pre release event
-
హారర్ చిత్రానికీ కన్నీళ్లొస్తాయనుకోలేదు: నాని
‘‘శబ్దం’ సినిమాని ఎంజాయ్ చేశాను. ఎమోషనల్గా చాలా హై ఇస్తుంది. హారర్ సినిమాకీ కన్నీళ్లొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ, భావోద్వేగాలున్న హారర్ సినిమా ఇది. హారర్ మూవీస్ని ఇష్టపడే వారైతే పది మంది ఫ్రెండ్స్తో కలసి వెళ్లండి... చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో నాని తెలిపారు. ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వం వహించిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ సినిమా నుంచి ఆది, నేను ఫ్రెండ్స్. ‘శబ్దం’ సినిమాపై తను ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడో నాకు తెలుసు. సౌండ్ ఒక ఆయుధం అని ఒక రకమైన కొత్త యాంగిల్ని సినిమాలో చూపించారు.థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్స్లో చూసి ఆదికి, ‘శబ్దం’ టీమ్కి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘శబ్దం’ ప్రయాణం 16 ఏళ్ల క్రితం మొదలైంది. ‘వైశాలి’ లేకపోతే ‘శబ్దం’ ఉండేది కాదు. మా డైరెక్టర్ అరివళగన్కి ధన్యవాదాలు. హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది’’ అని చెప్పారు. అరివళగన్ మాట్లాడుతూ– ‘‘వైశాలి’ తర్వాత ఆది, నేను మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు సౌండ్ని హారర్ థీమ్గా తీసుకోవాలనుకున్నాం. సౌండ్ని విజువలైజ్ చేసి, హారర్ క్రియేట్ చేయడం సవాల్గా అనిపించింది. తమన్ పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
‘శబ్దం’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హీరో నాని (ఫొటోలు)
-
'బాపు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన ధన్య బాలకృష్ణ (ఫొటోలు)
-
బ్రహ్మాజీ 'బాపు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అలాంటి వారి మనసుల్లో నిలిచిపోతుంది: ప్రదీప్ రంగనాథన్
‘‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరి మనసుల్లో మా సినిమా నిలిచిపోతుంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు థ్యాంక్స్’’ అని హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) చెప్పారు.‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల అవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డైరెక్టర్స్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల ముఖ్య అతిథులుగా హాజరై, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ–‘‘మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. మా డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఇది కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అర్చనా కల్పాతి చెప్పారు. ‘‘ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవి శంకర్. కయాదు లోహర్, నిర్మాత ఎస్కేఎన్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
'రామం రాఘవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆ ఆలోచన నుంచి బయటికి రండి'.. చిరుకు శ్యామల చురకలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. తనలాగే రామ్ చరణ్కు వారసుడు పుట్టాలని కోరుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టారు. మా ఇంట్లో నా చుట్టూ అంతా మనవరాల్లే ఉన్నారని.. ఇళ్లంతా లేడీస్ హాస్టల్ను తలపిస్తోందని అన్నారు. చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమనని భయమేస్తోందని సరదాగా అన్నారు. చిరు సరదాగా కామెంట్స్ చేసినప్పటికీ..దీనిపై పలువురు నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. వారసుడంటే మగపిల్లాడేనా.. కూతుర్లు వారసురాళ్లు కాకూడదా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.తాజాగా చిరంజీవి చేసిన కామెంట్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించింది. వారసుడు అంటే కొడుకే అవుతాడా?.. కూతురు అవ్వకూడదా? అని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు కానీ..వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అనే ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుంటుందని అన్నారు. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచన సరికాదన్నారు. వారి కోడలు ఉపాసన కూడా ఎంత చక్కగా రాణిస్తున్నారు. కొడుకైనా.. కూతురైనా వారసులు అవ్వొచ్చు అని తెలిపింది శ్యామల.మెగాస్టార్ ఏమన్నారంటే..బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతూ..'ఇంట్లో నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే.. ఒక్క మగపిల్లాడు లేడు. చరణ్.. ఈసారైనా సరే ఒక మగపిల్లాడిని కనరా.. నా వారసత్వం ముందుకువెళ్లాలని కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని నా భయం' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవడం తప్పు లేదు కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురూ అభిప్రాయపడుతున్నారు. కాగా రామ్చరణ్- ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. -
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
ప్రీరిలీజ్ ఈవెంట్లో కుప్పకూలిన డైరెక్టర్..ఏమైంది?
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘తల’. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. అయితే ఈవెంట్కి వచ్చిన అమ్మ రాజశేఖర్ సడెన్గా కిందపడిపోవడంతో కాసేపటి వరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని స్టేజిపై ఉన్నవారిలో ఆందోళన మొదలయ్యింది. కాసేపటికి ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి, కాసేపు క్రింద అలాగే కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగి కొద్ది సేపు రెస్ట్ తీసుకుని రిలీఫ్ అయ్యారు. హైబీపీ కారణంగానే అమ్మ రాజశేఖర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికే కోలుకొని స్టేజ్ మీదకు రావడంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.అనంతరం తల సినిమా గురించి మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరవాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న తల చిత్రాన్ని మీరంతా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.." అన్నారు.హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న(అమ్మ రాజశేఖర్) నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు.." అన్నాడు. -
అమ్మ రాజశేఖర్ ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రాజకీయాలకు దూరంగా... సినిమాలకు దగ్గరగా ఉంటా: చిరంజీవి
‘‘బ్రహ్మానందం(Brahmaanandam)లో స్పార్క్ని గమనించి నేను తనని మద్రాసు తీసుకువెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం, ప్రేమానురాగాలు, గురు–శిష్యుల అనుబంధం ఉన్నాయి. ఓ రోజు బ్రహ్మానందం ఇంటికి వెళితే ఎన్నో అవార్డులు ఉన్నాయి. తన చరిత్ర అంతా ఓ గదిలో కనిపించింది. అలాంటి బ్రహ్మానందం కొడుకు చేసిన రెండు మూడు సినిమాలు అంతంతగా అలరించినా సరే... మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi)అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రల్లో, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’.ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’(Brahmaanandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై, అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ విధంగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో, అలానే నువ్వూ అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అత్తిలిలో నేను లెక్చరర్గా చేస్తున్నప్పుడు భీమవరం వెళ్లి ‘ఖైదీ’ సినిమా చూశాను. చిరంజీవి ట్రెండ్ సెట్టర్. ఆయన చూడని చరిత్రా... చెప్పని చరిత్రా. చిరంజీవి కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఈ వేడుకకు చిరంజీవిగారిని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకుని కాస్త తటపటాయించాను. 9వ తారీఖు ఒక ఫంక్షన్. మళ్లీ 11న మరొక ఫంక్షన్ కదా అనుకున్నాను. ‘గౌతమ్ నీకు బిడ్డ. నాకూ బిడ్డలాంటి వాడే..’ అన్నారు. నన్ను తొలిసారి చెయ్యి పట్టుకుని విమానం ఎక్కించింది చిరంజీవిగారే. ఇప్పుడు నా బిడ్డ చేయిపట్టుకుని ఈ విమానం ఎక్కిస్తున్నారు.మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న కుర్ర నిర్మాతల్లో రాహుల్ ఒకడు. ఇది తాత–మనవడు గురించి చెప్పే కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. ‘‘హీరో అనే పదానికి నాకు మీనింగ్ చిరంజీవిగారే. బ్యూటిపుల్ ఎమోషనల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో అందరూ హాయిగా చూడండి’’ అన్నారు రాజా గౌతమ్. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా అంటే బ్రహ్మానందంగారే. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రాజా గౌతమ్గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఆర్వీఎస్ నిఖిల్. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ వేదికపై ఆయన్ను బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ సన్మానించారు.అప్పుడు ఒత్తిడిగా ఉండేది సినిమాల్లో ఉండగా నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. పొలిటికల్ సైడ్ వెళ్లినప్పుడు కాస్త ఒత్తిడిగా ఉండేది. అన్నవాడిని, అననివాడిని కూడా ఏదో అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. ఒత్తిడిగా ఫీలయ్యేవాడిని. ఎందుకు స్పందించడం లేదని మా ఆవిడ నన్ను అడిగింది. నాలో హాస్య గ్రంథులు ΄ోయాయేమో అనుకున్నాను. ‘ఖైదీ నెంబరు 150’ తర్వాత మళ్లీ నవ్వడం ప్రారంభించాను. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లందరూ దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా అటు (రాజకీయాలు) వెళ్తాడా అని. కాదు... మరో రకంగా సేవలు అందివ్వడం కోసమే తప్ప పొలిటికల్గా వెళ్లడం అనేది లేదు. – చిరంజీవి -
‘లైలా’ మెగా మాస్ ఈవెంట్ ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా రియల్ లైఫ్ హీరోలు వీళ్లే!
‘‘ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్తో చేస్తే కెరీర్కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్లో గీతా ఆర్ట్స్ పేరు టాప్లో ఉంటుంది. ఈ బేనర్లో సినిమా చేసిన ఏ యాక్టర్ అయినా ఒక మంచి రిజల్ట్తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్ జాతర’ అంటూ యూనిట్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు... మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్ లైఫ్కి, తండేల్ రాజు క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి టైమ్ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ ట్రూ రాక్స్టార్. ‘నమో నమః శివాయ...’ పాట రిహార్శల్స్ జరుగుతున్నపుడు దేవి సెట్కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్ శ్యామ్ సార్, ఇతర యూనిట్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.వీళ్లు లేకుండా ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా... మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే... ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్ ఎమోషన్ . వీళ్లే నా రియల్ లైఫ్ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్... ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్పై రియల్ పీపుల్లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్గా నిలిచాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్తో మాట్లాడాను. ఆమె స్లీవ్లెస్ డ్రెస్లు ధరించరని చెప్పారు. భవిష్యత్లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్రెడ్డి వంగా. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్గారు, చందు... ఇలాంటి టీమ్ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్మీట్లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. ‘తండేల్’ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ సినిమా సక్సెస్మీట్లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్కు బన్నీ (అల్లు అర్జున్) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్ నుంచి వచ్చాడు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్. -
నాగచైతన్య తండేల్ ఈవెంట్.. డ్యాన్స్తో అదరగొట్టిన అల్లు అరవింద్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్'(Thandel Movie). కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. తండేల్ జాతర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇది చదవండి: బన్నీ ఫ్యాన్స్కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!)డ్యాన్స్తో ఆకట్టుకున్న అల్లు అరవింద్..అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తన డ్యాన్స్తో అలరించారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి స్టెప్పులు వేశారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాగే పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించారు. The legendary producer does it again 💥💥💥The super energetic #AlluAravind Garu shakes his leg for #HailessoHailessa at the #ThandelJaathara ❤️🔥Watch the #ThandelJaathara live now 💥💥▶️ https://t.co/DPO8zzLUOv#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.… pic.twitter.com/qo8OvOwNeB— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి
‘‘నాకు ఒకే రకమైన పాత్రలు వస్తుండటంతో సినిమాలు వదిలేయాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ‘రాచరికం’(Racharikam) టీమ్ని నా వద్దకి పంపించాడని అనిపించింది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని అప్సరా రాణి(Apsara Rani) తెలిపారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది.ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో విజయ్ శంకర్ మాట్లాడుతూ–‘‘రాయలసీమ అంటే ఏంటో ‘రాచరికం’ చూపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేశాను’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘విజయ్గారు చాలా అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశారు’’ అని సురేశ్ లంకలపల్లి చెప్పారు. ‘‘ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతిసారి నా మిత్రులే నన్ను సపోర్ట్ చేశారు’’ అన్నారు ఈశ్వర్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, ‘ఆదిత్య మ్యూజిక్’ నిరంజన్, కెమేరామేన్ ఆర్య సాయి తదితరులు మాట్లాడారు. -
అప్సర రాణి 'రాచరికం' మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో చేసిన కామెంట్స్పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.అసలేం జరిగిందంటే..'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో మహేశ్బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిజామాబాద్లో నిర్వహించారు. 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. "I will file a case if you don't apologise for this comments" @MukhiSree https://t.co/VbhguoJwqI— Siri Vennela Goud Palle (@VennelaPalle) January 8, 2025 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
రామ్ చరణ్ ఫ్యాన్స్ మృతి.. ఎవరూ పట్టించుకోలేదన్న బాధిత కుటుంబాలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఏపీలోని రాజమండ్రిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ఈవెంట్లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా పాల్గొన్నారు.ఇంటికి వెళ్తుండగా విషాదం..అయితే అభిమాన హీరో ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఎవరూ పట్టించుకోలేదు.. బాధిత కుటుంబాల ఆవేదన..తాము కన్న కుమారులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న తమను ఎవరూ కూడా పరామర్శించలేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్దకు ఎవరూ రాలేదని.. చాలా నరకం అనుభవించామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.బాధితు కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ..' పరామర్శించడానికి ఎవరూ రాలేదండి. ఆదివారమంతా మేము నరకం అనుభవించాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు. మాకు మేమే వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుని సొంతంగా పోస్టుమార్టం చేయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా మా గురించి పట్టించుకోలేదు. మేము ఫోన్ చేసినా ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదండి. ఇప్పటి వరకు కూడా ఎవరూ మా వద్దకు రాలేదు. పరామర్శించేదు' అని అన్నారు.సంతాపం ప్రకటించిన రామ్ చరణ్.. రూ.10 లక్షల సాయంఅభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ... 'ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
హీరో విశాల్కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?
హీరో విశాల్ (Vishal) నటించిన సినిమా పుష్కరకాలం తర్వాత రిలీజవుతోంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్ 2012లోనే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు.వణికిపోతున్న విశాల్ఈ కార్యక్రమానికి విశాల్ పంచెకట్టులో హాజరయ్యాడు. అయితే ఆయన బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. తను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురూ చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇంకేదైనా..?ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తే..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్లో 8 ప్యాక్స్తో కనిపించాలన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. Actor #Vishal 🥹❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...Dedication 💪 ❤️pic.twitter.com/qb1o3vHvuh— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025 చదవండి: 'గేమ్ ఛేంజర్' కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు -
మూలాలు మరచిపోకూడదు: పవన్ కల్యాణ్
‘‘తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి. రామారావుగారిని స్మరించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే దానికి స్ఫూర్తి అక్కినేని నాగేశ్వర రావు, ఎన్.టి. రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబుగార్లు.. ఇలా ఎంతో మంది పెద్దలే. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో మంది పెద్దలు శక్తి యుక్తులు ధారపోశారు... వారందరికీ ధన్యవాదాలు. మన మూలాలను మరచిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్చరణ్ ఉన్నా దానికి మూలం చిరంజీవిగారు. నేనెప్పుడూ మూలాలు మరచిపోను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాజమౌళి, రామ్చరణ్, ఎన్టీఆర్గార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోందంటే దానికి కారణం శంకర్గారు. ‘రంగస్థలం’ చూసి చరణ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్æస్టార్ కాకుండా ఏమవుతాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తే... మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా అనిపించింది. సినిమాని సినిమాగానే చూడండి.కిందపడిపోయి, మీద పడిపోయి, తొక్కిసలాటలో హీరోని చూడటం కంటే కూడా... దూరంగా నిలబడి మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ అండ్ సప్లయ్ వల్లే టికెట్ల ధరలు పెంచుతున్నాం. ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీని పన్ను రూపంలో కడుతున్నాం... చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి... తీయని వాళ్లు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఎన్డీయే కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) తరఫున నేను చెబుతున్నా. సినిమాలు తీసేవాళ్లతోనే మేము మాట్లాడతాం... వారినే గుర్తిస్తాం. సినిమా టికెట్ల ధరల పెంపుకోసం హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు.మహా అయితే నిర్మాతలు రండి... లేదా మీ యూనియన్తో రండి. మేము ఇచ్చేస్తాం’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ని శంకర్గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ అని పెట్టారేమో అనిపిస్తోంది’’ అని చెప్పారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్గారిని కలిశాను. ఆయనలాంటి మంచి వ్యక్తి మా ‘గేమ్ చేంజర్’ వేడుకకి వచ్చినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు. -
గత 40 ఏళ్లలో ఎవరూ ఇలా ట్రై చేయలేదు: మోహన్లాల్ కామెంట్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'బరోజ్'(Barroz) ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాను తెలుగులో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్తో పాటు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాను 3డీ వర్షన్లో తెరకెక్కించడం మరో విశేషం. ఇవాళ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో మోహన్ లాల్ తెలుగు సినీఇండస్ట్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)మోహన్ లాల్ మాట్లాడుతూ..'తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. పుష్ప లాంటి పెద్ద సినిమాను మనం చూశాం. తెలుగు ఆడియన్స్ ప్రతి సినిమాను గౌరవిస్తారు. బరోజ్ రిలీజ్ చేస్తున్నందుకు మైత్రి మూవీ మేకర్స్కు ధన్యవాదాలు. గత 40 ఏళ్లలో ఎవరూ ప్రయత్నించని నేటివ్ 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త విధానంలో కథను పరిచయం చేస్తున్నాం. కొత్త ఆలోచనతో బరోజ్ను తీశాం. ఈ సినిమా చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది మీలోని పసితనాన్ని గుర్తు చేస్తుంది.' అని అన్నారు. 'We shot the film as Native 3D which over the 40years nobody has tried. It will enhance the child in you❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine @antonypbvr… pic.twitter.com/KxV2Mt1u1A— YouWe Media (@MediaYouwe) December 24, 2024 'Telugu industry is the biggest film industry and they respect films and deliver blockbusters like #Pushpa2TheRule ❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine… pic.twitter.com/bxplRH2nUu— YouWe Media (@MediaYouwe) December 24, 2024 -
‘శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
డల్లాస్లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదివరకే రిలీజైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికాలోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లాడు. ఈ మూవీ ఇప్పటికే చూసేశానని చెప్పి.. ఎలా ఉందో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్)'నేను, చిరంజీవి గారు ఆల్రెడీ మూవీ చూశాం. ఫస్టాప్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. క్లైమాక్స్లో చరణ్, అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు' అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.సుకుమార్ చెప్పిన దానిబట్టి చూస్తే సినిమా అదిరిపోయిందని తెలుస్తోంది. మరి ప్రేక్షకులు తీర్పు ఏంటనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా) -
మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే మాటలు రావటం లేదు: రామ్ చరణ్
‘‘డల్లాస్లోని అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడి వారు చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు కూడా రావటం లేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నామా? లేక డల్లాస్ వచ్చామా? అని కూడా అర్థం కావటం లేదు. నాపై ప్రేమతో ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని హీరో రామ్చరణ్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇంyì యన్ మూవీ ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్లో ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, ‘దిల్’ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ–‘‘ఓవర్సీస్లోని ప్రేక్షకులు ముందుగా సినిమాను చూస్తారు. అందుకే ఇక్కడి నుంచే ప్రమోషన్స్ ను మొదలు పెడుతున్నాం.మా ‘గేమ్ చేంజర్’కు మీ ఆశీస్సులు కావాలి. ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు కృతజ్ఞతలు. ఇంత పెద్ద ప్రీ రిలీజ్ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లి అండ్ టీమ్కి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ టైటిల్ పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా డల్లాస్ను సెలక్ట్ చేసుకున్నాం. ఇంత భారీగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇక్కడ నిర్వహించటం ఇదే తొలిసారి. టైటిల్కి తగ్గట్టు ఈవెంట్ని ఘనంగా చేయాలని ఇక్కడ చేశాం. దానికి రాజేష్ కల్లెపల్లి ముందుకొచ్చి సపోర్ట్ చేశారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజ్, సహ నిర్మాత: హర్షిత్, కెమెరా: ఎస్. తిరుణ్ణావుక్కరసు, సంగీతం: ఎస్ఎస్ తమన్, లైన్ ప్రోడ్యూసర్స్: నరసింహా రావు .ఎన్, ఎస్.కె. జబీర్. -
ఈ క్రిస్మస్ మనదే: ‘అల్లరి’ నరేశ్
‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు. -
'బచ్చలమల్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హీరోయిన్ల వైల్డ్ ఫైర్ గ్లామర్ (ఫొటోలు)
-
షణ్ముఖ్ జస్వంత్ ' లీల వినోదం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్గా దాక్షాయణి! (ఫొటోలు)
-
పుష్ప2 ఈవెంట్లో సందడి చేసిన శ్రీలీల, అనసూయ (ఫొటోలు)
-
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
పుష్ప2 ఈవెంట్లో 'పీలింగ్సే' అంటూ ఫిదా చేసిన రష్మిక మందన్న (ఫోటోలు)
-
Pushpa 2 Pre Release Photos: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హైదరాబాద్లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!
హైదరాబాద్లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్ని హైదరాబాద్లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్ని యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. ‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.టికెట్ రేట్లు భారీగా పెంపుసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు. -
హైదరాబాద్లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్!
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్కి అనుమతిస్తారా అనేది డౌట్గానే ఉండేది. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్కి మారిందట.టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్
‘‘మిస్ యు’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. రాజశేఖర్ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత ‘మిస్ యు’ లాంటి ఒక అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనిపిస్తోంది’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఎన్. రాజశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ యు’. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థ ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘మిస్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి మా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ‘మిస్ యు’ తర్వాత నాకు మరిన్ని మంచి ప్రేమకథలు వస్తాయి.గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది అద్భుతమైనపాటలు ఇచ్చారు. శామ్యూల్గారు ΄్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు. మా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
గేమ్ ఛేంజర్: అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా అమెరికాలోనే!
సినిమా తీయడం ఒకెత్తయితే ప్రమోషన్స్ చేయడం మరో ఎత్తు. సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు చిత్రబృందం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నగరాల్లో టూర్స్ చేస్తుంటారు. ప్రీరిలీజ్ ఈవెంట్ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు.ఇదెక్కడి మాస్రా మావాఅయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించని ప్లేస్లో చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా కాదు.. ఏకంగా అమెరికాలోనే ప్లేస్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.గేమ్ ఛేంజర్ పేరుకు సార్థకంఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమోషన్స్లోనే గేమ్ ఛేంజర్ అని నిరూపించుకున్నారు.. ఇదెక్కడి ప్రమోషన్స్రా.. భలే ప్లాన్ చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 'Mega MASS'ive Event in the USA 🇺🇸 💥The pre-release event of #GameChanger will happen in the USA - the first time ever for an Indian cinema ❤️🔥📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040🗓️ 21st DEC, 6:00 PM ONWARDSSee you soon, America!Event by… pic.twitter.com/rcjVCrDGOX— Game Changer (@GameChangerOffl) November 22, 2024 చదవండి: ఆర్ఆర్ఆర్ టైమ్లో లేదు.. అందుకే పుష్ప-2తో.. నాగార్జున -
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్కి, అర్జున్కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో MLA హరీష్ రావు స్పీచ్
-
‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను వరంగల్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్పోస్ట్లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
‘మెకానిక్ రాకీ’ ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు : విశ్వక్ సేన్
‘‘నేను పది సినిమాలు చేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. నా గత సినిమాల కన్నా చాలా భిన్నమైన సినిమా ‘మెకానిక్ రాకీ’. ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. 21న ‘మెకానిక్ రాకీ’ పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నాం. థియేటర్స్కు రండి. నిర్మాత రామ్గారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మెకానిక్ రాకీ’ మంచి సినిమా’’ అన్నారు. ‘‘విశ్వక్ సేన్ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడి, ‘మెకానిక్ రాకీ’ విజయాన్ని ఆకాంక్షించారు. -
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
'రోటి కపడా రొమాన్స్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై!
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్స్ మెగాస్టార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్లోనూ మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు.Chiranjeevi timing 😂😂🤣🤣😭😭Cinemalo aina Offline lo aina Boss @KChiruTweets timing ni kottevadu inka puttaledu 💥💥😂😂🫶🏻#ZEBRA #Chiranjeevi pic.twitter.com/khp7QZvSwq— Vamc Krishna (@lyf_a_zindagii) November 12, 2024 -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
విశాఖపట్నం : ‘మట్కా’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కంగువ' నిర్మాత ఫోన్ వాల్ పేపర్గా రాజమౌళి ఫొటో
తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాజమౌళి అతిథిగా వచ్చారు. కాకపోతే రాజమౌళిపై తనకు, తన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు ఎంత ఇష్టముందో అనేది చెప్పకనే చెప్పారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)'కంగువ' టీమ్కి కోసం వచ్చిన రాజమౌళి అంతా మాట్లాడిన తర్వాత సూర్య మైక్ అందుకున్నాడు. తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా అని రాజమౌళితో సినిమా చేయాలని ఉందని సూర్య తన మనసులో మాటని బయటపెట్టాడు.మీ 'బాహుబలి' పేరు పలకడానికి కూడా మాకు అర్హత ఉందో లేదో తెలీదు. మీరు వేసిన దారిలోనే మేం మీ వెనుక నడుస్తూ వస్తున్నాం. మీరు మా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి షేక్ హ్యాండ్ ఇస్తే అదే మాకు పెద్ద ఆస్కార్ అని సూర్య చెప్పాడు. జ్ఞానవేల్ రాజా తనకు పరిచయమైనప్పటి నుంచి మీ ఫొటోనే ఫోన్ వాల్ పేపర్గా పెట్టుకున్నాడనే ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జ్ఞానవేల్ రాజా స్టేజీపైకి వచ్చి తన ఫోన్లోని రాజమౌళి ఫోటో చూపించడంతో పాటు రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)"In our mobile phones we keep Family photos as wallpaper, but Gnanavel has your photo as wallpaper. You have paved the way for #Kanguva. It will be like an Oscars If you shake hands with Gnanavel"- #Suriyapic.twitter.com/fJ7GKri4mT— AmuthaBharathi (@CinemaWithAB) November 7, 2024 -
‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన బిగ్ బాస్ భామ దివి వద్త్య (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఘనంగా ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
కంగువని థియేటర్స్లోనే చూడాలి: ఎస్ఎస్ రాజమౌళి
‘‘కంగువ’ టీమ్ పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నాను. ‘కంగువ’ లాంటి సినిమాను థియేటర్స్లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని ΄పొందుతారు’’ అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ–‘‘తెలుగు సినిమాను తెలుగుకే పరిమితం చేయకుండా మిగతా ్రపాంతాలకు తీసుకెళ్లాలని, అలాగే పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు నాకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. ‘గజినీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి తను చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా నిర్మాతలు, హీరోలకు చెప్పేవాణ్ణి. నేను, తను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం.. కానీ కుదరలేదు. తనతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను’’ అని చెప్పారు. ‘‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్లా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.‘‘ఈ సినిమా విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ‘కంగువ’ ఘన విజయం సాధించాలి’’ అని నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు తెలిపారు. ‘‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ ‘కంగువ’లో చూపించాం’’ అన్నారు శివ. ‘‘కంగువ’ వంటి అద్భుతమైన సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. సూర్య మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి ఏ సినిమాతోనూ మా ‘కంగువ’ని పోల్చలేం. ఆయనతో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను.కానీ, ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. ‘కంగువ’ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ఈ వేడుకలో డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, కెమెరామేన్ వెట్రి పళనిస్వామి, రైటర్ రాకేందు మౌళి, డిస్ట్రిబ్యూటర్ అభినేష్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల తదితరులు మాట్లాడారు. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
‘ధూమ్ ధామ్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
'ఆ కష్టమేంటో నాకు జీవితంలో తెలియదు.. ఎందుకంటే?'.. నాగచైతన్య కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి రెడీ అయిపోయాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్లో వస్తోన్న క మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైపోయింది. ఈ నెల 31న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నేనే మొదటి అభిమానిని..నాగ చైతన్య మాట్లాడుతూ..'కిరణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. కానీ కిరణ్ లాంటి వాళ్ల స్టోరీస్ వినగలుతాను. కానీ ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. నేను చెప్పేది ఒక్కటే కిరణ్ జర్నీకి నేను అభిమానిని. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలంటే నీలాంటి స్టోరీస్ ఆదర్శం. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీలో చాలా సత్తా ఉంది. ట్రోల్ చేసేవాళ్లు చేస్తారు. వాళ్ల చేతుల్లో కేవలం ఫోన్ మాత్రమే ఉంది. అలాంటి వారి గురించి భయపడాల్సిన పనే లేదు. నీ టాలెంట్ ఏంటో చూస్తూనే ఉన్నాం. అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ప్రతి సక్సెస్ వెనకాల ఓ మహిళ ఉంటుంది. నీకు రహస్య సపోర్ట్ ఫుల్గా ఉంది. క టీమ్ బృందం పడిన కష్టం నా కళ్లముందే కనిపిస్తోంది. కిరణ్కు నేనే మొదటి అభిమానిని. ఆల్ ది బెస్ట్' అంటూ మాట్లాడారు.ట్రోల్స్పై కిరణ్ కౌంటర్..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఇచ్చిపడేశాడు. నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించాడు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడిని.. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడని అన్నారు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదని కిరణ్ మాట్లాడారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. -
తల్లి పడిన కష్టాలు చెప్పి ఏడిపించిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)
-
కిరణ్ అబ్బవరం 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా ఆయన కోసం సినిమా చూడండి: టాలీవుడ్ హీరోయిన్ క్యూట్ రిక్వెస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమైపోయాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీరియాడిక్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమాకు సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోన్న ఈ మూవీ ఈనెల 31న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.అయితే ఇటీవల కిరణ్ను పెళ్లాడిన హీరోయిన్ రహస్య గోరఖ్ సైతం తన భర్త ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రహస్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు ఏడాదిన్నర్రగా ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. మా పెళ్లి రోజు మినహాయిస్తే మిగతా రోజులన్నీ సినిమాతోనే బిజీగా ఉన్నారని తెలిపింది. మీ కోసం, మా టీమ్ కోసం.. అలాగే మా ఆయన కోసం ఈ సినిమా చూడండి అంటూ చాలా క్యూట్గా మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఈ ఏడాదిలోనే కిరణ్- రహస్య వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.'క' కథేంటంటే..'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.మా ఆయన కోసం ఈ సినిమా చూడండి 😍 - #RahasyaGhorak at #KA Pre-Release EventWatch Live Here: ▶️ https://t.co/Fgd2dNzC1vEvent by @shreyasgroup ✌️#KAonOctober31st in Cinemas Worldwide pic.twitter.com/KWwGYEWE4Y— Shreyas Media (@shreyasgroup) October 29, 2024 -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్ను వెంకీ సక్సెస్ఫుల్గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్గారి రైటింగ్లో మంచి డెప్త్ ఉంటుంది.విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్లోని పాత్రలు మెచ్యూర్డ్గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
Shiva Karthikeyan: ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
Karimnagar: లగ్గం సినిమాలో మనోళ్లు
విద్యానగర్(కరీంనగర్): పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడమే కాదు.. రెండు మనసులు కలవడం అన్న అంశంతో తెలంగాణ పెండ్లి సంప్రదాయాన్ని పెద్ద తెరపై ఆవిష్కరిస్తున్నారు మనోళ్లు. ‘లగ్గం’ పేరున సినిమాను కామారెడ్డికి చెందిన వేణుగోపాల్రెడ్డి నిర్మించగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన చెప్పాల రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ, యూట్యూబ్ స్టార్స్ ఆర్ఎస్ నంద, గుండ మల్ల య్య, రాధిక, తెలంగాణ లక్ష్మి, మిమిక్రి మహేశ్, సత్య ఎలేశ్వరం, సినీ పోస్టర్, టైటిల్ డిజైనర్ విష్ణువర్దన్రెడ్డి, అర్చిత, కాంతరెడ్డితోపాటు మరో 10మంది వరకు నటించడం విశేషం. లగ్గం సినిమా ఈనెల 25న విడుదల కానుంది. పాటే ఆమె ప్రాణం.. శంకరపట్నం(మానకొండూర్): ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జనగాం లావణ్య ఫోక్సాంగ్స్ పాడి పల్లె జనం, పట్టణ ప్రజల అభిమానం చురగొంటున్నారు. గ్రామీణ ప్రాంతమైన ఇప్పలపల్లిలో నివాసముంటూ భర్త రవీందర్ ప్రోత్సాహంతో నటనలోనూ సత్తా చూపుతున్నారు. బతుకమ్మ, పెళ్లి, వాన పాటలే కాకుండా.. వేములవాడ రాజన్న, కొండగుట్ట అంజన్న, కొమురవెల్లి మల్లన్న దేవతామూర్తుల పాటలు పాడుతూ భక్తుల గుండెల్లో చోటు సాధించారు. ఎల్ఆర్ పోక్స్ పేరిట య్యూటూబ్లో పాటలు, షార్ట్ఫిల్్మలు విడుదల చేస్తున్నారు. భర్త రవీందర్, కూతురు మైత్రి, కొడుకు మనోజ్కుమార్తో కలిసి నటించారు. 90 వరకు పాటలు, షార్ట్ఫిల్్మలలో నటించగా.. ఇప్పటివరకు 1.50లక్షల వ్యూయర్స్ ఉన్నారు. పాట పాడుతున్న లావణ్య -
‘పోటెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా సినిమా కలెక్షన్స్లో 20% వారికే ఇస్తాం: సముద్రుడు టీమ్
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మిస్తున్నారు. హీరో సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు నగేష్ నన్ను చూసి సముద్రుడు అనే టైటిల్ పెట్టాడు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాట నేడు నిజమైంది అన్నారు.మొదటి వ్యక్తి నేనేహీరో సుమన్ మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వ్యక్తిని నేనే! అన్నమయ్య, రామదాసు సినిమాల తర్వాత చేసిన పాత్రలే చేయడం ఎందుకని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను.ఛత్రపతిలా పెద్ద హిట్నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గవాటిలో ఇదీ ఒకటి. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. ఇప్పుడాయన జాలర్ల జీవితాలపై సముద్రుడు తీశాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.20 శాతం వారికే..దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. సముద్రం దగ్గర ఉండే జాలర్లు చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని సినిమాలో చూపించాం. ఒక మంచి పాత్రలో అడగ్గానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు అన్నారు. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. -
ఆ సినిమాలూ ఇండస్ట్రీని నడిపిస్తాయి: సుధీర్ బాబు
‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ చాలా బాగుంది. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచిపాత్రలు ఉంటే వారిని సూచించాలనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలూ ఇండస్ట్రీని నడిపిస్తాయి. ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలి’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు.శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీ జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతరపాత్రలు ΄ోషించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుధీర్బాబు, దర్శకులు వీరశంకర్, శ్రీరామ్ ఆదిత్య, నటీనటులు వితికా శేరు, వీజే సన్నీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ వేడుకలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమాపై ఫ్యాషన్, డబ్బులుంటే సినిమాలు తీయలేం. నేను ప్రారంభంలో కొన్ని చిత్రాలను నిర్మించాను. కానీ, థియేటర్లో విడుదల చేయలేకపోయాను. ‘నరుడి బ్రతుకు నటన’ టీమ్ని చూసినప్పుడు నాకుపాత రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే వారికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చాను’’ అని తెలిపారు. ‘‘యూనివర్సల్ సబ్జెక్టుతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రిషికేశ్వర్ యోగి, సింధు రెడ్డి, శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న. -
'ది డీల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. 18న మూవీ రిలీజ్
'ఈశ్వర్' సినిమాతో నటుడిగా పరిచయమైన హను కోట్ల.. ఇప్పుడు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ది డీల్'. పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్లు. అక్టోబర్ 18న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)'ది డీల్' సినిమాతో దర్శకుడిగా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ మూవీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానని హను కోట్ల చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్స్క్రీన్లోనే కాదు.. ఆఫ్స్క్రీన్లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంత (ఫొటోలు)
-
సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నీమధ్య తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సామ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదలా ఉంచితే చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చింది. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. దీనికి హాజరైన సామ్పై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)సమంత ఏం చెప్పింది?సినిమా టీమ్కి విషెస్ చెప్పింది. అలానే హీరోయిన్లుగా తమకు ఎంతో బాధ్యతగా ఉంటుందని, ప్రతి అమ్మాయి కథలో వాళ్లే హీరోలని చెప్పింది. చాలారోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని అభిమానులని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తన కుటుంబమని క్లారిటీ ఇచ్చింది.త్రివిక్రమ్ టీజింగ్ఇదే ఈవెంట్కి హాజరైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తిని ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ చెప్పారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్) -
గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో సుహాస్ 'జనక అయితే గనక' మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
హీరో ధృవ సర్జా ‘మార్టిన్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)