-
అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్గా స్టార్ని చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టై¯Œ మెంట్స్ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్ మలినేని.‘‘సత్యదేవ్ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్కి సచిన్ టెండూల్కర్గారు ఎలాగో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగే. తెలుగు సినిమాని (ఆర్ఆర్ఆర్) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్. మా ట్రైలర్ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. -
'బాక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సుహాస్ 'ప్రసన్నవదనం'మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సీతా కళ్యాణ వైభోగమే’ పెద్ద విజయం సాధించాలి: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
సుమన్ తేజ్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘యుగంధర్ నిర్మించిన ‘సీతా కల్యాణ వైభోగమే’ టైటిల్ చూస్తే, ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తోంది. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.‘‘కొన్ని వందల స్క్రిప్ట్స్ విన్నాం. ఫైనల్గా ఈ సినిమాతో జర్నీ మొదలైంది’’ అన్నారు సుమన్ తేజ్. ‘‘సీతమ్మ తల్లి పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. ఈ చిత్రంలో నాలాంటి రావణ పాత్రతో సీత ఎలాంటి కష్టాలు పడిందో చూపించారు. సీత క్యారెక్టర్లో గరీమ చక్కగా నటించారు’’ అన్నారు గగన్ విహారి. ‘‘మహిళలు ఎదుర్కొనే సమస్యలను ఎమోషనల్ జర్నీగా చూపించాం’’ అన్నారు సతీష్ పరమవేద. ‘‘ఏ మాత్రం పారితోషికం ఆశించకుండా పని చేసిన సంగీతదర్శకుడు చరణ్ అర్జున్కు థ్యాంక్స్’’ అన్నారు రాచాల యుగంధర్. -
‘మై డియర్ దొంగ’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
‘పారిజాత పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మంజుమ్మల్ బాయ్స్ని ఎంజాయ్ చేస్తారు
‘‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాని అమెరికాలో చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది. మలయాళంలో బిగ్ హిట్ అవడంతో పాటు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత నవీన్ యెర్నేని అన్నారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో చిదంబరం ఎస్. పొదువల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. పరవ ఫిలింస్పై బాబు షాహిర్, సౌబిన్, షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో తెలుగులో ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిదంబరం ఎస్. పొదువల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శశిధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నటులు శ్రీనాథ్ భాసి, అరుణ్ కురియన్, విష్ణు రవి తదితరులు మాట్లాడారు. -
అహంకారం అనుకున్నా సరే...
‘‘నా సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలనే నా కల నా నాలుగో సినిమా ‘గీత గోవిందం’తో నిజమైంది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. అనంతరం నేను నటించిన మరో సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను... కానీ, సాధించలేదు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తాను. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. ఇక ఈ సమ్మర్కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ‘ఫ్యామిలీ స్టార్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మన కుటుంబంలోని భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’’ అన్నారు. ‘‘మా సినిమా కథలోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు పరశురామ్ పెట్ల. -
ప్రతి మహిళ చూడాలి
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ముఖ్య తారలుగా సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్దార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్, ఆకాశ్ పూరి అతిథులుగా పాల్గొన్నారు. ‘‘స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. మెర్సీ కిల్లింగ్ అంటూ సమాజంలో ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి మహిళ చూడాల్సి సినిమా’’ అన్నారు సాయికుమార్. ‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటరమణ. -
Tillu Square Movie: ‘టిల్లు స్క్వేర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన". ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, డీఎస్ రావు, హీరో రమాకాంత్ పాల్గొన్నారు. నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబ్జెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది. పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించాం. థ్రిల్లింగ్ సస్పెన్స్తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా" అని అన్నారు . ర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. 'అప్సర రాణీని చూస్తే కశ్మీర్ యాపిల్లా కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తను కాశ్మీర్ మిర్చిలా నటించింది . చాలా వెరైటీ స్టోరీ ఇది. షూటింగ్ తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ.. 'నా కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్, క్లాస్ ఆడియన్స్కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతమందిస్తున్నారు. This is just a teaser of the power of Rowdy Lady Police Officer💪🏻🔥 Production- AKSHARA CREATIONS Producer- @sridharreddy3355 Powered by- One Media Director- @nageshnaradasi Fight Master- @anji_fight_master Fight assistant &training- @_its_me_raksha pic.twitter.com/Da1uUANcdN — Apsara Rani (@_apsara_rani) March 21, 2024 -
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘వెయ్ దరువెయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘మాయ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అందులో డౌటే లేదు ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు. ఆయన నవ్వుతోనే ఎనర్జీ.. దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ముఖ్యగమనిక' ప్రీ రిలీజ్.. విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటించిన సినిమా 'ముఖ్య గమనిక'. శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించారు. వేణు మురళీధర్. వి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్లో జరగ్గా.. హీరో విశ్వక్ సేన్ గెస్ట్గా వచ్చాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. వీడియో వైరల్!) విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. బ్యాగ్రౌండ్ ఉన్నాసరే కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. విరాన్ నన్ను అన్నా అంటాడు కానీ నేను విరాన్ని అన్నా అని పిలవాలి. ఈ సినిమా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని విశ్వక్ సేన్ చెప్పాడు. షూటింగ్లో బిజీ ఉండి కూడా విశ్వక్ నా కోసం వచ్చారు. నా వెనకే ఉండి సపోర్ట్ చేసే అల్లు అర్జున్, శిరీష్కి ప్రత్యేక కృతజ్ఞతలు అని హీరో విరాన్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) -
డల్లాస్ లో గ్రాండ్ గా యాత్ర 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
రవిశంకర్ రాజు టూ మాస్ మహారాజా: ఇరగదీశాడు భయ్యా!
#EagleRavitejarapsongintelugu టాలీవుడ్ హీరో రవితేజ్ గా వస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తెలుగు కుర్రోడు దుమ్ము రేపాడు. తెలుగులో ర్యాప్ మ్యూజిక్తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రవిశంకర్ రాజు నుండి మాస్ మహారాజా రవితేజ వరకు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అంతేకాదు అద్భుతమైన RAP పాటకు రవితేజ కూడా ఫిదా అయిపోయాడు. ఉత్సాహంగా ఊగిపోయాడు. అదేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. కాగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ్ నటిస్తున్న మూవీ ఈగల్. ధమాకా తర్వాత మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలొ అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. -
నేను కూడా సిద్ధం
‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. విశ్వ ప్రసాద్, వివేక్గార్లతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.. అన్ని విషయాల్లోనూ చాలా స్పష్టంగా ఉంటారు.. అందుకే వారితో పనిచేయడం నాకు ఇష్టం. నాతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని విశ్వ ప్రసాద్గారు అంటున్నారు.. ఈ బ్యానర్లో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను కూడా సిద్ధం’’ అని హీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్’ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూసేందుకు నేను కూడా వేచి చూస్తున్నా. ఈ సినిమాకి తన సంగీతంతో ఇరగదీశాడు డేవ్ జాంద్. బాలనటుడు ధ్రువన్ పాత్ర బాగుంటుంది.. పిల్లలందరూ తన పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ‘ఈగల్’ కథని నడిపించేది అనుపమ పాత్రే. కావ్యది లవ్లీ క్యారెక్టర్. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని ఎంతో క్లారిటీతో తీశాడు. ఈ సినిమా విజయం సాధించి, తనకు చాలా మంచి పేరు రావాలి. నాకు నేను విపరీతంగా నచ్చిన పాత్ర ‘ఈగల్’.. ఈ పాత్ర కోసం చాలా మేకోవర్ అయ్యాను. ఈ చిత్రం రిలీజ్ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ–‘‘ఈగల్’ కి దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఇంతమందితో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన రవితేజ సర్కి థ్యాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థియేటర్ అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘మా సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న రవితేజగారికి థ్యాంక్స్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. ‘ఈగల్’ని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మళ్లీ మళ్లీ రవితేజగారితో పనిచేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘రవితేజగారు వెర్సటైల్ యాక్టర్. ‘ఈగల్’ హాలీవుడ్ మూవీలా అద్భుతంగా ఉంటుంది. కానీ, తెలుగు నేటివిటీ ఎక్కడా మిస్ అవదు’’ అన్నారు చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. -
మా 'గేమ్'ని ప్రేక్షకులు గెలిపిస్తారని కోరుకుంటున్నాం: 'గేమ్ ఆన్' టీమ్
కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాకు దయానంద్ దర్శకుడు. మధుబాల, ఆదిత్య మేనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్, బిగ్ టికెట్ లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో) హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే సైకలాజికల్ గేమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సౌండ్, ట్విస్టులు, విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థియేటర్లలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని చెప్పారు. (ఇదీ చదవండి: ఫిబ్రవరి 2న థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్) -
'నా సామిరంగ' ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన,ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement