hebah patel
-
అందాలతో సెగలు పుట్టిస్తున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఫొటోస్
-
ఓటీటీలో 'హెబ్బా పటేల్' రొమాంటిక్ సినిమా
టాలీవుడ్లో భారీ తారాగణంతో గతేడాది నవంబర్లో విడుదలైన ‘‘ధూం ధాం’(Dhoom Dhaam Movie) సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (hebah patel) జోడీగా నటించిన చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ( Sai Kishore Macha) తెరకెక్కించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ భారీ అంచనాలతో నిర్మించారు. థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ సినిమా కథలకు కాస్త కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో 'ధూం ధాం'గా చూపించారు. గతంలో శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన డైరెక్టర్ సాయి కిషోర్ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో కాస్త బెటర్గానే ఓపెనింగ్స్ వచ్చాయి.ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్గా అమెజాన్ ప్రైమ్లో ధూం ధాం చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హెబ్బా పటేల్ కాస్త గ్లామర్ రోల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మారుతి సినిమా 'రోజులు మారాయి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చేతన్ కృష్ణ ధూం ధాం అనేలా మెప్పించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
చీరకట్టుతో మతిపోగోడుతున్న హెబ్బా పటేల్ వైరల్ అవుతున్న (ఫొటోలు)
-
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
'ధూం ధాం' సక్సెస్ మీట్.. చీరలో హెబ్బా సూపర్! (ఫొటోలు)
-
Dhoom Dhaam Review: హెబ్బా పటేల్ ‘ధూం ధాం’ మూవీ రివ్యూ
టైటిల్: ధూం ధాంనటీనటులు: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులునిర్మాత:ఎంఎస్ రామ్ కుమార్స్టోరీ, స్క్రీన్ప్లే: గోపీ మోహన్దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చాసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామిఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల విడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు రావడం లేదు. ఎక్కువ రా, రస్టిక్, యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ధూం ధాం’. దర్శకుడు సాయి కిషోర్ ఎంచుకున్న కథ పాతదే అయినా.. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. ఫాదర్-సన్ ఎమోషన్, తండ్రీ- కూతుళ్ల బాండింగ్తో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఓ మంచి ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చెప్పారు. ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూ సరదాగా సాగుతుంది. పరిచయమే లేని ఓ అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నానంటూ హీరోకి చెప్పడం.. ఆమె ఎవరో తెలియక హీరో పడే తిప్పలు, ఈక్రమంలో వచ్చే పాటలు, ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్స్టోరీ పాత సినిమాలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్లు కథకి ఫ్రెస్నెస్ని తెచ్చాయి. ఇక సెకండాఫ్లో వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం హిలేరియస్గా సాగుతుంది. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్లో ‘ఎక్స్ప్రెషన్స్’ పేరుతో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ సినిమాల్లోని డైలాగ్స్ని వెన్నెల కిశోర్ చెప్పడం సినిమాకే హైలెట్. వెన్నెల కిశోర్కి సంబంధించిన ప్రతీ సీన్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో కథనాన్ని నడిపించడం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. కొత్తదనం కోరుకోకుండా.. ఎంటర్టైమెంట్ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ధూం ధాం సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. హీరో చేతన్ కృష్ణకి ఇది తొలి సినిమా. అయినా కూడా ఉన్నంతలో చక్కగానే నటించాడు. అయితే నటన పరంగా ఇంకొంత కసరత్తు చేస్తే..భవిష్యత్తులో మంచి హీరో అయ్యే చాన్స్ ఉంది. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు గతంలో చాలానే చేసింది కాబట్టి సుహాన పాత్రలో ఈజీగా నటించేసింది. హీరోహీరోయిన్ల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర వెన్నెల కిశోర్ది. హీరో కజిన్గా ఆయన పండించిన కామెడీ సినిమా స్థాయిని పెంచేసింది. సెకండాఫ్ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. ఓ రకంగా ఈ సినిమాకు వెన్నెల కిశోరే హీరో అని చెప్పొచ్చు. హీరో తండ్రిగా సాయి కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరో స్నేహితులుగా ప్రవీణ్, నవీన్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. గోపరాజు రమణ, వినయ్ వర్మ, బెనర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. చివరిలో వచ్చే మంగ్లీ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పోలెండ్ అందాలను తెరపై చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో నిర్మాత రామ్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/5 -
ట్రెండ్కు భిన్నంగా ‘ధూం ధాం’.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్ కృష్ణ
‘ఇప్పుడు థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. నేనూ అదే చేస్తే వాటిలో మరొక థ్రిల్లర్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న ట్రెండ్కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్తో ‘ధూం ధాం’ చేశాను’ అన్నారు యంగ్ హీరో చేతన్ కృష్ణ. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ-హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో చేతన్ కృష్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. సినిమాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరిక. ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ అనే మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో కొన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి గుర్తింపు వచ్చింది.→ నాకు గోపీ మోహన్ గారి స్క్రిప్ట్స్ ఇష్టం. సకుటుంబంగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఆయన స్క్రిప్ట్స్ ఇస్తారు. అలాంటి మూవీ ఒకటి నేనూ చేయాలని అనుకున్నాను. ఇప్పటిదాకా విభిన్న తరహా చిత్రాల్లో నటించాను. ఒకసారి ఒక బిగ్ మూవీ చేద్దామని "ధూం ధాం" మొదలుపెట్టాం.→ తండ్రీ కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఎక్కడిదాకా అయినా వెళ్తారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. దానికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. మా మూవీలో ఫాదర్ తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్ గా ఉండాలనుకుంటాడు. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరిగా తయారవుతాడు. తన వల్ల ఒక అమ్మాయి జీవితంలో ఏర్పడిన సమస్యకు తనే పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాడు.→ మా మూవీలో చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారితో పాటు నటించడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. వాళ్ల టైమింగ్ తో మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించా. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ పట్టుకోవడం కష్టమైంది. ఆయన సినిమా సెకండాఫ్ లో వస్తారు. సినిమా మొత్తం ఉంటారు. ఈ సెకండాఫ్ మొత్తం పెళ్లి ఇంట సందడితో సాగుతుంది. ఇదే మా "ధూం ధాం" సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. సెకండాఫ్ లో థియేటర్ నిండా నవ్వులు నిండిపోతాయి.→ అదుర్స్ లాంటి సినిమాల్లో హీరో ఒక ఫేమస్ కమెడియన్ పక్కనే ఉంటూ కథ సాగుతుంది. అలా "ధూం ధాం"లో కూడా నేను వెన్నెల కిషోర్ గారి పక్కనే ఉంటాను. మూవీ షూటింగ్ టైమ్ లో కిషోర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సీన్స్ చేసే ముందు నాతో డిస్కస్ చేసేవారు. హెబ్బా పటేల్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను షూటింగ్ స్టార్ట్ కాక ముందు చాలా ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. కెమెరా రోల్ కాగానే తన క్యారెక్టర్ లోకి మారిపోతుంది.→ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేయడం మా సినిమాకు మరో అడ్వాంటేజ్. గోపీ సుందర్ గారు ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. ఒక సెంటర్ లో ఒక మంచి థియేటర్ ఉంటుంది. ఏ సినిమా అయినా అక్కడే ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడతారు. అలాంటి ఒకట్రెండు థియేటర్స్ చిన్న డబ్బింగ్ సినిమాలకు ఇచ్చారు. ఆ విషయంపై నేను ప్రీ రిలీజ్ లో స్పందించాను. అయితే మాకు కావాల్సినన్ని మంచి థియేటర్స్ దొరికాయి. -
‘ధూమ్ ధామ్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
Hebah patel : హెబ్బా పటేల్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)
-
‘ధూం ధాం’లో ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ: డైరెక్టర్ సాయికిషోర్
ఈ మధ్య మనం థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ మూవీస్ చూస్తున్నాం. వాటిలో కామెడీ మిస్ అయ్యాం. ఆ మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ని మా "ధూం ధాం" సినిమాలో చూస్తారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది’ అన్నారు డైరెక్టర్ సాయికిషోర్ మచ్చా. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ధూం ధాం’. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ సాయికిషోర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశాను. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశాం. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్ ను లీడ్ చేశాను. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన బృందా సిరీస్ కు వర్క్ చేశాను. ఇలా మూవీస్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో రైటర్ గోపీమోహన్ గారు "ధూం ధాం" సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది.→ మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూరప్ లో షూటింగ్ చేద్దామని పోలెండ్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ చిత్రీకరణ జరిపాం. పోలెండ్ లో కూడా మాకు ఇండియా ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే.→ తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.→ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి మైత్రీ నవీన్ గారు మంచి ఫ్రెండ్. అలా కాంటాక్ట్ అయి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.→ హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో నటుడిగా మంచి టైమింగ్ ఉంది. తండ్రి కోసం కొడుకు పడే ఒక ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్ లో చేతన్ బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబా పటేల్ కూడా తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించింది. సెట్ లో కూడా తను చాలా యాక్టివ్ గా ఉండేది.→ "ధూం ధాం" సినిమా మీరు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. రీసెంట్ గా వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్ లో దాదాపు ప్రతి సీన్ కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈనెల 8వ తేదీన అన్ని థియేటర్స్ నుంచి ఇలాంటి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. -
'ధూం ధాం'గా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త సినిమా 'ధూం ధాం'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కు గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటకు సోషల్మీడియాలో మంచి గుర్తింపు దక్కింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీలో టాలీవుడ్ మూవీకి ఊహించని రెస్పాన్స్..!
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్ప్రెస్'. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ మూవీ అభిమానులను ఆడియన్స్ను అలరిస్తోంది. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్గా అమెజాన్ప్రైమ్లోకి వచ్చేసింది.ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన చిత్రం ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కరోజులోనే ఈ సినిమా ట్రెండింగ్లో వచ్చేసింది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులతో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. -
విల్లులా ఒళ్లు వంచేసిన షాలినీ.. బిగ్బాస్ స్రవంతి గ్లామర్ ట్రీట్!
గులాబీ పెట్టుకున్న గులాబీలో కీర్తి సురేశ్గోల్డ్ కంటే బ్రైట్గా మెరిసిపోతున్న శ్రీలీలఒళ్లుని విల్లులా వంచేసి హోయలు పోతున్న షాలీనీ పాండేఅద్దాల డ్రస్సులో జిగేలుమనేలా హెబ్బా పటేల్అందాల కుందనపు బొమ్మలా యాంకర్ విష్ణుప్రియజడతో పరాచకాలు ఆడేస్తున్న శ్రుతిహాసన్చీరలో అందాలన్నీ చూపించేస్తున్న బిగ్బాస్ స్రవంతిAngel in Gold 💫 Our @sreeleela14 as showstopper, show openerThrowback to @TimesFashionWk @BangaloreTimes1 By @studiobhargavi #Sreeleela pic.twitter.com/9a6qaKvunH— Team Sreeleela (@Teamsreeleela) July 30, 2024 View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అబ్బా అనేంత అందంతో హెబ్బా.. సూపర్ క్యూట్నెస్ (ఫొటోలు)
-
రిలేషన్ షిప్ పై కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..
-
చీరకట్టులో హెబ్బా పటేల్ క్యూట్ లుక్స్.. (ఫొటోలు)
-
‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎన్ని కోట్లు పెట్టినా అది ఉంటేనే థియేటర్లకు వస్తారు: టాలీవుడ్ డైరెక్టర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం 'హనీమూన్ ఎక్స్ ప్రెస్;. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ కథాంశంగా దర్శకుడు బాల రాజశేఖరుని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 'హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'అని అన్నారు. కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' చెప్పారు.దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ..'హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారివల్లే హనీమూన్ ఎక్స్ ప్రెస్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రసాద్ ల్యాబ్స్నే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. ఎన్ని కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. థియేటర్కు వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. -
ఫన్నీగా, రొమాంటిక్గా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’టీజర్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆట్టుకుంటుందని దర్శకుడు బాల రాజశేఖరుని అన్నారు. -
హెబ్బా పటేల్ తాజా చిత్రం.. మంగ్లీ సాంగ్ వచ్చేసింది!
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ధూం ధాం'. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'మల్లెపూల టాక్సీ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. కాగా.. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, వన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హనీమూన్ ఎక్స్ప్రెస్: టైటిల్ సాంగ్ రిలీజ్
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్ప్రెస్". ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.కె.ఆర్, బాల రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.ఇప్పటికే హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్ ట్రాక్ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి. అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో డీన్ గా పనిచేశాడు.ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. సాంగ్ బాగుంది. మా దర్శకుడు బాలకు, సినిమాలోని నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు. -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్గా... స్వీట్గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘క్యూట్గా... స్వీట్గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు. -
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
సురేఖావాణి కూతురు సుప్రీత అందాల జాతరచీరకట్టులో ఎక్స్ట్రా క్యూట్గా నయని పావనిగ్లామర్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్లేటు వయసులోనే ఆ రేంజ్ హాట్గా శ్రియచీరలో సంప్రదాయంగా 'గుంటూరు కారం' మీనాక్షిమత్తెక్కించేలా చూస్తూ రెచ్చగొడుతున్న అనుకృతి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by 𝐒𝐀𝐀𝐍𝐕𝐈𝐄 𝐓𝐀𝐋𝐋𝐖𝐀𝐑 (@saanvitalwar9) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Deepak Vijay (@deepak_vijay_photography) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by तरुण चौहान (@tarunchouhan_ph) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) View this post on Instagram A post shared by Larissa Bonesi (@larissabonesi) -
సముద్రం తీరంలో తేజస్వీ ప్రకాశ్ చిల్.. హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్..!
మెక్సికోలో చిల్ అవుతోన్న తేజస్వీ ప్రకాశ్.. మంచుకొండల్లో భూమిక చావ్లా చిల్.. లైట్ బ్లూ డ్రెస్లో హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్.. పింక్ డ్రెస్లో రీతూ చౌదరి హోయలు.. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
Odela 2: నాగ సాధువుగా తమన్నా!
తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి. మధు నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో కనిపించారు తమన్నా. ‘‘ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అత్యధిక బడ్జెట్తో బహు భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కాశీలో జరుగుతోంది. శివ శక్తి పాత్ర కోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూ΄ాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. ఎస్, సంగీతం: అజనీష్ లోక్నాథ్. -
అనసూయ మరింత అందంగా.. హెబ్బా మాత్రం చీరలో వేరేలా!
బీచ్ ఒడ్డున హీరోయిన్ కేతిక అందాల జాతర వైట్ షర్టుతో మడోన్నా సెబాస్టియన్ కిరాక్ పోజులు చూపులతో చంపేస్తున్న యాంకర్ అనసూయ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కేక పుట్టిస్తున్న సిమ్రన్ చీరకట్టులో మరింత అందంగా హీరోయిన్ హెబ్బా పటేల్ చీరలో నడుముం అందాలు చూపిస్తున్న తాప్సీ పన్ను అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఐశ్వర్య మేనన్ ఫొటో బ్లర్ ఉంది కానీ కృతి కర్బంగా అందం మాత్రం అబ్బో! View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నా స్నేహితుడి సినిమా హిట్ అవ్వాలి: ఆర్జీవీ
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్ప్రెస్". ఈ చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'నిజమా' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రంలోని 'నిజమా' పాటను ఇప్పుడే చూశా. పాటను చాలా బాగా చిత్రీకరించారు. నేను విడుదల చేయడం ఇంకా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని అన్నారు. దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. "రామ్ గోపాల్ వర్మతో బ్యూటీ ఆఫ్ ప్యాషన్, ఆట అనే రెండు చిత్రాలకు పని చేశా. ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నా. హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. రామ్ గోపాల్ వర్మ మా చిత్రంలోని మొదటి పాట లిరికల్ వీడియోని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. -
బికినీలో రకుల్ రచ్చ.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
►కాజల్ అగర్వాల్ అదిరిపోయే లుక్స్ ►ఫారిన్లో చిల్ అవుతోన్న హెబ్బా పటేల్ ►రెడ్ డ్రెస్లో దేవర భామ జాన్వీ కపూర్ పోజులు ►అమెరికాలోని ఫ్లోరిడాలో అషురెడ్డి హోయలు ►సముద్ర తీరంలో బికినీలో రకుల్ రచ్చ రచ్చ ►కలర్ఫుల్ డ్రెస్లో దివి స్టెలిష్ లుక్స్ ►రెడ్ డ్రెస్లో ఆదితి శంకర్ స్మైలీ లుక్స్ View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా
ఈ వారం అందరూ 'సలార్' బిజీలో ఉన్నారు. చాలారోజుల పాటు వెయిట్ చేయించి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తొలిరోజు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. దీంతో చాలామంది మూవీ లవర్స్కి టికెట్స్ దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. అదే టైంలో ఓటీటీలోకి పలు మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. (ఇదీ చదవండి: ‘సలార్’ మూవీ రివ్యూ) ఈ శుక్రవారం ఓటీటీలోకి ఆదికేశవ, టోబి లాంటి స్ట్రెయిట్-తెలుగు మూవీస్ వచ్చేశాయి. వీటితో పాటు మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన 'అలా నిన్ను చేరి' చిత్రం.. నవంబరు 10న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, అప్పుడు వరల్డ్ కప్ హంగామా ఉండటంతో ఈ సినిమాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో దినేశ్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. కథ విషయానికొస్తే.. దివ్య (పాయల్ రాధాకృష్ణ)కి ఈమె తల్లి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం గణేశ్ (దినేశ్ తేజ్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లిద్దరి మధ్యలోకి అను (హెబ్బా పటేల్) వస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది ఈ సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్! దిమ్మతిరిగే రేటుకు..) -
‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ తో హెబ్బా హిట్ కొట్టాలి: నాగార్జున
చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (USA) పతాకంపై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్ని కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..దర్శకుడు బాల నాకు సుపరిచితుడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డీన్ గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారు. అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు 'హనీమూన్ ఎక్సప్రెస్' చిత్రం లో అవకాశాలు ఇచ్చాడు. ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం కలిగి ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా రొమాంటిక్ గా వచ్చాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి’అని అన్నారు. ‘‘హనీమూన్ ఎక్సప్రెస్' ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి మరియు సుహాసిని గార్ల క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్ గా ఉంటాయి. యూత్ కి, ప్రేమికుల కి మా చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ వివరాలతో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు. -
ఆర్జీవీకి శ్రీదేవి ఎలానో..నాకు హెబ్బా అలానే: సాయి రాజేశ్
‘కుమారి 21 ఎఫ్’చిత్రం చూశాక నేను హెబ్బా పటేల్కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆమె ఫోటోలను చూస్తూ ఉండిపోయేవాడిని. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్లకి తెలుసు నేను హెబ్బాకి ఎంత పెద్ద అభిమానినో. రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి అంటె ఎంత ఇష్టమో..నాకు హెబ్బా అంటే కూడా అంతే ఇష్టం’ అని ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేశ్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. నవంబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సాయి రాజేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘దినేష్ చాలా మంచి వ్యక్తి. మంచి నటుడు. అతనికి సరైన బ్రేక్ రావాలి. బేబితో మా జీవితాలు మారిపోయాయి. ఈ చిత్రంతో దినేష్ లైఫ్ మారిపోవాలి. పాయల్ గారు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. హెబ్బా నాకు మంచి స్నేహితురాలు. తన మనసు చాలా మంచింది. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు. నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ..‘ఈ సినిమాకు హెబ్బా పటేల్ మెయిన్ ఎసెట్. సినిమాను భుజాల మీద మోసింది. సుభాష్ మ్యూజిక్, ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. చంద్రబోస్ గారు రాసిన ఆరు పాటలు, ఓ బిట్ అద్భుతంగా ఉంటాయి’ అన్నారు. ‘లవ్, కెరీర్ మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ. ప్రేమను ఎంచుకోవాలా? కెరీర్ను ఎంచుకోవాలా? రెండూ ఎంచుకోవాలా? అన్నదే ఈ కథ. ఎమోషనల్గా వెంటాడుతుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అదే ట్రాన్స్లో ఉంటారు. కన్నీళ్లతో బయటకు వస్తారు’ అని డైరెక్టర్ మారేష్ శివన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్ తేజ్, పాయల్ రాధకృష్ణ తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
Hebah Patel Stills: ‘అలా నిన్ను చేరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హెబ్బా పటేల్ కిల్లింగ్ లుక్స్ (ఫొటోలు)
-
‘అలా నిన్ను చేరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘కొడిపాయే లచ్చమ్మది’ అంటోన్న హెబ్బా పటేల్.. !
యంగ్ హీరో దినేష్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొడిపాయే లచ్చమ్మది' అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ పాడగా.. కుర్రకారుని కట్టిపడేసేలా మరో జానపదంగా నిలవబోతోంది. (ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో నిలిచిన తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Mass Folk Fest Begins!! Put Your dance shoes to groove 💃 🕺 Honourable Minister Sri @YadavTalasani launched the Folk Number #KodiBhayeLachammadi from #AlaNinnuCheri and wished the team all the luck@iamMangli sensational singing Watch the Lyrical Here:https://t.co/J2LUBtDhpd pic.twitter.com/c1ivLs3kti — Dinesh Tej (@idineshtej) September 27, 2023 -
Sandeham: ఆకట్టుకుంటున్న‘మనసే మరలా’ సాంగ్
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా, విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మిస్తున్నారు. సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం మేకర్లు థర్డ్ సింగిల్ను రిలీజ్ చేశారు. 'మనసే మరలా' అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది. ఎస్పీ చరణ్, కే ప్రణతిల గానం, పూర్ణాచారి సాహిత్యం, సుభాష్ ఆనంద్ బాణీ చక్కగా కుదిరాయి. ఇక ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్, సుమన్ వూటుకూరిల పాత్రల తీరు ఆకట్టుకుంటుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలో చూపించారు. -
‘చచ్చినా చావని ప్రేమిది’ సాంగ్ క్యాచీగా ఉంది
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సందేహం’.‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది’ అన్నారు. ‘టీమ్ అంతా ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని మన చౌదరి అన్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు. -
దృశ్యం నటి సీమంతం.. సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇషితా దత్తా తెలుగు సినిమా చాణక్యుడుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎక్కువగా కనిపించిన భామ హిందీలో తెరకెక్కిన దృశ్యం-2 చిత్రంలోనూ నటించింది. జార్ఖండ్కు చెందిన ముద్దుగుమ్మ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి బేబీ షవర్ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంది. తాను బెంగాలీ కావడంతో వారి సంప్రదాయంలో సీమంతం జరుపుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇషితా తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇషితా తన ఇన్స్టాలో రాస్తూ..'షాద్ వేడుక' మా అమ్మ నా కోసం నిర్వహించిన బెంగాలీ బేబీ షవర్…నాకు ఇది ఎంతో స్పెషల్. అంతే కాదు నా జీవితంలో ఉత్తమమైనది. ఇది మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వేడుకలో సన్నిహితులు, ఫ్రెండ్స్ పాల్గొన్నారు. ఇషితాకు బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా బేబీ షవర్లో సందడి చేసింది. సీమంతంలో పాల్గొన్న పలువురు తారలు ఇషితా దత్తాను ఆశీర్వదించారు. కాగా.. ప్రస్తుతం ఇషితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా అనే షోలో నటిస్తోంది. (ఇది చదవండి: లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
శారీలో రకుల్ హోయలు.. బ్రెజిల్లో ఆలియా భట్ పోజులు!
►వైట్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్ ►గ్రీన్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు ►హెబ్బా పటేల్ లుక్స్ క్యూట్ లుక్స్ ►శోభిత రానా స్టన్నింగ్ పిక్స్ ►బ్లాక్ డ్రెస్లో ప్రియా భవానీ శంకర్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
‘సందేహం’ ఫస్ట్లుక్ రిలీజ్..డిఫరెంట్ పాత్రలో హెబ్బా పటేల్!
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సందేహం’. లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. సందేహం అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి 'షి బిలీవ్డ్' అనే ట్యాగ్ లైన్ జోడించారు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే ఈ సందేహంపై జనం కన్ను పడిందని చెప్పుకోవచ్చు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందట. ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రకుల్ అలా.. హెబ్బా ఇలా.. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తారలు!
లంగా ఓణిలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది శివాత్మిక వేసవి సాయంత్రం అంటూ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది రాశీఖన్నా అమెరికాలో విహార యాత్రని ఎంజాయ్ చేస్తున్న హేబ్బా పటేల్. అక్కడ అందాలను తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
హెబ్బా పటేల్ చేతుల మీదుగా 'బోగీ' ఫస్ట్లుక్ రిలీజ్
పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.K దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ను హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రముఖ నిర్మాత డీఎస్ రావు, నటులు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కుంటున్న సంఘటలను వివరిస్తూ, సున్నితమైన అంశాలను నలుగురు మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు. -
‘బ్లాక్ అండ్ వైట్’ మూవీ రివ్యూ
టైటిల్: బ్లాక్ అండ్ వైట్ నటి నటులు: హెబ్బా పటేల్, సూర్య శ్రీనివాస్, లహరి శరీ, నవీన్ నేని తదితరులు నిర్మాణ సంస్థలు: ఏ యు & ఐ స్టూడియోస్ నిర్మాత: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి దర్శకుడు: ఎల్ యెన్. వి సూర్య ప్రకాశ్ సంగీతం: అజయ్ అర్రసాడ సినిమాటోగ్రఫీ: టి.సురేంద్ర రెడ్డి విడుదల తేది: ఏప్రిల్ 14, 2023 తొలి సినిమా (కుమారి 21 ఎఫ్)తోనే సక్సెస్ని చూసింది హెబ్బా పటేల్. ఆ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే ఒకానొక దశలో ఆమె వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. ఆ తరువాత కథానాయికగా వెనుకబడిన ఆమె, ఐటమ్ సాంగ్స్ లోను మెరిసింది. ఈ మధ్య కాలంలో తెరపై ఆమె కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు 'బ్లాక్ అండ్ వైట్' సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘బ్లాక్ అండ్ వైట్’ కథేంటంటే... వర్ధన్(సూర్య శ్రీనివాస్), స్వరాంజలి(హెబ్బా పటేల్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. మూడేళ్ల పాటు కలిసి సహజీవనం చేస్తారు. అయితే ఓ రోజు ‘జాను’ అనే అమ్మాయి నుంచి వర్దన్కి మెసేజ్వస్తుంది. అది చూసి స్వరాంజలి అతనితో గొడవ పడుతుంది. కోపంలో అతన్ని చంపేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు జాను ఎవరు? వర్దన్కు వచ్చిన మెసేజ్లో ఏం ఉంది? వర్ధన్ ని చంపినా స్వరాంజలి జైలు కి వెళ్లిందా? పప్పువా(నవీన్ నేని) ఎందుకు ‘స్వరాంజలి’ హౌస్ చుట్టూ తిరుగుతుంటాడు? అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రేమలో పడటం .. మోసపోవడం .. అందుకు ప్రతీకారం తీర్చుకోవడం..ఇలాంటి కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ తరహా చిత్రమే. కపోతే, దర్శకుడు ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న కథ చూపించిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో ఇంకాస్త గ్రిప్పింగ్ ఉంటే బాగుండేది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ టచ్ ఇంకాస్త పెంచితే బాగుండేదేమో. సినిమాలో అక్కడక్కడ ‘వర్ధన్’ భయపెట్టించే కొన్ని సీన్స్ రక్తి కట్టిస్తాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయ్యితే, క్లైమాక్స్ లో స్టేషన్ దగ్గర వచ్చే ట్విస్ రివీల్ చేసిన విధానం అదిరిపోతుంది. స్వరాంజలి కి ఎంతో ఇష్టమైన పెయింటింగ్ లైవ్ విజ్యువల్స్ బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మల్టీపుల్ షేడ్స్ ఉన్న స్వరాంజలి పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. మునుపెన్నడు చూడని హెబ్బాను చూస్తారు. బిగ్ బాస్ ఫెమ్ ‘లహరి తనదైన యాక్టింగ్ ముద్ర వేసుకుంటూనే ముఖ్య పాత్ర పోషించింది. ‘సూర్య శ్రీనివాస్’ ఫ్లాష్ బ్యాక్ వెర్షన్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తునే ప్రెజెంట్ లో భయపెట్టించిన వేరియేషన్ బాగుంది. నవీన్ నేని పాత్రను సరిగ్గా స్క్రీన్ మీద ఉపయోగించలేకపోయినప్పటికీ యాక్టింగ్ లో బాగానే రాణించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. డైరెక్టర్ ఎల్.యెన్.వి సూర్య ప్రకాష్ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు బాగుంది. కాకపోతే, కథ ని చెప్పడంలో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. అజయ్ అర్రసాడ నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదు. టి.సురేంద్ర రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
కర్నూలులో సినీ తారలు అనసూయ, హెబ్బా పటేల్ సందడి (ఫొటోలు)
-
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
హెబ్బాపటేల్తో ఫోటోలు దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. ఇక ఓ సినిమా షూటింగ్ కోసం పోలండ్ వెళ్లిన హెబ్బా పటేల్ అక్కడ ఓ లిరిసిస్ట్తో దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఎప్పుడూ నుదుటన బొట్టు పెటుకొని, సంప్రదాయబద్దంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి ఈ సారి మాత్రం స్టైల్ మార్చేశారు. ట్రెండీగా గాగుల్స్ పెట్టుకొని హెబ్బాపటేల్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన నెటిజన్లు రామజోగయ్య శాస్త్రి లుక్ చూసి షాకవుతున్నారు. -
హెబ్బా పటేల్ 'బ్లాక్ అండ్ వైట్' టీజర్ అవుట్
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్ఎల్వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్తో టీజర్ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
రిలీజ్కు రెడీ అవుతున్న 'తెలిసినవాళ్లు' సినిమా
సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా హేబా పటేల్ హీరోయిన్గా నటిస్తుంది.ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన "శశివదనే" పాటకు మంచి స్పందన లభించింది. అలానే ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేసింది. సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. -
విభిన్న కథాంశంతో వస్తున్న 'తెలిసినవాళ్లు'.. ఆకట్టుకుంటున్న టీజర్
రొమాన్స్ –ఫ్యామిలీ –థ్రిల్లర్ జోనర్స్ కలిసిన కొత్త తరహా కథనంతో రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. ఈ సినిమాలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) ఈ చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంబంధించి మరిన్ని అప్డేట్స్, రిలీజ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
హెబ్బా పటేల్, పాయల్ హీరోయిన్స్గా 'అలా నిన్ను చేరి'
హుషారు సినిమాతో సక్సెస్ కొట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గురువారం ఘనంగా జరిగింది . హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.. పి.జి. వింద కెమెరామెన్గా పని చేస్తున్నారు. చదవండి: ఉసురు తగులుతుందంటూ అనసూయ ట్వీట్, రౌడీ హీరో ఫ్యాన్స్ ఫైర్ పార్టీలో అందరి ముందు ఆయన్ని కౌగిలించుకున్నా.. ఆ క్షణం ఇబ్బంది పడ్డా -
గ్రాండ్గా సునీల్-హెబ్బా పటేల్ల' గీతా' విష్కరణ
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ‘గీత’ విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు’ అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... ‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’అన్నారు. హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ ‘గీత’ వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ‘గీత’ చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు. -
సీక్రెట్ రివీల్ చేసిన హెబ్బా పటేల్
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో టాలీవుడ్కు పరిచమైంది ముంబై బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించిన ఆమెకు ఆ తర్వాత వరస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు తక్కువగా ఉండటంతో ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ ఫ్యాన్స్ను పలకరిస్తోంది. దీనితో పాటు హెబ్బా సోషల్ మీడియాలో సైతం పుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటోంది. చదవండి: తల్లి కాబోతోన్న నయనతార?, బయటికొచ్చిన అసలు విషయం! ఇదిలా ఉంటే ఆ మధ్య హెబ్బా బొద్దుగా మారి అందరికి షాకిచ్చింది. ‘అందుకే హెబ్బాకు అవకాశాలు రావడం లేదని, కాస్తా ఫిజిక్పై దృష్టి పెట్టు’ అంటూ ఆమె నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సినిమాల్లో కనిపించని హెబ్బా.. రీసెంట్గా లైవ్ చిట్చాట్కు వచ్చింది. ఇందులో ఆమె సన్నగా మారి అందంగా నాజుగ్గా కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్ ఆమె బ్యూటీ సీక్రెట్ గురించి ఆరా తీశారు. దీనికి అదో పెద్ద సీక్రెట్ అంటూ సమాధానం ఇస్తూనే అసలు విషయం చెప్పేసింది ఈ ముంబై భామ. చదవండి: అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే! ఇప్పటివరకు ఈ రహస్యం ఎవరికి చెప్పలేదన్న హెబ్బా.. తనకు అందం కొంత దేవుడు ఇస్తే.. మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని చెప్పింది. ఇలా తను సర్జరీ చేయించుకున్న విషయాన్ని హెబ్బా చెప్పకనే చెబుతూ తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టేసింది. చూస్తుంటే హెబ్బా బాడీట్రాన్స్ఫామింగ్ సర్జరీ చేసుకుని మరింత సెక్సీగా తయారైంది. కాగా చాలా మంది తారలు సర్జీరీ చేసుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. దీంతో హెబ్బా ఇలా తాను సర్జరీ చేసుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఓదెల రైల్వే స్టేషన్, తెలిసివాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది. -
Telisinavaallu Glimpse: నన్ను నేను చంపుకోబోతున్నాను.. హెబ్బా పటేల్
హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం తెలిసినవాళ్లు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో హీరో చెఫ్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. చివర్లో.. నన్ను నేను చంపుకోబోతున్నాను అన్న హెబ్బా డైలాగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. హీరోయిన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది? దాని వెనక కారణాలు ఏత్టి? ఆత్మహత్యను ఎవరైనా అడ్డుకున్నారా? లేదా? అన్న అనుమానాలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానై ఈ సినిమాను భుజానికెత్తుకున్నాడు విప్లవ్ కోనేటి. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అనంత్ కవూరి, అజయ్ నాగ్ వి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తుండగా ధర్మేంద్ర కాకరాల ఎడిటర్గా పని చేస్తున్నాడు. -
సెట్ కాదన్న డ్రెస్సే కొంటా..! నా ఫేవరేట్ బ్రాండ్ ఇదే..: హెబ్బా పటేల్
‘నా పేరు కుమారి.. నా ఏజ్ 21..’ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. ఎస్.. హెబ్బా పటేల్. ఆమెకు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అంతే క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆ అందానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్.. జ్యూయెలరీని అందిస్తున్న బ్రాండ్స్ ఇవే.. నచ్చితే వెంటనే కొనేస్తా. నాలాగే బొద్దుగా ఉన్నవాళ్లకి కొన్ని దుస్తులు నప్పవని అంటుంటారు. అందులో నిజం లేదు. శరీరానికి కష్టం కలిగించకుండా.. ఇష్టంతో ధరించే ఏ దుస్తుల్లో అయినా అందంగానే కనిపిస్తాం – హెబ్బా పటేల్ ఇస్సా స్టూడియో... ఇటీవలే ప్రారంభమై, బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యాషన్ హౌస్లలో ఒకటి ఇస్సా స్టూడియో. హైదరాబాద్కు చెందిన స్వాతి, చేతన అనే ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి తదితరులు వీరి కలెక్షన్స్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. యువతరమే వీరి టార్గెట్. యూత్ స్టైల్ను మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసే సంప్రదాయ దుస్తులతో ఫేమస్ బ్రాండ్గా ఇస్సాను నిలిపారు. ప్రస్తుతం భారత్తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లోనూ ఇస్సా స్టూడియో డిజైన్స్ను కొనుగోలు చేయొచ్చు. ఆ డ్రెస్ నీకు సెట్ కాదని ఎంతమంది చెప్పినా వినను. చీర..బ్రాండ్: ఇస్సా స్టూడియో ధర: రూ. 34,000 ఆర్నీ బై శ్రావణి.. ఈ బ్రాండ్ పెళ్లి ఆభరణాలకు ఫేమస్. ఈ నగలను ధరించి పెళ్లి పందిట్లోకి వెళ్లాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. రెడీమేడే కాదు స్వయంగా ఆర్డర్ ఇచ్చి కూడా కావలసిన నగలను డిజైన్ చేయించుకోవచ్చు. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్కు మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ అనీ ఈ బ్రాండ్కి పేరుంది. డిజైన్ను బట్టే ధర. కొన్ని సందర్భాల్లో రత్నాల విలువ, ఆభరణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్గా ఉన్న ఆర్నీ బై శ్రావణి జ్యూయెలరీని ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ఆర్నీ బై శ్రావణి ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్పై ఆధారపడి ఉంటుంది. -దీపిక కొండి చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. -
అనాధల రాత మారుస్తానంటున్న ‘గీత’
హెబ్బా పటేల్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం. సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు. -
నా తప్పులు తెలుసుకున్నా: హెబ్బా పటేల్
ప్రస్తుత ప్రపంచంలో మనం ఏరంగంలోనైనా రాణించాలంటే కొత్తదనాన్ని కచ్చితంగా ఆహ్వానించాలని అంటోంది అందాల భామ హెబ్బా పటేల్. కెరీర్ మొదట్లో నటించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తన అందం, నటనతో యువతను కట్టిపడేసిన హెబ్బా గత కొన్నాళ్లుగా కాస్త వెనుకపడింది. నితిని ‘భీష్మ’లో అలా తళుక్కున మెరిసి, రామ్ ’రెడ్’ చిత్రంలో ఐటెమ్ పాత్రలో కనిపించడం మినహా పెద్దగా చెప్పకునే పాత్రలేమీ చేయలేదు. దీనికి గతంలో తను చేసిన తప్పులే కారణమని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ఆరంభంలో కుమారి 21 ఎఫ్ , ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్నప్పటికీ అనంతరం సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేయడంతో కెరీర్ పరంగా వెనకబడింది. “24 కిస్సెస్’ సినిమా తర్వాత అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాల్లో మాత్రమే కనిపించింది. అయితే ఒకానొక సమయంలో తన కెరీర్ గురించి భయమేసిందంటోంది హెబ్బా పటేల్. కానీ లాక్డౌన్ విరామ సమయంలో కెరీర్లో చేసిన తప్పుల్ని సమీక్షించుకున్నానని, ఇకపై కథల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ‘ఓదెల రైల్వేస్టేషన్’లో పోషిస్తున్న పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని అంటోంది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడ తను కోరుకున్న పాత్రలు లభిస్తున్నాయని తెలిపింది. చదవండి: న్యూస్ రీడర్గా రమా రాజమౌళి.. వీడియో వైరల్ -
స్నేహితులను మిస్ అవుతున్న లావణ్య, హ్యాపీ ఫేస్తో అనుపమ
♦ తన బలం తన సోదరుడే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ అనుపమ పరమేశ్వరన్ చేయి కొరుకుతున్న సోదరుడు అక్షయ్ ♦ ఈ ఫొటో నచ్చిందంటోన్న హెబ్బా పటేల్ ♦ స్త్రీ కంటే ఎక్కువగా ఎవరూ కష్టపడరు అంటోన్న నటి ప్రగతి ♦ మీరే ప్రశాంతతను నెలకొల్పి అక్కడే సేద తీరండి అంటోన్న వితికా షెరు ♦ అలీ రెజాకు బర్త్డే విషెస్ చెప్పిన రాహుల్ సిప్లిగంజ్ ♦ డ్యాన్స్ ఇరగదీసిన దేత్తడి హారిక ♦ స్నేహితులను మిస్ అవుతున్న లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by I N D H U J A (@indhuja_ravichandran) View this post on Instagram A post shared by I N D H U J A (@indhuja_ravichandran) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Devi Sri Prasad (@thisisdsp) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
సోషల్ హల్చల్: హీటెక్కిస్తున్న నియా, చెట్టెక్కిన హెబ్బా
♦ గాగ్రాలో బొంగరాలు తిరుగుతున్న అదితి బుద్దకోటి ♦ మరో రోజు, మరో అడ్వెంచర్తో అంటూ ఎయిర్పోర్టులో నికిత శర్మ ♦ అనవసరమైనవి పట్టించుకోవడం మానేస్తే లైఫ్ ఎంత బాగుంటుందో అంటున్న అమలాపాల్ ♦ బ్లూటిఫుల్ డే అంటోన్న శిల్పా శెట్టి ♦ అమ్మ తీసిన ఫొటోను పంచుకున్న శ్రద్దా కపూర్ ♦ ఇది శుక్రవారమా? కాదా? అని అడుగుతోన్న సోనాక్షి సిన్హా ♦ గుడ్ మార్నింగ్ అంటూ వీడియో షేర్ చేసిన అమీషా పటేల్ ♦ ఎక్కడైనా కాఫీ తాగొచ్చంటూ చెట్టెక్కిన హెబ్బా పటేల్ ♦ హీటెక్కించే పోజులో నియా శర్మ View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
సోషల్ హల్చల్: సింగారాలు ఒలకబోస్తున్న బ్యూటీలు
► పిల్లందం కేక అనిపిస్తోన్న హెబ్బా పటేల్ ► పసుపు రంగు కుర్తీలో దేత్తడి హారిక సెల్ఫీ ► లెహంగాలో సింగారాలు ఒలకబోస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ► ఇతరుల కోసం కాకుండా నీకు నచ్చినట్లు ఉండని చెప్తోన్న నిషా అగర్వాల్ ► నవ్వుతో గాలం వేస్తున్న నభా నటేశ్ ► లంగా ఓణీలో భలేగుంది బాల అనిపిస్తోన్న అషూ రెడ్డి ► బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోయిన మలైకా అరోరా ► కురులు విరబోసుకుని అందాలు పరుస్తున్న లక్ష్మీ రాయ్ ► ఓవైపు క్యూట్, మరోవైపు హాట్ ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ నటి అదితి బుద్ధకోటి View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) -
సినిమా టాకీస్: సంక్షిప్త సమాచారం
దుల్కర్ సెల్యూట్ దుల్కర్ సల్మాన్ హీరోగా రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ‘సెల్యూట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో దుల్కర్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ ఈ సినిమా ద్వారా మలయాళ చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి çసంగీతం: సంతోష్ నారాయణన్. యువత కథ ‘‘ఓ మహిళ నిర్మిస్తున్న ‘ఒక యువత కథ’ చిత్రం లోగో ఆవిష్కరణ మహిళా దినోత్సవం సందర్భంగా మా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. 30 మంది కొత్త వారిని తెరకు పరిచయం చేస్తూ, రూపొందుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ అన్నారు. ఆపతి ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఒక యువత కథ’. ప్రవీణ్ ఎంటర్టైన్మెంట్స్–సూర్య కుమారి వర్క్స్ పతాకంపై ఏలూరి సూర్యకుమారి నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని రామసత్యనారాయణ, సాయి వెంకట్ విడుదల చేశారు. ఏలూరి సూర్యకుమారి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి కొత్తవారిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుత యువత ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు ఆపతి ప్రవీణ్ కుమార్. భరత్ మహేశ్వరం, హేమంత్ వర్మ, అజిత్ సింగ్, సిరిల్ గాలంకి, ఖుష్బు వైష్ణవ్, నందిగామ పూజిత, ప్రియా వైష్ణవ్, యం.ఎస్ నందిని, రత్నశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య. మినీ స్టోరీ ప్రభాస్తో ‘మిర్చి’ వంటి భారీ చిత్రం, శర్వానంద్తో ‘రన్ రాజా రన్’, నానీతో ‘భలే భలే మగాడివోయ్’, అనుష్కతో ‘భాగమతి’.. ఇలా విజయవంతమైన చిత్రాలు నిర్మించి, తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. యూవీకి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ఆరంభమైంది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘ఏక్ మినీకథ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోకుల్ భారతి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: సత్య. తెలిసినవాళ్లు ముఖం ఎక్కడో, మొండెం ఎక్కడో.. ఫొటో చూశారుగా. ‘తెలిసినవాళ్లు’ సినిమా స్టిల్ ఇది. ఎందుకిలా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్ కార్తీక్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో కేఎస్వీ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. విప్లవ్ కోనేటి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో ఉంటుంది. హెబ్బా పటేల్ తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ద్వారా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోబోతున్నారు. షూటింగ్ ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అజయ్ వి. నాగ్, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, లైన్ ప్రొడ్యూసర్: డా. జెకె సిద్ధార్థ. చదవండి: శివరాత్రికి పవన్ సినిమాకు టైటిల్ -
ముద్దులు పంచుతున్న రాశీ, అబ్బా అనిపిస్తున్న హెబ్బా
♦ సముద్ర తీరాన సాగరకన్యగా మైమరపిస్తోన్న 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ ♦ తన అందాన్ని ముసుగుతో దాచలేకపోతున్న ప్రియా వారియర్ ♦ జీన్స్లో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా పటేల్ ♦ చూపులతో చంపేస్తున్న కాజల్ అగర్వాల్ ♦ తెల్ల చీరలో హొయలు పోతున్న జాన్వీ కపూర్ ♦ పిల్లలకు ముద్దులు పంచుతున్న రాశీ ఖన్నా ♦ కళ్లతోనే సైగలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ ఒక్క ఫొటోతో సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
నిజామాబాద్లో హెబ్బా, పాయల్ సందడి ఫొటోలు
-
'ఒరేయ్ బుజ్జిగా’ మూవీ స్టిల్స్
-
‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ వేడుక
-
‘సరిగమ’ అంటున్న రాజ్, హెబ్బా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సరిగమ’ అనే పూర్తి లిరికల్ సాంగ్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. వనమాలి సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసి పాడాడు. యూత్కు బాగా కనెక్ట్ అయిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (నగ్నంగా నరేశ్.. 30న ఎఫ్ఐఆర్) ఈ పాటలో రాజ్ తరుణ్ డ్యాన్స్, హెబ్బా పటేల్ అందాలు హైలైట్గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే కుమారి 21ఎఫ్, అంధగాడు, ఆడోరకం ఈడోరకం చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడిని ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుండటంతో ఈ చిత్రంలోనూ వీరిని రీపీట్ చేశామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేటర్లోనే విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్లు తెరిచిన వెంటనే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) -
హీరోయిన్ హెబ్బా పటేల్ ఫోటోలు
-
రూట్ మార్చిన ‘కుమారి’
‘కుమారి 21 ఎఫ్’తో కుర్రకారు మనసు దోచుకున్న నటి హెబ్బా పటేల్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. కానీ అగ్రహీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం, వరుసగా అపజయాలు చవిచూడటంతో హీరోయిన్గా నిలదొక్కులేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అడపాదడపాగా గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు డిజిటల్ ఫ్లాట్ఫామ్పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆహా యాప్లోని మస్తీస్ అనే వెబ్ సిరీస్లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్లో మరె రెండు వెబ్సిరీస్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక వెబ్ సిరీస్లకు పెట్టింది పేరయిన నెట్ఫ్లిక్స్తో కూడా హెబ్బా జతకట్టినట్టు విశ్వసనీయం సమాచారం. త్వరలో నెట్ఫ్లిక్స్ తీయబోయే రెండు వెబ్ సిరీస్లకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెండు వెబ్ సిరీస్లు అడల్ట్ కంటెంట్ స్టైయిల్లో ఉంటుందని.. హెబ్బా బోల్డ్ క్యారెక్టర్ చెయ్యబోతోందని ఫిలింనగర్ టాక్. ఈ వెబ్ సిరీస్లతో మళ్లీ క్రేజ్ సంపాదించుకోవాలని హెబ్బా భావిస్తుందట. రామ్ ‘రెడ్’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది. చదవండి: పూజా హెగ్డే చిట్కాలు విన్నారా? ‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెట్టింట కాదు థియేటర్లోనే విడుదల
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడింది. వైరస్ వ్యాప్తి నివారణ నియంత్రణలో భాగంగా ప్రపంచంతో పాటు భారత్ లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా అనేక సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు నెట్టింట్లో విడుదల చేశారు. డిజిటల్ ఫ్లాట్ఫాం వేదికగా రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో పలు చిన్న సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. అయితే యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్రం కూడా నెట్టింట విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్ర విడుదలపై నిర్మాత రాధామోహన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఒరేయ్ బుజ్జిగా చిత్ర విడుదల విషయంలో వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం. మా చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుంది’అంటూ నిర్మాత ట్వీట్ చేశారు. ఉగాది కారణంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతమందించాడు. Don't believe in rumours about skipping the theatrical release of #OreyBujjiga. We will update about the theatrical release date once normalcy is restored. Until then #StayHomeStaySafe - @KKRadhamohan @SriSathyaSaiArt — Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 9, 2020 చదవండి: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు? కరోనాపై పోరులో చిరంజీవి తల్లి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాధకు బ్రాండ్స్తో పనేంటి డాడీ’
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. కొండా విజయ్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రి టీజర్, సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర టీజర్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. యూత్ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’, ‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటి? ఒక ఫ్లిప్కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్మైషో, ఒక క్రెడిట్ కార్డ్’ అంటూ టీజర్లో వచ్చే డైలాగ్లు యూత్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ‘బాధకు బ్రాండ్స్తో పనేంటి డాడీ’, ‘నీకు తెలిసిన స్టోరీలో తెలియన్ ట్విస్టు ఉంది’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్లు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో యూత్ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన టీజర్ సినిమాకు మరింత ప్లస్గా నిలిచే అవకాశం ఉంది. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. చదవండి: ‘అమృతరామమ్’ ఎప్పుడంటే? యూట్యూబ్లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’ -
కూకట్పల్లిలో సినీ సందడి
-
విలన్గా హాట్ బ్యూటీ!
అలా ఎలా సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అందాల భామ హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ సినిమాతో బోల్డ్ క్యారెక్టర్లో నటించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఈడో రకం ఆడో రకం, ఎక్కడి పోతావు చిన్నవాడ సినిమాలతో సక్సెస్లు వచ్చినా.. తరువాత హెబ్బా కెరీర్ ఇబ్బందుల్లో పడింది. వరుసగా నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్ సినిమాలో బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో హెబ్బాకు అవకాశలు కరువయ్యాయి. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాటో హాట్ ఫోటోషూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు హెబ్బా. తాజాగా ఈ భామ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న భీష్మ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హెబ్బా నెగెటివ్ రోల్లో కనిపించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్ర కావటంతో తనకు మరోసారి బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో హెబ్బా ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బంజారాహిల్స్లో హెబ్బా పటేల్ సందడి
-
మరో రొమాంటిక్ థ్రిల్లర్లో కుమారి
‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుసగా బబ్లీ రోల్స్లో అలరించింది. అయితే వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ కిడ్నాప్ ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాడికల్. ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో హెబ్బా హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. -
ఏంజెల్.. గుండె జిగేల్
అలా ఎలా... అంటూ తెలుగుతెరకు పరిచయమై..నేనింకా కుమారి 21ఎఫ్నేనని గోలచేసిఎక్కడికి పోతావు చిన్నవాడా..అంటూయువత గుండెల్లో కొలువైనఏంజెల్ హీరోయిన్ హెబ్బాపటేల్ఆదివారం అనంతలో సందడి చేశారు.ఎస్ఆర్ఐటీ వార్షికోత్సవంలో ఆడిపాడిఅందరినీ ఉర్రూతలూగించారు. అనంతపురం, బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ కళాశాల దశమ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా బెంగళూరుకు చెందిన అసెంచర్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రముఖ సినీనటి హెబ్బా పటేల్, నటుడు షఫీ, కళాశాల చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, సీఈఓ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ హితేంద్రశర్మ, టీపీఓ రంజిత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన అసెంచర్ కంపెనీ సాఫ్ట్వేర్ డైరెక్టర్ హెచ్ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. అలాగే అదే విధంగా ఇంజినీరింగ్ విద్యకు ఎంతో డిమాండ్ ఉందని, ప్రతి విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఎస్ఆర్ఐటీ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అవసరమయ్యే సెమినార్ సదస్సులను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం వివిధ బ్రాంచ్లలో టాపర్గా నిలిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లు, బంగారు పథకాలను ప్రదానం చేశారు. నా పేరు కుమారి... నా పేరు కుమారి అంటూ సినీనటి హెబ్బా పటేల్ చెప్పిన డైలాగ్తో విద్యార్థులు తెగ సంబరపడి పోయారు. మరోవైపు నటుడు షఫీ కూడా తన మార్క్ డైలాగ్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం విద్యార్థులు చేసిన డ్యాన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి. -
‘24 కిస్సెస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
బిగ్బాస్ ఎంట్రీపై హీరోయిన్ క్లారిటీ
బిగ్బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాని శని, ఆది వారాల్లో బెబుతున్న పిట్టకథలు, హౌస్మేట్స్తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అనేలా ఉంది హౌస్లో పరిస్థితి. సీజన్ వన్లో వైల్డ్కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్లు హౌజ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి ఈసారి ప్రముఖ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించారు. దీనిపై ఆమె ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడారు. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు. ఇక బిగ్బాస్ హౌస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్కు సామ్రాట్, తేజస్వీ, రోల్రైడా, దీప్తి, తనీష్లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కామన్మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
బిగ్బాస్లో మరో ట్విస్ట్: హీరోయిన్ ఎంట్రీ!
బిగ్బాస్ షోలో నాని తన పిట్టకథలతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎపిసోడ్ చివరలో ఆ పిట్టకథలకు నీతి చెప్పడం ఎంతగానో అలరిస్తోంది. అంతేకాక బిగ్బాస్ 2 భారీ అంచనాల మధ్య మొదలైంది. కాకపోతే, ఈ సీజన్పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని సమాచారం. కాగా, ఫేమస్ సెలబ్రిటిస్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోవడం లేదనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో బిగ్బాస్ టీం వైల్డ్కార్డు ఎంట్రీ ద్వారా ఓ హీరోయిన్ హౌజ్లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్కార్డు ద్వారా నందిని షోలోకి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 2 హోస్ట్ నాని ఏమైనా జరగవచ్చు అని చెబుతున్నట్లే షోలో ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏవరూ ఊహించని విధంగా శ్యామల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట మరో రూమర్ హల్చల్ చేస్తోంది. హీరో రాజ్తరుణ్ సరసన నటించిన భామ బిగ్బాస్ 2లోకి వైల్డ్కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. కూమారి 21ఎఫ్ చిత్రంలో నటించి అందరి మనసుల్ని గెలిచిన హీరోయిన్ హెబ్బా పటేల్ను బిగ్బాస్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి ఆ భామ అంగీకరించిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ, దీనిపై అధికారకంగా ఏ విధమైన సమాచారం లేదు. ఈ వారం ఎండింగ్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫస్ట్ సీజన్లో కేవలం సెలబ్రెటీలకు మాత్రమే షో యాజమాన్యం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, లక్షల మందిలో నుంచి సామాన్యులైన సంజన, నూతన నాయుడు, గణేశ్లకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే షో నుంచి సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం షోలో కొనసాగుతున్న గణేశ్ తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీకేండ్ వరకూ వేచి చూడాల్సిందే. -
హెబ్బా.. స్మైల్ అదిరిందబ్బా..
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో 5కే వాక్ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్లో నటి హెబ్బా పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లబ్బీపేట (విజయవాడతూర్పు) : క్యాన్సర్ను తొలిదశలో గుర్తించడం ద్వారా వందశాతం నివారించవచ్చని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 5కే వాక్ నిర్వహించారు. ఈ వాక్లో పెద్ద సంఖ్యలో యువత, వాకర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ నేడు ప్రజలకు సోకుతున్న వ్యాధులన్నీ జీవనశైలి కారణంగానే అని నిర్ధారణ అవుతున్న వేళ, ప్రజల తమ దినచర్యలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జబ్బు చేసిన తర్వాత చికిత్స కోసం పరుగులు పెట్టేదానికన్నా, వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, తొలిదశలో క్యాన్సర్ను నిర్ధారించే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి, లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. క్యాన్సర్పై పోరాటం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, మురళీమోహన్, రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్య, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, నగర మేయర్ కోనేరు శ్రీధర్, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, రూట్స్ అధ్యక్షుడు డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిఖిల్, హెబ్బాపటేల్ క్యాన్సర్పై అవగాహన కలిగించేందుకు నగరంలో నిర్వహించిన ర్యాలీలో సినీ నటులు నిఖిల్, హెబ్బాపటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఐదు కిలోమీటర్లు నడిచి, వాకర్స్లో ఉత్సాహాన్ని నింపారు. ఉచిత నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 450 మందికిపైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 20 మందికి మమ్మోగ్రామ్, 25 మందికి ఎక్స్రే, 55 మందికి పాప్స్మియర్ టెస్ట్లు ఉచితంగా నిర్వహించారు. ఇద్దరిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడంతో వారికి హైదరాబాద్ ఆస్పత్రికి పంపించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ కుమారి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సులోచనరాణి, డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ భువనకుమారి బృందం పాల్గొన్నారు. ఈ శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది.