
జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కేసీఆర్(కేశవ చంద్ర రమావత్)’. గరుడ వేగ అంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.

కేసీఆర్ సినిమాకు మంచి స్పందన రావడం పట్ల రాకేష్ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసేందుకు కాశీకి వెళ్లాడు.

భార్య సుజాత, కూతురుతో కలిసి విమానంలో కాశీకి వెళ్లిన రాకేశ్.. అక్కడ సినీ నటి, మాజీ మంత్రి రోజాతో శివయ్యను దర్శనం చేసుకున్నాడు.

అనంతరం అక్కడ రోజాతో కలిసి సెల్పీలు దిగారు. ఆ ఫోటోలను రాకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్గా మారాయి.















