
అమ్మవారిని నవరాత్రుల్లో ఒక్కో అవతారంలో భక్తులు పూజిస్తుంటారు కదా..! అయితే, కొన్ని ప్రాంతాల్లో రూపానికి తగినట్లుగా తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భక్తులు దుర్గామాతను కొలుస్తారు.

ఇప్పుడు ప్రముఖ యాంకర్, బిగ్బాస్ ఫేమ్ లాస్య తనదైన విధానంలో నవరాత్రుల లుక్స్ను పలు ఫోటోలతో పంచుకుంది.

నవరాత్రుల్లో భాగంగా మొదటిరోజు: 'శైలపుత్రి రూపం' ప్రతీకను తెలుపుతూ పసుపు రంగు చీర ధరించి ఆ ఫోటోలను లాస్య షేర్ చేసింది.

నవరాత్రుల్లో రెండోరోజు: 'బ్రహ్మచారిణి దేవి' రూపం ఈరోజు ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఇది ప్రకృతికీ, సంతానానికీ, శాంతికీ, ప్రతీక. దీంతో లాస్య కూడా ఆకుపచ్చ రంగు చీర ధరించి పోటోలు పంచుకుంది.

నవరాత్రి మూడోరోజున చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారు. బూడిద రంగు దుస్తులు ధరిస్తారు. మనందరిలో ఉండే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ప్రతీక. స్త్రీలోని శక్తిని కూడా తెలుపుతుంది.

నవరాత్రుల సందర్భంగా మంచి మెసేజ్తో పాటు తన ఫోటోలను షేర్ చేస్తుంది లాస్య.

మిగిలిన ఆరు రోజులకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో ఆమె పంచుకోనున్నట్లు తెలుస్తోంది.




