కూడా తీరుతుంది.ఇదంతా ప్రతి రోజూ ఉదయం నాకొక దినచర్య అయింది. ఒకరోజు ఎప్పటిలాగే వెళ్లి జకూజీ ఆన్ చేశాను. బట్టలు విడిచి వాల్ దగ్గర పెట్టి ఈతకు ప్రత్యేకంగా వేసుకునే నిక్కరుపై జకూజీలోకి దిగాను. యథాలాపంగా భుజాన్ని జకూజీలోని ఓ మూల హోల్కి ఆనించాను. ఉన్నట్టుండి జకూజీ నుండి వేడి నీటి తీవ్రత పెరగసాగింది. నేను గుర్తించే లోపలే నీటి వేడి విపరీతమైపోయింది. బయటకు వెళ్ళే వరకు బతుకుతానా అనిపించింది. జ్వాలలతో కూడిన నీటితో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. గట్టిగా అరిచాను, హెల్ప్..హెల్ప్ అని.ఒకమ్మాయి స్విమ్మింగ్ పూల్ నుండి పరుగెత్తుకొచ్చింది. జకూజీ స్విచ్ ఉన్న దగ్గరికి వెళ్లి స్విచ్ ఆఫ్ చేసింది.అతి వేడి సాధారణమైన వేడిగా మారుతూంది. అయినా నేను తట్టుకోలేక పోతున్నాను. మంట.. మంట.. ఒళ్లంతా మంట. మెల్ల మెల్లగా నడుస్తున్నాను నీటినుంచి బయటకు రావడానికి. ఆమె గబగబా జకూజీలోకి దిగింది. నా వీపు మీద చేయి వేసి ‘‘కమాన్ ...నో ప్రాబ్లం. ఇట్స్ ఓ.కే’’ అంటూ నన్ను నడిపించింది.పూర్తిగా బయటకు వచ్చాను. ఆమె నన్ను తీసుకెళ్ళి పడక కుర్చీలో కుచోపెట్టింది. ఆమె గబా గబా వెళ్లి స్విమ్మింగ్ పూల్ నుండి ఓ బకెట్ చల్లని నీళ్ళు తెచ్చి నా పైన గుమ్మరించింది. ఒక గుడ్డను తడిపి నా ఒంటిని రుద్దసాగింది. నేను వారించ బోయాను, ‘‘ఓకే... ఇట్సోకే.. రిలాక్స్’’ అంటున్న మాటలు నాకు వినిపించీ వినిపించనట్టు వినిపిస్తున్నాయి. మా ఇంట్లోవాళ్లసెల్ నంబర్ చెప్పమంది. మా అమ్మాయి నంబర్ ఇచ్చాను. ఆమె ఫోన్ చేసింది. మా అమ్మాయి ఫోన్ ఎక్కడ పెట్టిందో ఎత్తలేదు. ఓ పావు గంట గడిచింది. ఆమె చల్లని చేయి నా భుజాల్ని స్పృశిస్తూనే ఉంది. ఒళ్ళు చల్ల బడింది. మెల్లగా తేరుకున్నాను. నెమ్మదిగా లేవబోయాను నా బట్టలవైపు చూస్తూ. ఆమె అక్కడే పెట్టుకున్న నా బట్టలు అందించింది. టవల్తో నెమ్మదిగా తుడుచుకున్నాను. ఆమె సెల్ మ్రోగింది. వెంటనే పికప్ చేసి హలో అంది.‘‘వాట్ హాప్పెండ్ టు దిస్ జకూజీ’’ నెమ్మదిగా అడిగాను.‘‘ఇస్ దేర్ సమ్ టెక్నీషియన్ అవైలబుల్’’ మళ్లీ అన్నాను.ఆమె సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసి గబ గబా తన దుస్తులు ఉన్న దగ్గరికి వెళ్ళింది. తన స్లీవ్లెస్ బనియన్ పైనుండి శాలువా కప్పుకొని ‘‘ఓ.కే. బై టేక్ కేర్’’ అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి పోయింది. దేవతలాగా వచ్చింది.కనీసం థాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నన్ను నేను ఎంతగా నిందిచుకుంటే ఏం లాభం? మిస్ కాల్ చూసి వెన్నెల ఫోన్ చేస్తోంది. ఫోన్ శబ్దం వింటూ బట్టలు వేసుకున్నాను. నిక్కరు పై నుండే లుంగీ కట్టుకొని నెమ్మదిగా నడుస్తూ స్విమ్మింగ్ ఫూల్ గేటు దాటి లిఫ్ట్ వైపుకి వెళ్లాను. అంతా చెప్పి ఆనవాళ్ళు చెప్పి ఈ అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటుంది? అని అడిగాను. ‘‘అలా చెప్పడం కష్టం, ఎన్నో కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్స్లో పోలికలు చెప్పి ఎలా తెలుసుకోగలం?’’ అంది వెన్నెల.‘‘ఎట్లా మరి?’’ అడిగాను.‘ఏముంది? మళ్లీ కనిపించినపుడు ఆనవాళ్ళు పట్టి గుర్తు పట్టడమే’’‘‘పేరైనా అడిగారా’’ ?‘‘అడగలేదు’’ నాలో నేను గొణుగుకున్నాను. నాకు నేనే ఆమెకు పేరు పెట్టుకున్నాను. యూఫోరియా!కొద్ది రోజులకు మేం లాస్ ఏంజిల్స్ నుండి లాస్ వేగాస్కి బయలుదేరాం. సొంత కారు సర్వీసింగ్ చేయబడి లేకపోవడం వల్ల కళ్యాణ్ వెన్నెల ఒక పెద్ద కారు అద్దెకు తెచ్చారు. లాస్ వేగాస్ విద్యుద్దీపాలకు పుట్టిల్లుగా ఉంది. ఎటు జూసినా కాంతుల వెల్లువ. లాస్ వేగాస్ ప్రవేశిస్తుంటే చెప్పలేని ఉత్సాహం, ఆకాశాన్నంటే సుందరమైన మేడలు,ట్రంపు హోటల్ ఒకటుందీ. చాలా కాస్ట్లీ అట. వెన్నెల చెప్పింది.‘’అదిగో...నాన్నా...మనం ఉండబోయే హోటల్’’ వెన్నెల దూరం నుంచి చూపించింది. స్ట్రాటోస్పియర్ హోటల్, నూటారెండు ఫ్లోర్లు. దిగ్భ్రమకు లోనయ్యాను. దూరం నుంచి చూస్తే ఒక ఎత్తయిన çస్తంభం లాగా కనబడుతుంది. కళ్యాణ్ మేం ఉండబోయే గదికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అరగంటలో వచ్చాడు. హోటల్లోనే సుమారు అరకిలోమీటరు నడచి, లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాం.గుండ్రని రెస్టారెంట్ అది. కూల్ డ్రింక్, బీర్, ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డరిచ్చి సోఫాలలో కూచున్నాం. రెస్టారెంట్ గుండ్రంగా మెల్లగా తిరుగుతుంటుంది. లాస్ వేగాస్ ఎక్కడో కింద కనబడుతుంటుంది. విద్యుద్దీపాలు భూమికి మొలచిన నక్షత్రాలలాగా కనబడుతున్నాయి. పై భాగం నూటారెండవ భాగం స్లోగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే భూమి మీద మిణుగురుల్లాగా మెరిసిపోతున్న దృశ్యాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి. అంతా ఒక అద్భుతం...సోఫాలో మాకు నాలుగవ వరుసలో కూచున్నది ఒకామె ...ఆమె.. ఆమె..యూఫోరియా!యూఫోరియా...నేను పెద్దగా అరిచాను. గ్లాస్ పక్కకు పెట్టి గబగబా దగ్గరకు వెళ్లాను. ఆమె కుడిచేతిలో డ్రింక్ ఉంది. ఎడమచేతిలో పొగలు కక్కే సిగరెట్ ఉంది. నేను దగ్గరకు వెళ్లి నిలబడ్డాను. ఆమె క్రిందికి చూస్తున్నదల్లా తల త్రిప్పి డ్రింక్ సిప్ చేస్తూ నావైపు చూస్తుంది.‘’హలో’’అన్నాను.ఆమె అట్లాగే నావైపు చూస్తూ హలో అంది. తన ముందు సోఫాను సూచిస్తూ ‘‘ప్లీజ్ బీ సీటేడ్’’ అంది.ఇంకొంచెం పరీక్షగా చూశాను. ఈమె యూఫోరియా కాదు. యూఫోరియా పెదాలు ఎర్రనివి. ఈమె బాగా లిప్స్టిక్ వేసుకున్నా ఆ అందం రాలేదు. అయాం సారీ ...‘‘యు ఆర్ రెసెంబ్లింగ్ మై ఫ్రెండ్, అయాం మిస్టేకెన్’’ నేను లేస్తూ అన్నాను. ‘‘ఇత్స్ ఓకే’’ అంది. వెనుతిరిగి వచ్చాను. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు.∙∙ మరో రెండు రోజుల్లో ఆ హోటల్ ఖాళీ చేశాం. ఉదయమే అంటి లొప్ కెన్యాన్ కి బయలుదేరాం. అట్లా ఒక ఐదు గంటలు ప్రయాణించాక ఒక సెంటర్కి చేరుకున్నాం. అక్కడ నుండి కెన్యాకి వాహనాలు వెళ్ళవు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ట్రక్కులో బయలుదేరాం. దారంతా ఇసుకమయంగా ఉంటుంది. దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ట్రక్కు డ్రైవర్ ఒక రెడ్ ఇండియన్. ప్రయాణం జరిగినపుడు అతను తనపద్ధతిలో చెప్పాడు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రెడ్ ఇండియాన్స్ కే వదలి వేసిందట. రెడ్ ఇండియన్స్ అదంతా తమ సొంతంగా భావిస్తుంటారు. మూలవాసులకు అట్లాంటి ప్రాధాన్యత దొరకడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. కచ్చా రోడ్ మీద ఊగుతూ వెడుతుంది వాహనం. అమెరికాలో కూడా అట్లాంటి రోడ్లున్నయన్నమాట.లాస్ వేగాస్లోనే అజయ్, ప్రతిమలు కలిశారు. వెన్నెల, కళ్యాణ్ కుటుంబ స్నేహితులు వాళ్ళు. అంటీ లోప్ కెన్యాన్కి మరో కారులో వచ్చారు. ట్రక్కు దగ్గర అందరం కలుసుకొన్నాం.అంటిలోప్ కెన్యాన్ లోపలి వెడుతుంటే చిన్నప్పుడు చూసిన జానపద సినిమాలు గుర్తొచ్చాయి. కొండల నడుమ చీకటి లోపలికి నడచి వెడుతున్నటనిపించింది. మధ్యలో శ్వాస ఆడకపోతే ఎలా? కొంచెం భయం వేసింది. ఇంతమంది ఉన్నారు. నాకే సమస్యా? ధైర్యం తెచ్చుకొని కొనసాగాను. లోపలికి వెడుతుంటే చీకటి. ..పైన బిలం నుంచి కొంత వెలుగు.్ర కమంగా భయం పోయింది. నూతనోత్సాహం వచ్చింది. మాతో వచ్చిన గైడ్ (డ్రైవర్ ) విషయాలు చెప్పుకొంటూ పోతున్నాడు. అవి చారిత్రకాంశాలు కావు. కల్పిత కథలే.అంటిలోప్ కెన్యాన్లో నేనెందుకో ఒక చోట వెనుకబడి పోయాను. అంతా ముందు వెళ్లి పోయారు. ఆ బిలాన్ని చూస్తూ సంభ్రమంగా నేను ఒక చోట ఉండిపోయాను.నా వెనుకే వీడియోలో దృశ్యాన్ని బంధిస్తూ పైకి చూస్తోంది ఒకామె. ఆమె వీడియో తీస్తూ తీస్తూ నా వైపు తిరిగింది. ఆమె కెమెరా తీసి మెడకు తగిలించుకొంది. ఆశ్చర్యం ...ఆమె యూఫోరియా...దగ్గరికి పరిగెత్తాను. ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది. హలో అన్నాను. ఆమె హలో అంది జుట్టు సవరించుకుంటూ,పూర్తిగా దగ్గరికి వెళ్ళాక తెలిసింది ....ఆమె యూఫోరియా కాదు. యూఫొరియా నా కంటే మూరెడు పొడుగుంటుంది. ఈమె కూడా నా కన్నా పొడవేవుంది. కాని అంత పొడవు లేదు. నాకు నిరాశ కలిగింది.‘’ఐ రెమేనడ్ హియర్, అయాం అఫ్రైడ్ అఫ్ గోయింగ్ ఎలోన్’’ అన్నాను ఏమనాలో తెలియక.‘’ఓ, కమ్ ఎలాంగ్ విత్ మీ, దెన్’’ ఆమె దారి తీస్తూ అంది.∙∙ తరువాత రెండు రోజులకు లాస్ వేగాస్కి తిరిగివచ్చాం. లేక్ వ్యూ గదిలో నది ప్రక్కనే గడపడం, బోట్ రైడింగ్, గ్రాండ్ కెన్యాన్, లోయర్ అంటిలోప్ కెన్యాన్ వంటివన్నీ గొప్ప అనుభవాలు. లేక్ వ్యూలో ధవళ సుందరుల మధురమైన పాటలు ఎప్పుడు మరచిపోలేనివి. లాస్ వేగాస్లో సీజర్ ప్యాలెస్కి వెళ్ళాం. సీజర్ వీరగాధ గురించి నేను కళ్యాణ్ కొంచెం సేపు మాట్లాడుకున్నాం. అక్కడే బాక్ హావెల్ బఫెట్లో వేయి రకాల డిష్లు ఉంటాయి. వివిధరకాల మాంసాహారాలుంటాయి. ప్రతి మాంసాహారం మీద ఆయా జంతువుల బొమ్మలుంటాయి. కుక్కల బొమ్మలు కూడా ఉన్నాయి. మేం మేక బొమ్మ ఉన్న దగ్గరికే వెళ్లి మటన్ కర్రీ వేసుకున్నాం. ప్లేట్లో ఇంకా ఇష్టమైన ఆహార పదార్థాలు వడ్డించుకొని వచ్చి మా సీట్లలో కూచున్నాం. వివిధ రకాలైన మద్యాల సరఫరా జరుగుతుంది. అట్లా ఎక్కువ సమయమే అక్కడ గడచింది.ఆడామగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. వాతావరణం కొంచెం మత్తుగా ఉంది.నాకు కూడా కొంచెం మత్తెక్కినట్టు అనిపించింది. లేచి నెమ్మదిగా అడుగు వేస్తూ టాయిలెట్ వైపు వెళ్లి వస్తున్నాను. వస్తూ బాల్కనీలోకి వెళ్లాను సిటీ చూద్దామని. ఓ యువతి బయటకు చూస్తూ నిలబడి ఉంది. సుతారంగా సిగరెట్ తాగుతోంది. వెనుక నుండి చూస్తే ఆమె భుజాలు తిలక్ వర్ణించిన చంద్రవంకల్లా ఉన్నాయి. ఆ ఎత్తు ఆ పద్ధతి చూస్తే ఈ శ్వేతసుందరి యూఫోరియా కాదు కదా,అవును ...ఆమె యూఫోరియాయే, గబ గబా ఆమె దగ్గరికి వెళ్ళాను. ‘’ఎక్సుక్యూజ్ మి’’ అన్నాను. ఆమె వెనక్కి తిరిగి ‘’ఎస్’’ అంది. కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. బాగా మద్యం సేవించిందని తెలుస్తూనే ఉంది. ఆమె కళ్ళలోకి నిశితంగా చూశాను. నో...ఈ కళ్ళు చిన్నగా ఉన్నాయి. ఈమె యూఫోరియా కానే కాదు.సారీ ...అంటూ వెనుదిరిగాను. ఆమె ఆశ్చర్యంగా కళ్ళెగరేసి మళ్లీ ఎందుకో తలూపుతూ ఏదో అంటుంది. ఆమె ఉచ్ఛారణ అర్థం కాలేదు. వెనుదిరిగి వచ్చాను. ఆమె కిసుక్కున నవ్వినట్టు అనిపించింది.∙∙ బెలాజియం హోటల్లో ఫౌంటెన్ షో చూసినప్పుడు, విన్ హోటల్లో విలేన్ అనే డ్రీం షో చూసినపుడు, తరువాత గండోల బోటు రైడింగ్ చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. యూఫోరియాని బాగా గుర్తించ గలిగితేనే పలకరించాలి కాని ఇట్లా పొరపాటు చేయకూడదనుకున్నాను. చివరికి లాస్ ఏంజిల్స్కి తిరుగు ప్రయాణమయ్యాను.∙∙ చివరికి మేం ఇండియాకి తిరిగి వచ్చే రోజు రానే వచ్చింది. వెన్నెల కళ్యాణ్లను విడిచి రావడం భారంగా అనిపించింది.విశాలమైన రోడ్లు, చక్కగా వాహనాలు పాటించే ట్రాఫిక్ రూల్స్, పెద్ద పెద్ద మాల్స్, విసుగు లేకుండా అందరూ అనుసరించే క్యూ సిస్టం, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలున్న అమెరికా సామాజిక జీవితం ఎంతో ముచ్చట గొలిపింది. అయినా మనం ఉండాల్సిన కాల పరిమితి అయిపోయాక తప్పదు కదా.వెన్నెల, కళ్యాణ్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. వస్తున్నప్పుడు దారి సరిగా చూసుకోకపోవడం, ఇంట్లో కూడా తొందరగా తెమలక పోవడం వల్ల ఆలస్యం అయింది. ఏమిరేట్స్ ఫ్లైట్ కి కొద్ది సమయమే ఉంది.వెన్నెల మాకు వీల్ చైర్ ఏర్పాటు చేసింది. చెకింగ్ క్యాబిన్లోకి చేరిపోయాం.చకా చకా ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. లోపలికి వెడుతూ వెనక్కి చూశాం. వెన్నెల, కళ్యాణ్, చేయి ఊపుతున్నారు. మేమూ చేయి ఊపుతూ ముందుకెడుతున్నాం.ఆశ్చర్యం...వెన్నెల, కళ్యాణ్ల వెనుక నిలబడింది ఆమె. ఆమె ....ఆమె ...ఆమె ..యూఫోరియా ..అవును యూఫోరియా! చాలా పొడవైన యూఫోరియా...ధవళ దేహంతో మెరిసిపోతున్న యూఫోరియా ...విశాల నేత్రాల యూఫోరియా ...నన్ను విద్యుదాఘాతం నుండి కాపాడిన యూఫోరియా...అవును ఆమె కచ్చితంగా యూఫోరియానే ...నా శరీరం ఒక్కసారిగా జలదరించినట్టయింది. యూఫోరియా...గట్టిగా అరిచాను. వెన్నెల, కళ్యాణ్లతో పాటు ఆమె కూడా ఇటు చూసింది. యూఫోరియా ...యూఫోరియా ..నేను చేతులెత్తి ఊపుతూ అరిచాను. వీల్చైర్ అతను లోపలి వీల్ చెయిర్ని తోయడం ఆపి నిలబడ్డాడు. యూఫోరియా ఇటు చూసింది. ఆశ్చర్యంగా చూస్తోంది. నన్ను గుర్తించలేదు. అలాగే చూస్తూ నిలబడింది. ‘‘నాన్నా..వెళ్ళండి టైమవుతుంది’’ వెన్నెల టైం చూస్తూ అంది. వీల్ చైర్ అతను వెన్నెలను గమనించాడు. వీల్ చైర్ నెట్టుకుంటూ లోపలికి నడిచాడు. యూఫోరియా కనుమరుగయింది.∙∙ నాకు తెలుసు, యూఫోరియా నన్ను గుర్తించలేదు. బహుశా నన్ను మరచిపోయి ఉంటుంది. కాని నా ఙ్ఞాపకాలలో ఎప్పుడు ఉంటుంది.నాలో కథై దూకేలా హృదయాన్ని కదలిస్తూనే ఉంటుంది.యూఫోరియా ...వండర్పుల్ యూఫోరియా. డా.కాంచనపల్లి -
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
నమ్మకం నిజమైంది
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను. మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్లో కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ బాగా వచ్చాయి. మౌత్ టాకే మా సినిమాకి మెయిన్ పబ్లిసిటీ’’ అన్నారు. -
ట్రెండ్ మారింది
కల్యాణ్, రిహా జంటగా కృష్ణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కె. శ్రీకాంత్, కె. చంద్రమోహన్ నిర్మిస్తున్నారు. ఆదివారం పవన్ కల్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను వి. సాగర్, మోషన్ పోస్టర్ను నటి కవిత విడుదల చేశారు. టైటిల్ సాంగ్ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘పవన్కల్యాణ్ను స్ఫూర్తిగా తీసుకుని కథ తయారు చేసుకున్నారంటే ఈ సినిమా యూనిట్కు ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారింది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు కవిత. ‘‘మా సినిమా రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అన్నారు చంద్రమోహన్. కృష్ణతేజ, కల్యాణ్, సంగీత దర్శకుడు జయసూర్య పాల్గొన్నారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి సరళ. -
మరో మెగా హీరో లాంచింగ్పై క్లారిటీ
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. వైష్ణవ్.. వారాహి చలనచిత్రం బ్యానర్లో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్తో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను తాము నిర్మించటం లేదని క్లారిటీ ఇచ్చింది. -
మెగా అల్లుడి సినిమా ప్రారంభోత్సవం
-
మెగా అల్లుడి సినిమా మొదలైంది
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్ర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు నేడు (జనవరి 31) తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. ‘బాహుబలి’ చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’ అన్నారు. -
చిరు అల్లుడితో లై బ్యూటీ?
‘బొమ్మోలే ఉన్నదిరా పోరి.. బొం బొంబాటుగుందిరా నారి.. లడ్డోలె ఉన్నదిరా కోరి.. లై లైలప్ప బుగ్గల్ది ప్యారి’ అంటూ ‘లై’ సినిమాలో మేఘా ఆకాశ్ అందచందాల్ని వర్ణించారు నితిన్. రచయిత కాసర్ల శ్యామ్ రాసినట్లు నిజంగానే మేఘా ఆకాశ్ బాగుంటుంది. ‘లై’ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ రెండోసారీ నితిన్తో జోడీకట్టారు. నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్కల్యాణ్, త్రివిక్రమ్ ఓ సినిమాతో పాటు ప్రస్తుతం తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో మేఘా ఆకాశ్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. ‘జతకలిసే’ ఫేమ్ రాకేశ్ శశి దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రబృందం మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపైనా దృష్టి సారించారట. -
మెగా అల్లుడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జతకలిసే ఫేం రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. కళ్యాణ్ అరంగేట్రం కోసం మెగా ఫ్యామిలీ భారీ కసరత్తులే చేస్తోంది. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోంది. కళ్యాణ్ సరసన హీరోయిన్ గా లై ఫేం మేఘా ఆకాష్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మేఘా ప్రస్తుతం నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన మేఘా ఆకాషే, కళ్యాణ్కు సరైన జోడి అని భావిస్తున్నారట మెగా టీం. ప్రస్తుతానికి మేఘా ఎంపికపై మెగా టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
నిఖిల్ కాదన్న కథతో మెగా అల్లుడు..!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జత కలిసే సినిమా ఫేం రాకేష్ శశి కళ్యాణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథ ముందుగా యంగ్ హీరో నిఖిల్ కు వినిపించారట. తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ కథ కావటంతో తనకు సూట్ కాదన్న ఉద్దేశంతో నిఖిల్ రిజెక్ట్ చేశాడట. అయితే అదే కథ కళ్యాణ్ కు నచ్చటం, మెగాస్టార్ కూడా ఓకె చెప్పటంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. -
రెండో అల్లుడి మొదటి మూవీ
మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రెడీ అవుతున్నారు. యస్.. మీ గెస్ కరెక్టే. ఇక్కడున్న ఫొటో చూడగానే చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ అరంగేట్రానికి రంగం షురూ అయిందని ఊహించేసి ఉంటారు. వచ్చే ఏడాది కల్యాణ్ కెమెరా ముందుకు రానున్నారు. ‘అందాల రాక్షసి’, ‘ఈగ’, ‘లెజెండ్’, ‘దిక్కులు చూడకు రామయ్య’... ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వారాహి చలన చిత్రమ్ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడిగా జస్ట్ వన్ మూవీ ఓల్డ్ అయిన రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అసలు ఈ ప్రాజెక్ట్కి ఎలా శ్రీకారం జరిగింది? అనేది రాకేశ్ శశి మాటల్లో తెలుసుకుందాం. ‘‘డైరెక్టర్గా నా ఫస్ట్ మూవీ ‘జత కలిసే’ చూసి, సాయి కొర్రపాటిగారు ఇంప్రెస్ అయ్యారు. ఆయనే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడే వారాహి బ్యానర్లో దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చారాయన. మంచి కథ రెడీ చేసుకున్నా.వైజాగ్ సత్యానంద్గారు ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు కాబట్టి, ఎవరైనా కొత్త హీరో ఉంటే చెప్పమని ఆయన్ను అడిగా. కథ కూడా చెప్పాను. ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్కి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది’’ అని సలహా ఇచ్చారు సత్యానంద్గారు. ‘నేనా.. చిరంజీవిగారి అల్లుడితోనా? చాన్స్ ఇస్తారా?’ అనుకున్నా. అయినా కల్యాణ్ను కలిసి, కథ చెప్పా. ఓకే అన్నారు. కానీ ‘ఓసారి మామయ్య చిరంజీవిగారికి కథ చెప్పండి’ అని కల్యాణ్ అన్నారు. అనుకోని కారణాల వల్ల చిరంజీవిగారితో నా ఫస్ట్ అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారిని కలిసి, కథ చెప్పాం. ఆయన ఇంప్రెస్ అయ్యారు. కథ చాలా బాగుందని అభినందించారు. ఆ క్షణాలను మరచిపోలేను’’ అన్నారు రాకేశ్ శశి. మరి కల్యాణ్తో తీయబోయే సినిమా లవ్స్టోరీనా? అని అడగ్గా.. ‘‘లేదు. డిఫరెంట్ స్క్రిప్ట్. జనవరిలో లేదా ఫిబ్రవరిలో సెట్స్పైకి తీసుకెళ్తాం. వారాహిలాంటి పెద్ద బేనర్, చిరంజీవిగారి అల్లుడు.. ఇలా నా రెండో సినిమాకే మెగా చాన్స్ కొట్టేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాకేశ్. -
మరో మెగా వారసుడు రెడీ..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్ అల్లుడు, చిరు చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి సినీ ప్రవేశంపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత వరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ లుక్స్, మేకోవర్ చూస్తుంటే మాత్రం సినిమాల్లోకి రావటం ఖాయమనిపిస్తుంది. తాజాగా కళ్యాణ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కళ్యాణ్ ను తెరకు పరిచయం చేసే బాధ్యతను మెగా ఫ్యామిలీ దర్శకుడు రాకేష్ శశి(జత కలిసే ఫేం), నిర్మాత సాయి కొర్రపాటి లకు అప్పగించారట. అంతేకాదు రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మెగాస్టార్ ఓకే అన్న వెంటనే సినిమాను పట్టాలెకక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఈప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా.. త్వరలోనే మెగా అల్లుగా ఎంట్రీకిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
హైదరాబాద్లో కర్నాటక చలన చిత్రోత్సవాలు
‘‘పరభాషల చిత్రాల గురించి తెలుసుకునేందుకు ఫిలిం ఫెస్టివల్స్ను రెగ్యులర్గా నిర్వహించాలి. చలన చిత్రోత్సవాల నిర్వహణలో మనం వెన కబడ్డాం’’ అని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లో నేటి నుంచి ‘కర్నాటక ఫిలిం ఫెస్టివల్’ జరగనుంది. ఈ సందర్భంగా కర్ణాటక చలనచిత్ర అకాడమీ, హైదరాబాద్ ఫిలిం క్లబ్, సారధీ స్టూడియోస్ ప్రెస్మీట్ నిర్వహించాయి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘తెలుగు సినిమాలు ఇతర రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్లోనూ రిలీజ్ అవుతుండటంతో ఆదాయం పెరిగింది. ఇండియాలోని ఇతర భాషలతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇందుకు తెలుగు పరిశ్రమ నుంచి సహకారం అందిస్తాం’’ అన్నారు. ‘‘కర్ణాటకలో షూటింగ్ చేసిన సినిమాలకు ఐదు కోట్ల సబ్సిడీని అందిస్తున్నాం’’ అన్నారు కర్ణాటక చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ రాజేంద్రసింగ్ బాబు. తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్, హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాష్రెడ్డి, దర్శక–నిర్మాత పవన్కుమార్, సారధీ స్టూడియో కె.వి. రావు తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ సంచలనంపై పోలీస్ జులుం
ముంబై: అది ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో గల సుభాష్ మైదాన్. శనివారం సాయంత్రం అక్కడ ఓ కేంద్ర మంత్రి హెలికాప్టర్ దిగబోతోందన్న సమాచారంతో పోలీసుల హడావిడి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి విమానం దిగడానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శించి ’క్రికెట్ సంచలనం’ ప్రణవ్ను స్టేషన్కు తరలించి.. తప్పుడు కేసు బుక్ చేయడానికి ప్రయత్నిచారు. ప్రణవ్ ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఓ ఇన్నింగ్స్లో అజేయంగా 1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన కుర్రాడు. ఏ స్థాయిలో నైనా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్తో పాటు పలువురు క్రికెట్ క్రీడా దిగ్గజాల మన్ననలు అందుకున్నాడు. అయితే.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హెలికాఫ్టర్ కోసం ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు ప్రణవ్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రాక్టీస్లో ఉన్న ప్రణవ్ను అక్కడ నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే మైదానం వదిలి వెళ్లడానికి ప్రణవ్ నిరాకరించాడు. క్రీడా స్థలాన్ని పొలిటికల్ లీడర్స్ హెలికాప్టర్లు దిగడానికి ఎందుకు కేటాయిస్తారని వాదించాడు. దీంతో ఎస్సై కదమ్ ప్రణవ్పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న ప్రణవ్ తండ్రి ప్రశాంత్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రణవ్తో పాటు తండ్రిని పోలీసులు తీసుకెళ్లి జీపులో పడేసి.. బజార్పెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన పోలీసులు తమపై తప్పుడు కేసు బనాయించాలని చూశారని ప్రణవ్ వాపోయాడు. ఆ ప్రాంతంలో రెండు ఉర్దూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కేంద్ర మంత్రి జవదేకర్.. వాస్తవానికి ఆ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ విషయంలో తప్పు పోలీసులదే అని జవదేకర్ స్పష్టం చేశారు. పోలీసుల తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
మనసుకి ఏమైందిరా...
‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ అంటూ తొలిప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ పాడుకుంటారు. అప్పట్లో ఆ పాట యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్, హనీగుప్త, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ నేదునూని దర్శకత్వంలో జేవీఆర్ సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై జేవీఆర్, దేశ్ముఖి రాజు యాదవ్, శ్రీనివాస్ నేదునూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ మంత్రి జగదీశ్వర్రెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యమధర్మ రాజు, చిత్రగుప్తుడు పాత్రలతో పాటు ప్రేమ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నాం. వినోదాత్మకంగా తీర్చిదిద్దుతాం. అందరూ కొత్తవాళ్లు నటిస్తున్న ఈ చిత్రంలో హీరోల్లో ఒకరైన శరత్ కల్యాణ్ వైజాగ్ సత్యానంద్గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘‘మంచి కథ కుదిరింది. టైటిల్ అందరికీ నచ్చింది’’ అని నిర్మాతలు అన్నారు. హీరో, హీరోయిన్లు, నటులు కృష్ణుడు, తాగుబోతు రమేశ్, భోజ్పురి నటి రాణీ ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మెలోడి శ్రీనివాస్, కెమెరా: మురళీ కృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావు. -
ఈ తరం గల్లీ కుర్రాడు
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్న ఇంజనీర్ రాత్రంతా పార్ట్టైం జాబ్ ఉదయం టీకొట్టులో తండ్రికి సాయపడుతూ.. మధ్యాహ్నం పోటీ పరీక్షలకు శిక్షణ షార్ట్ ఫిల్మ్లో హీరోగా అవకాశం బీటెక్ పూర్తిచేసిన ఆ కుర్రాడి లైఫ్ సై్టల్ డిఫరెంట్. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు టీ కొట్టు నిర్వహిస్తున్న తండ్రికి సాయపడడం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీ పరీక్షలకు కోచింగ్.. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్గా పార్ట్టైం జాబ్.. వీటితోపాటు డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్ నటన.. ఇలా ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణాన్నీ వథా చేయడం లేదు. పేదరికమే తనకు లభించిన వరంగా దూసుకుపోతున్న ఈ గల్లీ కుర్రాడి గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిందే. సాక్షి, విశాఖపట్నం : అక్కయ్యపాలేనికి చెందిన నిద్దాన కళ్యాణŠ కుమార్ అందరి కుర్రాళ్లలాగే ఆడుతూ పాడుతూ గడపాలనుకోలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని చూసి చేదోడువాదోడుగా ఉండాలనుకునేవాడు. సీతమ్మధారలో టీకొట్టు నిర్వహిస్తున్న తండ్రి బంగారునాయుడికి సాయపడుతూ బీటెక్ పూర్తి చేశాడు. సాధారణంగా బీటెక్ విద్యార్థులంటే కొంచెం హైఫైగా ఉంటారు. కళ్యాణ్ మాత్రం అనవసర ఆర్భాటాలకు పోలేదు. ఉదయాన్నే టీకొట్టు దగ్గరకు వెళ్లి మధ్యాహ్నం వరకూ తండ్రికి సాయం చేస్తాడు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్గా పార్ట్టైం జాబ్ చేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంగా ఉంటే కళ్యాణ్ ఒక్కడే టీ బండిని చూసుకుంటుంటాడు. ఇటీవలే ఫస్ట్క్లాస్లో బీటెక్ పూర్తి చేసిన అతను మధ్యాహ్నం బ్యాంకుSటెస్ట్లకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తూనే తన అభిరుచులను వదులుకోకుండా డాన్స్ నేర్చుకున్నాడు. శుభకార్యాలు, పండుగల సమయంలో డాన్స్ చేయడంతోపాటు కొరియోగ్రఫీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తన చిన్ననాటి స్నేహితులతో ‘ఒక్క నిమిషం’ అనే షార్ట్ఫిల్మ్ రూపొందిస్తున్నాడు. హీరోగా తానే నటిస్తుండగా, అతని చిన్ననాటి స్నేహితురాలు బి.రాజి హీరోయిన్గా చేస్తోంది. ప్రాణ స్నేహితుడైన జి.మధు ఈ షార్ట్ఫిల్మ్ని రచించి, దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ పనైనా ఎందుకు చేయలేకపోతున్నారని ఎవరైనా అడిగితే ఎక్కువ మంది చెప్పే కారణం తమకు సమయం సరిపోవడం లేదని. కానీ కళ్యాణ్ గురించి తెలిశాక మాటలో వాస్తవం లేదని అర్ధమవుతోంది. ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచీ మా అమ్మానాన్న పడుతున్న కష్టాలు చూశాను. వారికి అదనపు భారం కాకూడదనుకున్నాను. నాన్నే టీకొట్టు నడుపుతున్నపుడు నేను అక్కడ టీలు అందించడం నామోషీగా భావించలేదు. ఇప్పుడు కోచింగ్ కోసం డబ్బులు కావాలి కాబట్టి పార్ట్టైమ్ జాబ్ తప్పదు. ఇంత కష్టంలో నాకున్న ఒకే ఒక్క ఊరట నటన, డాన్స్. అందుకే వాటిని వదులు కోవడం లేదు. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. –కళ్యాణ్ కుమార్ వాడి కోసమే డైరెక్టర్నయ్యా.. కళ్యాణ్ నా ప్రాణ స్నేహితుడు. నేను బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్యార్డ్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పడుతున్న కష్టాలు చూస్తున్నాను. వాడికి నటన అంటే ఇష్టం. అందుకే వాడికోసం షార్ట్ పిల్మ్ తీయాలనుకున్నాను. కథ రాసి డైరెక్టర్గా మారాను. సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు తీయాలనుకుంటున్నాం. –మధు స్నేహం కోసం ఒప్పుకున్నా.. చిన్నప్పటి నుంచి మా ముగ్గురం మంచి ఫ్రెండ్స్. పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. తర్వాత కాలేజీలు వేరైనా రోజూ కలుస్తుండేవాళ్లం. మధు ఎప్పటి నుంచో ఓ స్టోరీ రాసి ఉంచుకున్నాడు. వాళ్లు షార్ట్ఫిల్మ్ తీయాలనుకున్నప్పుడు నన్ను హీరోయిన్గా చేయమని అడిగారు. మా మధ్య స్నేహం కొద్దీ ఒప్పుకున్నాను. నాక్కూడా నటనపై ఆసక్తి ఉండటంతో ఎటువంటి టెన్షన్ లేదు. –రాజి -
కానిస్టేబుల్ ను చితకబాదిన మందుబాబులు
కళ్యాణ్: తన కారుపై మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు కానిస్టేబుల్ పై ఐదుగురు మందుబాబులు దాడిచేసిన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కళ్యాణ్-మాలాంగ్ రోడ్డులోని రంగీలా బార్ వద్ద ఈ ఘటన జరిగిందని దర్యాప్తు అధికారి ఎండీ గజాడే తెలిపారు. కానిస్టేబుల్ సతీశ్ దేశాయ్ ప్రైవేటు వాహనంపై నిందితుల్లో ఒకడైన రాహుల్ చౌదరి మూత్రవిసర్జన చేశాడు. ప్రశ్నించిన సతీశ్ పై రాహుల్, అతడి నలుగురు స్నేహితులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఐదు నిమిషాల పాటు కానిస్టేబుల్ ను విచక్షణారహితంగా చితకబాదారు. అయితే ఘటనాస్థలంలో పలువురు ఉన్నప్పటికీ అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. బార్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎండీ గజాడే చెప్పారు. వీరికి ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీ విధించినట్టు తెలిపారు. -
బోల్తాకొట్టిన ఆటోను లారీ ఢీకొట్టడంతో..
మేడికొండూరు(గుంటూరు జిల్లా) పోటీ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ బోల్తాపడిన ఆటోను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో ఆదివారం జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రోలగంపాడు గ్రామానికి చెందిన మేండ్రగుత్తి కల్యాణ్, పి.వెంకట కాశీసాయిరామ్, రెహమాన్ విద్యార్థులు. వీరిలో కల్యాణ్, సాయిరామ్ మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షకు వీరికి పెదపలకలూరు విజ్ఞాన్ కళాశాలను సెంటర్గా కేటాయించారు. దీంతో ముగ్గురూ ఒకరోజు ముందుగా శనివారమే ఫిరంగిపురంలో ఉన్న కల్యాణ్ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రానికి ఆటోలో బయలుదేరారు. డోకిపర్రు శివారులోని జోసిల్ కంపెనీ వద్దకు రాగానే ఆటోకు శునకం అడ్డురాగా అదుపుతప్పి బోల్తాకొట్టింది. అదే సమయంలో పేరేచర్ల నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న లారీ.. బోల్తాకొట్టిన ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న కల్యాణ్, సాయిరామ్ ఘటన స్థలంలోనే మత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన రెహమాన్ను, ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిల్లి ఏసోబును గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు కూడా చికిత్స పొందుతూ మరణించారు. ఘటన స్థలాన్ని గుంటూరు సౌత్ డివిజన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిశీలించారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చారిత్రక కల్యాణ మండపం!
మైసూరుః ప్యాలెస్ లో పెళ్ళి సందడి మొదలైంది. మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహానికి ప్యాలెస్లో ప్రత్యేక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూన్ 27న జరిగే వివాహ మహోత్సవానికి చారిత్రక కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. రాజవంశంలో 40 సంవత్సరాల తర్వాత జరుగుతున్న వివాహ కార్యక్రమం కావడంతో.. రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహం కోసం తరతరాలుగా కొనసాగుతున్నమండప సామగ్రికి మెరుగులు దిద్దుతున్నారు. ఘనమైన చరిత్ర కలిగిన మైసూరు రాజకుటుంబంతోపాటు, అక్కడి ప్రతి వస్తువుకూ ఓ చరిత్ర ఉంది. మైసూర్ మహారాజుల వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ వివాహ కార్యక్రమానికి వంశపారంపర్యంగా కొనసాగుతున్న కల్యాణ మండపానికి ప్రత్యేక హంగులు సమకూరుస్తున్నారు. యువరాజు యదువీర్ పట్టాభిషేకం జరిగిన సమయంలో ఆయన అధిరోహించిన రజిత సింహాసనం (భద్రాసనం) కూడ ప్యాలెస్ లో ప్రత్యేకాకకర్షణగా నిలిచింది. అదేరీతిలో అత్యంత ఐశ్వర్యవంతుడైన యువరాజు వివాహానికి ఇప్పుడు అనువంశికంగా వచ్చే వెండి సింహాసనాన్ని ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అనువంశిక సంప్రదాయ మండపానికి సైతం మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే పూజాకార్యక్రమాలతో పెళ్ళి సందడి ప్రారంభం కాగా... ఖరీదైన చెక్కతో రూపొందించిన కల్యాణ మండపాన్ని, అద్దాల ఆడిటోరియంలోకి తరలించారు. మహారాజులు పట్టాభిషేక సమయంలో మాత్రమే భద్రాసనా ఉపయోగిస్తారు. పది అడుగులు ఎత్తు ఉండే మండపం... రాజ కుంటుంబ సభ్యుల వివాహాల సందర్భంలోనే బయటకు తీస్తారు. 41 ఏళ్ళ తర్వాత గత మే నెలలో యదువీర్ కృష్ణదత్త పట్టాభిషేక సమయంలో భద్రాసనా వినియోగించగా... మండపం మాత్రం రాజకుంటుంబం 1992 లో మైసూరు రాజు పెళ్ళి సందర్భంలో వినియోగించారు. అనంతరం యువరాజు యదువీర్ వివాహం కోసం ప్రస్తుతం వినియోగంలోకి తెస్తున్నారు. ఈ మండపాన్ని మహారాజు కుటుంబంలోని సభ్యుల పెళ్ళిళ్ళకు వాడిన తర్వాత తిరిగి ఏ భాగానికి ఆ భాగం విడదీసి సురక్షితంగా భద్రపరుస్తుంటారు. శివపార్వతుల వివాహ మహోత్సవమైన గిరిజా కల్యాణానికి సంబంధించిన చిత్రాలతో కూడిన ఈ మండపం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. మండపాన్ని 1912 లో రూపొందినప్పటినుంచీ ఇందులో ముగ్గురు మహారాజుల పట్టాభిషేకాలు, రెండు డజన్ల వివాహ మహోత్సవాలు జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మహారాజులు, ఇతర రాజకుటుంబ సభ్యుల వివాహాలు, పుట్టినరోజు వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాలకు ఈ అష్టభుజ కల్యాణ మండపం నిర్మించినట్లు చెప్తారు. అయితే 1897 లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంతో ప్యాలెస్ లోని అధికభాగం దగ్ధమైపోయింది. ఆ తర్వాత రాజ కుటుంబీకులు తిరిగి ఆ నిర్మాణాన్ని విలక్షణంగా నిర్మించారు. ఈసారి నిర్మాణంలో ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడినట్లు తెలుస్తోంది. ఈ మండపాన్ని కేవలం రాజకుటుంబీకుల వివాహాలకోసమే రూపొందించారని, రాజకుటుంబం నమ్మకాలు, సంప్రదాయాలను బాగా తెలిసిన వ్యక్తి, యు ఆర్ ఎస్ కమ్యూనిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. మండపాన్ని ఏర్పాటు చేసే ఆడిటోరియంలో సైతం మూడు పక్కల గోడలూ మైసూరు శైలి చిత్రాలతో సుందరంగా అంకరించబడి ఉంటాయి. దసరా వేడుకలకు సంబంధించిన ఏనుగు బంగారు అంబారీపై మహారాజులు కూర్చున్నట్లుగా ఉండే చిత్రాలు, పురాణ కథలు ఈ గోడలపై నిక్షిప్తమై... రాచరికపు సాక్ష్యాలను ప్రస్ఫుటింపజేస్తాయి. -
గమ్యం చేరిన ప్రయాణం
ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన ఓ వ్యక్తి ఏం చేస్తుంటాడు చెప్పండి..? హా..! ఏం చేస్తాడు ఏదో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడనుకుంటాం. కానీ కల్యాణ్ అక్కిపెద్ది మాత్రం అలా చేయట్లేదు. రూ.లక్షల్లో జీతం, నగరం జీవితం...ఇవేవి అతనికి తృప్తి నివ్వలేవు. వచ్చే జీతం జేబును నింపుతోంది కానీ మనసును తాకట్లేదు. ఉద్యోగం మానేసి తన సంతోషం ఎక్కడుందో వెతుక్కోవాలని... ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. చివరికి తను కోరుకున్న గమ్యాన్ని ఎలా చేరుకున్నాడో చూడండి..! మే 30... కల్యాణ్ 38వ పుట్టిన రోజున వచ్చిన ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. ఇంకా ఎన్నాళ్లు బతికుంటానని ఆలోచించసాగాడు కల్యాణ్. లెక్కలు వేసుకున్నాడు ‘మహా అయితే ఓ 30 ఏళ్లు. అంటే సుమారుగా పదివేల రోజులు. ఈ సమయంలో ఏం చేయగలను. ఏం సాధించగలను’ అని అతనిలో అతనే మధన పడిపోయాడు. ఆ మరుసటి రోజే తను పనిచేస్తోన్న ఆఫీసుకెళ్లాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. దేశమంతా పర్యటన ఏ ప్రయాణానికైనా గమ్యం ఉంటుంది. కానీ కల్యాణ్ మొదలు పెట్టిన ప్రయాణానికి మాత్రం గమ్యమంటూ లేదు. దేశం మొత్తం తిరగాలని నిశ్చయించుకున్నాడు. చాలా మంది భారతీయుల జీవితాల్లో పేదరికం ఎలాంటి పాత్ర పోషిస్తోందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రయాణంలో కల్యాణ్ తనకి తాను ఒక షరతు విధించుకున్నాడు. తన తిండికి గానీ వసతికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఏదో పనిచేస్తూ తన అవసరాలను తీర్చుకున్నాడు. 2008లో మొదలు పెట్టిన ఈ ప్రయాణాన్ని సుమారు రెండున్నరేళ్ల పాటు కొనసాగించాడు. ఈ సమయంలో కల్యాణ్ ఎక్కువగా గ్రామీణ భారతాన్ని చుట్టాడు. మన ప్రయాణాల్లో కొన్ని మనకి ఇబ్బంది కలిగించే అంశాలు, మరికొన్ని స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఎదురవుతుంటాయి. కల్యాణ్ వెతుకుతున్న గమ్యం గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉండే గిరిజనుల రూపంలో దొరికింది. సుమారు 8 నెలల పాటు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ కొన్ని గిరిజన తెగల జీవన శైలిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. జీవితం పట్ల వారికి ఎలాంటి ఫిర్యాదులు లేవు. తమకున్న అవకాశాలను వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన కల్యాణ్కి ఒక ఆలోచన వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించాలంటే రూ.కోట్లు ఖర్చు చేయడానికి బదులు, ప్రజల్లో స్వయంగా సంపాదన సృష్టించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు. తిరిగి స్వగ్రామానికి రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణానంతరం కల్యాణ్ తిరిగి తన స్వగ్రామం అనంతపురం చేరుకున్నాడు. సుమారు 166 గ్రామాలు సందర్శించిన తర్వాత ‘టెకులోడు’ అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. మొదట్లో ప్రతి రోజూ గ్రామంలోని ఒకరి ఇంట్లో ఉంటూ వారితో కలసి పనిచేస్తూ... రాత్రి ఆ కుటుంబంతోనే భోజనం చేసేవాడు. అలా సుమారు 100 రోజులు పాటు 100 కుటుంబాల స్థితిగతులను వారి ఆర్థిక పరిస్థితులను ఒక డాక్యుమెంటరీగా రూపొందిచాడు. చివరగా ఒక కుటుంబంతో కలసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. కల్యాణ్ వారి కుటుంబంలో చేరక ముందు ఆ కుటుంబం ఆదాయం ఏడాదికి కేవలం రూ. 6500. కానీ వారితో చేయి కలిపి వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు ఉపయోగిండంతో 8 నెలలు తిరిగేలోపే నెలకు రూ.14 వేలు సంపాదించే స్థాయికి ఆ కుటుంబం చేరుకొంది. ‘ప్రోటో విలేజ్’ లక్ష్యంగా ఏడాదికి రూ. ఆరు వేల నుంచి నెలకి రూ. 14 వేల ఆదాయం సాధించడంతో...సాధికారత సాధించడం సాధ్యమేనని కల్యాణ్ బలంగా నమ్మాడు. ఇదే ప్రేరణతో ‘ప్రొటో విలేజ్’ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య, తండ్రి సహాయంతో అదే గ్రామంలో ఓ 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. తన ఆలోచనని మొదటగా గ్రామస్తులతో చెప్పినపుడు పది కుటుంబాలు దీనికి అంగీకరించాయి. ప్రస్తుతం ఈ ప్రోటో విలేజ్లో సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ మొత్తం స్థలాన్ని అన్ని కుటుంబాలకు సమానంగా కేటాయించడం విశేషం. ఇప్పుడు ఆ గ్రామంలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో ఎనిమిది చెరువులను తవ్వారు. సోలార్తో గ్రామంలో స్వయంగా విద్యుత్ని సృష్టించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నాను ‘మొదట్లో మా కుటుంబ సభ్యులు... అంత జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఎలా సంతోషంగా ఉంటావురా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు గ్రామంలోని ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి వారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా జీవితంలో అనుకున్నది సాధించడంలో విజయవంతమవుతున్నా. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు. లక్షల రూపాయలు సంపాదించినా రాని సంతోషం నాకు ఇప్పుడు కలుగుతోంది’ అని అంటున్నాడు ఈ ‘రియల్ లైఫ్ శ్రీమంతుడు’. 2017 ఆగస్టు నాటికి తమ ‘ప్రోటో విలేజ్’ని ప్రపంచానికి పరిచయం చేస్తామంటున్నాడు కల్యాణ్. -
ఢిల్లీ రాజేశ్వరి కొడుకు రిసెప్షన్
-
ఘనంగా శ్రీజ వివాహ విందు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి హోటల్ పార్క్ హయత్లో జరిగింది. వేడుకకు గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు సినీ, రాజయకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్ తో శ్రీజ వివాహం మార్చి 28న జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిపించడంతో ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బి. గోపాల్, గుణశేఖర్, హీరో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, పొట్లూరి వర ప్రసాద్, గోపీచంద్ దంపతులు, మంచు మనోజ్, మురళీమోహన్, జయసుధ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, అలీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ తదితర ప్రముఖులు రిసెప్షన్ కు హాజరైనవారిలో ఉన్నారు. -
ఘనంగా శ్రీజ వివాహం
బెంగళూరు: సినీ నటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్తూరుకు చెందిన ఎన్నారై కళ్యాణ్ వరుడు. ప్రచారానికి దూరంగా సోమవారం ఉదయం మెగా ఫ్యామిలీకి చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్ లో బంధుమిత్రులు వీరిద్దరి వివాహం జరిపారు. చిరంజీవి, వరుడు తరపు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయాడు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంచేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలను మాత్రమే ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానించినట్టు సమాచారం. -
బెంగళూరులో శ్రీజ వివాహం
హైదరాబాద్ : అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు. అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. -
మొదటి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు..
హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకుని ...ఇద్దరు భార్యలతో ఎలా తంటాలు పడేది,ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడానికి హీరో పడే కష్టాలను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. అయితే నిజ జీవితంలో కూడా ఓ ప్రబుద్ధుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వేదికైంది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కల్యాణ్(28)కు అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం భార్యాభర్తలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనూహ్యంగా 2014లో కల్యాణ్ కనిపించకుండా పోయాడు. దీంతో దుర్గాదేవి భర్త కోసం గాలిస్తూ మాదాపూర్లో నివాసముంటోంది. 2014లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లిన కల్యాణ్ అక్కడ అపర్ణ అనే యువతిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండవ భార్యతో హైదరాబాద్ చేరుకుని బోరబండలో నివాసముంటున్నాడు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. మొదటి భార్య దుర్గాదేవి మంగళవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చింది. అదే సమయంలో కల్యాణ్ తన రెండో భార్యతో కలసి అక్కడకు వచ్చాడు. మరో మహిళ, బిడ్డతో వచ్చిన కల్యాణ్ను దుర్గాదేవి నిలదీసింది. దీంతో కల్యాణ్ రెండో వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దుర్గాదేవి భర్తను చితక్కొట్టి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కల్యాణ్పై కేసు నమోదు చేసుకుని స్టేషన్కు తరలించారు. -
తనే నాకు తగిన జోడీ!
కలర్స్ కళ్యాణ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సీరియల్ రాధ- మధు. ఆ సీరియల్లో నటి మౌనిక పక్కన కళ్యాణ్ ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఇంటింటికీ ఆత్మీయుడైపోయాడు. లయ, కన్యాదానం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సీరియల్స్తో కెరీర్ కొనసాగించిన కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి ‘సాక్షి’తోపంచుకున్నారు... ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని టైటిల్ పెట్టారు. కానీ సీరియల్లో మీ మాటలు తేడాగా ఉన్నాయే? (నవ్వుతూ) అవును. పేరుకే హీరోని గానీ క్యారెక్టర్ పరంగా విలన్ని. వేరే అమ్మాయి కోసం భార్యని దారుణంగా మోసగించే పాత్ర. ఎప్పుడూ సాఫ్ట్గా కనిపించి కనిపించి బోర్ కొట్టింది. అందుకే నెగిటివ్ రోల్ ఎంచుకున్నా. ఆమధ్య బుల్లితెర మీద కనిపించలేదెందుకని? కావాలనే రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా. ఈ ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్కరోజులో ఎత్తేస్తారు, ఒక్కరోజులో పడేస్తారు. కాబట్టి భవిష్యత్తు కోసం మరొక ఆప్షన్ పెట్టుకోవడం అవసరమనిపించింది. అందుకే నటనకు కామా పెట్టి బిజినెస్ సెటప్ చేసే ప్రయత్నాల్లో పడ్డాను. అంతలో మంచి ఆఫర్ రావడంతో మళ్లీ మేకప్ వేసుకున్నాను. చూస్తుంటే ఇండస్ట్రీ మిమ్మల్నేదో ఇబ్బంది పెడుతున్నట్టుంది? లేదు.. నేను అలా అనలేదు. సెకెండ్ ఆప్షన్ అవసరం అని చెప్పానంతే. అయినా సమస్యలన్నవి అన్ని చోట్లా ఉంటాయి. ఇష్టపడి చేస్తే ఏదీ కష్టంగా అనిపించదు. నాకు నటనంటే ఇష్టం. ఇండస్ట్రీ అంటే ఇష్టం. కాబట్టి దీన్ని ఎప్పటికీ కష్టమనుకోను, వదలను. ఈ ఇష్టం మీరు నటుడయ్యాక పెరిగిందా... లేక ఇష్టంతోనే నటుడయ్యారా? నిజానికి ఇండస్ట్రీకి ఇష్టంతో రాలేదు, యాక్సిడెంటల్గా వచ్చాను. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఎంబీయే చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు చిన్నా అనే అసిస్టెంట్ డెరైక్టర్ ద్వారా ‘రాధ-మధు’ సీరియల్ హీరోగా చాన్స్ వచ్చింది. నటించడం మొదలెట్టాక అందులోని ఆనందం తెలిసి వచ్చింది. పైగా అది పెద్ద హిట్. తర్వాత చేసిన ‘లయ’ కూడా మంచి హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. సినిమాల్లోకి కూడా వెళ్లారుగా? అవును. ‘గోపి గోపిక గోదావరి’లో సెకెండ్ హీరోగా చేశాను. నిజానికి అంతకంటే ముందే వాన, లక్ష్మి, సై, మనోరమ లాంటి కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ కోసం అడిగారు. టైమ్ కుదరక చేయలేదు. కానీ వంశీగారి సినిమా అంటే వదులుకోలేకపోయాను. కానీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు? చెప్పానుగా నటనకు కామా పెట్టానని. దానివల్లే సీరియల్స్తో పాటు సినిమాలకీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కలిసొస్తే లీడ్ రోల్ చేసే చాన్స్ కూడా ఉంది. సినిమా మీద ఆశతో కెరీర్ని పాడు చేసుకున్న సీరియల్ నటులు చాలామంది ఉన్నారు. మరి మీరు..? మీరన్నది నిజమే. కానీ టీవీ నుంచి వెళ్లి సక్సెస్ అయినవాళ్లూ ఉన్నారు. రాజీవ్ కనకాల, రావు రమేష్ అందుకు మంచి ఉదాహరణ. ఓ మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు నటుడి లైఫ్ దానంతటదే టర్న్ అవుతుంది. అయితే ఒకటి. నేను సినిమాల కోసం సీరియళ్లను వదిలేసుకోవాలని అనుకోవడం లేదు. నేనెవరో అందరికీ చెప్పిందీ, నాకింత పేరు తెచ్చిందీ టీవీయే కదా! సినిమాలు హీరో చుట్టూ తిరిగితే... సీరియళ్లు హీరోయిన్ చుట్టూ తిరుగుతాయి. మరి సీరియల్ హీరోగా మీకెంత ప్రాధాన్యత ఉంది? సీరియల్ అంటే కుటుంబ కథ. వాటిలో కనిపించే పాత్రలన్నీ తమ ఇళ్లలోనే కనిపిస్తుంటాయి అందరికీ. ప్రతి ఇంటికీ ఇల్లాలు ముఖ్యం. అందుకే హీరోయిన్ పాత్రకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా అని మిగతా సభ్యులంతా లేకపోతే కుటుంబం అవ్వదు. సందర్భాన్ని బట్టి ఒక పాత్ర బరువవుతుంది. ఓ పాత్ర తేలికవుతుంది. అంతే తప్ప ప్రాధాన్యత లేకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ సీరియల్లో సడెన్గా ఓ పాము ఎంటరయ్యిందనుకోండి. దానివల్ల టీఆర్పీ పెరిగితే పాము ప్రధాన పాత్రగా మారిపోతుంది. దాన్ని మిగతావాళ్లంతా అంగీకరించి తీరాలంతే. ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులున్నాయనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి మగవాళ్లకి? ఎదిగే క్రమంలో సమస్యలు అందరికీ ఉంటాయి. అధిగమించుకుంటూ వెళ్తేనే సక్సెస్. నా వరకూ నన్ను ఇబ్బంది పెట్టే విషయమైతే రూమర్స్. ఎవరితో కాస్త క్లోజ్గా ఉన్నా వాళ్లతో ముడిపెట్టేస్తారు. అంతకాలం కంటిన్యుయస్గా ఓ హీరోయిన్తో పని చేస్తున్నప్పుడు కాస్త స్నేహం ఏర్పడుతుంది. చనువుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి విపరీతార్థాలు తీసి, దారుణంగా కామెంట్లు చేయడం బాధనిపిస్తుంది. (నవ్వుతూ) పైగా నేను ఇద్దరు హీరోయిన్లు లేకుండా ఇప్పటి వరకూ ఏ సీరియల్ చేయలేదేమో... ఈ పుకార్ల బాధ కాస్త ఎక్కువే. వాటికి మీ ఇంట్లోవాళ్ల స్పందన? నా భార్య శ్రీలేఖ యాంకర్. కాబట్టి తనకు ఇలాంటివన్నీ తెలుసు. సో, ప్రాబ్లెమ్ లేదు. వేరే సీరియల్స్ చూస్తారా? మీ కాంటెంపరరీస్లో మీకు నచ్చే నటుడు ఎవరు? ‘వరూధినీ పరిణయం’ చాలా నచ్చుతుంది నాకు. రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తల జీవితాలను ముడివేసి చూపించే విధానం చాలా బాగుంది. అలాగే హిందీలో ‘బాలికావధు’, ‘ఆనంది’ క్యారెక్టర్ని బ్యాలెన్స్డ్గా చూపించే తీరు అద్భుతం. ఇక హీరోలంటారా... వాళ్ల పరిధి మేరకు అందరూ బాగానే చేస్తారు. ఎవరి స్టైల్ వారిది. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? సీరియళ్లలో లేదు కానీ సినిమాల్లో ఉంది. ‘సాగర సంగమం’లో కమల్గారి పాత్ర లాంటిది చేయాలి. నిజానికి ఆయన చేసే పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు. అంత గొప్పగా మరెవరూ చేయలేరు. అంతలో కొంత చేయగలిగితే చాలు... నటుడిగా జీవితం ధన్యమైనట్టే. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇక్కడ ఏదైనా మారాల్సి ఉందని మీకనిపిస్తోందా? డబ్బింగ్ సీరియల్ సంస్కృతి మారాలి. ఒక్క సీరియల్ మీద కనీసం ఓ యాభై కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. ఓ సీరియల్ని డబ్ చేసే బదులు రీమేక్ చేస్తే ఆ యాభై కుటుంబాలూ కడుపు నిండా తిండి తింటాయి. అది పట్టించుకోకుండా టపటపా ఇతర భాషా సీరియళ్లను దించేస్తున్నారు. ఇది ఆగాలి. నటన... బిజినెస్... ఇవేనా, ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్న చిన్న పిల్లలు బిచ్చమెత్తుకుంటుంటే మనసు అదోలా అయిపోతుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ నా ఒక్కడి వల్లే అది సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. నిజంగా వాళ్లు ఏదైనా చేస్తే... అందులో పాలు పంచుకునే మొదటివాణ్ని నేనే అవుతాను. - సమీర నేలపూడి -
సినిమాల్లోకి చిరంజీవి చిన్నల్లుడు?
హైదరాబాద్: పెద్ద స్టార్ల కొడుకులే కాదు.. అల్లుళ్లు కూడా వారసులుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చరిత్ర టాలీవుడ్లో ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అంటూ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కళ్యాణ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్యూట్ లుక్స్తో అదరగొడుతున్న ఇతగాడిని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. 'మెగాస్టార్ చిన్నల్లుడు', 'శ్రీజతో కళ్యాణ్' అంటూ లీకైన ఫొటోలు టీటౌన్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శ్రీజతో పెళ్లయిన తర్వాత చిన్నల్లుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అటు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ట అల్లుడు సుధీర్ బాబు హీరోగా పరిచయమయ్యాడు. ఇపుడు చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ వంతు వచ్చిందన్నమాట అంటూ టాలీవుడ్ గుసగుసలాడుతోంది. శ్రీజ పెళ్లి వార్తలపై ఇప్పటికీ గోప్యతను పాటిస్తున్నమెగా ఫ్యామిలీ , మరి ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కళ్యాణ్-శ్రీజ జంటగా ఇలా..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి కబుర్లు రోజుకొకటి వార్తల్లో నిలుస్తున్నాయి. చిరంజీవికి కాబోయే చిన్నల్లుడు ఎట్టకేలకు వెలుగులోకి వచ్చాడు. నిన్న మొన్నటివరకూ శ్రీజకు కాబోయే వరుడు కళ్యాణ్ ఇతడేనంటా అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణ్-శ్రీజ జంటగా ఉన్న ఫొటోను ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. దీంతో శ్రీజ పెళ్లి వార్తను చిరంజీవి ఫ్యామిలీ అధికారికంగా కన్ఫామ్ చేసినట్టయింది. ఇక వరుడు కనుగంటి కళ్యాణ్ ఎన్నారై ఫ్యామిలీ అని తొలుతు వార్తలు వచ్చినా... అతని తల్లిదండ్రులు కెప్టెన్ కృష్ణ, జ్యోతి హైదరాబాద్కు చెందినవారేనని వధువరుల సన్నిహితులు తెలిపారు. కళ్యాణ్ బిట్స్ ఫిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 'కళ్యాణ్, శ్రీజలకు ఒకరిపై ఒకరికి చక్కని అవగాహన ఉంది. వియ్యం అందుకుంటున్న ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి' అని సన్నిహితులు వెల్లడించారు. కాగా ఈ వివాహం ఎక్కడ జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు. పెళ్లి వేడుకను హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నా, ఆ తర్వాత వేదిక మారినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో రెండు కుటుంబాలు గోప్యత పాటిస్తున్నాయి. -
చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి కబుర్లు టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. దీనిపై చిరంజీవి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రేమ వివాహం, విడాకులతో సంచలన వార్తగా నిలిచిన శ్రీజ.. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి కట్టుతో ఉన్న ఫొటో ఒకటి హల్చల్ చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి చిన్న అల్లుడు ఈయనే అంటూ మరో ఫొటోఒకటి ఇప్పుడు ఆందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చిరంజీవి భార్య సురేఖకు సన్నిహితుల కొడుకు, తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కళ్యాణ్తో పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఏ హంగూ, ఆర్భాటం లేకుండా, చాలా నిరాడంబరంగా కొద్దిమంది విశిష్ట అతిథుల సమక్షంలో ఈ పెళ్లి చేయించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొణిదల వారి ఇంటి పెళ్లిసందడిపై... స్వయంగా పెళ్లివారి నుంచి కబురు అందేవరకు ఈ సస్పెన్స్ తప్పదు. -
లారీ, బైక్ ఢీ.. ఇద్దరి మృతి
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ శివారులోని రాయన్గూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై నలుగురు వ్యక్తులు టేకుమట్ల నుంచి సూర్యాపేట వైపు వెళుతుండగా ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న కల్యాణ్, మణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్, ఉపేందర్లను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతులు, క్షతగాత్రులు సూర్యాపేట పట్టణంలోని బర్లపెంటబజార్కు చెందినవారు. -
నిర్మాత ప్రసాద్పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
-
స్కూల్ వద్ద హీలియం సిలిండర్ పేలుడు
థానే: మహారాష్ట్రలో ఓ స్కూల్ వద్ద హీలియం వాయువుతో నిండిన సిలిండర్ పేలి ఒక చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. 13మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు. థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఓ పాఠశాల వద్ద బెలూన్లు విక్రయించే వ్యక్తి బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కల్యాణ్(15) అనే 9వ తరగతి విద్యార్ధి వల్లూరుపాడు వంకలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఐదుగురు స్నేహితులు సరదాగా ఈత కొట్టడానికి వంకకు వెళ్లారు. వంకలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కల్యాణ్ దిగడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు గ్రామస్థులకు సమాచారమివ్వడంతో కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. అతనికి ఈత రాకపోవడం కూడా మృతికి కారణంగా తెలుస్తుంది. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్లోని కల్యాణ్పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు. మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ. -
ఉస్మానియా భూముల జోలికి వెళ్లొద్దు
నల్గొండ: ఉస్మానియా యూనివర్సిటీ భూములను దళారులకు పంచెందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో జరిగిన నియోజకవర్గం బీజేవైఎం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన కేజీ టూ పీజీ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
శివాజీ రాజీకే ఏమీ తెలియదు
-
'మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు'
-
'మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు'
హైదరాబాద్: మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన అవకతవకలపై అసోసియేషన్కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ సమాధానం లేదని కల్యాణ్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ ముందుకు వచ్చానని.. రాజకీయ పార్టీల్లో కూడా ఇంత వ్యతిరేకత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సీసీఎల్ క్రికెట్ వెనుక మురళీమోహన్ ఉన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయంటూ నోటీసుబోర్డులో పెట్టారు. శివాజీ రాజీకే ఏమీ తెలియదు. 'మా' డబ్బును మురళీ మోహన్ రూ.5లక్షలు దేవాలయాలకు ఇచ్చారు. నేనూ గుడి కట్టిస్తా.. మరి నాకూ అలాగే డబ్బులు ఇస్తారా ? 'మా' డబ్బును మురళీమోహన్ వేరే వాళ్లకు ఎందుకు ఇస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాగుపడ్డాం... హాపీగా ఉన్నాం!
వెలుగులు విరజిమ్ముతున్న సేంద్రియ వ్యవసాయ సంస్కృతి అప్పులపాలైన బడుగు రైతు బతుకు ఏం చేస్తే నిజంగా బాగుపడుతుంది? అదికూడా.. ఎడతెగని కరవుకు, అన్నదాతల ఆత్మహత్యలకు నెలవైన అనంతపురం జిల్లా నుంచి వలస పోయి పొట్టపోసుకుంటున్న రైతు జీవితాన్ని ఆకుపచ్చగా మార్చడానికి ఏం చేస్తే బాగుంటుంది? నాలుగేళ్ల క్రితం కల్యాణ్ అనే ఓ కార్పొరేట్ ఉద్యోగి తనకు తాను ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నెలకు రూ.2 లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ఈ ప్రశ్నలకు బాధ్యత గల పౌరుడిగా చిత్తశుద్ధితో సమాధానాలు వెతికాడు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, స్వయం సమౄద్ధ జీవనాన్నే కల్యాణ్ కలగన్నాడు. ఈ కలను సాకారం చేసుకోవడానికి నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణాత్మక కృషి సత్ఫలితాలనిస్తోంది. ఓ చిన్న రైతు కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి, వలస వెతల నుంచి రక్షించి సగర్వంగా తన కాళ్లపై తనను నిలబెట్టింది. ఆ అదృష్టవంతుడైన రైతు పేరు లచ్చన్నగారి రామచంద్రారెడ్డి. దండగ మారి ‘గవర్నమెంటు ఎరువులు’ వదిలేసి.. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నాడాయన. ఇప్పుడా రైతు కుటుంబానికి ఆదాయ భద్రతతోపాటు బతుకుపై భరోసా కూడా చేకూరింది! దిశానిర్దేశం చేసి, తగిన తోడ్పాటునందిస్తే బడుగు రైతు బతుకు శాశ్వతంగా బాగుపడుతుందనడానికి రామచంద్రారెడ్డి అనుభవమే ఉదాహరణగా నిలుస్తుంది. లచ్చన్నగారి రామచంద్రారెడ్డి(36), సుగుణమ్మ దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఆనంద్రెడ్డి ఉన్నాడు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆరుమాకులపల్లి వారి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామచంద్రారెడ్డి చదువు పదో తరగతితో ముగిసింది. 3 ఎకరాల్లో పొలంలో ‘గవర్నమెంటు(రసాయనిక) ఎరువుల’తో వ్యవసాయం చేస్తే.. రూ. 1.75 లక్షల అప్పులు మిగిలాయి. కాడి కింద పడేసి పొట్టచేతపట్టుకొని కుటుంబ సమేతంగా బెంగళూరెళ్లి కూలి పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటుండగా.. హిందూపురానికి చెందిన విశ్రాంతాచార్యులు రాజారావు కుమారుడు కల్యాణ్ తారసపడ్డాడు. తిరిగి సొంతూరు వచ్చేస్తే పచ్చగా పంటలు పండించుకుంటూ బతుకును బాగు చేసుకునే దారి చూపుతానన్నాడు. వలస బాటపట్టిన రామచంద్రారెడ్డి ఆ విధంగా మరల సేద్యానికి మళ్లాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత.. ‘అప్పులు తీరిపోయాయి. ఆనందంగా ఉన్నాం’ అంటున్నాడు. అంతేకాదు.. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేసుకునే దారిదీ అని నలుగురికీ చెప్ప గలిగే స్థితికి ఎదిగాడు. పంటకు, ఇంటికీ సొంత ఇంధనమే! ఎంబీఏ చదివి జెనరల్ ఎలక్ట్రికల్లో నెలకు రూ. 2 లక్షలు సంపాదించే కల్యాణ్ గ్రామీణ పేదలకు సేవ చేసే లక్ష్యంతో ‘ఇంటిగ్రేటర్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన సమకూర్చిన మౌలిక సదుపాయాలు, పర్యావరణహితమైన స్వతంత్ర జీవన విధానం, సేంద్రియ సాగు పద్ధతి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టింది. సొంతంగా తయారు చేసుకున్న పంకాతో ఇంటి అవసరాలకు పవన విద్యుత్ అందుతోంది. సోలార్ విద్యుత్తో బోరు నడుస్తోంది. బయోగ్యాస్తో వంట అవసరాలు తీరుతున్నాయి. రామచంద్రారెడ్డి కుటుంబంతోపాటు కల్యాణ్ కుటుంబం, ఇంతియాజ్ అనే మరో విద్యాధిక యువకుడు కూడా పొలంలో నిర్మించిన మట్టి ఇళ్లలో నివాసం ఉంటూ.. పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. 3 ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం 300 అడుగులు తవ్విన బోరు నుంచి ఇప్పటికీ 3 అంగుళాల నీరు వస్తుండడంతో పొలానికి సాగునీటి సమస్య తీరిపోయింది. భూమిని రామచంద్రారెడ్డి దంపతులే స్వయంగా చదును చేసుకున్నారు. మూడు సొంత నాగళ్లతోనే దుక్కి దున్నడం అంతా. వ్యవసాయ పనులేవైనా సాధ్యమైనంత వరకు సొంతంగా చేసుకోవడమే. మరీ అవసరమైనప్పుడే కూలీలను పెట్టుకునేది. ఈ ఏడాది 3 ఎకరాల సాగుకు రూ. 10 వేలకు మించి కూలీలకు ఖర్చు పెట్టలేదు. 26 గిర్ ఆవులతో కల్యాణ్ ఏర్పాటు చేసిన డెయిరీ అందుబాటులో ఉండడంతో.. రామచంద్రారెడ్డి వ్యవసాయానికి పశువుల పేడ, మూత్రం కొరత లేకుండాపోయింది. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టు, జీవామృతం, పంచగవ్యతో వ్యవసాయం చేస్తున్నారు. మరీ అవసరమైతే తప్ప ఏమీ కొనకూడదన్నది సూత్రం. ఈ ఏడాది బెల్లం, వస్త్రాలు తప్ప ఏమీ కొనలేదని రామచంద్రారెడ్డి చెప్పారు. రైతుబజారులో రెట్టింపు ధరకు అమ్మకాలు సొంతానికి అవసరమైన అన్ని పంటలూ పండించుకోవడం, అదనంగా ఉన్న పంట దిగుబడులను మాత్రమే అమ్మటం- ఇదే మూల సూత్రం. రామచంద్రారెడ్డి తమ సేంద్రియ ఉత్పత్తులను హిందూపురం రైతుబజారుకు తీసుకెళ్లి రెట్టింపు ధరకు విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోంది. గడచిన ఖరీఫ్లో పంటల ద్వారా చక్కటి ఆదాయం పొందారు. అరెకరంలో 30 బస్తాల ధాన్యం పండించి, సొంత వినియోగం కోసం ఉంచుకున్నారు. అరెకరంలో 800 కిలోల రాగులు పండించి కొన్ని అమ్మారు. అరెకరంలో 800 కిలోల వేరుశనగలు పండించారు. ఎకరంలో కొత్తిమీర వేసి 45 రోజుల్లోనే రూ. లక్ష ఆదాయం పొందారు. టమాటా నాటబోతున్నారు. అరెకరంలో మిర్చి వేశారు. వారం వారం కాయలు కోసి రైతుబజార్కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఇప్పటికి రూ. 42 వేల ఆదాయం వచ్చింది. మరో రూ. 50 వేలు వస్తుందని అంచనా వేస్తున్నారు. 3 ఎకరాల్లో పంటల సంగతి అట్లా ఉంచితే.. ఇంటి వద్ద 3ఁ5 సైజ్ గల 8 ఫైబర్ టబ్ల(వికింగ్ బెడ్స్)లో ఇంటికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ ఎరువులతో పండించుకుంటున్నారు. రామచంద్రారెడ్డి సాధించిన విజయం గ్రామంలో పలువురు రైతులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది కొందరు రైతులు ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రైతులందరకూ ఈ తరహా జీవన శైలిని, విషరహిత వ్యవసాయ పద్ధతిని అలవరచుకొని నిశ్చింతగా బతికేలా శిక్షణ ఇవ్వాలని.. గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కల్యాణ్ (097417 46478) ఆశిస్తున్నారు. - హెబ్బార్ చక్రపాణి, హిందూపురం, అనంతపురం జిల్లా విషం లేని ఆహారం పండిస్తున్నాం.. కల్యాణ్ సారు చెప్పినట్టు చేస్తూ.. విషం లేని ఆహారం పండించి తింటున్నాం. ఖర్చు లేని వ్యవసాయం చేస్తున్నాం. పెద్దోళ్లు చేసిన వ్యవసాయం ఇది. మొదటి ఏడాది సరిగ్గా దిగుబడి రాలేదు. తర్వాత బాగుంది. భూమి రంగు మారి సత్తువ పెరిగింది. అప్పులు తీరాయి. బాగుపడ్డాం. హాపీగా ఉన్నాం. ఇతర రైతులూ ఇలాగే బాగుపడాలని అడిగిన వారికి చేతనైన సాయం చేస్తున్నాం. - లచ్చన్నగారి రామచంద్రారెడ్డి (85009 86728), ఆరుమాకులపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా. -
ఐదేళ్ల బాలుడి కిడ్నాప్నకు యత్నం
ఇబ్రహీంపట్నం: ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఓ మహిళ విఫలమైంది. మంగళవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నంలోని ఎంజీఆర్ కాలనీకి చెందిన అంజయ్య, పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ (05) స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూలులో ఎల్కేజీ చదువుతున్నారు. సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం ఇబ్రహీంపట్నంకే చెందిన ఓ పాస్టర్ కూతురు ఆశ.. బాలుడి తల్లిదండ్రుల పేరు చెప్పి కార్తీక్ను తన వెంట తీసుకెళ్లింది. బాలుడిని తీసుకెళ్లిన కాసేపటికే తల్లి పద్మ పాఠశాలకు వచ్చి బాలుడి కోసం ఆరా తీయగా విషయం బయటపడింది. అయితే కాసేపటికే స్థానిక పాతబస్టాండ్ సమీపంలో ఓ మహిళ వద్ద ఉన్న కార్తీక్ను అదే పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి కళ్యాణ్ గమనించారు. కార్తీక్ను పట్టుకున్న మహిళ వద్దకు వెళ్తుండగానే ఆమె అక్కన్నుంచి జారుకుంది. దీంతో కళ్యాణ్.. కార్తీక్ను పాఠశాల వద్దకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, కళ్యాణ్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కిడ్నాప్కు పాల్పడిన మహిళను ఆశగా గుర్తించారు. -
కళ్ళు చెదిరేలా.. 'కళ్యాణ్' సంపద!
-
పాపం చిన్నారులు
చిలకపాలెంలో దంపతుల ఆత్మహత్య అనాధలైన కుమారులు ఎచ్చెర్ల క్యాంపస్: జెండా పండుగను అందరితో కలిసి ఘనంగా జరుపుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన బహుమతులు అమ్మానాన్నలకు చూపించాలని భావించి తమ్ముడితో కలిసి గురువారం రాత్రి 9 గంటలలోపే నిద్రకు ఉపక్రమించాడు ఆ కుర్రాడు. కానీ విధి వారి జీవితంతో ఆడుకుంది. ఉదయానే స్కూలుకు వేగిరంగా వెళ్లాలని నిద్ర లేచిన పిల్లలకు ఇంట్లో అమ్మా నాన్న కనిపించలేదు. ఏమయ్యారో ఇరుగుపొరుగు వారిని అడిగితే సరైన సమాధానం రాలేదు. చుట్టుపక్కల వెతికితే ఓ పాడుపడిన బావి దగ్గర తండ్రి సెల్ ఫోన్, కాళ్ల చెప్పులు కనిపించడంతో ఆందోళన చెందారు. బావిలో చూసేసరికి వారి నెత్తిన పిడుగుపడినట్లయింది. తల్లిదండ్రులిద్దనూ విగతజీవులుగా బావిలో కనిపించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. వివరాలు ఇవీ... లావేరుకు చెందిన వాలపల్లి సత్యనారాయణ (45), సరస్వతి (40)కి 20 ఏళ్ల కిందట వివాహం అయింది. 15 ఏళ్ల కిందట వాళ్లు చిలకపాలెం జంక్షన్ను వలస వచ్చారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కల్యాణ్ ఎచ్చెర్లలోని వెంకటసాయి ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి, చిన్నకుమారుడు ప్రసాద్ అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇటుకల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు గానీ, అప్పులు గానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే మద్యం వ్యసనం ఉన్న సత్యనారాయణ తరచూ భార్య సరస్వతితో గొడవపడుతుండేవాడు. గురువారం రాత్రి 9 గంటలకు పిల్లలిద్దరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఏంజరిగిందో తెలియదుగానీ క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జేఆర్పురం సీఐ కె.అశోక్కుమార్ పిల్లలను విచారణ చేశారు. వారు కూడా దాదాపుగా స్థానికులు, బంధువులు చెప్పిన విషయాలే చెప్పడంతో భార్యాభర్తలది ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు. సత్యనారాయణ దంపతుల ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సత్యనారాయణ అన్నయ్య లావేరులోను, తమ్ముడు వీరభద్రరావు చిలకపాలెంలోనూ ఉంటున్నారు .విషయం తెలిసి లావేరు మండలం నుంచి బంధువులు తరలివచ్చారు. కాగా పోలీసులు మృతదేహాలను బావిలోకి బయటకు తీయించి శవ పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపం కల్యాణ్ కల్యాణ్కు చురుకైన విద్యార్థిగా పేరుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల స్కూల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా గెలిచాడు. అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందుకోవాలని ఎంతో ఆశించాడు. కానీ ఊహించని రీతిలో ఇంట్లో విషాదం నెలకొనడంతో తల్లిదండ్రుల అంత్యక్రియల్లో పాల్గోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మృతదేహాల ఎదుట కల్యాణ్, ప్రసాద్ గుండలవిసేలా విలపిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
ఒక్క సీటూ ఇవ్వొద్దు:నరేంద్ర మోడీ
డీఎఫ్ను ఖాతా తెరవనివ్వకండి కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో మోడీ కల్యాణ్ ఎన్నికల సభలో అభిమానుల బహుకరించిన పూలదండతో మోడీ, ఉద్ధవ్ కల్యాణ్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ఎన్సీపీ(డీఎఫ్) కూటమికి ఒక్క సీటు రాకుండా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కల్యాణ్లో సోమవారం జరిగిన మహాకూటమి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కంటే కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తుందని మోడీ మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 232 లోక్సభ స్థానాల జరిగిన ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని గ్రహించిన కాంగ్రెస్ తనను ఆపేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికలు జరగబోయే మరిన్ని దశలలోనూ బీజేపీకే ఎక్కువ స్థానాలు ఇచ్చి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అప్పడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.మే 16 తర్వాత తమ స్థానమెంటో తెలుసుకున్న కాంగ్రెస్, తనని ఆత్మరక్షణలో పడేయాలన్న ఏకైక ఎజెండాతో పనిచేస్తుందని ఆరోపించారు. మురికివాడ రహిత, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన యూపీఏ, అవి నెరవేర్చడంలో విఫలమైందని మోడీ మండిపడ్డారు. కాగా, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే మద్దతు విషయంలో మోడీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తికమకపడాల్సిన అవసరం లేదని, మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. తొలిసారిగా మోడీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రే గుజరాత్ ముఖ్యమంత్రి మోడీపై ప్రశంసలు కురిపించారు. సుస్థిర పాలన అందించే నాయకత్వం ఆయన సొంతమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎఫ్ కూటమి పాలన అవినీతిమయంగా మారిందన్నారు. -
పాకెట్ మనీతో చెబితేనే పేమెంట్ విలువ తెలిసేది
కల్యాణ్కు ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తవుతుండగానే... క్యాంపస్లోనే ఓ బహుళజాతి సంస్థ తనను సెలక్ట్ చేసుకుంది. ఆరంభంలో నెలకు రూ.25 వేల జీతం. రెండేళ్లు తిరిగేసరికల్లా జీతం రూ.50 వేలు దాటిపోయింది. ఐదేళ్లు తిరిగేసరికి ఇంట్లో వాళ్లు పెళ్లి కూడా కుదిర్చేశారు. ‘‘పెళ్లయ్యాక ఇంట్లో చక్కని సామగ్రి, హనీమూన్ ట్రిప్... అన్నిటికీ నీ సేవింగ్స్ పనికొస్తాయిరా’’ అన్నాడు కల్యాణ్ తండ్రి. తెల్లమొహం వేశాడు కల్యాణ్. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచీ పైసా దాస్తే ఒట్టు. జీతం పెరిగితే ఖర్చులూ పెరిగాయి. అంతెందుకు! చదువుకునేటపుడు సైతం పాకెట్ మనీ అయిపోయి మళ్లీ మళ్లీ ఇంట్లోవాళ్లనే అడిగేవాడు కల్యాణ్. ఇదంతా ఎందుకంటే... చిన్నప్పటి నుంచే కళ్యాణ్కు పొదుపు చేయటం అనే అలవాటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పటానికే. అది అలవాటు కావాలంటే నేర్పించాల్సింది తల్లిదండ్రులే. అదెలాగో ఈ వారం చూద్దాం... పాత సలహానే అనిపించినా.. ముందుగా పిల్లలకంటూ పిగ్గీ బ్యాంక్ లాంటిది ఒకటి అలవాటు చేయండి. దాని ప్రయోజనాలేంటో వివరించండి. వాళ్లేదైనా మంచి పని చేస్తే చిన్నపాటి పారితోషికం ఇవ్వడంతో పాటు దాన్ని వారు దాచుకునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పొదుపు చేయడం అన్నది చిన్నతనంలోనే అలవాటవుతుంది. పిల్లలకు ప్రతి నెలా పాకెట్ మనీ లాంటిది ఇచ్చినప్పుడు అది మొత్తం ఖర్చు చేసేయకుండా.. కొంతైనా దాచుకునేలా ప్రోత్సహించండి. అలా జమ చేసిన డబ్బుతో వారికి నచ్చినవి కొని గిఫ్టుగా ఇవ్వండి. కొంత కొంతగా పొదుపు చేసిన డబ్బుతో పెద్ద అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో దీని వల్ల వారికి తెలియజేయొచ్చు. వస్తువులు కొనుక్కురావడం వంటి డబ్బుతో ముడిపడి ఉన్న చిన్న చిన్న పనుల్ని అప్పుడప్పుడు వారికి పురమాయించండి. మొదట్లో తప్పులు చేయొచ్చు. కానీ ఓర్పుగా వివరిస్తే వారు ఆర్థిక లావాదేవీల గురించి త్వరగానే తెలుసుకుంటారు. అప్పుడప్పుడు బ్యాంకులకూ, ఏటీఎంలకూ వెంట తీసుకెళ్లండి. చెక్కులు వేయడం, డబ్బు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం లాంటి లావాదేవీల గురించి వారు తెలుసుకునే వీలుంటుంది. వీలయితే పిల్లల పేరుతో బ్యాంకు అకౌంటు కూడా తెరవచ్చు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి కిడ్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. కిడ్స్ ఖాతా తెరవాలంటే... పద్దెనిమిదేళ్ల దాకా వయసుండే పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. సేవింగ్స్ ఖాతా తరహాలోనే ఈ అకౌంట్లకు కూడా అన్ని సదుపాయాలూ ఉంటాయి. డెబిట్ కార్డు, పాస్ బుక్ లాంటి వాటితో పాటు కొన్ని బ్యాంకులు మైనర్ల కోసం చెక్ బుక్లు కూడా ఇస్తున్నాయి. ఖాతా తెరిచేందుకు వయసు, చిరునామాతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లలకు మధ్య బంధాన్ని తెలియజేసే పత్రాలు, మైనర్ ఫోటో కావాల్సి ఉంటుంది. .. కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బీమా కవరేజి కూడా ఇస్తున్నాయి. పేరెంట్స్కి ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో బీమా సొమ్ము పిల్లలకు అందుతుంది. మిగతా ఖాతాల్లానే కిడ్స్ అకౌంట్లలోనూ కనీస బ్యాలెన్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏమేం ఖాతాలున్నాయంటే... ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ 1 రోజు నుంచి 18 ఏళ్ల దాకా వయసున్న వారికి సగటున కనీస బ్యాలెన్స్ రూ. 2,500 ఉండాలి. పర్సనలైజ్డ్ చెక్ బుక్, ఉచిత డెబిట్ కార్డు రోజువారీ రూ.5,000 వ్యయం లేదా విత్డ్రాయల్ పేరెంట్స్కి ఐసీఐసీఐలో ఖాతా తప్పనిసరి. హెచ్డీఎఫ్సీ కిడ్స్ అడ్వాంటేజీ ఖాతాలో రూ. 35,000 దాటాక.. ఎఫ్డీ కింద ఆటోమేటిక్గా మార్చుకునే మనీ మ్యాగ్జిమైజర్ సదుపాయం. ఈ ఖాతా నుంచి పిల్లల పేరిట సిప్తో ఫండ్స్లోకి మళ్లించవచ్చు కూడా. తల్లిదండ్రులకు ఏదైనా జరిగిన పక్షంలో పిల్లల చదువుకు రూ.1,00,000 ఉచిత విద్యా బీమా. ఆంధ్రా ఏబీ కిడ్డీ 18 ఏళ్ల దాకా వయసున్న వారికోసం పొదుపు అలవాటును పెంచేందుకు ఖాతా తెరిచే సమయంలో పిల్లలకు ఉచితంగా ఒక బొమ్మ కిడ్డీ బ్యాంకును అందిస్తోంది. పిల్లలు దీన్లో డబ్బులు దాచుకోవచ్చు. దీనికి ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది. ఖాతా ఉన్న శాఖలోనే ఈ లాక్ని తీయడానికి వీలవుతుంది. కనీస బ్యాలెన్స్ రూ. 100. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ 12 ఏళ్లకు లోబడి ఉంటే తల్లిదండ్రులు లేదా గార్డియన్ల పేరిట చెక్ బుక్, ఏటీఎం కార్డు మెట్రో నగరాల్లో కనీస త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 2,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000. 6 నెలలకు రూ.25,000 ఎఫ్డీ, రూ.2,000 ఆర్డీ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్లో సడలింపు 12 ఏళ్లు పైబడిన పిల్లలైతే.. వారు కోరుకున్న బొమ్మను డెబిట్ కార్డుపై ముద్రించి ఇస్తారు -
మన కుర్రాళ్లే మూవీ స్టిల్స్
-
ఫెస్ట్స్ వెబ్సైట్ రూపొందించారు...
కాలేజీ అంటేనే ఒక కొత్త ప్రపంచం. విజ్ఞానమే అక్కడి మతం, సంప్రదాయం. మన సంప్రదాయాలని నిలబెట్టేవి మనం జరుపుకునే పండుగలు. మరి కాలేజీ సంప్రదాయాల గురించి ప్రచారం చేసేవి... కల్చరల్ ఫెస్ట్లు, టెక్ఫెస్ట్లే. మామూలు పండుగలు ఎప్పుడు జరుపుకోవాలో చెప్పడానికి పంచాంగాలున్నాయి. కాని కొన్ని వేల కళాశాలలు... అన్ని వేల పండుగలు. వీటికి పంచాంగం రూపొందించేది ఎవరు? అంటే, ‘మేము చేస్తాము’ అనుకున్నారు హరీష్ కొట్రా, కల్యాణ్ వీరమల్ల. అనుకున్నదే తడవుగా రూపొందించిందే fests.info. acumen, carpedium, vidyut ఇలాంటి ఫెస్ట్ పేర్లను వినడమే కాని, సగటు విద్యార్థికి అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో అంత ఐడియా ఉండదు. అలాంటి ఇద్దరు సగటు విద్యార్థుల ఆలోచన నుండి పుట్టింది fests.info. వివిధ కళాశాలల్లో జరిగే ఈ ఫెస్ట్లలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నా, అంత క్లారిటీ లేక వెనుకంజ వేశారు హరీష్, కల్యాణ్. ఆ వెనుకంజలో పుట్టిన ఆలోచనే ఈ ఫెస్ట్ల గురించి చెప్పే వెబ్సైట్. ‘‘హైదరాబాద్లోనే కాదు, మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో జరిగే ఫెస్ట్స్ గురించి చెప్పే ఒక వెబ్సైట్ రూపొందిస్తే ఎలా ఉంటుంది’’ అని ఐడియా ఇచ్చాడు కల్యాణ్. స్వతహాగా వెబ్ డిజైనర్ అయిన హరీష్ వెంటనే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. ఇలా మే 2012లో కలిగిన ఆ ఐడియా, జూన్ 21, 2012 కి మన రాష్ట్రంలోని ప్రసిద్ధ కాలేజీలలో జరిగే ఫెస్ట్స్తో వెబ్సైట్గా రూపొందింది. అలా 2012లో ఫెస్ట్స్కి సంబంధించిన అతి కొద్ది వెబ్సైట్లలో ఒకటిగా ఉన్న ఈ సైటు, ఒకటిన్నర ఏళ్లలోనే దేశవ్యాప్తంగా పేరు సాధించింది. ‘‘ఒక విద్యార్థి కాలేజీలో ఎంతో నేర్చుకుంటాడు. కాని ఆ నేర్చుకున్న దానిని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పేవి ఫెస్ట్స్ మాత్రమే. రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి సబ్జెక్ట్లలోని ప్రాక్టికల్ అప్రోచ్ని వినోదంతో కలిపి ఒక వేదికపై నిలపడమే టెక్ ఫెస్ట్ల ముఖ్య ఉద్దేశ్యం. అలానే ప్రతి విద్యార్థిలోను దాగి ఉన్న కళలను బయటకు తీసుకురావడం కల్చరల్ ఫెస్ట్ వంతు. ఏం చేసినా ఈ ఇంజనీరింగ్లోనే చెయ్యాలి. తర్వాత ఉద్యోగం వచ్చాక ఇలాంటి వాటిలో పాల్గొనే అవకాశం తక్కువ. అందుకే ఈ ఫెస్ట్ల మీద మేము అంత ఆసక్తి చూపించి, దానికోసం ఒక వెబ్సైట్ని రూపొందించింది’’ అంటాడు హరీష్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో కేవలం కళాశాలలో జరిగే ఫెస్ట్ల గురించి కాక, ముఖ్యపట్టణాల్లో జరిగే మ్యూజికల్ నైట్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, చారిటీ షోస్, వర్క్షాప్స్, కాన్ఫరెన్స్లకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ‘‘మా వెబ్సైట్లో అనవసర యాడ్స్ ఉండవు. మొబైల్లో నుండి కూడా చాలా సులువుగా యాక్సెస్ని పొందవచ్చు. ఇవే మమ్మల్ని వేరే వెబ్సైట్స్ నుంచి వేరు చేసే గుణాలు. మా వెబ్సైట్లో ఎవరైనా వాళ్ల ఫెస్ట్స్కి సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవచ్చు. మేము మాకు వచ్చే ప్రతి వివరాన్నీ చెక్ చేసి వందశాతం నిజమని నిర్ధారించాకే మా వెబ్సైట్లో ఆ ఫెస్ట్కు సంబంధించిన వివరాల్ని పొందుపరుస్తాం...’’ అంటారు కల్యాణ్. ఇంతకీ దీని ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో అనుకుంటున్నారా! సున్నా రూపాయలు. అవును, వీరు ఆ ఫెస్ట్స్కి ప్రచారాన్ని కల్పించిన వాళ్ల దగ్గర చిల్లిగవ్వ కూడా తీసుకోరు. పైగా ఈ వెబ్సైట్ని నడపడానికి అయ్యే ఖర్చుని తమ సొంత డబ్బులతో నెట్టుకొస్తున్నారు. ఎందుకిలా అని అడిగితే, ‘‘మేము ఏదో బిజినెస్ చేద్దాం అని వెబ్సైట్ చెయ్యలేదు, మా స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక సర్వీస్లా చేస్తున్నాం. మేము ఆశించేది కాస్తంత ప్రేమ, పేరు... అంతే’’ అని నవ్వేస్తారు ఇద్దరూ. కల్యాణ్ ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నాడు. హరీష్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. రోజంతా వీళ్లు పనిలో ఉన్నా, ప్రతిరోజూ ఈ వెబ్సైట్ బాగోగులని తప్పక చూసుకుంటారు. - శ శ్రీక్ -
పవన్ పెళ్ళి విషయాన్ని ధృవీకరించిన రిజిస్ట్రార్
-
పవన్ మూడో 'కళ్యాణ్'౦
-
మూడో కళ్యాణ్
-
పవనిజమేది..?
-
సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం
చెన్నై:వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది. త్వరలో జరుగనున్న సినిమా వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ నెల 21 నుంచి భారతీయ సినిమా శత జయంతి వేడుకలు చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శత జయంతి వేడుకల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం విశేషం. ఈ మేరకు దక్షిణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కల్యాణ్ కు రూ.10 కోట్ల చెక్కును జయలలిత అందజేశారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తమిళులు విరాళాన్ని ప్రకటించడంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు.