rocking rakesh
-
సంవత్సరమంతా జంట స్వరంగా...
కలసి పాడుదాం బతుకు పాట... కలసి సాగుదాం వెలుగు బాట... అన్నట్టు ప్రతి దంపతులు ఒకరికి ఒకరై ముందుకు సాగితే ఏ కాలమైనా మంచికాలంగానే ఉంటుంది. భార్య భర్త జీవననౌకకు ఉమ్మడి చుక్కానిగా మారాలి. కలతలు చిన్నవయ్యి ఆనందాలు పెద్దవవ్వాలి. కుటుంబం బాగుంటే సమాజం, దేశం బాగుంటాయి. మనకు తెలిసిన ఈ సెలబ్రిటీ జంటలు ఆ మాటే చెబుతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.మనవాళ్లెవ్వరో తెలిసింది→ ప్రభాకర్: మాకు పెళ్లై 25 ఏళ్లయింది. ఎవరి ఫ్యామిలీ లైఫ్ అయినా బాగుండాలంటే భార్య సహకారం, తను అర్థం చేసుకునే విధానం మీదనే ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో మా ఆవిడకి సహనం, ఓపిక చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా కేర్ చేస్తుంది. జనరల్గా మగవాళ్లకి చాలా ప్రపంచాలుంటాయి. ప్రొఫెషన్, మదర్స్ ఫ్యామిలీ, బిజినెస్, కెరీర్... ఇలా. కానీ భార్యకు మాత్రం ఎప్పుడూ ఒకే ఒక ఆలోచన మా ఆయన తిన్నారా? నా పిల్లలు టైమ్కి తిన్నారా? అందర్నీ ఆరోగ్యంగా చూసుకుంటున్నానా? అని! ఆ విషయంలో మేము రియల్లీ బ్లెస్డ్. 2025కి నావి రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ రెండు సీరియల్స్తో నేను బిజీగా ఉన్నాను. ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సూపర్ సీరియల్ ఇప్పటికే లీడ్లో ఉంది. అలాగే ‘చామంతి’ అనే మరో సీరియల్లో చేస్తున్నాను. మా మలయజ కూడా 2024లో వెబ్ సిరీస్తో పాటు రెండు సినిమాల్లో నటించింది.మా అబ్బాయి చంద్రహాస్ ‘రామ్నగర్ బన్నీ’ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి బాగా నటించాడు. అది మేం కళ్లారా చూశాం కాబట్టే మా స్థాయికి మించి ఆ సినిమా కోసం పెట్టుబడి పెట్టాం. మా అబ్బాయి సంతోషం కోసం ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆప్రాసెస్లో డబ్బుల గురించి ఎక్కడా ఆలోచించలేదు. ‘రామ్నగర్ బన్నీ’తో చంద్రహాస్ తనని తాను నిరూపించుకున్నాడు. మా అమ్మాయి దివిజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. లండన్ వెళ్లి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని, ఒక వ్యాపారవేత్తగా ఉండాలన్నది తన కల. తను ఇప్పటికే బాల నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. ఈ రెండూ పూర్తయ్యాక తను ఎలా సెటిల్ అవ్వాలనుంటే అలా మేం సంతోషంగా సపోర్ట్ చేస్తాం. → మలయజ: 2024లో నేను నిర్మాతగా షూటింగ్ లొకేషన్కి రావటం, మా అబ్బాయి చంద్రహాస్ మూవీ (రామ్నగర్ బన్నీ) కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చూసుకోవడం ఒక కొత్త అనుభవం అని చెప్పగలను. కానీ, ఈ ఏడాది చాలా నేర్చుకున్నాను మా అబ్బాయి మూవీ ‘రామ్నగర్ బన్నీ’ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్న సమయంలో డబ్బులు అయిపోయి, మేం ఎదుర్కొన్న సవాళ్లలో ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అనేది తెలుసుకున్నాం. మనకేదైనా అవసరం వస్తే మనకంటూ తోడుగా వీళ్లందరూ ఉన్నారని అని కొంతమంది గురించి ఒక తప్పుడు అంచనాలతో ఉంటాం. కానీ, అది నిజం కాదు. ఈ సంవత్సరం మేం నేర్చుకున్న గుణపాఠం ఇది. అయితే అదే సమయంలో మేం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొత్తవాళ్లు కొంతమంది సమయానికి సహాయం చేశారు. మా అబ్బాయి నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమా 2025లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి దివిజ కూడా రెండు సినిమాలు సైన్ చేసింది. చాలా మంచిప్రాజెక్ట్స్ అవి. వాటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో ఒకటి బ్రహ్మానందంగారి సినిమాలో ఆయన కూతురుగా, హీరో చెల్లెలిగా మంచి పాత్ర వచ్చింది. అలాగే ఇంకో సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. అలా మా అమ్మాయి కెరీర్ పరంగా కూడా బీజం పడింది 2024లోనే. ‘మనుషులను’సంపాదించుకున్నాం→ రాకేష్: 2024 విషయానికి వస్తే ఈ సంవత్సరం మా ఇద్దరికీ చాలా బ్యూటిఫుల్ ఇయర్. మేం సొంతంగా సినిమా (‘కేసీఆర్’లో రాకేశ్ నటించి, నిర్మించారు) ఆరంభించాం. ఎన్నో సంవత్సరాలుగా నా డ్రీమ్ అది. 2023లోనే మేం ‘కేసిఆర్’ సినిమా అనుకొని షూటింగ్ స్టార్ట్ చేశాం. మేం తీసుకున్న మూవీ టైటిల్ కన్ఫర్మేషన్, కొన్ని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇంత కష్టపడి,ప్రాణం పెట్టి చేసిన సినిమా ఎందుకు ఇలా ఆగిపోయిందో అని చాలా నిరుత్సాహంలో ఉన్న సంవత్సరం అది. కానీ 2024, ఆగస్ట్ 1న నా బంగారు తల్లి పుట్టింది. నిజంగానే మా అన్ని టెన్షన్లకీ, కష్టాలకీ ఫుల్స్టాప్ పడ్డట్లు, ప్రత్యక్షంగా లక్ష్మీదేవి మా జీవితాల్లో అడుగు పెట్టినట్లు అయింది. సినిమా రిలీజైంది. ‘దైవం మానుష రూపేణ’ అని నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్న మనుషులు నా కోసమే అనే భావనతో మనుషుల్ని సంపాదించుకుంటూ, వాళ్లని కాపాడుకునేందుకై కష్టపడుతున్నాను. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్గారు ఈ సంవత్సరం ఆహాలో మా మూవీని రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి మమ్మల్ని ఇంకో మెట్టు పైకి ఎక్కించి, ఈ ఇయర్ ఎండ్ గిఫ్ట్గా ఇచ్చారు.→ అంతా బాగుండి మనం నడుస్తున్నప్పుడు మన వెనక చాలామంది వస్తారు. ఒకసారి కిందపడితేనే తెలుస్తుంది మనకి చెయ్యి అందించి పైకి లేపేది ఎవరు, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వేది ఎవరు అనేది క్లియర్గా తెలుసుకున్నాం. అన్నీ సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యి మంచి గుర్తింపుతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక సమయంలో హెక్టిక్ అయిపోయి తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో మా సుజాత నన్ను బిడ్డలాగా తోడు నీడగా ఉండి చాలా స్ట్రెంత్ను ఇచ్చింది. 2025లో ఇంకో న్యూప్రాజెక్ట్తో రాబోతున్నాం. మా సుజాతది కూడా 2025లో ‘సేవ్ ది టైగర్–3’ వెబ్ సిరీస్ రాబోతోంది. వర్క్లో,ప్రొఫెషన్లో ఇంకా ఇంకా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాం.→ సుజాత: నాకు 2023 డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 2024 జనవరి నుంచిప్రొఫెషన్ పరంగా ఎన్నో టెన్షన్స్తో ఉన్నా రాకేష్గారు నన్ను చాలా కేర్ తీసుకుంటూ, హాస్పిటల్కి తీసుకెళ్లి రెగ్యులర్ చెకప్లు చేయిస్తూ, చివరికి నా డెలివరీ రూమ్లో బేబీని తన చేతులలో బయటికి తీసి బొడ్డు కోసే వరకు, స్పెసిమెన్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వరకు కూడా అన్నీ ఆయన చేతుల్లోనే జరిగాయి.మేము ముగ్గురం అక్కా, చెల్లెళ్ల్లం కాబట్టి నాకు బాబు పుడితే బాగుండు అని ఉంది. కానీ మా ఆయన మాత్రం ఎవరైనా ఒకటే అనేవారు. ఫైనల్గా మా పాపాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటివరకు ఆగిపోయిన సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే క్లీయర్ అయిపోయి, మూవీ రిలీజ్ అయిపోయింది. మా పాప పుట్టుకతో మా ఆయన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినట్లు మేము ఫీలవుతున్నాం. అందుకే మా పాప పేరు కూడా ‘ఖ్యాతిక’ అని పెట్టుకున్నాం. ఆ పేరు కూడా బాగా కలిసొచ్చింది. మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది. మా రాకేష్ చాలా కష్టపడుతున్నాడు, మనవాడి కోసం మనం కూడా ఏదైనా చేయాలని స్వచ్ఛందంగా వచ్చి సినిమాలో పని చేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే మేం డబ్బు కంటే కూడా మనుషులను ఎక్కువగా సంపాదించుకున్నాం అనే తృప్తి 2024లో మాకు చాలా ఉంది.కామెంట్లు చేసినా కామ్గా ఎదిగాంఇంద్ర నీల్: ‘కాలచక్రం’ అనే సీరియల్లో మేఘన, నేను కలిసి నటించాం. మా ఫ్రెండ్షిప్తో కలిపి మా రిలేషన్షిప్కు 25 ఏళ్లు. మా పెళ్లి జరిగి 19 ఏళ్లవుతోంది. మా ఇద్దరి లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి? అని చె΄్పాలంటే మా మ్యారేజ్ అనే చె΄్తాను. 2005 మే 26న ‘చక్రవాకం’ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అత్త రోల్ చేశారు మేఘన. ఆ సీరియల్లో అత్తను ప్రేమించే క్యారెక్టర్ నాది..సో... రియల్ లైఫ్లో కూడా తనని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. చాలా కష్టపడి, పెద్దల్ని ఒప్పించి, పెళ్లికి వచ్చేలా చేసుకుని, మా ఇద్దరి డబ్బుల్తోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. అది మాకు ఎప్పటికీ తీయని గుర్తు. → నాకైతే 2024 గురించి చిన్న పశ్చాత్తాపం ఉంది. మా నాన్నకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి షోల కోసం అమెరికా వెళ్లాను. నేను వర్క్ చేయడానికి ఎక్కడికైనా వెళ్లి, కష్టపడుతుంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. నేనున్నాను కదా... నువ్వు వెళ్లు అని ధైర్యం చెప్పి పంపారు. కానీ నేను ఇండియాకి తిరిగి వచ్చేసరికి, నా ధైర్యం అయిన ఆయనే మాకు దూరం అయిపోయారు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ రోజు ఆయన మాతో భౌతికంగా లేకపోవడం మాకు చాలా పెద్ద లాస్. ∙2025 పై మాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఒక మంచి ΄్లాన్ కూడా ఉంది. మంచి బిజినెస్ ΄్లాన్స్తో పాటుగా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రివీల్ చేస్తే సర్ప్రైజ్ అంతా పోతుందని చెప్పడంలేదు.ట్రిప్స్ అయితే చాలానే ΄్లాన్ చేస్తున్నాం. మేం ఇద్దరం ఎక్కువగా రోడ్ ట్రిప్స్కి వెళ్లడానికే ఇష్టపడతాం. అయితే అన్నీ అన్΄్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి. అప్పటికప్పుడు అనుకోవడం... వెళ్లిపోవడం. మేఘన రామి: జీవితంలో ఓ మంచి పార్టనర్ దొరకడం అనేది చాలా ముఖ్యం. అప్పుడున్న ఆ ఏజ్లో అది కరెక్టో, కాదో అనేది పక్కన పెడితే... ఇప్పుడు మా 19 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత అనిపిస్తోంది.... అప్పుడు మేం తీసుకున్నది చాలా మంచి నిర్ణయమని. ‘ఏంటి, వాళ్లు ఇలా పెళ్లి చేసుకున్నారు?’ అని వ్యతిరేకంగా మాట్లాడుకున్నవాళ్లూ కూడా ఉన్నారు. కానీ మేం తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల మా లైఫ్ అప్పట్నుంచి చేంజ్ కావడం ఆరంభమైంది. ఇక నా ఫుడ్ బిజినెస్లో నీల్ సపోర్ట్ చాలా చాలా ఉంది. లేదంటే... ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత దూరం రానే రాదు. వైఫ్తో పచ్చళ్లు అమ్మిస్తున్నాడనీ, ఇండస్ట్రీలో వర్క్ లేక పచ్చళ్లు అమ్ముకుంటున్నారనీ, బతుకుతెరువు కోసం ఇలా చేస్తున్నారనీ చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. కానీ మేం ఇద్దరం చాలా చాలా మెమొరీస్ని బిల్డ్ చేసుకోగలిగాం. మంచి లైఫ్ని లీడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2025లో మా రిలేషన్షిప్కి సంబంధించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక 2025 రిజల్యూషన్స్ అంటే... ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చాలా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే న్యూ ఇయర్ రావడానికి రెండు వారాల ముందే యోగా సభ్యత్వం తీసుకున్నాను. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంటర్వ్యూలు: శిరీష చల్లపల్లి -
ఓటీటీకి కేసీఆర్ సినిమా.. ట్రైలర్ చూశారా?
కమెడియన్గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.అసలు కథేంటంటే..'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. -
ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'జబర్దస్త్' షోతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh).. హీరోగా నటించిన నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గానీ అదే టైంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో ఇది పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan).. ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
కేసీఆర్కి టికెట్ ధరలు తగ్గించాం – రాకింగ్ రాకేష్
‘‘ఈరోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ మా ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్)లో మాజీ సీఎం కేసీఆర్గారు నటించారు. అదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలియకుండా ఆయన సన్నివేశాలు తీశాను. నేడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మా సినిమాకి టికెట్ ధరలు కూడా తగ్గించాం. రూ. 50 నుంచి వంద రూపాయలు మాత్రమే’’ అన్నారు రాకింగ్ రాకేష్. ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేసీఆర్’. రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించారు. అనన్య కృష్ణన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు తన ఊర్లో జరుగుతున్న దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు? అవమానాలు పడ్డ ఊర్లో తను ఓ స్టార్గా ఎలా అయ్యాడు? అనేది కథ. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాశాను. ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ‘కేసీఆర్’ కథే నన్ను నటించేలా, నిర్మించేలా చేసింది. ఇది ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఈ మూవీలో గోరటి వెంకన్నగారు రాసిన ఓ పాట నన్ను కేసీఆర్గారి దగ్గరికి తీసుకెళ్లింది. ఆయనకి మా సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. నా భార్య జోర్దార్ సుజాత సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నా కథని వంద రెట్లు అద్భుతంగా తెరకెక్కించారు అంజిగారు’’ అని తెలిపారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకింగ్ రాకేష్ స్పీచ్
-
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
త్వరలోనే ఆ రుణం తీర్చుకుంటాను: సాయి రాజేష్
‘‘నేను తీసిన ‘హృదయ కాలేయం’ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్కిట్ చేశాడు రాకేష్. ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన తనకి కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ రాస్తానని మాట ఇచ్చాను. త్వరలోనే ఆపాత్ర రాసి రుణం తీర్చుకుంటాను. ‘కేసీఆర్’ సినిమా ట్రైలర్ బావుంది. సినిమా విజయం సాధించి, రాకేష్ మంచి స్థాయికి వెళ్లాలి’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు.రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ– ‘‘లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘కేసీఆర్’కి నేను దర్శకత్వం వహించడంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా అందించాను. రాకేష్ అద్భుతమైన కథ రాశారు’’ అని ‘గరుడవేగ’ అంజి చెప్పారు. నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘కొన్ని డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ‘కేసీఆర్’లాంటి ఒక మంచి సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు. -
ఒక్క ఫోటో వైరల్.. అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్
'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రం ఆడియో వేడుకలో అనసూయ గురించి డైరెక్టర్ సాయిరాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూనే 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తోన్నాడు. ఆపై స్క్రీన్ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీ సినిమా డైరెక్టర్ సాయిరాజేష్, అనసూయ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.విలేజ్ బ్యాక్డ్రాప్లో బావమరదళ్ల ప్రేమకథతో దర్శకుడు 'గరుడవేగ' అంజి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది. అయితే, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యాంకర్ అనసుయపై దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జబర్దస్త్ షో కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్మీడియాలో పోస్ట్ చేశాను. అయితే, చాలామంది అనసూయ భర్తను నేనే అనుకుని బండబూతులు తిట్టారు. అనసూయకు సరైన టేస్ట్ లేదు.. ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ కొందరు కామెంట్ చేశారు. తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చాను.' అంటూ సాయి రాజేష్ సరదాగ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.కానీ, ఇలాంటి వార్తలను తాను చూడలేదని అనసూయ చెప్పింది. సాయిరాజేష్ అందరికీ మంచి చేసే వ్యక్తి అంటూ ఆమే తెలిపింది.. అందుకే రాకింగ్ రాకేశ్ సినిమా విజయం కోసం ఇంత దూరం వచ్చారని సాయిరాజేష్పై ఆమె ప్రశంసలు కురిపించింది. అనసూయ, సాయిరాజేష్ల మధ్య సరదాగ జరిగిన సంభాషణ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు
బుల్లితెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్, సుజాత తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా వారు ప్రకటించారు. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్ సుజాతగా పేరు తెచ్చుకున్న ఆమె బిగ్బాస్ షో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది. అప్పటికే బుల్లితెరపై ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేశ్ రాణిస్తున్నారు. గతేడాది తిరుమలలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.తాము తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకున్నట్లు రాకింగ్ రాకేశ్ తెలిపారు. పండండి పాపకు సుజాత జన్మనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో ఒక అద్భుతం అంటూ.. ' జీవితంలో సగ భాగం అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం' అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: ఓటీటీలో 'గొర్రె పురాణం'.. అధికారిక ప్రకటనబిగ్బాస్తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగానే రాకేష్ చెప్పాడు. అలా 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. -
బిగ్బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
పెళ్లే వద్దన్నాడు.. భార్యతో కలిసి గుడ్న్యూస్ చెప్పిన రాకింగ్ రాకేశ్ (ఫోటోలు)
-
త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - నటి, యాంకర్ జోర్దార్ సుజాత దంపతులు గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నెలలో ఆమె సీమంతం కూడా జరిగింది. అయినా దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఓ వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేసింది. 'ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో షేర్ చేసినా మీరు ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.ప్రెగ్నెన్సీఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. మీరు ఆశీర్వదించినట్లే మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్గానూ ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకూ ఆయనకు నేనే భార్యను కావాలి.ఇంటికి పంపలేదుమా ఇంట్లోని వీణ(తోటి కోడలు).. నన్నెంత బాగా చూసుకుంటుందో! నేను ఏ ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మా ఆయనతో పోటీపడేది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. అక్కడ రోడ్లు సరిగా లేవు, ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు -
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' అనే టైటిల్తో ఒక సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాతగా రాకింగ్ రాకేశ్ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా నుంచి తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ దంపతులు వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఉన్నారు. ఈ పాటను గోరేటి వెంకన్న రచించగా సింగర్స్ మనో, కల్పన, గోరేటి వెంకన్న ఆలపించారు. ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుంది. పాటలో తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతూ సాగడంతో సోషల్మీడియాలో నెటిజన్లు భారీగా షేర్ చేస్తున్నారు. -
హైదర్నగర్లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్' అని ఓ సినిమా తీస్తున్నాడు. అయితే ఇది తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ లేదంటే వేరే ఏదైనా స్టోరీనా అనేది పెద్దగా రివీల్ చేయలేదు. సరే అదంతా పక్కనబెడితే ఈ నవంబరులోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయమై నటుడు-నిర్మాత రాకేశ్ ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) అసలేం జరిగింది? ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మరోవైపు జబర్దస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'(కేశవ్ చంద్ర రమావత్) పేరుతో సినిమా తీస్తున్నాడు. అయితే ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయొద్దని సెన్సార్ ఆపేసింది. ఇప్పుడు దాని గురించే చెబుతూ రాకేశ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలానే కొందరికి తను బినామీగా వ్యవహరిస్తున్నాననే వార్తలపైనా క్లారిటీ ఇచ్చేశాడు. రాకేశ్ ఏమన్నాడు? 'ఈ సినిమాని అనుకున్న టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇది బయోపిక్కా? ఏ జానర్ అనేది రివీల్ చేయడం లేదు. సెన్సార్ వాళ్లకే అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నాను. పబ్లిసిటీకి టైం దొరికిందని అనుకుంటాను. అలానే నాకు ఎవరు డబ్బులిచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. ప్యాషన్ తో ఈ సినిమా తీస్తున్నా. మీరు గౌరవిస్తారని కోరుకుంటున్నాను' అని రాకేశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్
తెలుగులో కామెడీ షో అనగానే చాలామందికి 'జబర్దస్త్' గుర్తొస్తుంది. ఓ సాధారణ కమెడియన్గా ఈ షోలో అడుగుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత టీమ్ లీడర్ రాకింగ్ రాకేశ్ అయ్యాడు. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' సినిమా తీస్తున్నాడు. అయితే ఈ మూవీ తీయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు తనని మోసం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏంటీ సినిమా? కమెడియన్ రాకేశ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టి 'కేసీఆర్' అనే సినిమా తీస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా, ఆయనపై ఇష్టంతో తీస్తున్న సినిమా ఇది అని స్వయంగా రాకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని యాంకర్ అడగడంతో.. తను ఎంతో కష్టపడి, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టేశానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో) మోసం చేశారు! ఈ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు తనకు మాటిచ్చారని, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని రాకింగ్ రాకేశ్ చెప్పుకొచ్చుడ. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేశారని రాకేశ్ చెప్పుకొచ్చాడు. తన భార్య సుజాత.. బ్యాంకులో దాచుకున్న డబ్బులిస్తానని తనకు ధైర్యం చెప్పిందని.. అలానే ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్.. ఇలా చాలా పనుల్ని సుజూత చేస్తూ తనకు అండగా ఉందని రాకేశ్ చెప్పాడు. ఇదిలా ఉండగా కేసీఆర్ సినిమాతో తెలుగు నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్ ఇండస్ట్రీలోకి ఎంటారీ ఇస్తోంది. గరుడ వేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్బాస్?) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!
ఆంధ్రప్రదేశ్లో ఇంకాస్త టైం ఉంది కానీ తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించేశారు. కొన్నిరోజుల్లో నామినేషన్స్, ఎన్నికలు, కౌంటింగ్ అని హడావుడి మాములుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ ప్రకటించాడు. కాకపోతే దానికి 'కేసీఆర్' అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఈ సినిమా సంగతేంటి? మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు 'జబర్దస్త్' కామెడీ షోలోకి వచ్చాడు. అలా కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రాకింగ్ రాకేశ్ అయ్యాడు. మొన్నీ మధ్య హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఆ చిత్రానికే 'కేసీఆర్' అనే టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. టైటిల్ మాత్రమేనా? అయితే ఈ సినిమా పోస్టర్లో కేసీఆర్ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ లుక్ చూస్తుంటే ఆయనదే అనిపిస్తుంది. అలానే కేసీఆర్ అంటే 'కేశవ్ చంద్ర రమావత్' అని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి రాజకీయాలతో సంబంధం ఉందా? లేదంటే హైప్ కోసమే ఆ పేరు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో అమర్కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
గ్రాండ్గా జబర్దస్త్ కమెడియన్స్ రాకేశ్, సుజాతల హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్దీ.. ఫోటోలు వైరల్
జబర్దస్త్ కమెడియన్లు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం జరుపుకోగా తాజాగా పెళ్లిపీటలెక్కారు. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమ హల్దీ వేడుకల ఫోటోలను నూతన వధూవరులిద్దరూ అభిమానులతో పంచుకున్నారు. 'మీ అందరి ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం. ఈ ఆనందం చెప్పలేనిది, రాయలేనిది' అంటూ ఫోటోలు షేర్ చేశారు. తమకు శుభాకాంక్షలు చెప్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ హల్దీ థీమ్లో రాకేశ్, సుజాత ఇద్దరూ పసుపు రంగు బట్టలు ధరించగా వెరైటీ పోజులతో ఫోటోలు క్లిక్మనిపించారు. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) చదవండి: కష్టాలతో సావాసం.. ఫైమా సొంతింటి కల సాకారం -
జబర్దస్థ్ కమెడియన్ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
ఊ అంటావా మావా!
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రేలంగి నరసింహారావుగారి 76వ చిత్రం ఇది. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి’’ అన్నారు ప్రసన్నకుమార్. -
ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ప్రముఖ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అతను సొతంంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేశాడు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. భారీ సంఖ్యలో కస్టమర్లు ఆర్పీ కర్రీ పాయింట్ ముందుకు క్యూ కడుతున్నాడు. ఫలితంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు బిజినెస్ లాభాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆర్పీ తన బిజినెస్ చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కియారా-సిద్ధార్థ్ల సీక్రెట్ డేటింగ్, పెళ్లిపై కంగనా షాకింగ్ రియాక్షన్! తాను నిజాయితిగా కర్రీ పాయింట్ నడిపిస్తున్నానని, ఎవరి ఎన్ని తప్పుడు ప్రచారం చేసిన అది తనకు ప్రమోషన్ అవుతుందంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ఓ పెయిడ్ బ్యాచ్తో తన కర్రీ పాయింట్పై ఆసత్య ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే కమెడియన్ రాకింగ్ రాకేష్ ఆర్పీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ నెట్టింట హాట్టాపిక్గా నిలిచాయి. జబర్దస్త్ షోను నుంచి బయటకు వచ్చాక ఆర్పీ కర్రీ పాయింట్ పెట్టి ఫేమస్ అయ్యాడు కదా? దీనికి కారణం జబర్దస్త్ షోనే అంటారా? అని అడగ్గా.. ‘ఎవరికై సరే ఆ కామెడీ షో భిక్షే. ఎవరూ ఏం చేసిన కూడా అది జబర్దస్త్ భిక్షే’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: సుమంత్తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడైన ఆయనను కలిశారా? అని అడగ్గా.. ‘లేదు.. అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అంటూ పరోక్షంగా ఆర్పీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చాక ఆయన ఫుల్ ట్రోల్ చేశాడు. అక్కడ ఫుడ్ బాగుండదంటూ విమర్శలు చేశాడు. ఇప్పుడు వాటికి పుల్స్టాప్ కూడా పడింది. కానీ ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారని అడగ్గా.. జనాలకు అంతా తెలుసని, ఎవరో ఏదో మాట్లాడారని.. అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడమే ఈ విలువైన సమయం వృధా అనుకుంటున్నానంటూ ఆసక్తికర షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు రాకేష్. -
''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ''.. రిలీజ్ డేట్ ఫిక్స్
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహా రావు దర్శకత్వం వహించారు. కామెడీ హారర్ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. .'ఈ సినిమాను కశ్మీర్, హైదరాబాద్లో షూట్ చేశాం. మంచి అద్భుతమైన కంటెంట్తో తెరకెక్కించాం. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి 76 సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాం.' అని అన్నారు. -
రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
మంత్రి రోజా ఇంట్లో వంటమనిషిగా మారిన రాకింగ్ రాకేశ్!
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ జోర్దార్ సుజాత.. కమెడియన్ రాకింగ్ రాకేశ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే! ఇటీవలే వీరు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కూడా చేశారు. ఆ వీడియోను సుజాత తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇకపోతే నిశ్చితార్థానికి బంధుమిత్రులను పిలిచేందుకు రెడీ అయిందీ జంట. తాజాగా ప్రముఖ నటి, మంత్రి రోజాకు తమ పెళ్లి వార్త చెబుదామని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే రోజా ఏదో మీటింగ్లో ఉండటంతో రాకేశ్ ఆలస్యం చేయకుండా వంటిట్లో దూరాడు. తనే స్వయంగా ఆలూ ఫ్రై వండాడు. రోజా ఇంటికి రాగానే ఆమెకు స్వయంగా వడ్డించాడు. విందు అనంతరం రోజా కాబోయే పెళ్లికూతురు సుజాతకు పట్టుచీర పెట్టారు. ఆ తర్వాత ఆ జంటను తన కారులో తిరుపతి కొండకు తీసుకెళ్లారు. 'మేడమ్ మమ్మల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం దగ్గరుండి తిరుపతి కొండకు తీసుకెళ్లడం ఎన్నో జన్మల అదృష్టం' అంటూ మురిసిపోయాడు రాకేశ్. ఇక ఈ వీడియోను చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. చదవండి: నోరు అదుపులో పెట్టుకోకుంటే బాలయ్యకు గుణపాఠం చెప్తాం -
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు షోస్లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటీ కాబోతున్నారు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈనెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. -
దుబాయ్లో గ్రాండ్ గా ‘జోర్దార్’ సుజాత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జోర్దార్గా రాకింగ్ రాకేశ్ ప్రియురాలి బర్త్డే సెలబ్రేషన్స్
తెలంగాణ యాసలో జోర్దార్గా మాట్లాడే సుజాత గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో! మొదట్లో సుజాత ఆన్లైన్ మార్కెటింగ్లో ఉద్యోగం చేసింది. తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ వస్తుందంటే తన అదృష్టం పరీక్షించుకుందామని దానికి ట్రై చేసింది. ఆమె యాస నచ్చడంతో షో నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ హిట్ కావడం.. గలగలా మాట్లాడే సుజాతను ప్రేక్షకులు జోర్దార్ సుజాతగా అక్కున చేర్చుకోవడం చకాచకా జరిగిపోయాయి. యాంకర్గా తనేంటో నిరూపించుకున్న సుజాత తర్వాత బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. అనంతరం ఓ కామెడీ షోలోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాకింగ్ రాకేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అవును, ప్రేమలో పడ్డామని అంగీకరించారు. ఇక రాకేశ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ సుజాత ఉండాల్సిందే! అంతలా కలిసిపోయారిద్దరూ.. ఇటీవల వీరిద్దరూ విదేశీ విహారయాత్రకు వెళ్లారు. దుబాయ్లో సుజాత బర్త్డే(డిసెంబర్ 29) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ లవ్ బర్డ్స్. ఇందులో ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: బాలీవుడ్ నటుడు సతీష్ షాకు జాతి వివక్ష హీరో కాకపోయుంటే ఆ పని చేసేవాడిని : ప్రభాస్ -
తిండి లేక ఫ్యామిలీ అంతా పస్తులున్నాం: రాకింగ్ రాకేశ్
కామెడీ స్కిట్ల ద్వారా బుల్లితెరపై నవ్వులు పంచుతున్నారు రాకేశ్ - జోర్దార్ సుజాత. ఆన్స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా వీరిద్దరూ జంటపక్షులన్న విషయం తెలిసిందే!రాకేశ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ వాలిపోతోంది సుజాత. అయితే ముందుగా సుజాతే తనను ఇష్టపడిందంటున్నాడు రాకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'పెళ్లంటే నాకు మంచి అభిప్రాయం లేదు. అసలు పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నాను. పెళ్లి చేసుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతానని బెదిరించింది అమ్మ. కానీ ఎప్పుడైతే సుజాత పరిచయమైందో అప్పుడు నా అభిప్రాయం మారింది. ముందుగా ఆమె నన్ను ఇష్టపడింది. ఇంట్లోవాళ్లకు కూడా నచ్చింది. అలా మా ప్రేమ ముందుకు సాగింది. నా కెరీర్ ఎలా ప్రారంభమైందంటే.. అవకాశాల కోసం వరంగల్ వదిలి హైదరాబాద్ వచ్చాను. 11 ఏళ్లు ఎన్నో ఆఫీసులు తిరిగాను. మొదట్లో మిమిక్రీ ప్రోగ్రామ్లు చేసుకునేవాడిని. మిమిక్రీ చేశాక పేమెంట్ ఇచ్చేదాకా వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం. సరిగ్గా చేయలేదని రూ.500 ఇచ్చినా అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కమెడియన్ స్థాయికి వచ్చాను. ధనరాజ్ నన్ను కామెడీ షోకి తీసుకెళ్లడం వల్లే నేనిప్పుడు మీ ముందు నిలబడ్డాను. రేలంగి నరసింహారావు డైరెక్షన్లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పుడింత గుర్తింపు, డబ్బు ఉంది కానీ ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు. ఒక్కోసారి అమ్మ పస్తులుండి మాకు తిండిపెట్టేది. అలా చాలా కష్టాలు పడ్డాం. అవన్నీ దాటుకుని ఇక్కడిదాకా వచ్చాను. అప్పుడప్పుడూ నేను శ్మశానానికి వెళ్లి అక్కడే పడుకుంటాను. అక్కడ నాకు ఎక్కడలేని ప్రశాంతత దొరుకుతుంది' అని చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేశ్. చదవండి: ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు -
జోర్దార్ సుజాతను స్మశానానికి తీసుకెళ్లి పరీక్ష పెట్టిన రాకింగ్ రాకేశ్!
నాన్స్టాప్ మాటలతో అందరినీ ఆకట్టుకునే యాంకర్ జోర్దార్ సుజాత ఆమధ్య బిగ్బాస్ షోలో సందడి చేసింది. నాలుగో సీజన్లో పాల్గొన్న ఆమె కింగ్ నాగార్జుననే బిట్టు అని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలలో ఎక్కువగా కనిపిస్తోంది. కమెడియన్ రాకింగ్ రాకేశ్తో లవ్లో పడ్డ సుజాత పెళ్లికి ముందే అతడి ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా చేసిన విషయం తెలిసిందే! తమ ప్రేమను బాహాటంగానే బయటపెట్టిన ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేటప్పుడు ఆ భగవంతుడు నాకెన్నో పరీక్షలు పెట్టాడు. కానీ నువ్వు స్మశానానికి తీసుకెళ్లి నాకు పరీక్ష పెట్టావు అంటూ ఎమోషనలైంది. నాకు కోట్లాది రూపాయలు కావాలి, కార్లల్లో తిప్పాలి అని నేను అడగను, కానీ నా కన్నీళ్లను తుడవడానికి జీవితాంతం నా పక్కనుంటే చాలు అంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో రాకేశ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు. ఇది చూసిన జనాలు ఇంతకీ రాకేశ్ స్మశానానికి తీసుకెళ్లి ఏం పరీక్ష పెట్టి ఉంటాడు? అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని విషయాలు అడ్డంగా దొరికిపోయిన శ్రీసత్య, బండారం బయటపెట్టిన నాగ్ -
స్టేజ్పైనే ప్రియుడికి ముద్దుపెట్టిన జోర్దార్ సుజాత
తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జోర్దార్ సుజాత. బిగ్బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవలె రాకింగ్ రాకేశ్ అనే కమెడియన్తో ప్రేమలో పడింది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లోనూ నడుస్తుంది. ఇప్పటికే తమ ప్రేమ గురించి బహిరంగంగానే మాట్లాడిన ఈ జోడీ తాజాగా మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. ఓ షోపై వీరి జంట సందడి చేసింది. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తమది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేశ్ మాటలకు ఫిదా అయిన సుజాత స్టేజ్పైనే అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. -
పెళ్లికి ముందే అత్తారింట్లో జోర్దార్ సుజాత వరలక్ష్మి వ్రతం!
తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది జోర్దార్ సుజాత. అదే యాసలో యాంకరింగ్ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ కామెడీ షోలోనూ చేరి మరింతమందికి జనాలకు చేరువైంది. అదే సమయంలో ఆ కామెడీ షోలోని హాస్య నటుడు రాకింగ్ రాకేశ్తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా ఇరువురూ పలుమార్లు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకున్నారు కూడా! అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సుజాత ఓ సర్ప్రైజింగ్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరలక్ష్మి వ్రతం చేశానోచ్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. సాధారణంగా పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్లైనవాళ్లు వారి భర్త బాగుండాలని ఈ పూజ చేస్తారంటూ వ్రతం విశేషాన్ని చెప్పుకొచ్చింది. అయితే సుజాత మాత్రం ఈసారి ఏకంగా కాబోయే అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. రాకింగ్ రాకేశ్ ఇంట్లో అత్తయ్యతో కలిసి పూజలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ వ్రతాన్ని ఇంత గ్రాండ్గా ఎప్పుడూ చేసుకోలేదని సంతోషం వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చినవాళ్లందరికీ వాయినం కూడా ఇచ్చానంటూ మురిసిపోయింది. అత్తయ్య.. ఇంట్లో అమ్మవారికి చీర కట్టినదగ్గర నుంచి ఫలహారాలు చేయడం వరకూ అన్నీ తానే దగ్గరుండి చూసుకుందంటూ ఆమె గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: బిగ్బాస్ 6.. ఇప్పటివరకు ఫైనల్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే! -
జబర్దస్త్ రాకేష్ ఇంట్లో పెళ్లి సందడి
-
సుశాంత్తో త్వరలో కొత్త చిత్రం
వర్ధమాన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాకవరపాలెం: వైవిద్య కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభించనున్నట్టు వర్ధమాన సినీ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. దసరాకు స్వగ్రామం బయ్యవరం వచ్చిన ఆయన, నర్సీపట్నంలో ఓ కార్యక్రమానికి వచ్చిన హాస్యనటుడు రా కింగ్ రాకేష్తో కలిసి ‘సాక్షి’ విలేకరితో కాసేపు మాట్లాడారు. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని, కన్నడ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఇందులో సీనియర్ న టుడు రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తారన్నారని శ్రీనివాస్ చెప్పారు.ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్తో కథ ఉంటుందని, వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. తన మొదటి చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య చిత్రాలు’ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని గుర్తుచేశారు. హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా..: హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా కమెడియన్ అయ్యా నని రాకింగ్ రాకేష్ చెప్పారు. కమెడియన్గా, మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపురావడం ఆనందంగా ఉందన్నారు. నిత్యం బిజీగా ఉండే తాను ఇలా పల్లెటూరుకు రావడం కూడా సంతోషంగా ఉందన్నారు. బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నానన్నారు. ప్రస్తుతం లక్ష్మీబాంబు, పెళ్లికిముందు ప్రేమకథ, శరభతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానన్నారు. శరభ తెలుగు, తమిళంలో కూడా తానే కమెడియన్గా చేస్తున్నానని తెలిపారు. ఓ మంచి హాస్య నటుడిగా పేరుతెచ్చుకోవడమే లక్ష్యమన్నారు.