
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్;. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

















