sujatha
-
ప్రక్షాళన
‘ఆర్య బావ ఫోన్ చేశాడు నాన్నా, ఈవేళ మధ్యాహ్నం రెండుగంటల బస్సుకి వస్తున్నాడట!’బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అంకిత్ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది. మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపూ, జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది.పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారంలాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త! పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషప్పురుగు కుట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్య దారిలోనే ప్రాణాలు పోయాయని! నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది. అమ్మ శోకాలు మొదలెట్టింది. విషయం తెలిసి పరామర్శకి వచ్చిన చుట్టపక్కాలంతా ‘పుడుతూనే తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు’ అంటూ నా మేనల్లుడిని దూషిస్తుంటే వినలేకపోయాను. పసివాడిని హత్తుకుంటూ ‘ఆపండి! పసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తోంది’ అంటూ వాళ్ళందరి నోర్లూ మూయించింది నా భార్య సుజాత. ఆ తర్వాత నాతో ‘మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి’ అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకి కదిలేను. టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము.భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క. తనతో పాటే అమ్మ కూడా! అది చూసి, వయసులో చిన్నదైనా తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని, బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత. దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని, బాబుని తీసుకొని తిరిగొచ్చేశాము.బావ చనిపోయిన ఆరుమాసాలకి ‘రామం, ఒక్కమారు ఊరికి వెళ్లి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా! ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనల్లుడి పేరున రిజిస్టర్ చేయించుకునిరా’ అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా!‘అమ్మా! బావ వాళ్లకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు, పంపకాల గురించి మాట్లాడ్డానికి!’ అన్న నా మాటలకి, వెంటనే ‘అదేం మాటరా? ఇల్లూ, రెండెకరాల పొలమూ లేవూ! మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆ ఆస్తి మొత్తానికీ హక్కుదారు వీడేగా! మనం వెళ్లి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది’ అంది అక్క.‘అది చెప్పేదీ నిజమేరా, దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయమాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు’ ఆర్డర్ వేసింది అమ్మ. మరుసటి రోజే బావ వాళ్లూరికి ప్రయాణమయ్యాను.వాళ్ళింట్లో నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ కూర్చున్న మూడుగంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులని అంచనా వేస్తూనే వుంది. పెచ్చులూడుతున్న గోడలూ, పై పెంకుల మధ్యనుండి తొంగి చూస్తున్న మబ్బుతునకలూ, వాటిగుండా కిందకి జారుతున్న వానచినుకులూ, ఇంకా ఆ అక్కాచెల్లెళ్ళ చిరుగుల బట్టలూ.. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కళ్ళెదుట నిలిచినట్టనిపించింది. ఉన్న ఆ రెండు ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకీ, ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికే అరకొరగా సరిపోతోందేమో!భోజనాల అనంతరం ఆ పెద్దావిడ ‘కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతురిని పుట్టింటికి పంపించేస్తే, రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు’ అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు. పాతికేళ్లు నిండిన చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నేను బతికుండగా దీని పెళ్లి చూస్తానో, లేనో’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆ మాటలకి ‘అధైర్యపడకండి. మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి’ అంటూ ఓదార్చాను. బావ బాధ్యతలను పంచుకోని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను. ఒట్టి చేతులతో నేనలా వెనక్కొచ్చేయడం అమ్మకి, అక్కకి బొత్తిగా నచ్చలేదు. సుజాత మాత్రం ‘మంచి పని చేశారు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని బాధపెట్టడం మనకి శ్రేయస్కరం కాదు’ అంది.రెండేళ్ళ తర్వాత మాకూ బాబు పుట్టాడు. అంతదాకా ‘బాబూ’ అని పిలుస్తున్న నా మేనల్లుడికి ‘ఆర్య’ అనీ, నా కొడుక్కి ‘అంకిత్ ’ అనీ నామకరణం చేసి, ఇద్దరినీ రెండు కళ్ళలా చూసుకోసాగాం. వాళ్ళిద్దరూ బావామరుదులే అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండడంతో కుట్టుపనులు చేస్తూ, చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత. ఆర్య పదవ తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఇంటర్లో కామర్స్ తీసుకుంటానన్న రోజున, అక్కయ్య ‘లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజినీరింగు చేస్తే లక్షల్లో సంపాదన వుంటుంది. జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు’ అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది. ‘పిల్లలకి ఆసక్తిలేని చదువులని వాళ్ళపై రుద్దడం మంచిది కాదు అక్కయ్యా! వాడికిష్టమైన కామర్సు చదివి, ఆపైన బ్యాంకు పరీక్షలు రాసి, పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడులెద్దూ’ అంటూ నచ్చజెప్పి వాడిని కామర్సు గ్రూపులో చేర్పించాను.ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్ పదవ తరగతి పూర్తయింది. నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూర్లోని బడికి బదిలీ అయింది. పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి, నేనొక్కడినే వెళ్లాను. ఆర్యని డిగ్రీ కాలేజీతోపాటు బ్యాంకు పరీక్షల కోచింగ్ సెంటర్లోనూ చేర్చాను. అలాగే అంకిత్ని వాడి ఇష్టప్రకారం ఇంటర్ సైన్సు గ్రూపులో చేర్పించి, ఎంసెట్ కోచింగులో పెట్టాను. ఏడాదిన్నర కాలం ఏ సమస్యలూ లేకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్! దానికి మించిన దుర్వార్తని మరో ఆరునెలల్లో వినాల్సి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.ఆ దుర్దినాన.. అల్మారా అంతా కిందా మీదా చేస్తున్న నన్ను చూసి ‘దేనికోసమండీ, అంతలా వెతుకుతున్నారు?’ అడిగింది సుజాత.‘అంకిత్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. అవసరాలకెప్పుడూ ఆదుకునే షావుకారు, ఈమారు పెద్దమొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు. వాటి కోసం వెతుకుతున్నాను’ అన్నాను.‘ఆ మధ్యెప్పుడో అత్తయ్యగారు, వదినగారు ఆ పత్రాలని తీసుకున్నారండీ. మళ్లీ ఇక్కడ పెట్టారో, లేదో! ఉండండి, వదినగారిని అడుగుతాను’ అని సుజాత అంటుండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ‘ఏమిటిరా, ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరానా పడుతున్నారు?’ అడిగింది.‘ఇంటిపత్రాల కోసం అక్కయ్యా ..’ అని చెబుతుండగానే ‘అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని, వాటితో నీకేం పనిరా ఇప్పుడు?’ అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది.‘హమ్మయ్య, ఇంటి దస్తావేజులు ఎక్కడికీ పోలేదన్నమాట. అవి కనబడకపోయేసరికి కంగారేసింది అక్కా. నీ మేనల్లుడి ఇంజినీరింగ్ అడ్మిషన్ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టక తప్పడం లేదక్కా’ అన్నాను.నా మాటలకి అక్కయ్య కళ్ళలో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపైన కొద్దిసేపు అక్కయ్య ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత మెల్లగా ‘అది కాదురా తమ్ముడూ, అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది. తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరమొస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా’ అన్న అక్కయ్య మాటలకి నేను, సుజాత దిగ్భ్రాంతి చెందాము.‘అమ్మ అలా చేసిందా? ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా..’ నా మాట పూర్తి కాకుండానే ‘ఏమోరా, అవన్నీ నాకు తెలియదు’ అనేసి అక్కయ్య వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేనూ, సుజాతా చేష్టలుడిగిపోయాము. ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి! నా మేనల్లుడిని నా కొడుకుతో సమానంగానే కదా చూశాను. వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా? నేను గానీ, సుజాతగానీ ఎన్నడైనా అక్కని, ఆర్యని పరాయివాళ్ళుగా చూశామా? నా జీతమంతా ఈ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసమే కదా వెచ్చించాను. అమ్మకివన్నీ తెలియవా? పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా.. అక్కయినా అమ్మని వారించి ఉండాల్సింది కదా! సర్లే , జరిగిందేదో జరిగిందనుకుని సర్దిచెప్పుకుందామనుకున్నా, కనీసం ఇప్పుడైనా ఇంటిపత్రాలని తెచ్చిచ్చి ‘ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా, వెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకురా’ అనాలి కదా అక్కయ్య! మరిదేమిటి, అలా వెళ్ళిపోయింది? మనసంతా భారమవగా నిస్సత్తువగా మంచంపై కూర్చుండిపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే, మెట్టినింట్లో ‘అందరూ నా వాళ్లే’ అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో! ఆ ఆలోచనతో గభాల్న తలెత్తగా.. కళ్ళనీళ్ళతో కనిపించిన సుజాతని చూసి చలించిపోయాను. లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోపెట్టాను. ‘బెంగపెట్టుకోవద్దు సుజా.. నా పీఎఫ్లో కొంత డబ్బుంది. అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వేం దిగులు పెట్టుకోకు’ అంటూ భరోసా ఇచ్చాను.నా మాటలు వింటూనే సుజాత భోరున ఏడ్చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా చలించకుండా, దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరకి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. దుఃఖభారం ఉపశమించే దాకా తనని అలాగే ఏడవనిచ్చాను. కొంతసేపటికి తేరుకున్న సుజాత ‘నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండీ! అదేమంత పెద్దవిషయమని? నా నగలను కుదువపెట్టినా, లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది. కాని, ఇన్నేళ్లుగా మనతోనే మసలుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తోంది. మన అనుకున్నవాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండీ! మనది కాని ఈ ఇంట్లో ఉండేందుకు నాకెంత మాత్రం మనస్కరించడం లేదు. మీతో పాటు వచ్చేస్తానండీ’ అంది దీనంగా.‘అలాగే సుజా, ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తిచేసి వాడ్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. కాకపోతే నాదొక విన్నపం.. ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కల్మషమైన వారి మనసుల్ని పాడు చేయొద్దు. దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం, ప్లీజ్’ అన్నాను తన రెండుచేతులూ పట్టుకుని. సరే అన్నట్టుగా తలూపింది సుజాత. ఆ తర్వాత అక్కకీ, నాకూ మధ్య మాటలూ, రాకపోకలూ ఆగిపోయాయి. పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆర్యని చూసేందుకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది.‘మావయ్యా..’ అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పర్శకి ఆలోచనల నుండి బైటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ‘ఇన్నాళ్ళకి ఈ మావయ్యని చూడాలనిపించిందటరా’ అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా.‘అదేం మాట మావయ్యా? ఎన్నోసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది, కాని ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది. అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకి నేను సెలెక్టయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్యా. మరో నెలలో ట్రైనింగ్కి వెళ్ళాలి’ అంటూ నా నోట్లో మైసూరుపాకు కుక్కాడు ఆర్య.అదే ఊపులో వంటింట్లోకి వెళ్లి ‘అత్తయ్యా’ అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు. వాడి పట్ల సుజాతదీ మాతృవాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరికి తీసుకుంది.‘ట్రైనింగ్ పూర్తయాక పోస్టింగు విజయవాడలోనే ఇస్తారనుకుంటా. అప్పటికి మావయ్యక్కూడా విజయవాడకి బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒక్కచోటే ఉండొచ్చు కదత్తయ్యా’కల్లాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది.ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదరువులే ఉండడం చూసి ‘అత్తా, ఈ రుచి ఇంకెక్కడా దొరకదు’ అంటూ ఆవురావురని ఆరగించాడు. ఆ తర్వాత అంకిత్తో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ ‘మావయ్యా , ఇది మీకివ్వమని ఇచ్చింది అమ్మ’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్ కవరుని నా చేతిలో పెట్టాడు. నేనూ, సుజాతా ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము. తెరిచి చూస్తే అందులో సీల్ చేసిన పెద్ద ఎన్వలప్, ఒక ఉత్తరం కనిపించాయి. ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలెట్టాను..‘తమ్ముడూ! ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటాని ఆశ్చర్యపోతున్నావు కదూ! నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ. తండ్రిలేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థంలేని శంకతో, అంతకు మించిన ధనాశతో అమ్మని ప్రేరేపించి, చేయకూడని తప్పే చేశాను. బావ చనిపోయిన నాటినుండి నన్నూ, నీ మేనల్లుడినీ ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకూ, సుజాతకూ ఆజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను. ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్ రూపంలో దహించేస్తోంది.’‘క్యాన్సర్’ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను. అది చూసి సుజాత గభాల్న నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది..‘నమ్మకద్రోహం చేసిన నన్ను, తోబుట్టువే కదాని మంచి మనసుతో నువ్వు క్షమించేసినా, పైనున్న ఆ భగవంతుడు శిక్షించక మానడుగా! బ్లడ్ క్యాన్సర్తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. అందుకు బాధ లేదు. కాని, నీ మేనల్లుడిని ఒంటరిని చేసి వెళ్తున్నానే దిగులు మాత్రం తొలిచేస్తోంది. ఇన్నాళ్ళూ తండ్రిలేని లోటు తెలీకుండా పెంచిన నువ్వూ , సుజాతా ఇకపై వాడికి తల్లి లేని లోటూ తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట! ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి. ఈ చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞురాలిని. చిన్న కోరిక తమ్ముడూ! నా చివరి రోజులని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా! నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయల్దేరుతున్నాను. కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్తున్నాను. మిమ్మల్ని చూడాలని, మీ నీడన చేరాలని మనసు ఆరాటపడుతోంది. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ! ఇట్లు మీ అక్కయ్య!’ ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటున వేణుగోపాలస్వామి ఆలయం వైపు వెళ్ళాను, నాతోపాటే సుజాత కూడా! అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను. చిక్కిశల్యమైంది. మాకు కన్నీళ్లాగలేదు. మమ్మల్ని చూసి భోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం. ‘మహాపరాధం చేశాను. ఫలితంగా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతున్నాను’ అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సుజాత.‘మీకేం కాదు. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. అన్ని జబ్బులనూ నయం చేయలేకపోయినా, తీవ్రతను తగ్గించి, ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కనిపెడుతూనే వున్నారు. ధైర్యంగా వుండండి. పదండి ఇంటికి వెళ్దాం’ అంది సుజాత.‘అవును అక్కయ్యా! నీకేం కాదు’ అని నేనంటూండగానే అక్కయ్య సెల్ మోగింది. ఫోన్ తీసిన అక్కయ్య.. నిలబడే ఓపిక లేక అక్కడే మెట్లపై కూర్చుంది. ఫోన్ తెరపై‘డాక్టర్ సునీల్’ అన్న పేరు కనబడగానే ఆత్రంగా ఆ ఫోన్ అందుకుని ‘డాక్టర్ గారూ! మా అక్కయ్య ఆరోగ్యం ఎలా వుందో వివరంగా చెప్పండి ప్లీజ్, నాకు చాలా కంగారుగా వుంది’ అన్నాను.‘మీ అక్కయ్య టెస్టు రిపోర్టులని నిన్ననే మరో స్పెషలిస్ట్కి చూపించాం. ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్ కాదనీ, కేవలం బ్లడ్ డిజార్డర్ మాత్రమేనని కచ్చితంగా చెబుతున్నారు. అయినా చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి, మరోమారు బోన్ మ్యారో టెస్ట్ చేయిస్తే మంచిది’ చెప్పాడు డాక్టర్. ఆ మాట వింటూనే ‘మా చెవుల్లో్ల పాలు పోశారు డాక్టర్ గారూ! రేపే ముంబైకి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తాను. థాంక్యూ’ అని ఫోన్ పెట్టేసి, ‘చూశావా అక్కయ్యా! నీకే జబ్బూ లేదు. అనవసరంగా భయపడిపోయి మమ్మల్నీ భయపెట్టావు’ అన్నాను హాయిగా నవ్వేస్తూ.‘పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బహుశా, ఇదంతా నా మనసుని ప్రక్షాళనచేసి, నన్ను మీ వద్దకి చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో!’ అంటూ రెండు చేతులూ ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య. ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది. ‘శుభం! సాక్షాత్తూ ఆ వేణుగోపాలస్వామే అభయమిచ్చాడు, ఇంకేం భయం లేదు’ అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళనా మటుమాయమవగా ఆనందంగా ఇంటికి బయల్దేరాం! -
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
బాల్యం ఇక్కడ సేఫ్
సమస్యలు చూసి ‘అయ్యో!’ అనుకునే వాళ్లు కొందరు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించేవారు కొందరు. సూరేపల్లి సుజాత రెండో కోవకు చెందిన యాక్టివిస్ట్. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ‘శాతవాహన యూనివర్సిటీ’లో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. ప్రాఫెసర్గా క్లాసు నాలుగు గోడలకే పరిమితం కాలేదు. పర్యావరణ సమస్యల నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో ఉద్యమాలలో భాగం అయింది. తన గళాన్ని గట్టిగా వినిపించింది. ‘సేఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది...హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో 2021లో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసన తెలియజేసేందుకు సుజాత అక్కడి మురికివాడకు వెళ్లింది. ఆ బస్తీలో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పేదలను చూసి చలించిపోయింది. సాయంత్రమైతే ఆ బస్తీలో గంజాయి, మద్యం, మత్తుపదార్థాల వరద పారుతుంది. ‘ఇలా ఎందుకు?’ అని తెలుసుకోవడానికి ఆరునెలలపాటు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల కార్మికులుగా చేస్తున్న తీరును గమనించి స్కూల్ పిల్లల్ని డ్రాపౌట్స్గా మారకుండా చూడడంపై దృష్టి పెట్టింది.మత్తు పదార్థాల ప్రభావం చిన్నారులపై పడకుండా, వారి భవిష్యత్ను కాపాడడం కోసం రంగంలోకి దిగిన సుజాత మొదటి అడుగుగా చిన్న స్థలాన్ని చూసి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి ‘సావిత్రి బాయి పూలే స్టడీ సెంటర్’గా నామకరణం చేసింది. ఒకటితో మొదలైన స్టడీ సెంటర్ల సంఖ్య పదిహేనుకు పెరిగింది.మూడు అంగన్ వాడీ కేంద్రాలు, మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడువందల మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో సాయంత్రం చదువుకోవడానికి వస్తారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్టైం టీచర్లుగా పనిచేస్తున్నారు. డ్రాపౌట్లను తగ్గించడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పిల్లల మానసిక వికాస అభివృద్ధి, పౌష్టికాహార లోపం అధిగమించడంపై ఈ విద్యాకేంద్రాలు దృష్టి పెట్టాయి.సింగరేణి కాలనీలో అంతా చెత్త ఏరుకుని బతికే పేదలే. వారి పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్తారు. నాలుగో తరగతి వరకు చదివించి ఆపై ఆపేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పిల్లలు పై చదువులు చదవడానికి ‘సావిత్రిబాయి పూలే సెంటర్’ల ద్వారా విశేష కృషి చేస్తోంది సుజాత.పదవ తరగతి చదివే పిల్లలకోసం బ్రేక్ఫాస్ట్ (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) అందించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చి ఆ ఏడాది ఉత్తీర్ణతా శాతాన్ని పెంచింది. ఏటా పిల్లల కోసం సమ్మర్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల నుంచి ఆత్మరక్షణ విద్య, సైన్స్ ప్రాజెక్ట్ల వరకు ఈ క్యాంప్లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మత్తు పదార్థాల దుష్ప్రభావంపై అవగాహన కలిగించడం మరో కీలక అంశం.తొలిసారిగా తాను ఆ మురికివాడలో అడుగు పెట్టినప్పటితో పోల్చితే విద్యార్థుల చదువుకు సంబంధించి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమిస్తే వచ్చిన మార్పు. ‘తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తీసుకు వస్తే పిల్లల భవిష్యత్కు బంగారుబాట వేయవచ్చు’ అని నిరూపించిన మార్పు. – భాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్సమాజంలోని అవలక్షణాలను వదిలించి, మనిషి సన్మార్గంలో నడిచేలా పనిచేయడమే మా లక్ష్యం. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత -
వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు. భయంతో వైద్యం ఎలా చేస్తారు?కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు? రోగుల సహాయకులను నియంత్రించాలిప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
సింగర్ సుజాత మోహన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
అప్పట్లో వైఎస్ఆర్ పెట్టిన గొప్ప పథకం. ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారు
-
హైదర్నగర్లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు..
కరీంనగర్: కొత్త ఏడాది సందర్భంగా దైవదర్శనం కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొని మృత్యువాత పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకేంద్రంలోని మహాలక్ష్మీనగర్కు చెందిన సామ సుజాతరెడ్డి, హేమేందర్ రెడ్డి దంపతులు. సుజాతరెడ్డి (45) గృహిణి. సోమవారం ఉదయం పొలాస గ్రామంలోని పౌలస్తేశ్వరస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై బయల్దేరింది. జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి వెళ్దుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సుజాత తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందింది. రూరల్ సీఐ ఆరీఫ్అలీఖాన్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చారు. హేమేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. సుజాతరెడ్డికి ఒకే కూతురు సంతానం. ఆమె విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెల్సింది. ఇవి చదవండి: 'అమ్మా.. ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాను.. నీతోనే ఉంటానని' అనంత లోకాలకు -
చిరంజీవి పక్కన హీరోయిన్గా, చెల్లిగా, తల్లిగా కనిపించిన నటి!
హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల పాత్రలు చేస్తుంటారు. తొలినాళ్లలో హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత తల్లిగా, వదినగా.. వయసు మీద పడే కొద్దీ పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోతూ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా అందుకు అతీతం కాదు. అయితే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక సినిమాలకు ముగింపు పలికినవాళ్లూ ఉన్నారు. ఇకపోతే చిరంజీవితో స్టెప్పులేసి హీరోయిన్గా వెలుగు వెలిగి తర్వాత క్రమంలో చెల్లి, అమ్మగా నటించిన సీనియర్ నటి ఎవరో తెలుసా? సుజాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన సుజాత దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్లో ప్రేమతరంగాలు అనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది. ఇందులో చిరుకు జోడీగా నటించింది సుజాత. రెండేళ్ల తర్వాత 1982లో సీతాదేవి చిత్రంలో చిరుకు చెల్లిగా యాక్ట్ చేసింది. ప్రేయసి కాస్తా చెల్లెలు అయిపోయిందేంటి? అనుకుంటున్న సమయంలో ఏకంగా మెగాస్టార్కు తల్లిగా మారిపోయింది నటి. 1995లో బిగ్బాస్ మూవీలో చిరు తల్లిగా కనిపించింది. చిరుకు చెల్లెలిగా నటించి రొమాంటిక్ స్టెప్పులేసినవారు ఉన్నారు కానీ ఇలా హీరోయిన్, చెల్లి, అమ్మ.. అన్ని రకాల పాత్రలను పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం. నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న కన్నుమూసింది. ఇకపోతే ప్రేమతరంగాలు సినిమాలో డ్యాన్సర్గా నటించిన జయసుధ రిక్షావోడు చిత్రంలో చిరుకు తల్లిగా నటించింది. చదవండి: ఇదేందిది.. ఇది ప్రభాస్ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్.. బాహుబలి నిర్మాత సీరియస్ -
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్ను అరెస్ట్ చేశారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో.. పోలీస్స్టేషన్ ఆవరణలో యువతి ఒక్కసారిగా..
ఆదిలాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇచ్చోడ పోలీస్స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ముసాయిపేట్కు చెందిన సుజాత (28), ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్కాలనీకి చెందిన చందల హరీశ్కుమార్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. హైదరాబాద్లో చదువుతున్న సమయంలో వీరు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండడంతో 2022 మార్చిలో ప్రియుడు ఇంటి వద్ద సుజాత భైఠాయించింది. ఈ క్రమంలో హరీశ్ తల్లిదండ్రులు నిర్మల్కు మకాం మార్చారు. దాదాపు 18 నెలల నుంచి సుజాత తన సమీప బంధువులతో కలిసి ప్రియుడు హరీశ్కుమార్ ఇంట్లో ఉంటోంది. ఆదివారం ఇరువర్గాల కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించారు. ఈ వివరాలను ఇచ్చోడ పోలీస్స్టేషన్లో వెల్లడించానికి వెళ్లారు. పెళ్లికి హరీశ్కుమార్ నిరాకరించడంతో యువతి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. వెంటనే స్థానిక ఎస్సై నరేశ్ పోలీసు వాహనంలో పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రసుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సై వివరణ కోరగా ఇరువర్గాల కులపెద్దలు పోలీస్స్టేషన్ బయట మాట్లాడుకున్నారు. హరీశ్కుమార్ పెళ్లికి నిరాకరించడంతో పోలీస్స్టేషన్ గేటు బయట సుజాత పురుగుల మందు తాగినట్లు తెలిపారు. -
TS Election 2023: అరుపులు, కేకలతో గందరగోళ పరిస్థితి.. ‘కంది’ పై సస్పెండ్ ప్రకటన..
ఆదిలాబాద్: కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. జిల్లాలో హస్తం పార్టీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో లొల్లి రచ్చకెక్కింది. పట్టణంలోని విద్యుత్ తరంగిణి భవన్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారడమే ఇందుకు నిదర్శనం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ సినీయర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత్రావు సమక్షంలో పార్టీ ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, పార్టీ సీనియర్ నేత గండ్రత్ సుజాత వర్గీయులు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన వర్గీయులు గేటు దూకి తాళాన్ని పగులకొట్టగా.. శ్రీనివాసరెడ్డి బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్లారు. సభహాలులోకి వస్తుండగా మరోసారి సుజాత, సాజీద్ఖాన్ వర్గీయులు గేటు మూసివేయడంతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు తోసుకుని లోపలకు వెళ్లారు. తమ నాయకుడిని వేదికపైకి పిలువాలంటూ వీహెచ్తో వాగ్వాదానికి దిగారు. బెంచీలను గట్టిగా చరుస్తూ నినదించారు. మరోవర్గం కార్యకర్తలు వారిని అడ్డుకునే యత్నం చేయగా ఇరువర్గాల అరుపులు, కేకలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందోరగోళ పరిస్థితి. ఈ క్రమంలో వీహెచ్ శ్రీనివాస రెడ్డిని వేదికపైగా పిలువగా వచ్చి కూర్చున్నారు. అయినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తగ్గలేదు. ఓ క్రమంలో నేతలపై దాడిచేసినంత పనిచేశారు. వీహెచ్ మెడలోని కండువాను శ్రీనివాసరెడ్డి వర్గీయుడు లాక్కోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ క్రమంలో వీహెచ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా ఆందోళన కొనసాగించడంతో చేసేదిలేక వీహెచ్తో సహా నేతలంతా బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడే వేచి చూసిన శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో కలిసి బయటకు వెళ్లారు. కాగా వీహెచ్కు వ్యతిరేకంగా ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగా వీహెచ్ ప్రసంగించారు. సీఆర్ఆర్కు నివాళి.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు నివాళులర్పించారు. శాంతినగర్లోని సీఆర్ఆర్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన వెంట ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్ , డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి.. దేశవ్యాప్తంగా బీసీల గణనను నిర్వహించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని వీహెచ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో పాటు పిల్లల చదువులు, స్కాలర్షిప్ అందేలా రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. దేశంలో 52శాతం, రాష్ట్రంలో 54శాతం జనాభా కలిగిన బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్ని బీసీ కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. అలాంటి వారికి బీసీ రిజర్వేషన్లు తోడ్పడనున్నాయన్నారు. రాహుల్గాంధీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించిన న్యాయవ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. దేశంలో రాహుల్ హవా నడుస్తుందని కేంద్రంలో ఆయన ప్రధాని కావడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అది ఖరారు కాకముందే బౌన్సర్లతో వచ్చి దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని కంది శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు. అమెరికా నుంచి ప్రజాసేవ చేసేందుకు వచ్చిన వ్యక్తి అందరినీ కలుపుకుని పోవాలే తప్ప బౌన్సర్లతో ఇతర నేతలపై దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. -
బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు నటి 'సుజాత' జీవితం ముగిసిందా?
టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. పాత తరం అందరి అగ్రకథానాయకల సరసన సుజాత హీరోయిన్గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి ఇక్కడ చెరగని ముద్ర వేశారు. (ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!) సుజాత స్వతహాగ మళయాలి. కానీ ఆమె శ్రీలంకలోని గల్లేలో జన్మించింది. ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి 'ఎమకులమ్ జంక్షన్' అనే మళయాళ చిత్రంలో తొలిసారి నటించారామె. తర్వాత కె.బాలచందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ తెరకెక్కించిన 'అవల్ ఒరు తోడర్ కథై'లో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది. తర్వాత బాలచందర్ తెరకెక్కించిన 'అవర్గల్' (ఇది కథ కాదు) మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. దాసరి నారాయణరావు సినిమాతో ఎంట్రీ అలా మంచి క్రేజ్లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు 'గోరింటాకు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ను అందుకుంది. తర్వాత దాసరి డైరెక్షన్లో ఏయన్నార్, సీనియర్ ఎన్టీఆర్,కృష్ణంరాజు, కృష్ణలతో పలు సినిమాల్లో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమతరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో సుజాత కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ 'చంటి'లో తల్లి పాత్రలో అలరించిన సుజాత.. 'పెళ్ళి'లో పృథ్వీకి తల్లిగా కనిపించి మెప్పించారు. భర్త అనుమానంతో ఎన్నో ఇబ్బందులు అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరీ సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయిన జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొద్దిరోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రానురాను పూర్తిగా సుజాత సంపాదన మీదనే ఆధారాపడ్డాడు. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పచ్చళ్ల వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తర్వాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు. అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమెపై రెచ్చిపోయేవాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించేవాడు. ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిత్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది. (ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?) తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. అలా బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది. -
వివాహేతర సంబంధం: కలిసి ఉండలేక.. విడిగా బతకలేక!
హైదరాబాద్: హయత్నగర్లో జరిగిన జంట మరణాల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక మానసికంగా కుంగిపోయిన అల్లవుల రాజేశ్, బత్తుల సుజాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని హయత్నగర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న సుజాత వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేక, ఆమె ఎడబాటును భరించలేక రాజేశ్లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారమే ఇద్దరూ కలిసి పురుగుల మందు కొనుగోలు చేసి, తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. తొలుత హత్యగా కేసు దర్యాప్తును ప్రారంభించిన హయత్నగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇవి ఆత్మహత్యలను తేల్చి చెప్పారు. పూర్తి వివరాలను వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డితో కలిసి గురువారం మీడియాకు వివరించారు. ► ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ పై చదువుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చి చైతన్యపురిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఏడాది క్రితం రాజేశ్ అనుకోకుండా హయత్నగర్లోని సిద్దివినాయకనగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బత్తుల సుజాతకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. అటువైపు కాలర్ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో మెసేజ్ చేశాడు. దీంతో సుజాత రిప్లై ఇచ్చింది. అలా ఒకరికొకరు పరిచయం ఏర్పడి నిరంతరం చాటింగ్ చేసుకునేవారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చిట్చాట్తో మొదలైన వారి ప్రేమ.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ► కొంతకాలం తర్వాత సుజాత తరచూ గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటం ఆమె కుటుంబ సభ్యులు గమనించారు. 15 రోజుల క్రితం సుజాత అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో రాజేశ్ ఆమెకు తరచూ ఫోన్లు, వాట్సాప్ సందేశాలు చేశాడు. అనారోగ్యం కారణంగా ఆమె రిప్లై ఇవ్వలేకపోయింది. ► దీంతో రాజేశ్ ఆమె ఇంటి పరిసరాల్లోకి వచ్చాడు. అతని అనుమానాస్పద కదలికలను గమనించిన సుజాత కూతురు శివాని తన స్నేహితుడు క్రాంతి వంశీకి ఫోన్లో సమాచారం ఇవ్వడంతో అతను ఇంటికి వచ్చాడు. ఇప్పటికే రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరు రోడ్లోని మిస్టర్ చాయ్ టీ స్టాల్కు వెళ్లిపోయాడు. అతన్ని అనుసరిస్తూ వంశీ కూడా వెళ్లాడు. ఇదే విషయాన్ని శివానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తన సోదరుడు జైచంద్రకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను తన స్నేహితుడు జస్వంత్ను తీసుకొని, టీ స్టాల్ వద్దకు చేరుకున్నారు. జైచంద్ర, జస్వంత్, వంశీ ముగ్గురు కలిసి సుజాత ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని రాజేశ్ను ఆరా తీశారు. ఒకట్రెండు దెబ్బలు కొట్టేసరికి అసలు విషయాన్ని రాజేశ్ వివరించాడు. ► ఆ తరువాత రాజేశ్ను బైక్ మీద ఎక్కించుకొని జై చంద్ర, జస్వంత్లు వెళ్లిపోయారు. ముగ్గురూ కలిసి సూర్యానగర్ కాలనీ వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రాజేశ్ వివరాలను సేకరించి, తన తల్లి సుజాత ఆత్మహత్యాయత్నం చేసుకుందని, తనని వేధించవద్దని హెచ్చరించి, రాజేశ్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ► మే 24న సాయంత్రం సమయంలో మృతురాలు సుజాత కుంట్లూరు క్రాస్ రోడ్కు వచ్చి, ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి, రాఘవేంద్ర ఆగ్రో ఏజెన్సీ దుకాణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రిలయన్స్ మార్ట్ వద్దకు చేరుకొని, అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న రాజేశ్ చేతికి బాటిల్ను ఇచ్చింది. ఆపై ఆమె రిలయన్స్ మార్ట్లోకి వెళ్లి యాపిల్స్, చాక్లెట్లు, ఇడ్లీ రవ, మైదా వంటి వస్తువులను కొనుగోలు చేసింది. మార్ట్ నుంచి బయటకు వచ్చాక రాజేశ్ అక్కడి నుంచి కుంట్లూరులోని పాపాయిగూడ రోడ్ శివారు ప్రాంతానికి వెళ్లిపోయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ► ఇంటికి వెళ్లిన సుజాత మే 24న రాత్రి సమయంలో విషం తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన ఆరోగ్యం నిమిత్తం ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. మే 29న సాయంత్రం 4 గంటలకు సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. ► మే 29న సాయంత్రం 6:30 గంటలకు సీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలోజు వెంకటేశ్వర్లు కుంట్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. బహిరంగ ప్రదేశంలో దుర్వాసన రావటంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాజేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రాజేశ్, సుజాతలవి బలవన్మరణాలే మిస్టరీ వీడిన హయత్నగర్ జంట మరణాల కేసు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడి -
హయత్ నగర్ హత్యకేసులో సంచలన విషయాలు..!
-
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్నగర్లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్
కర్నూలు: కర్నూలు కృష్ణానగర్లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న పి.సుజాతపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆమె నివాసం ఉంటున్న కర్నూలు శ్రీరామ్నగర్లోని నాగులకట్ట వద్దనున్న ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కోఆపరేటివ్ కార్యాలయంలో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనాథ్రెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్ బాషా, వంశీనాథ్ తదితరులు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా విస్తృతంగా సోదాలు జరిపారు. వీటిలో అక్రమ స్థిర, చరాస్తులను గుర్తించారు. కర్నూలుకు చెందిన సుజాత 1993 డిసెంబర్ 9న జూనియర్ ఇన్స్పెక్టర్ హోదాలో కోఆపరేటివ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. 1999లో సీనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది కర్నూలు, ఆత్మకూరు ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. ఆత్మకూరుతో పాటు కలెక్టరేట్లోని డీసీవో కార్యా లయంలో విధులు నిర్వర్తించారు. గత ఆరేళ్లుగా కర్నూలు కృష్ణానగర్లోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే.. కర్నూలులోని శ్రీరామ్ నగర్లో జి+2 ఇల్లు, అశోక్ నగర్లో జి+1 ఇల్లు, కస్తూరి నగర్లో ఒక ఇల్లు, బుధవారపేటలో జి+1తో పాటు సమీపంలోనే మరో వ్యాపార దుకాణం, కర్నూలు మండలం సుంకేసులలో 2.53 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూ లు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, బ్యాంకు లాకర్లో 40 తులాల బంగారు నగలు, టాటా విస్టా కారు, హోండా యాక్టివా స్కూటీతో పాటు ఖరీదైన ఎల క్ట్రానిక్ గృహోపకరణాలు, రూ.8.21 లక్షల నగ దుతో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు గుర్తింపు. డాక్యుమెంట్ ప్రకారం వీటి విలువ రూ.1.80 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు అనంతరం సుజా తను కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చ నున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పటమట సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోనూ సోదాలు సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంతోపాటు మరో నాలుగు ప్రదేశాల్లో ఉన్న ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయనికి మించి ఆర్జించిన స్థిర, చరాస్తులు ఆర్జించారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న సోదాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. అనంతరం తాము గుర్తించిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
గ్రాండ్గా జబర్దస్త్ కమెడియన్స్ రాకేశ్, సుజాతల హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత (ఫొటోలు)
-
జబర్దస్థ్ కమెడియన్ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
Sujata Seshadrinathan: ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్
సార్క్ రీజన్ ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది... సాఫ్ట్వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్ స్పెషలిస్ట్గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్. ఫండ్ బిజినెస్లో అకౌంటింగ్ అప్లికేషన్స్ కోసం ఆటోమేటెడ్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. భవిష్యత్తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్. ఎస్పీజైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన సుజాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేసింది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్ ఫండ్ సర్వీస్ ప్రైవెట్ లిమిటెడ్కు సుజాత డైరెక్టర్. ఫండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది. -
పిఠాపురం జమీందారుతో పెళ్లి, ఆస్తులన్నీ పోయాయి: సీనియర్ నటి
అరవై దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార సుజాత. భీష్మ సినిమాలో మత్స్యకన్యగా నటించి అందరికీ దగ్గరైన ఆమె భీష్మ సుజాతగా స్థిరపడారు. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం.. ఇలా ఎన్టీఆర్తో అనేక సినిమాలు చేశారు. నాగేశ్వరరావుతో ఒకే ఒక్క సినిమా 'మహాత్ముడు' చేసినప్పటికీ చివరకు తన పాత్రను ఎడిటింగ్లో తీసేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చారు. 'మాది తెనాలి. స్కూలు ఫంక్షన్లో నాటకాలు వేసేవాళ్లం. అమ్మానాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాను. ఇకపోతే అప్పట్లో నా పెళ్లి పెద్ద సంచలనం. పిఠాపురం జమీందారును పెళ్లి చేసుకున్నా. అప్పుడే పెళ్లెందుకమ్మా, తర్వాత ఫీలవుతావు అని శోభన్బాబు చెప్పినా నేను వినిపించుకోలేదు. పైగా పిఠాపురం జమీందారుకు అప్పటికే పెళ్లయింది. ఆయన మొదటి భార్య ఒప్పుకున్న తర్వాతే నేను అతడిని పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో నేను నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ తర్వాత మాత్రం సినిమాలే వద్దన్నారు. మా ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసే వారు. అలా ఉన్న ఆస్తంతా పోయింది. మిగిలిన కొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలోకి పోయాయి. ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో తిరిగి మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ ఈసారి డ్రామాలు, సినిమాలు, డబ్బింగ్లు, కోరస్లు.. ఇలా అన్నీ చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు భీష్మ సుజాత. చదవండి: షారుక్ ఖాన్ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్ ఎన్టీఆర్ను జమున కాలితో తన్నడంపై వివాదం -
రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
షేక్పేట మాజీ తహసీల్దార్ సుజాత మృతి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్న షేక్పేట మాజీ తహసీల్దార్ సి.హెచ్. సుజాత (46) శనివారం గుండెపోటుతో మృతిచెందారు. 45 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె నిమ్స్లో చేరగా డెంగ్యూతోపాటు కేన్సర్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స తీసుకొని ఇటీవలే ఆమె డిశ్చార్జి అయ్యా రు. అయితే ఈ నెల 2న ఆరోగ్యం విషమించడంతో బంధువులు ఆమెను మళ్లీ నిమ్స్కు తరలించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతున్న క్రమంలో తీవ్ర గుండెపోటు రావడంతో మర ణించారు. సుజాత భౌతికకాయాన్ని చిక్కడపల్లి లోని ఆమె నివాసానికి తరలించిన బంధువులు... అనంతరం అంబర్పేట శ్మశానవాటికలో అంత్య క్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయాన్ని సంగారెడ్డి డీఆర్వో రాధికారమణి, తహసీల్దార్లు శైలజ, లలిత, జానకి, రామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. రూ. 40 కోట్ల భూమి వ్యవహారంలో... బంజారాహిల్స్లో రూ. 40 కోట్ల విలువజేసే ఓ భూమిని సర్వే చేసి ఆన్లైన్లో రికార్డులు నమోదు చేసేందుకు రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసి నట్లు సుజాతపై ఆరోపణలు రావడంతో 2020 జూన్ 7న ఏసీబీ అధికారులు ఆమెతో పాటు ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను, నాటి బంజారాహిల్స్ ఎస్సైని అరెస్టు చేశారు. అలాగే ఆమె నివాసం నుంచి రూ. 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశంతో అప్పట్లో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే సుజాత అరెస్ట్తో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ఆమె భర్త అజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురై 2020 జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో భర్త అంత్యక్రి యల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బెయిల్పై విడు దలైన సుజాత... ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పొంది సరూర్నగర్లోని తన తల్లి ఇంట్లో కుమా రుడు భరత్చంద్రతో కలిసి ఉంటున్నారు. 2005లో తహసీల్దార్గా ఉద్యోగంలో చేరిన సుజాత మెదక్, అంబర్పేట, ముషీరాబాద్, హిమాయత్నగర్ తదితర మండలాల్లో పని చేశారు. తహసీల్దార్ కాకముందు ఆమె కొంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగానూ పనిచేశారు. -
స్టేజ్పైనే ప్రియుడికి ముద్దుపెట్టిన జోర్దార్ సుజాత
తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జోర్దార్ సుజాత. బిగ్బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవలె రాకింగ్ రాకేశ్ అనే కమెడియన్తో ప్రేమలో పడింది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లోనూ నడుస్తుంది. ఇప్పటికే తమ ప్రేమ గురించి బహిరంగంగానే మాట్లాడిన ఈ జోడీ తాజాగా మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. ఓ షోపై వీరి జంట సందడి చేసింది. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తమది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేశ్ మాటలకు ఫిదా అయిన సుజాత స్టేజ్పైనే అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. -
సురుచిలో శేఖర్ మాస్టర్ దంపతుల సందడి
సాక్షి, మండపేట (కోనసీమ): ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, టీవీ డాన్స్షోల జడ్జి శేఖర్ మాస్టర్ సోమవారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్లో సందడి చేశారు. తన సతీమణి సుజాతతో కలిసి జిల్లాలోని ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన మార్గమధ్యంలో సురుచిలో ఆగారు. శేఖర్ మాస్టర్ దంపతులకు బాహుబలి కాజాను కానుకగా అందించి సత్కరించారు. చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం) -
కెరీర్ కాంతిమంతం
దీపం జీవితానికి ప్రతీక. ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. ఆ వెలుగును ఒడిసిపట్టుకోవడం తెలిస్తే జీవితం ప్రకాశవంతమవుతుంది. సరదాగా నేర్చుకున్న క్యాండిల్ మేకింగ్తో జీవితాన్ని కాంతిమంతం చేసుకున్న సుజాత మేడబాల అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లక్కీ క్యాండిల్స్... ఇది హైదరాబాద్, ప్రగతినగర్లో ఓ చిన్న పరిశ్రమ. పరిశ్రమ చిన్నదే కానీ, అందులో తయారయ్యే క్యాండిల్స్ మాత్రం చిన్నవి కావు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని భుజాన మోసినట్లు మోయాల్సినంత పెద్ద క్యాండిల్స్ తయారవుతాయక్కడ. రెండు అడుగుల చుట్టుకొలత, రెండున్నర అడుగుల ఎత్తున్న క్యాండిల్ అది. అందుకే ఆ క్యాండిల్ పేరు సరదాగా బాహుబలి క్యాండిల్గా వ్యవహారంలోకి వచ్చేసింది. ఇంతకీ బాహుబలి క్యాండిల్ బరువు ఎంతో తెలుసా? 30 కేజీలు. ధర తెలిస్తే క్యాండిల్ వెలుగులో చుక్కలు కూడా కనిపిస్తాయి మరి. ఆ క్యాండిల్ ధర 30 వేల రూపాయలు. ఇది కస్టమైజ్డ్ క్యాండిల్ అని, ఒకరు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారని, ఈ క్యాండిల్ కోసం ప్రత్యేకంగా మౌల్డ్ తయారు చేయించాల్సి రావడంతో ఆ ధర తప్పలేదని చెప్పారు సుజాత. ఆమె పరిశ్రమలో తయారయ్యే క్యాండిల్స్లో ఎక్కువ భాగం డిజైనర్ క్యాండిల్సే. పిల్లర్ క్యాండిల్, కంటెయినర్ క్యాండిల్, సెంటెడ్ క్యాండిల్, పెయింటెడ్ క్యాండిల్, ప్రింటెడ్ క్యాండిల్, ఫ్లోటింగ్, పర్సనల్ క్యాండిల్స్ కూడా ఉంటాయి. పండుగలు, ఇతర ధార్మిక వేడుకల కోసం రిచువల్స్ క్యాండిల్స్ ప్రత్యేకం. ‘‘దీపం వెలుగు మనసును ఉత్తేజితం చేస్తుంది. అందుకే సెంటెడ్, అరోమాటిక్ క్యాండిల్స్లో సందర్భాన్ని బట్టి ఫ్రాగ్నెన్స్ను ఎంచుకోవాలి. మా ప్రయోగంలో నాలుగురకాల నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో సోయా వ్యాక్స్, కోకోనట్ వ్యాక్స్, పామ్ వ్యాక్స్ క్యాండిల్స్... ఈ మూడు వేగన్ క్యాండిల్స్. అంటే ఈ మైనం జంతువులు, పక్షుల వంటి ఏ ప్రాణి నుంచి సేకరించినది కాదు. ఇక నాచురల్ వ్యాక్స్లో నాలుగవది బీ వ్యాక్స్. తేనెపట్టు నుంచి సేకరించే మైనం అన్నమాట. సాధారణంగా క్యాండిల్ తయారీలో ఉపయోగించేది పారాఫిన్ వ్యాక్స్. ఇప్పుడు నాచురల్ వ్యాక్స్ క్యాండిల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు, ధర గురించి పట్టింపు కూడా ఉండడం లేదు. దాంతో ప్రయోగాలు చేయడానికి అవకాశం కూడా బాగా ఉంది. నేను పదేళ్లుగా ముగ్గురు ఉద్యోగులతో ఈ పరిశ్రమ నడిపిస్తున్నాను. ముగ్గురూ మహిళలే. మహిళలనే ఎందుకు చేర్చుకున్నానంటే... ఇది భుజబలంతో చేసే పని కాదు, సృజనాత్మకంగా చేయాల్సిన పని. పైగా మొత్తం చేతుల మీద జరిగే పని. భారీ మొత్తంలో మైనాన్ని కరిగించి ఒకే మూసలో పోయడం కాదు, ప్రతిదీ ప్రత్యేకమే. మనసు పెట్టి చేయాల్సిన పని. సహనం కూడా చాలా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని మహిళలైతే బావుంటుందనుకున్నాను. అలాగే ఒక మహిళగా సాటి మహిళలకు అవకాశం ఇస్తే బావుంటుందని కూడా అనిపించింది. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు, భారీ ఆర్డర్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా మహిళలకే’’ అన్నారు సుజాత. వైజాగ్లో చిరుదీపంగా మొదలైన పరిశ్రమ, హైదరాబాద్లో కాంతులు విరజిమ్ముతున్న వైనాన్ని కూడా వివరించారామె. ‘‘వైజాగ్లో ఒక టైనింగ్ ప్రోగ్రామ్లో ఒకరోజు శిక్షణ తీసుకున్నాను. అది కూడా సరదాగానే. పిల్లలు పెద్దయిన తర్వాత ఖాళీ దొరికింది. దాంతో నేర్చుకున్న పనిని రకరకాలుగా కొత్తగా ఏం చేయవచ్చో ఆలోచిస్తూ పేపర్ కప్పు క్యాండిల్ చేశాను. అలా మొదలైన ప్రయోగాలను కొనసాగిస్తూ వచ్చాను. మా వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సమయానికి క్యాండిల్ తయారీలో నాకు పూర్తి స్థాయిలో పట్టు వచ్చేసింది. ఇక కంపెనీ రిజిస్టర్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించాను. నా టైమ్పాస్ కోసం మొదలు పెట్టిన ఈ ఆలోచన... ఇప్పుడు మా వారికి రిటైర్మెంట్ తర్వాత వ్యాపకంగా మారింది. నా ఆలోచనతో రూపుదిద్దుకున్న పరిశ్రమ ఇప్పుడు ఒక ఈవెంట్కి రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే క్యాండిల్స్ని సరఫరా చేసే స్థాయికి చేరింది. మాకు మంచి వ్యాపకం, మరికొందరికి ఉపాధి. నా పరిశ్రమ కాంతిమంతం చేస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, వేలాది ఇళ్లను, లక్షలాది మనసులను’’ అన్నారామె వాలెంటైన్స్ డే క్యాండిల్స్ చూపిస్తూ. – వాకా మంజులారెడ్డి -
'జబర్దస్త్' కమెడియన్తో బిగ్బాస్ బ్యూటీ లవ్ ట్రాక్.. త్వరలోనే పెళ్లి
Rocking Rakesh And Jordar Sujatha All Set To Tie Knot: ప్రేమ..ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇక నటీనటుల మధ్య ప్రేమ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరేమో నిజంగానే లవ్లో పడతారు. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్తో కలిసి పలు స్కిట్లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. -
రెండు గంటలు గర్భిణి నరకయాతన
కొత్తగూడ: గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యంలేక ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో పురిటి నొప్పులతో ఓ మహిళ రెండు గంటలు నరకయాతన పడింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కర్నెగండిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నెగండి గ్రామానికి చెందిన పూనెం సుజాతకు పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు సరిగా లేనందున మెయిన్ రోడ్డువరకు వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్తామని అంబులెన్స్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు టాటా మ్యాజిక్ వాహనం మాట్లాడుకుని తీసుకువస్తుండగా అది మార్గమధ్యలో చెడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మరో వాహనాన్ని తీసుకు వచ్చి టాటా మ్యాజిక్కు తాడు కట్టి మెయిన్ రోడ్డువరకు లాక్కుని వచ్చారు. ఇదంతా అయ్యేసరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటివరకు నొప్పులతో సుజాత నరకయాతన అనుభవించింది. అక్కడినుంచి ఆమెను అంబులెన్స్లో కొత్తగూడ పీహెచ్సీకి తరలించగా అక్కడి వైద్యులు, సహజ ప్రసవం అయ్యే పరిస్థితి లేదని చెప్పడంతో మహబూబాబాద్ జిల్లా అస్పత్రికి తరలించారు. -
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్కు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. çసూరత్కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్పూర్కు చెందిన అనుమిత, ఫరిదాబాద్కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
బిగ్బాస్: గంగవ్వకు మెహబూబ్ స్పెషల్ గిఫ్ట్
బిగ్బాస్ హౌస్లో కోపం, ప్రేమ, ద్వేషం, గొడవలు,అలకలు, మనస్పర్థలు అన్నీ ఉంటాయి. ఒక్కో కంటెస్టెంట్స్ కొట్టుకునే రేంజ్లో గొడవ పడతారు కూడా. అయితే ఈ గొడవలు, కోపాలు కేవలం ఆటలో మాత్రమే ఉంటాయి. తర్వాత అంతా ఒక్కటైపోతారు.హౌస్లో శత్రువుల్లా మారినవారు సైతంబయటకు వచ్చాక మిత్రులైపోతారు. ఇది గత మూడు సీజన్లలో చూస్తూ వచ్చాం. బిగ్ బాస్ లో గోడవలు ఎన్ని జరిగినా కూడా ఎక్కడో ఒక చోట కంటెస్టెంట్స్ మధ్య స్నేహ భావం అనేది ఉంటుంది.ఇక బిగ్బాస్ నాల్గో సీజన్లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన సభ్యులంతా బయట కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటికెళ్లి కలుస్తున్నారు. గంగవ్వ ఇంటికి జోర్దార్ సుజాత వెళ్లి పలకరించింది. అలాగే లాస్య, నోయల్ కలిశారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ మిగిలిన వారందరిని కలుసుకుంటు స్పెషల్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఇక తాజాగా కండల వీరుడు మెహబూబ్ దిల్సే గంగవ్వతో పాటు జోర్దార్ సుజాతను ప్రత్యేకంగా ఇంటికి పిలిచాడు. మెహబూబ్ వారితో బిగ్బాస్కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వించాడు. తన ఇంట్లో వారిద్దరికీ స్పెషల్ గా వంట చేసి పెట్టాడు. ఆ తర్వాత బిగ్బాస్ పెట్టినట్లు వీరిద్దరికి ఒక గేమ్ పెట్టాడు మెహబూబ్. అద్దం లేకుండా మేకప్ వేసుకోవాలని సుజాత, గంగవ్వకు పోటీ పెట్టాడు. అందులో గంగవ్వ తనదైన శైలీలో మేకప్ వేసుకొని నవ్వులు పూయించింది. ఇక చివర్లో గంగవ్వకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు మెహబూబ్. ఆమె కోసం 25 తులాల పట్టీలను అందించారు. గంగవ్వ బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు పట్టీల స్టోరీ చెప్పింది. అప్పట్లో పొలం పని చేసేటప్పుడు పట్టీలు తీసి ఒక కుండలో దాచగా, ఆమె భర్తే తాగుడుకు అలవాటు పడి అమ్ముకున్నట్లు చెప్పింది. ఇక అప్పటి నుంచి కాళ్లకు పట్టీలు లేకుండానే ఉంటున్నానని ఒక సందర్భంలో చెప్పింది. అది గుర్తుపెట్టుకున్న మెహబూబ్.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పట్టీలను కానుకగా ఇచ్చి గంగవ్వను సర్ప్రైజ్ చేశాడు. మెహబూబ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన గంగవ్వ ఎమోషనల్ అయింది. మోహబూబ్ను దగ్గరికి పిలిచి హగ్ చేసుకుంది. ఇక మెహబూబ్, సుజాతకు స్వీట్స్ ప్రజెంట్ చేశాడు. -
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక..
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి చెందారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను టీవీల్లో వీక్షిస్తున్నారు. సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఓడిపోయిందని ప్రకటించడంతో తీవ్రకలత చెందారు. ఇక బీజేపీ వారు హుషారై బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారంటూ అక్కడే ఉన్న సహచరులకు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. (కారును పోలిన రోటీ మేకర్) -
‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హారీష్ రావు ప్రతిపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంతో పాటు పడిందని చెప్పిన మంత్రి కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ మోసం చేసింది నిజం కాదా అని మంత్రి హారీష్ రావు ప్రశ్నించారు. ఆనాడు విద్యార్థి మిత్రుల చావులకు ఈ కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీశారు. తొగుల మండల కేంద్రంలో మంగళవారం యువజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ది అని తెలిపారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోతే తామంతా రాజీనామా చేస్తే, బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ నీళ్లు, నిధులు, నియమకాలు టీఆర్ఎస్ నినాదమని, ఈ రోజు కాళేశ్వరం ద్వారా సాగు నీరు తెచ్చుకుంటున్నామన్నారు. మన నిధులు దక్కాయి కాబట్టే రైతు బంధు, రైతు బీమా, వచ్చాయన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పామని, 1,24,990 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ పారిశ్రామిక విధానంతో 8 వేల పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ వస్తే నల్లధనం తెస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా అని ప్రశ్నించారు. వారు వస్తే ఏటా కోటి ఉద్యోగాలన్నారు. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. డీమానిటైజేషన్తో ఉన్న ఉద్యోగాలు ఊడబీకారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడని, వచ్చిందా పసుపు బోర్డు అని నిలదీశారు. చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ ‘బీహార్లో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతదని మోడీ అంటున్నాడు. గట్లనే హైదరాబాద్లో కారు ఉంది. దుబ్బాకలో కూడా కారు ఉంటే అభివృద్ధి జరుగుతది. ముత్యంరెడ్డి బాగా అభివృద్ధి చేశాడని అంటున్న కాంగ్రెస్, 2018లో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టిఆర్ఎస్ అంటే 24 గంటల కరెంట్. కన్న తండ్రి క్షోభకు కారణమైన శ్రీనివాస్ రెడ్ది, ప్రజలకేం సేవ చేస్తాడు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తాం. ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కేసులు వేయడమే. దేశంలో బీహార్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కంటే నిరుద్యోగిత సగానికి సగం తక్కువ. తెలంగాణలో కేవలం 3.6 శాతమే. బీజేపీ కుడితులో పడ్డ ఎలుకల మారింది.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది.’ అని మంత్రి హరీష్రావు విమర్శించారు. చదవండి: 'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు' దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచేది ఖాయమని ఎంపీ ప్రబావకర్రెడ్డి తెలిపారు. ‘బీజేపీ, కాంగ్రెస్లు వెంటిలేటర్ మీద ఉన్నాయి. దుబ్బాకకు ఎప్పుడైనా కిషన్ రెడ్ది వచ్చారా. నిన్నటి నుంచి బీజేపీ కొత్త నాటకం మొదలు పెట్టింది. పైసలు పట్టుకుంటున్నారు. ఇంకా పంపించాలని అమిత్షాను అడుగుతున్నరు. ఆరడుగుల పిచ్చోడు ఇష్టమైనట్లు మాట్లాడుతున్నారు. స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చి, రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ అర్వింద్ది. అయ్యా టీఆర్ఎస్లో ఉండి బీజేపీలో ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కూడా రాజీనామా చేయాలి’ అని తెలిపారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు ఎన్నో సేవలు అందించారని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత అన్నారు, దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట వారికి దుబ్బాకతో పని లేదు కానీ, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆఆర్కు ముఖ్యమైన నియోజకవర్గం దుబ్బాక అని, సీఎం ఆశీస్సులతో, హరీశ్ రావు సహకారంతో దుబ్బాకలో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు, అన్ని చేయగల సమర్థత ఉందని స్పష్టం చేశారు. కన్నతల్లి లాగా నియోజకవర్గ యువతను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని తెలిపారు. -
గంగవ్వను కలిసిన బిత్తిరి సత్తి
సాక్షి, మల్యాల: బిగ్బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన మై విలేజ్ షో గంగవ్వను గురువారం నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి, బిగ్బాస్ ఫేమ్ సుజాత కలిశారు. మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని గంగవ్వ ఇంటికి వెళ్లి, ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గంగవ్వ బిగ్బాస్ రియాల్టీ షో నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మై విలేజ్ షో డైరెక్టర్ శ్రీరాం శ్రీకాంత్తోపాటు టీం సభ్యులను కలిశారు. (గంగవ్వ చాలా సేఫ్గా ఉంది) -
నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ కేటాయించడం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్కా సవాల్!) హుజూర్ నగర్ పలితాలే దుబ్బాకలో రాబోతుంది : హరీశ్ కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధకులుగా మారారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. అడుగడున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు. నిజామాబాద్లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాలేదని, దుబ్బాకలో కూడా అదే ఫలితాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. -
దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్కా సవాల్!
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు పరీక్షగా మారింది. ఏడాదిన్నర పాలనపై ప్రజల స్పందనకు ఈ ఎన్నికలను కొలమానంగా ఉంటాయనే ఆలోచనతో అధికార టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావుకు ఎన్నికల బాధ్యత అప్పగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక ఎన్నికలో తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే.. బీజేపీ కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది. సాక్షి, సిద్దిపేట: రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరిగే దుబ్బాక ఉప ఎన్నిక ఆ పార్టీ పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. దీనిని రుజువు చేసేందుకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో 1,90,483 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,925 ఓట్ల మెజార్టీ, 2018లో 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే ఊపులో పార్టీని నడిపించి గత ఎన్నికల కన్నా మెజార్టీ ఓట్లు సాధించేలా టీఆర్ఎస్ ప్యూహ రచన చేస్తోంది. ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్రావు తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేశారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల ప్రజలతో టీఆర్ఎస్కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయించారు. ఇలా లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ బడా నాయకులంతా దుబ్బాకలోనే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాణిక్యం ఠాగూర్ వచ్చీ రాగానే జరిగే ఉప ఎన్నిక కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు పర్యాయాలు రెండో స్థానంలో ఓట్లు సాధించిన ఆ పార్టీ.. బలమైన లీడర్ లేకపోయినా క్యాడర్ ఉందనే రుజువైంది. దీన్ని కాపాడుకుంటూ.. మరింతగా బలం పెంచుకునేందుకు పార్టీ ఆలోచిస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీలోని హేమాహేమీ నాయకులైన ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల, షబ్బీర్ అలీలను నియమించింది. అత్యధిక ఓట్లు సాధించాలంటే స్థానిక బలం కూడా అవసరమని భావించిన కాంగ్రెస్.. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, ముత్యం రెడ్డి సానుభూతి ఓట్లు కూడా తోడవుతాయని లెక్కలు వేస్తున్నారు. సత్తా చాటేందుకు బీజేపీ యత్నం ఈ ఎన్నికను బీజేపీ సీరియస్గా తీసుకుంది. సత్తా చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్రావు దూకుడు పెం చారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహి స్తున్నారు. ఈ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏడు మండలాలకు పలువురు ముఖ్య నాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. పలు మార్లు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రచారం చేయడం, అవసరమైతే మోదీ చరిష్మాను కూడా ఉపయోగించి అధిక శాతం ఓట్లు సాధించేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. -
బీ ఫామ్ అందుకున్న సోలిపేట సుజాత
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సోలిపేట సుజాత ...ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా బీ ఫామ్ అందుకున్న ఆమె కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సోలిపేట సుజాత మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. మీ లింగన్న లాగే మీకు (దుబ్బాక ప్రజలకు) నేను అందుబాటులో ఉంటాను. అత్యధిక మెజార్టీతో గెలవాలని కేసీఆర్ గారు చెప్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాను’ అని అన్నారు. (సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం) దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోలిపేట సుజాత ‘ సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటివారు. నా భర్త రామలింగారెడ్డి చనిపోతే చిట్టాపూర్కు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. రామలింగారెడ్డి ఆశయాల సాధన కోసం నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్కు జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. తన భర్త ఆశయ సాధన కోసం వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని చేతులు జోడించి వేడుకున్నారు. రామలింగారెడ్డి తుదిశ్వాస వరకూ ప్రజల మధ్యనే గడిపారని తాను కూడా ప్రజల్లోనే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. (దుబ్బాక బీజేపీలో ముసలం) . -
సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్లో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్ సందేశం ఇచ్చి.. టికెట్ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. రఘునందన్కు హైకోర్టులో ఊరట సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండల పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనపై అరెస్టులాంటి బలవంత చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. -
దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి కేసీ ఆర్ ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన సోలి పేట రామలింగారెడ్డి ఉద్యమం, పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్దికి చివరిశ్వాస వరకు కష్టపడి పనిచేశారు. రామలింగారెడ్డి కుటుంబం మొత్తం అటు ఉద్యమం, ఇటు నియోజకవర్గ అభివృద్దిలో పాలుపంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో రామలింగారెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన భార్య సుజాతను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’అని సీఎం పేర్కొన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు చేసేందుకు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులు దుబ్బాకకు ప్రాతినిధ్యం వహించడం సమంజసమని కేసీఆర్ అన్నారు. జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని తెలిపారు. రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక పాత్రికేయునిగా పనిచేస్తూ 2004లో దొమ్మా ట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి విజ యం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎ న్నికలోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందా రు. నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పా టైన దుబ్బాక నుంచి 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన రామలింగారెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన రెండు పర్యాయాలు అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఈ ఏడాది జూన్ లో అనారోగ్యానికి గురైన రామలింగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు ఆరో తేదీన మరణించారు. నవంబర్ 3న పోలింగ్ జరిగే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. భర్త: దివంగత సోలిపేట రామలింగారెడ్డి పుట్టిన తేదీ: 01–01–1969 వివాహం: 26–12–1986 విద్యార్హత: ప్రాథమిక విద్య కుమారుడు: సతీష్రెడ్డి కూతురు: ఉదయశ్రీ గ్రామం: చిట్టాపూర్, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా. -
బిగ్బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్
గత మూడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్బాస్ నాలుగో సీజన్లో మరో మెట్టు ఎక్కువ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తోంది. విభిన్న టాస్క్లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ఇప్పటికే 24 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని 25వ రోజులోకి అడుగుపెట్టింది. గురువారం కూడా కాయిన్ల టాస్క్ కొనసాగింది. మాస్టర్పై అరిచినందుకు సోహైల్ తన దగ్గరకు వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకున్నారు. స్విచ్ కాయిన్ ద్వారా సుజాతకు ఊహించని వరం లభించింది. సోహైల్పై మాస్టర్ విరుచుకుపడగా ఎవరూ ఊహించని వ్యక్తి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇంకా ఈ రోజు ఏం జరిగిందంటే.. అరియానాపై సుజాత ఫైర్ లాస్య, అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాట్లాడుతుండగా.. సోహైల్ వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్ నుంచి కాయిన్లు దొంగిలించిన కారణంగా తను ఇలా క్షమాపణలు కోరాడు. .. తన పక్కన కూర్చొబెట్టి బుజ్జగించాడు. తన మీద కోపం లేదని, ఏదో కోపంలో అలా చేశానని సంజాయిషీ చెప్పుకున్నాడు. నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని మాస్టర్ సోహైల్కు హితబోధన చేశాడు. అందరూ రిలాక్స్ అయిపోవడంతో బిగ్బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు.. ఆటను కొనసాగించాలని ఆదేశించాడు. తిరిగి ఆటను కొనసాగించారు. కిల్లర్ కాయిన్స్ రెండో భాగంలో దివి, అరియానా, సోహైల్, నోయల్, మాస్టర్ అవుట్ అవ్వడంతో తప్పుకున్నాడు. ఎక్కువ పాయింట్లు ఉన్న వారిని టార్గెట్ చేయాలని అరియానా చెప్పడంతో ఆమెపై సుజాత ఫైర్ అయ్యింది. నువ్వు రన్నింగ్ కామెంట్ ఇవ్వొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో లెవల్ పూర్తయింది. ఓవైపు అరియానా, సుజాత గొడవ పడుతుండగా.. మరోవైపు అఖిల్, మాస్టర్ మధ్య వాదన మొదలైంది. అమ్మాయిల మాదరి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మాస్టర్ మండిపడ్డారు. చదవండి : బిగ్బాస్: అందరి కన్ను సోహైల్ పైనే అనంతరం మూడో లెవల్ ప్రారంభమైంది. ఇదే అఖరిది కూడా. ఆ లెవల్లో ఆఖరు బజర్ మోగేలోపు ఇంటి సభ్యులు అందరూ సామా, భేద,దాన, దండోపాయాలు ఉపయోగించి తమ దగ్గర ఉన్న కాయిన్ల విలువను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అవినాష్కు కాయిన్లు పట్టకునేందుకు అరియానా సాయం చేసింది. లాస్చ, మాస్టర్కు కాయిన్లు ఇచ్చేసింది. అవినాష్వి కూడా మాస్టర్కు ఇచ్చేసింది. సోహైల్, మెహబూబ్కు ఇచ్చేశాడు. తన దగ్గర తీసుకున్న కాయిన్లనను తనకు ఇచ్చేయమని మాస్టర్, సోహైల్ను అడిగాడు. లేకుండే తన మనసు కుదుటపడదని వాపోయాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్కు కాయిన్లు ఇవ్వకంటూ మెహబూబ్ సోహైల్కు నూరిపోశాడు. (బిగ్బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!) తర్వాత ఇంటి సభ్యులంతా తమ దగ్గర ఉన్న కాయిన్లను లెక్కించి బిగ్బాస్కు చెప్పారు. అఖిల్, మోనాల్, సోహైల్ తమ పాయింట్లను మెహబూబ్కు ఇచ్చేశారు. ఇప్పడు సుజాత దగ్గర ఉన్న స్విచ్ కాయిన్ను ఉపయోగించి.. వేరే వాళ్ల కాయిన్లతో స్విచ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకొని సుజాత, మెహబూబ్ పాయింట్లను లాగేసుకుంది. చివరకు ఎక్కు పాయింట్లు ఉన్న కారణంగా సుజాత, అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక నలుగరు కెప్టెన్ పోటీదారులుగా ఎన్నికయ్యారు. తన పాయింట్లు పోవడంతో మెహబూబ్ కన్నిటీ పర్యంతమయ్యాడు. కష్టపడి ఆడిన తనకు అన్యాయ జరిగిందని ఆవేదన చెందాడు. అక్కడితో ఆ టాస్క్ ముగియడంతో హారిక, అభి, దివి జరిగిన దాని గురించి చర్చించుకున్నారు. (బిగ్బాస్: టాస్క్లో పడిపోయిన అవినాష్) మాస్టర్తో మాట్లాడాలని సోహైల్ కోరితే అందుకే మాస్టర్ ససేమిరా అన్నాడు. తన కాయిన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన సోహైల్ ఉపయోగించుకోలేదని రాజశేఖర్ మాస్టర్ అనగా.. గేమ్ను గేమ్ లానే ఆడానని, అస్సలు క్షమాపణలు చెప్పనని సోహైల్ తెగేసి చెప్పాడు. దీంతో తనతో జీవితంలో మాట్లాడనని మాస్టర్ శపథం చేశాడు. అనంతరం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు కాసుల వేట టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భాగంగా గార్డెనింగ్ ఏరియాలో మట్టితో బురద గొయ్యి ఏర్పాటు చేసి అందులో కొన్ని కాయిన్లు పెట్టి ఉంచారు. బురదలోని కాయిన్లనుంచి టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బాస్కెట్లో ఎక్కవ కాయిన్లు ఉంటే వారు ఇంటి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ టాస్క్ సంచాలకులుగా సోహైల్ ఉన్నాడు. ఈ టాస్క్లో నలుగురు పోటీపడి మరి పోరాడారు. ఈ టాస్స్లో ఎవరూ ఊహించని విధంగా 100 పాయింట్ల అధిక్యతతో కుమార్ నాలుగో కెప్టెన్గా ఎన్నికయ్యాడు. అనంతరం కెప్టెన్ బ్యాండ్ను ధరించాడు. గార్డెన్లో కూర్చొని ఉల్లాసంగా గడిపారు. అరియానుకు పిచ్చి పట్టింది. కానీ తనకు ఇప్పడే తెలిసిందని మాస్టర్ చెప్పాడు. ఇక స్వాతి, అఖిల్ మాట్లాడుకుంటుండగా.. అవినాష్ వారి సంభాషణలకు దూరం నుంచి ఫన్నీగా వాయిస్ ఇచ్చాడు. అలాగే గంగవ్వ అమ్మ వారు సోకితే ఎలా మాట్లాడతారో నటించి చూపిస్తూ ఇంటి సభ్యులకు వినోదాన్ని అందించింది. దీనంగా చూస్తున్న హారికను అభి ఆకస్మాత్తుగా వచ్చి భయపెట్టాడు. తర్వాత తనను వెనకనుంచి వచ్చి పట్టుకొని కూల్ చేశాడు. (కథ వేరే ఉంటది: మాస్టర్కు సోహైల్ వార్నింగ్) -
బిగ్బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!
బిగ్బాస్ తెలుగు సీజన్ 4లో టాస్క్ల డోస్ పెరుగుతోంది. ముందు తేలికపాటి ఆటలను ఇంటి సభ్యులకు పరిచయం చేసిన బిగ్ బాస్.. పోనుపోనూ మరింత కఠినతరం చేస్తున్నాడు. ఇక హౌజ్లో గురువారం సైతం కిల్లర్ కాయిన్స్ టాస్క్ కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్లో మోహబూబ్, సొహైల్ అందరికంటే ఎక్కవ కాయిన్స్ సంపాధించి మొదటి రెండు స్థానంలో ఉండగా.. కిల్లర్ కాయిన్స్ గేమ్ మొదటి లెవల్ ముగిసి రెండో లెవల్ జరుగుతోంది. ఈ గేమ్లో ఇంటిసభ్యులందరికి వెల్ ప్రో జాకెట్లను బిగ్బాస్ అందించగా కిల్లర్ కాయిన్ను ఇంట్లోని ఎవరైనా ఒకరి షర్ట్కు అతికించాలి. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఆ కాయిన్ ఉంటే వారి దగ్గర ఉన్న కాయిన్స్లో సగం కాయిన్స్ వేరే వారికి ఇచ్చేయాలి. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్లో భాగంగా నలుగురు సభ్యుల మధ్య కాసుల వేట సాగుతోంది. (స్వాతి విషయంలో అభిజిత్ను నిలదీసిన హారిక) ఈ టాస్క్లో అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్సాయి, సుజాత, అలేఖ్య హారిక తమ సత్తాను నిరూపించుకునేందుకు పోటీపడనున్నారు. వీరంతా మట్టితో ఉన్న దాంట్లోకి దిగి ఆ బురద నుంచి కాసులను వెతికి తమ బాస్కెట్స్లో వేయాలి. సమయం ముగిసే సరికి ఎవరి దగ్గర ఎక్కు కావయిన్స్ ఉంటే వారు ఈ వారం కెప్టెన్సీ అయినట్లు. ఈ క్రమంలో నలుగురు సభ్యులు తమ ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని పోటీ బరిలో దిగారు. ఎక్కువ సంఖ్యలో కాసలను సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఇంటి కెప్టెన్ అయ్యిందేకు రెడీ అయ్యారు. మరి ఈ ఆటలో గెలిచి నాలుగో ఇంటి కెప్టెన్ స్థానాన్ని ఎవరూ అధిష్టించారో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే బిగ్బాస్ షో చూడాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్కు సోహైల్ వార్నింగ్) Captaincy aatalo coins veta!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/IOJYYkQsVB — starmaa (@StarMaa) October 1, 2020 -
105 రోజుల వినోద క్వారంటైన్
కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్కి వెళ్లాలి. ఆ క్వారంటైన్ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్లు 105 రోజుల క్వారెంటైన్కి వెళ్లే సీజన్ వచ్చింది. బిగ్బాస్ 4 సీజన్. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్బాస్ 4. కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్బాస్ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది. ఈసారి హోస్ట్ ఎవరు? బిగ్బాస్ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్.టి.ఆర్ హోస్ట్గా పెద్ద బ్యాంగ్తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్ను కొనసాగించింది. బిగ్బాస్ 4కు మళ్లీ ఎన్.టి.ఆర్ హోస్ట్ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్బాబు పేరు వినిపించింది. కాని బిగ్బాస్కు హోస్ట్ చేసే చాన్స్ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్బాస్ 3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి. కంటెస్టెంట్లు ఎవరు? పాల్గొనే వరకు కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై సస్పెన్స్ ఉంచడం బిగ్బాస్ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్ కావాల్సిన షో సెప్టెంబర్ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్ను కొట్టి పారేశారు. ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి– 1. లాస్య మంజునాథ్ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్), 3. గంగవ్వ (యూట్యూబర్– విలేజ్ స్టార్), 4.సుజాత (టివి యాంకర్), 5.అవినాష్ (స్టాండప్ కమెడియన్), 6. సత్య (న్యూస్ రీడర్), 7.సుహైల్ రెయాన్ 8. సూర్యకిరణ్ (డైరెక్టర్), 9. అభిజిత్ (హీరో), 10. అమ్మ రాజశేఖర్ (దర్శకుడు). 11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్ చానెల్ యాంకర్ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్ కంటెస్టెంట్లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కత్తి మీద సాము ఏమైనా ఈసారి బిగ్బాస్ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్లు హౌస్లోకి రావాలన్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్ను పాటించి చేయాలి. అదీగాక బిగ్బాస్ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
భార్యను బతికించండని వేడుకోవడం కలచివేసింది..
అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. బెంగళూరులో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో కుటుంబంతో సహా స్వగ్రామానికి బయలుదేరారు. ఓ గంటలో ఇంటికి చేరుకుంటామనుకునేలోపే మృత్యువు దాడి చేసింది. నిండుగర్భిణి ప్రాణాలనుకబళించింది. కొలిమిగుండ్ల మండలంఅంకిరెడ్డి పల్లె సమీపంలో ఆదివారం లారీ, కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. కర్నూలు,కొలిమిగుండ్ల: బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన శేగిరెడ్డి నరేష్కుమార్ రెడ్డి బెంగళూరులో సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడ కరోనా కేసులు అధికమవుతుండటంతో భార్య సుజాత (29),ఏడాదిన్నర వయసున్న కుమారుడు హర్షిత్తో కలిసి స్వగ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. నరేష్కుమార్రెడ్డి సోదరుడు సతీష్రెడ్డి అన్నవదినలను బెంగళూరు నుంచి ఊరికి తీసుకురావడానికి కారులో వెళ్లారు. అప్పటికే బైక్లో బయలుదేరిన వారికి మార్గమధ్యంలో సతీష్రెడ్డి ఎదురయ్యాడు. బైక్ అతడికి ఇచ్చి వారు కారులో ఊరికి ప్రయాణమయ్యారు. అంకిరెడ్డిపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపైకి చేరుకోగానే బెలూంకు చెందిన లారీ అవుకు మండలం రామాపురంలోని క్వారీలో నుంచి కంకర లోడ్తో ఎదురె ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయి ముందు సీటులో కూర్చున్న సుజాత తీవ్రంగా గాయపడగా, డ్రైవింగ్ చేస్తున్న నరేష్కుమార్రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను 108 అంబులెన్స్లో తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. తన భార్యను బతికించండని ప్రమాద స్థలంలో నరేష్ స్థానికులను వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద విషయం తెలియగానే స్వగ్రామం ఎర్రగుంట్లలో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమ్మా డాడీని లెమ్మను..
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ‘అమ్మా.. డాడీని లెమ్మను.. నేనేమి తప్పుచేశానని నన్ను వదిలిపెట్టి పోయాడంటూ తహసీల్దార్ సుజాత కుమారుడు భరత్ రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎంత ఓదార్చినా భరత్ ఊరుకోకుండా డాడీ లే.. అంటూ రోదిస్తూనే ఉన్నాడు. మా డాడీకి ఫోన్ చేసింది ఎవరు..? బెదిరించింది ఎవరు...? అతనికి కూడా శిక్ష పడాలంటూ భరత్ అన్న మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. వివరాల్లోకి వెళితే.... అవినీతి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న షేక్పేట్ తహసీల్దార్ సుజాత భర్త అజయ్కుమార్ అంత్యక్రియలు గురువారం అంబర్పేట స్మశానవాటికలో ముగిశాయి. అజయ్కుమార్ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని లలిత మ్యాన్షన్ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహానికి అదే రోజు సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మార్చురీలో భద్రపరిచారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని చిక్కడపల్లిలోని ఆయన సోదరి గోక మంగళ నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చూసిన తహసీల్దార్ సుజాత, కుమారుడు భరత్ల రోధన పలువురికి కంటతడి పెట్టించింది. నాయకులు, అధికారుల నివాళి.. అజయ్ కుమార్ భౌతికకాయాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి నివాళులు అర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే,కె. లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు ‡ విజయలక్ష్మీ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లక్ష్మీనారాయణ, థామస్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళతో పాటు పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సుజాత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
‘రెవెన్యూ’లో ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్కుమార్ ఆత్మహత్య రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల దాడిలో ఇంట్లో దొరికిన నగదుకు లెక్క చూపినా.. విచారణ పేరిట కుటుంబసభ్యులను వేధించడంతోనే అజయ్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెవెన్యూ ఉద్యోగసంఘాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. వివాదాస్పద భూ వ్యవహారంలో ఆర్ఐ, ఎస్ఐలను అరెస్టు చేసిన పోలీసులు.. ఎలాంటి ప్రమేయంలేని తహసీల్దార్ను అరెస్టు చేయడమేగాకుండా తప్పులు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూను అవినీతి శాఖగా చిత్రీకరించడంలో భాగంగానే పద్ధతి ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన సంఘటనలోనూ ఆమెదే తప్పిదం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యలు చేసిన తీరును గుర్తు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.. తాజా ఘటన నేపథ్యంలో ఆందోళనబాట పట్టాలని యోచిస్తున్నారు. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన భూముల వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై దాడులు జరిగాయని, మాన్యువల్ పహాణీగాకుండా.. ఏకంగా ఆన్లైన్లోనే రికార్డులు నమోదు చేయడంతో ఆనేక తప్పు లు దొర్లాయని, వీటిని సవరించడానికి అనుమతినివ్వాలని కోరినా పట్టించుకోని అధికారు లు.. తప్పంతా రెవెన్యూ ఉద్యోగులదే అన్నట్లుగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో రాత్రికి రాత్రే అమలు చేయాలనే ఉన్నతాధికారుల వ్యవహారశైలితో రెవెన్యూశాఖకు చెడ్డ పేరు వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమం లోనే వీఆర్వోల వ్యవస్థ రద్దు, రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేయడంతో మానసిక ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు అవినీతి ముద్ర వేస్తుండటం మరింత కుంగదీస్తోందని అంటున్నారు. ఏసీబీ వేధింపులతోనే: ట్రెసా షేక్పేట్ తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కేసులో ఆధారాలు లేకపోయిన అరెస్ట్ చేసిన తహసీల్దార్ సుజాతకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే బాగుండేదని, ఇప్పటికైనా ఆమెను విడుదల చేసి కేసును విచారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
షేక్పేట తహసీల్దార్ భర్త బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లిలో లలిత మాన్షెన్లోని తన రెండో అక్క రేఖ ఇంట్లో తన కుమారుడితో అజయ్ ఉంటున్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు అజయ్కు ఓ ఫోన్ కాల్ రాగా మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తుపైకి వెళ్లి మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన అజయ్కుమార్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోపణలు భరించలేకే.. చిన్నప్పట్నుంచే సున్నిత మనస్కుడైన అజయ్ తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉన్నత కుటుంబం, భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు.. నల్లేరుపై నడకలా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకరు జైలుపాలు కాగా.. మరొకరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక అజయ్కుమార్ది విద్యావంతుల కుటుంబం. గత 15 ఏళ్లుగా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మొదట్లో సివిల్స్ కోసం శిక్షణ పొంది ఇంటర్వూ్య వరకు వెళ్లారు. తొలుత మహబూబ్నగర్ పీజీ కళాశాలలో, నిజాం కళాశాలలో, కోఠి ఉమెన్స్ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పీహెచ్డీ పూర్తిచేసిన అజయ్ తన థీసిస్ సబ్మిషన్ దశలో ఉన్నారు. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో పనిచేస్తుండగా తన కొలీగ్స్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నారు. ఇక అజయ్ బాబాయ్లు, పెద్దనాన్నలు కూడా ఉన్నత విద్యావంతులే. పెదనాన్న గోకా రామలింగం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే తన రెండో పెదనాన్న రామస్వామి అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి ఆంజనేయులు డీఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. తన బాబాయ్లు మోహన్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, మరో బాబాయ్ గోకా మురళీ డాక్టర్గా ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అజయ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సుజాత కూడా గ్రూప్–2 ఆఫీసర్గా ఎంపికై మొదట మెదక్ జిల్లాలో, తర్వాత నగరంలోని ముషీరాబాద్, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో తహశీల్దార్గా పనిచేశారు. కావాలనే టార్గెట్ చేశారా? షేక్పేట తహసీల్దార్ సుజాతను ఆమె కుటుంబాన్ని కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కావాలానే టార్గెట్ చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఆమె భర్త ప్రొఫెసర్ అజయ్ను సైతం అరెస్ట్ చేస్తామన్న సంకేతాల నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వే నెంబర్ 403/పీలో 4,865 గజాల భూవివాదంలో తనను ఎస్ఐ రవీందర్నాయక్ వేధిస్తున్నాడని అబ్దుల్కాలీద్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. ఏసీబీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) నాగార్జునరెడ్డిని వలపన్ని పట్టుకుంది. ఆపై కాలీద్ను పోలీస్లు విచారించిన సమయంలో అతను తహశీల్దార్ సుజాత ప్రస్తావనే తీసుకురాలేదని సమాచారం. అయినా కేసును ముందుకు తీసుకెళ్లే దిశగా ఆమె నివాసంలో సోదాలు చేయటం రూ.30 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపని కారణంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం భర్త అజయ్కు ఏసీబీ నుంచి తరచూ ఫోన్లు రావటం, తాము అడిగిన వివరాలు చెప్పకపోతే అరెస్ట్ తప్పదన్న సంకేతాలివ్వటం వల్లే అజయ్ ఆత్మహత్యకు ఒడిగట్టారని సమీప బంధువులతో పాటు రెవెన్యూ సంఘాలు ఆరోపించాయి. అయితే సుజాతను ఏసీబీ వివాదంలో ఇరికించేందుకు నగర రెవెన్యూశాఖలోని ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీకి తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశం తెరమీదకు వచ్చింది. రెండు మార్లే ఫోన్ చేశాం..: ఏసీబీ డీఎస్పీ అజయ్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావును ‘సాక్షి’ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆమె భర్త అజయ్కు ఫోన్లో ధ్రువీకరించామని, ఆపై హన్మకొండ సమీపంలో తమకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉందని సుజాత తమకు చెప్పగా, అదే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తాము అజయ్ను అడిగితే ఒకే ఎకరం ఉందని చెప్పారని ఈ రెండు సమయాల్లో తప్పితే తాము మరే కాల్ చేయలేదని చెప్పారు. తహసీల్దార్ సుజాత, ఆమె కుమారుడు భరత్ను ఓదారుస్తున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరైన సుజాత.. సుందరయ్య విజ్ఞానకేంద్రం: భర్త అజయ్కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి కండీషనల్ బెయిల్పై తహశీల్దార్ సుజాత విడుదలయ్యారు. సాయంత్రం చిక్కడపల్లిలోని తన ఆడపడుచు ఇంటికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు భరత్ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇటు ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్ అక్కలు ఆరోపించారు. సుజాత అరెస్టైనప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్లారని, చేయని తప్పుకు తన భార్య అరెస్టు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఏసీబీ అధికారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా తన తమ్ముడు ఆ అధికారికి మెసేజ్ కూడా పెట్టాడని అక్క మంగళ తెలిపారు. సుజాత కుటుంబానికి అండగా ఉంటాం.. ఈ నేపథ్యంలోనే సుజాతను పలువురు రెవెన్యూ అధికారులు పరామర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, అశోక్కుమార్, రాధిక రమణి, తహశీల్దార్ లలిత సుజాతను ఓదార్చారు. ‘తహశీల్దార్ సుజాత కుటుంబానికి అండగా ఉంటాం. షేక్పేట్ ఆర్ఐ నాగార్జునరెడ్డి డబ్బులు తీసుకున్న కేసుకు సుజాతకు ఎలాంటి సంబంధం లేదు. సుజాతకు రెవెన్యూశాఖలో ఎలాంటి చెడ్డపేరు లేదు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సుజాత నేరస్తురాలైతే కోర్టులో తేలుతుంది. సుజాత విషయంలో ఏసీబీ అధికారులు ఆమె భర్తకు ఫోన్ చేసి వేధించడం సరైంది కాదు..’అని గౌతమ్కుమార్ అన్నారు. అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ అజయ్ మృతదేహానికి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం పూర్తి చేసింది. కాగా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. గురువారం అజయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. -
భర్త మృతి; ఎమ్మార్వో సుజాతకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ షేక్పేట ఎమ్మార్వో సుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. కాగా, ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్లో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సోదరి నివాసానికి వచ్చిన అజయ్ అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా భూ వివాదం కేసులో అజయ్ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి: షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య) -
షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్లోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో అజయ్ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి : ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది) రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సుజాత విచారణ ఎదుర్కోంటుంన్నారు. -
నా చావుకు ఎవరూ బాధ్యులు కారు
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఇంట్లో వారిని ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. బతకడం ఇష్టం లేకే చనిపోతున్నా. నా అవయవాలు దానం చేయండి’. అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కర్నూలులో కలకలం రేపింది. 1వ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని జొహరాపురంలో నివాసముంటున్న వెంకటరెడ్డి, శకుంతల రెండవ కుమారుడు గోవర్ధన్ చౌదరి(22) బీటెక్ పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి గోవర్ధన్చౌదరి ఇంటి వద్దే ఉంటూ ఎప్పుడూ సెల్ఫోన్ చూసుకుంటూ మౌనంగా ఉండేవాడు. వీరు నివాసముంటున్న ఇంటిపైన రెండో అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మిద్దెపైకెక్కి సూసైడ్ నోట్ రాసి సమీపంలో పెట్టి నిర్మాణంలోనున్న గది ఇనుపరాడ్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి 1వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.(ఉసురుతీసిన క్షణికావేశం) ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కర్నూలు: కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన మాధన్న కూతురు సుజాత(17) ఇంటర్ సెకండియర్ ఫెయిలైనందుకు మనస్తాపంతో కేసీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...మాధన్న కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఇందులో మూడో కుమార్తె సుజాత పత్తికొండలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ చదివింది. అయితే రెండ్రోల క్రితం విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని తల్లి సుజాత మందలించడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బయటికెళ్లి కాలనీ శివారులోని కేసీ కెనాల్లో దూకింది. సుజాత రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై కాలనీ అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మధ్యాహ్నం కేవీఆర్ కాలేజీ సమీపంలో సుజాత ధరించిన పైట నీటిపై కన్పించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగివున్న బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే 2వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని నీటిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
షేక్పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్ట్
-
డబ్బులుండేవి కావు
‘టెక్నికల్లీ సౌండ్’ అనే మాట ఆటల్లో వినిపిస్తుంటుంది. ఎక్కువగా క్రికెట్లో. ఒడుపు తెలిసిన ఆటగాళ్లను అంటారు టెక్నికల్లీ సౌండ్ అని. ‘సౌండ్ పార్టీ’ అని ఇంకో మాట ఉంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తిని అంటుంటారు. అజింక్యా రహానే ఇప్పుడు టెక్నికల్గా, ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ముంబై కుర్రాడు. తొమ్మిదేళ్ల క్రితం క్రికెట్లోకి వచ్చాడు. 64 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్ట్ వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. క్రికెట్ అంటే ప్రాణం. కష్టపడి పైకొచ్చాడు. కష్టపడి పైకొచ్చిన ఇలాంటి కుర్రాళ్లంతా, ఇంట్లో వాళ్లనూ కష్టపెట్టే ఉంటారు! ‘ఇన్స్పిరేషన్’ అని ఇండియా టుడే టీవీలో ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఆ ప్రోగ్రామ్లో రహానే చెప్పిన విషయాలు వింటే, వెంటనే ముంబై వెళ్లి అతడి తల్లిదండ్రులను కలిసి కాసేపు మాట్లాడి వస్తే బాగుండనిపిస్తుంది. పేదరికంలో ఉన్న పిల్లలు బాగా అభివృద్ధిలోకి వచ్చి నలుగురికీ తెలిశారంటే.. వాళ్ల వెనుక వాళ్ల అమ్మానాన్న చేసిన త్యాగాలు కచ్చితంగా ఉంటాయి. ముంబై దగ్గరి డోంబివ్లీలో ఉండేది రహానే కుటుంబం. తండ్రి మధుకర్ బాబూరావ్ రహానే. తల్లి సుజాత. తమ్ముడు శశాంక్, చెల్లి అపూర్వ. ‘‘నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు ఏడేళ్లు. ఒక చేత్తో నా కిట్ బ్యాగుని, ఇంకో చేత్తో తమ్ముణ్ని మోస్తూ అమ్మ ఏడెనిమిది కి.మీ నడిచి నన్ను డోంబివ్లీలోనే కోచింగ్ సెంటర్కి తీసుకెళ్లేది. రిక్షాలో వెళ్లడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. తిరిగి వచ్చేటప్పుడూ అంతే. నేను నడవలేకపోయేవాడిని. ‘‘మనం ఎందుకు రిక్షాలో వెళ్లలేం అమ్మా’’ అని మూలుగుతూ అడిగేవాడిని. అమ్మ దగ్గర సమాధానం ఉండేది కాదు. వారానికి ఒక రోజు మాత్రం రిక్షాలో వెళ్లొచ్చేవాళ్లం’’ అని టీవీ ప్రోగ్రామ్లో చెప్పాడు రహానే. వాళ్ల నాన్న కూడా తక్కువ శ్రమేమీ పడలేదు. ఆ ఏడేళ్ల వయసులోనే రహానే కోచింగ్ సెంటర్ మారవలసి వచ్చింది. దోంబివ్లీ నుంచి సిఎస్టికి. అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడ దిగాలి. ప్రాక్టీస్ అయ్యాక అక్కడ ట్రైన్ ఎక్కి, ఇక్కడ దిగాలి. అమ్మకు బదులుగా నాన్న రావడం మొదలు పెట్టాడు. అయితే రైలు ప్రయాణం అలవాటు అవడానికి ఒక రోజు వస్తాను. రెండో రోజు నుంచి నువ్వే వెళ్లి వస్తుండాలి అని చెప్పాడు. ఒక రోజు అయింది. గంటన్నర ప్రయాణం. వెళ్లడానికి గంటన్నర, రావడానికి గంటన్నర. రెండో రోజు రహానే ఒక్కణ్ణే ట్రైన్ ఎక్కించి తను ఆగిపోయాడు. ‘‘నాన్న ఆగిపోయారనే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. వెనక బోగీలో ఎక్కి నాన్నగారు నన్ను ఫాలో అయ్యేవారని!’’ అని కళ్లు చెమ్మగిల్లుతుండగా చెప్పాడు రహానే. ‘‘నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మానాన్న వల్లనే. కోచింగ్ తీసుకుంటున్నప్పుడు, తర్వాత టీమ్లోకి వచ్చినప్పుడూ.. ఎప్పుడూ కూడా వాళ్లు గెలుపు ఓటముల కళ్లతో నన్ను చూడలేదు. నన్ను మాత్రమే చూశారు. వాళ్ల కొడుకుగా’’ అన్నాడు రహానే. -
సుజాత కేసులో కానిస్టేబుల్కు డీఎన్ఏ పరీక్ష!
వైఎస్ఆర్ జిల్లా,రాజంపేట: గత ఏడాది డిసెంబరు 26న రాజంపేట పట్టణంలో సంచలనం రేపిన వివాహిత సుజాత హత్యోదంతంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిస్టరీని చేధించేందుకు పోలీసులు తమదైన రీతిలో దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ అన్బురాజన్ పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సుజాత హత్య కేసులో పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతురాలి వీర్యం శాంపిల్స్, బ్లడ్శాంపిల్స్ రిపోర్టుతోపాటు కానిస్టేబుల్ డీఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత హత్యకేసు మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. హత్య జరిగిన తీరు ఇలా.. రాజంపేట పట్టణం నడిబొడ్డున నూని వారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుజాత పట్టణంలోనే ఒంటరిగా జీవనం సాగించేది. ఈ నేపథ్యంలో సుజాత హత్యచారం ఘటన సంచలనం రేపింది. సుజాత హత్య కేసులో ప్రధానంగా కిరణ్ అనే కానిస్టేబుల్కు డీఎన్ఏ పరీక్షలు చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన సుజాతతో ఆర్థిక వ్యవహారాలు సాగిస్తున్న కానిస్టేబుల్ ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కిరణ్ రక్తాన్ని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపారు. ఈ విషయాన్ని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ధ్రువీకరించారు. -
ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని సిరికొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గోప్యనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండాలో సుజాత అనే మహిళ ఉరివేసుకుని ఆదివారం బలన్మరణానికి పాల్పడింది. అత్తింటివారు వేధింపులకు పాల్పడటంతోనే సుజాత ఆత్మహత్య చేసుకుందని ఆమె తరపు బంధువులు ఆరోపించారు. సుజాత అత్తింటివారి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అయితే, విషయాన్ని గ్రహించిన మృతురాలి భర్త, అత్తామామలు అక్కడ నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
రోగుల ఏడాది జేబు ఖర్చు రూ.15,711 కోట్లు
సాక్షి, అమరావతి: సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా సకాలంలో వైద్య సేవలు అందించలేకపోవడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్లో రోగులకు జేబు ఖర్చు (ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్) ఏడాదికి రూ.15,711 కోట్లు అవుతోందని ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అధ్యక్షురాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు చెప్పారు. ఎక్కువగా మందులకు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ను కలిసి 182 పేజీల నివేదిక అందించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) అంటే గుండెజబ్బులు, క్యాన్సర్, హైపర్ టెన్షన్, మధుమేహం వంటి వాటితో సగటు ఆయుర్ధాయానికి ముందే 65 శాతం మంది మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. సగటు ఆయుర్దాయం రాష్ట్రంలో 72 సంవత్సరాలుండగా, వ్యాధుల పీడితులు 68 ఏళ్లలోపే మృతి చెందుతున్నారని చెప్పారు. జీవనశైలి జబ్బులు చాపకింద నీరులా విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. తమ నివేదికలో పొందుపరిచిన అంశాలు, ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై సుజాతారావు వివరించారు. - రాష్ట్రంలో కొత్తగా హెచ్ఐవీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. - రాష్ట్రంలో పది లక్షల కుటుంబాలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా చితికిపోయాయి. - రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తే రోగులకు ఖర్చు తగ్గించవచ్చు. - రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారు 93 లక్షల మంది ఉండగా, వీరిలో 40 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 27 శాతం మంది అమ్మాయిలు హింసకు గురవుతున్నారు. - రూ.లక్ష వేతనం తీసుకునే కంటి వైద్యుడు ఏడాదిలో ఒక్క సర్జరీ కూడా చేయని ఘటనలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలి. - మన వైద్య వ్యవస్థలో పర్యవేక్షణ అసలే లేదు. ఏ ఆస్పత్రిలో ఎవరూ బాధ్యత వహించడం లేదు. అందుకే ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో అదే రోజు సాయంత్రానికి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకునే బాధ్యత సూపరింటెండెంట్కు అప్పజెప్పాలి. - మేము ఇచ్చిన సిఫార్సులు అమలు చేసేందుకు రూ.14 వేల కోట్లు అవసరమని అంచనా వేశాం. ఇందులో వైద్య పరికరాలకే రూ.11 వేల కోట్లు అవుతుందని అంచనా. -
'పాడి'తో బతుకు 'పంట'!
విధి చిన్న చూపు చూసింది. పెళ్లయిన మూడేళ్లకే పసుపు కుంకాలను తుడిచేస్తే గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు బిడ్డల్ని తీపిగుర్తులుగా మిగిల్చి భర్త అకాల మరణం పాలయ్యాడు. అత్తింటివారు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా నిరాదరించినా కుంగిపోలేదు. ముక్కుపచ్చలారని బిడ్డల్ని వెంటబెట్టుకొని కట్టుబట్టలతో, కన్నీళ్లతో పుట్టింటికి చేరింది. ఎన్ని కష్టాలెదురైనా తన కాయకష్టంతో బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనేదొక్కటే సుజాత సంకల్పం!పాడి, పొదుపులే ఆమెకు అండాదండలయ్యాయి.. ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చాయి. జీవన రథం సజావుగా సాగడానికి అవే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.. సుజాత సొంతూరు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని తిరివిరెడ్డిపల్లె గ్రామం. రేవతి, రంగస్వామిల కుమార్తె అయిన సుజాత 7వ తరగతి వరకు చదువుకుంది. గుడిపాల మండలం దాయంవారిపల్లెకు చెందిన గురుమూర్తితో 1996లో ఆమెకు పెళ్లయింది. మూడేళ్లలోనే దురదృష్టం వెంటాడింది. ఆశలన్నీ కుప్పకూలాయి. కుమారుడు పవన్, కుమార్తె పూజిత పుట్టిన తర్వాత.. భర్త విద్యుదాఘాతంతో అకాల మరణం చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లీ పిల్లలను అత్త మామలు పట్టించుకోలేదు. ఆస్తి కూడా ఇవ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో తన ఇద్దరు బిడ్డలను వెంటపెట్టుకొని సుజాత పుట్టింటికి చేరింది. బంధుమిత్రుల సూచన మేరకు అప్పట్లోనే రూ. 50 వేలు అప్పు చేసి రెండు పాడి ఆవులు కొన్నది. ఆర్థికంగా తన కాళ్లమీద తాను నిలదొక్కుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి ఈ పాడి ఆవులే ఆమెకు ఆధారమయ్యాయి. నీటి వసతి ఉన్న ఎకరం భూమిని ఏడాదికి రూ. 15 వేల చొప్పున కౌలుకు తీసుకొని కో4 రకం పచ్చగడ్డి పెంచుతూ, పచ్చగడ్డితో పాటు ఎండుగడ్డిని కలిపి మేపుకుంటూ సంతృప్తికరంగా పాల ఉత్పత్తి ఉండేలా జాగ్రత్తపడుతున్నారామె. ఇప్పుడు సుజాత వద్ద 5 ఆవులు ఉన్నాయి. రోజుకు 30 లీటర్ల పాలను డెయిరీకి అమ్ముతూ ఉంటుంది. ప్రస్తుతం లీటరుకు రూ. 28 చొప్పున ఆదాయం వస్తున్నది. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తామంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయని సుజాత చెప్పారు. పాడిపశువులను పోషించుకుంటూనే పొదుపుపై ఆమె దృష్టి సారించారు. చాలా సంవత్సరాల క్రితమే ఆమె పొదుపుసంఘంలో సభ్యురాలిగా చేరారు. ప్రస్తుతం మండల పొదుపు సంఘం అధ్యక్షురాలిగా సుజాత పనిచేస్తున్నారు. నెలకు రూ. 4,500 ఆదాయం వస్తుంది. ఉన్న ఆదాయ వనరులతోనే ఇద్దరు బిడ్డలను ఉన్నత విద్యావంతులను చేయాలన్నదే ఆమె సంకల్పం. పొదుపు సంఘంలో రూ. 50 రుణం తీసుకొని బిడ్డల చదువుకు ఉపయోగించింది. పాడి ఆవుల ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చడంతోపాటు ఉన్నంతలో పొదుపు చేస్తోంది. కుమారుడు పవన్ ఇంటర్తో చదువు చాలించి, ఓ ప్రైవేటు డెయిరీలో ఉపాధి వెతుక్కున్నాడు. తల్లి ఆకాంక్షలకు తగ్గట్టుగా కుమార్తె 83 శాతం మార్కులతో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. పదోతరగతిలో 9.5 పర్సంటైల్, ఇంటర్లో కూడా 97 శాతం మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. పూజిత తెలివి తేటలను తిరుపతి వ్యవసాయ కళాశాల డీన్ రమేష్ ఆమెను అభినందించారు. రాష్ట్ర పొదుపు సంఘాల అధికారి విజయభారతి ఆర్థిక తోడ్పాటునందించి ప్రోత్సహించారు. పొదుపు సంఘం సభ్యులను చైతన్యవంతం చేస్తూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ సుజాత ప్రశంశలందుకుంటున్నారు. మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా.. తన రెక్కల కష్టంతో బిడ్డలకు తండ్రి లేని లోటు కనపడకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నడుపుతున్నారు సుజాత. ‘చిన్నవయస్సులో భర్తను కోల్పోయాను. అత్తమామల నిరాదరణకు గురై సెంటు భూమి లేని నిరుపేదగా మిగిలాను. జీవితంలో ఎన్నో కష్టాలకు గురైనా ధైర్యం కోల్పోకుండా ఉపాధి కల్పించుకున్నాను. స్వశక్తితో జీవిస్తున్నా. బిడ్డలను చదివిస్తున్నా. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అన్నారు సుజాత. ‘నన్ను ఉద్యోగస్తురాలిగా చూడాలని మా అమ్మ కన్న కలలు నిజం చేస్తాను. తల్లి రుణం తీర్చుకుంటాను. అమ్మను జీవితాంతం నేనే చూసుకుంటాను..’ అంటున్న పూజితను నిండు మనసుతో ఆశీర్వదిద్దాం. – దూది త్యాగరాజులు,సాక్షి, పెనుమూరు, చిత్తూరు జిల్లా -
రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి దుర్మరణం
కర్ణాటక, బొమ్మనహళ్లి : రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి సుజాత కేరాళి (17) దుర్మరణం చెందిన ఘటన ధార్వాడ తాలూకాలోని మాదనబావి గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. క్రీడాకారిణి సుజాత కేరాళి ఉదయం తండ్రి మల్లికార్జునతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిలో కారు ఢీకొంది. దీంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్లో పరారీలో ఉన్నాడు. గరగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విధివంచిత సుజాత
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వాళ్లిద్దరివి వేర్వేరు మతాలు. పెద్దలను ఎదిరించారు. పెళ్లి చేసుకున్నారు. అయితే విధి వారి మీద పగబట్టింది. సుజాతకేన్సర్ బారిన పడింది. సాయం కోసం కనబడిన ప్రతి ఒక్కరినీ అర్థిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్లో నివాసం ఉంటున్న ఇస్మాయిల్, సుజాత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలు వారిని దగ్గరకు రానివ్వలేదు. టింకరింగ్ పనిచేస్తూ ఇస్మాయిల్ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇలా పదేళ్లు గడిచిపోయాయి. గతేడాది నుంచి సుజాతకు తరచూ కడుపునొప్పి రావడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమైంది. వైద్యులు పరీక్షలు చేసి గర్భకోశ సంబంధిత కేన్సర్గా నిర్ధారించారు. ఇస్మాయిల్ రోజువారీ టింకరింగ్ పని ఆగిపోయింది. ఆమెకు సేవలు చేయడంతోనే సరిపోతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయారు. ఆస్పత్రిలో మందులకు, పరీక్షలకు అప్పులు చేయాల్సివచ్చింది. కనీసం తిండికి కూడా లేని పరిస్థితులతో కేన్సర్ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకుంది. సుజాత మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం దర్గామిట్ట సుజాతమ్మ కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ పరిస్థితిని చెప్పేందుకు సుజాత గొంతు పెగలడం లేదు. ఇస్మాయిల్ నిస్సహాయ స్థితిలో సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఆర్థికంగా చేయూతనందించదలచిన వారు పి.సుజాత, బ్యాంక్ అకౌంట్ నంబర్: 3462200115726, సిండికేట్ బ్యాంక్, దర్గామిట్ట, నెల్లూరు, ఐఎఫ్సీ కోడ్: ఎస్వైఎన్బీ 0003462 బ్రాంచిలో జమ చేయాలని అర్థిస్తున్నారు. వివరాలకు ఫోన్నంబర్: 81063 77737లో సంప్రదించవచ్చు. -
సుజాత.. సేవా బాట
మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని అక్షర సత్యం చేస్తున్నారు ఆమె. ఓ పక్క జీవన పోరాటం. మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవ చేయడానికి ప్రాంతంతో సంబంధం లేదని నిరూపిస్తూ తాను ఎక్కడుంటే అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ఇలా 20 ఏళ్లుగా జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన లక్కోజు సునీత. పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం రూరల్ : తనకున్న దానిలో పదుగురికి సేవ చేయాలనే సంకల్పం, బిడ్డ నుంచి పొందిన స్ఫూర్తి వెరసి ఆమెను సామాజిక సేవా కార్యకర్తగా మలిచింది. మొక్కవోని దీక్షతో కృషి సల్పి తాను ఎక్కడున్నా తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు లక్కోజు సుజాత. పెద్ద కుమార్తె భార్గవి ఉద్యోగ రీత్యా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఉపాధ్యాయినిగా పనిచేయడంతో స్థానికంగానే నివాసముంటున్నారు. లక్కోజు సుజాత సాధారణ గృహిణి. డిగ్రీ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు దాంపత్య జీవితం సజావుగా సాగినా అరమరికలు కారణంగా భర్త నుంచి వేరుపడ్డారు. అయినా ఏమాత్రం ఆత్మనూన్యతకు లోనుకాకుండా శ్రమకోర్చి పిల్లలను పెంచి పెద్దచేశారు. ఓ పక్క ఎల్ఐసీ ఏజెంట్గా మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. పిల్లలను విద్యావంతులను చేశారు. పెద్ద కుమార్తె భార్గవి దివ్యాంగులురాలైనా ఎంఏ హిందీ, పండిట్ ట్రైనింగ్ చేసి వీరంపాలెం హైస్కూలులో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె అనూష సముద్ర ఉత్పత్తుల (సీఫుడ్) కంపెనీలో నాణ్యతా విభాగంలో పనిచేస్తున్నారు. కుమారుడు పవన్ డిగ్రీ పూర్తి చేసి రైల్వే ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. బిడ్డ నుంచి స్ఫూర్తి సుజాత పెద్ద కుమార్తె భార్గవి పుట్టిన పదకొండు నెలల వయసులోనే పోలియో బారిన పడి దివ్యాంగురాలు కావడం ఆమెను ఎంతగానో కలచివేసింది. కదల లేని స్థితిలో తన బిడ్డపడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని భావించి 1999లో వివేకానంద వికలాంగ సంక్షేమ సంఘాన్ని ఏలూరులో నివాసం ఉండగా ఏర్పాటుచేశారు. ఈ సంఘం ద్వారానే తన తొలి అడుగు ప్రారంభించారు. ఏలూరులో ఉంటూ ఓపక్క జీవన పోరాటం చేస్తూనే మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిçస్తూ వచ్చారు. పేద విద్యార్థులకు విద్యాపరంగాను, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ, దివ్యాంగులైన పిల్లలకు తన సొంత నిధులు వెచ్చించి ఆపరేషన్లు చేయించడంలోనూ ఆమెతో పాటు పలువురు దాతలను సైతం భాగస్వామ్యం చేస్తూ వస్తున్నారు. దాదాపు 100 మంది దివ్యాంగులకు తిరుపతి బర్డ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్లు సైతం చేయించారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో అభ్యాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అశోక్కుమార్ సహకారంతో సుజాత సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలంతో పాటు నల్లజర్ల, దేవరపల్లి, కొయ్యగూడెం మండలాల్లో వివిధ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. అవార్డుల పరంపర సుజాత చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులను సైతం అందజేశాయి. 2001–2002లో జంగారెడ్డిగూడెంలో జరిగిన విజ్ఞాన, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులకు అన్నివిధాలా సహకరించినందుకు గాను, 2012లో జిల్లా సాంస్కృతికశాఖ నుంచి, 2018 నవంబర్ 25న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండో–నేపాల్ సమరసత్తా ఆర్గనైజేషన్ నుంచి ఇండో–నేపాల్ ఏక్తా అవార్డును, అదే ఏడాది ఎక్కువసార్లు రక్తదానం చేసినందుకు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఉత్తమ రక్తదాతగాను ఇలా పలు అవార్డులను సైతం లక్కోజు సుజాత అందుకున్నారు. 1990–92లో అయోధ్యలో భవ్యనవ్య రామమందిర నిర్మాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కరసేవకు ముందుకు ఉరికిన సైనిక సమ్మేళనం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలో పురిఘళ్ల రఘురామ్ చేతులమీదుగా 2017లో జ్ఞాపికను అందుకున్నారు. చిత్ర కళాకారిణిగా, అక్షర దీక్ష వలంటీర్గా, జిల్లా విద్యాకమిటీ సభ్యురాలిగా కూడా సుజాత సేవలందించారు. ఈసందర్భంగా పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. శ్వాస ఉన్నంత వరకు.. తాను, తన బిడ్డ పడుతున్న కష్టాలు సమాజంలో మరెవ్వరూ పడకూడదన్నదే ఆకాంక్ష. ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా విద్యాపరంగా, జీవనపరంగాను అవస్థలు ఎదుర్కొంటుంటే అటువంటి వారు తనను సంప్రదిస్తే చేతనైన సాయం చేస్తున్నా. బిడ్డలను ప్రయోజకులను చేశాను. నాడు నా బిడ్డ నడవలేని స్థితిలో ఉండగా ఏలూరుకు చెందిన అడ్డగర్ల రామ్మోహన్ ప్రోద్బలం, కృషితో ఇప్పుడు స్టిక్తో నడుస్తోంది. ఆయన చేసిన సాయం మరువలేను. నేను కూడా ఇలాంటి సాయాలను శ్వాస ఉన్నంత వరకు కొనసాగిస్తా. – లక్కోజు సుజాత -
ఆకాశమంత
సగం చాలదు... పూర్తి ఆకాశం కావాలి.యుద్ధానికి సకల ఆయుధాలు కావాలి.వాదనకు అన్ని అవకాశాలు ఉండాలి.ప్రతిఘటనకు సమస్త శక్తియుక్తులు కావాలి. పాలనలో స్త్రీకి స్థానం కావాలి.అణచివేత నుంచి ఒక కంఠం పైకి లేవాలి. సుజాత లాంటి అభ్యర్థికి స్వాగతం పలకాలి. ‘‘మేము చరిత్రను రాసేవాళ్లం కాదు.. చరిత్ర కన్న బిడ్డలం’’ అంటాడు మార్టిన్ లూథర్ కింగ్. అలాంటి చరిత్ర కన్న ఆడబిడ్డే సూరేపల్లి సుజాత. కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. పోరాటంలో ఉన్న వాళ్లకు, పోరాటాలను చూస్తున్న వాళ్లకు ఆమె సుపరిచితురాలు. మరెందుకు ఇప్పుడు ఈ ప్రత్యేక పరిచయం? మార్పు కోసం.. పర్సనల్ ఈజ్ పొలిటికల్ నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుంచి పోటీ చేస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్న శక్తికి సవాలుగా! అందుకే ప్రొఫెసర్, ఉద్యమనేత సూరేపల్లి సుజాత ప్రస్తావన, చిన్న పరిచయం ఇక్కడ.. ఉద్యోగధర్మాన్ని ఎక్కడా తప్పకుండానే ప్రజాసమస్యల మీద ఉద్యమిస్తూనే ఉన్నారు. బలమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?మూడు దళిత్ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అయినందుకు నామీద కేసులు పెట్టారు. కత్తి మహేష్ నిర్బంధం మీద నేను మాట్లాడ్డం, కరీంనగర్లో చనిపోయిన దళిత స్టూడెంట్కు న్యాయం జరగాలని కోరడం, సిరిసిల్లలో తండ్రీ కొడులు చనిపోతే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం. మంతెన మధుకర్ విషయం.. అన్నీ కారణమే. మంతెన మధుకర్ కేస్ ఇంకా కోర్ట్లోనే ఉంది. దళిత, ఆదీవాసీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ఇవన్నీ ప్రేరేపించాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి. మోర్దాన్ డికేడ్ యాక్టివిస్ట్గా పనిచేస్తూనే ఉన్నా. కుల సమస్యల మీద మాట్లాడ్డానికి చాలా ఆర్గనైజేషన్స్కి, మహిళా ఆర్గనైజేషన్స్కీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంతెందుకు కుల సమస్యల మీద స్పందించడానికి ప్రజాప్రతినిధులే ముందుకురారు. ఇవన్నీ చూశాకే రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత రాజకీయాల్లో ఆడవాళ్ల పరిస్థితి... ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావడమే ఒక ఉద్యమం అనిపిస్తోంది. మహిళకూ డబ్బు.. బ్యాక్గ్రౌండ్ (సామాజిక వర్గం, రాజకీయ కుటుంబ నేపథ్యం) తప్పడం లేదు. న్యాయం, నిజాయితీతో టికెట్ వచ్చే ప్రసక్తే లేదు. నా విషయంలోనూ సామాజిక వర్గం.. కోట్లు లేకపోవడం.. అన్నీ నాకు సవాళ్లే. నాకున్న ఉద్యమ నేపథ్యం, అవగాహనతో ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. నిజానికి సవాళ్లు నాకు కొత్తకాదు. కాబట్టి భయపడేది లేదు. జనరల్లో, ఇండిపెండెంట్గా కాక ఒక పార్టీ నుంచి ఎందుకు పోటీ? జనరల్లోనే వేయాలని నేనూ అనుకున్నా. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మహిళా నేతృత్వం, బహుజన సిద్ధాంతం వల్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వైపు వచ్చా. నా ఆలోచనలు ఈ సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి. నా లక్ష్య సాధనకూ ఆ పార్టీలో అయితేనే స్పేస్, సపోర్ట్ ఉంటుందని అనుకున్నా. పార్టీ నన్ను ఎంకరేజ్ చేసింది. ఇక చెన్నూరే ఎందుకు ఎంచుకున్నానంటే.. ఈ ఊరితో నాకు అంతకుముందు నుంచే అనుబంధం. ఇక్కడి ఇష్యూస్ మీద అవగాహన, పోరాడిన అనుభవం ఉంది. కులం, ఓపెన్ కాస్ట్ ఇక్కడున్న పెద్ద సమస్యలు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ల అవుతున్నా ఈ ఊళ్లో హాస్పిటల్ లేదు, కాలేజ్ లేదు. మహిళలు, విడోస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. అన్నీ కోల్పోయినా కూడా ఈ ప్రాంతం ప్రజలు ఒక చైతన్యంతో ఉద్యమాలు నడిపించారు. లక్ష్యాలు... పేదరికం, వెనకబాటు ఉన్న చోట విపరీతమైన దుష్ప్రభావం ఉంటుంది. మార్పు కోసమే రాజకీయపోరాటానికి దిగాను. ‘పర్సనల్ ఈజ్ పొలిటికల్’ నా నినాదం. ప్రధాన దృష్టి యువత ఉపాధి మీదనే. యువత అంటే మగపిల్లలే కాదు. ఆడ, మగపిల్లలు కలిపి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. అందుకే స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ ఉపాధి కల్పన, విధ్వంసం లేని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అభివృద్ధి కావాలి. వెనకబాటు తనానికి ప్రధాన కారణం చదువులేకపోవడమే. సో.. అందరికీ విద్య.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించే ప్రయత్నం జరగాలి. ఆడవాళ్లు ప్రభుత్వ పథకాల్లో బెనిఫియరీస్గా కాదు.. ఈక్వల్ సిటిజన్స్గా గుర్తింపు పొందాలి. అన్నిరంగాల్లో వాళ్లకు సమానమైన ప్రాతినిధ్యం అందాలి. ఎన్నికల ప్రయాణం ఎలా సాగుతోంది? స్త్రీలు.. అందునా ఒంటరి స్త్రీలు అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? నా క్యాస్ట్, నేపథ్యం అన్నిటితో ఆల్రెడీ నా మీద దాడులు మొదలయ్యాయి. నేను నాన్లోకల్నని, డబ్బులు తీసుకుని తప్పుకున్నాననే ప్రచారమూ చేస్తున్నారు. మహిళా జాక్కు ఫౌండర్గా, తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించినప్పుడు ఎందుకు ఈ డౌట్ రాలేదు? నా స్థానికతను అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాసమస్యల మీద పోరాడిన, పోరాడుతున్న స్త్రీలందరూ నాకు ఆదర్శం. వాళ్లముందు నేనెంత? అనిపిస్తుంటుంది. వాళ్లే నాకు ప్రేరణ. దళిత జీవితాలు నాకు ఇన్సిపిరేషన్. ‘‘డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యు సీ వైల్ స్లీపింగ్ ఇట్ ఈజ్ సమ్థింగ్ దట్ డజ్ నాట్ లెట్ యూ స్లీప్’’ అన్న అబ్దుల్ కలామ్ మాట నా బాట. మద్దతు? థాంక్స్ టు సోషల్ మీడియా పర్ ఎవ్రీ థింగ్. ట్రోల్ చేసింది. ట్రెమండస్ సపోర్ట్నూ ఇస్తోంది. నేను ఏ సమస్య మీద స్పందించినా ముందునుంచి సామాజిక మాధ్యమం చాలా మద్దతుగా నిలిచింది. ఇప్పుడైతే వలంటీర్స్ గ్రూప్స్గా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు, స్లోగన్స్, బ్యానర్స్, పోస్టర్స్, వెహికిల్స్.. ఇలా ఎవరికి ఏది వీలైతే అది చేస్తున్నారు. డబ్బు రాజకీయాలతో పోటీ పడలేని నాకు.. ఈ సోషల్ మీడియానే మంచి ప్లాట్ఫామ్ అయింది. అలాగే నా ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ కూడా. మొదటి నుంచీ నా వెన్నంటి ఉన్న ఫాదర్ ఫిగర్ ఊసాగారు (యు.సాంబశివరావు) అందరూ నా విజయం కోసం కష్టపడుతున్నారు. గెలుపుని కాంక్షిస్తున్నారు. ఫ్యామిలీ... స్వస్థలం సూర్యాపేట్. చదువుకుంది హైదరాబాద్లో. అమ్మ వరలక్ష్మి. హౌజ్వైఫ్. అమ్మ లేకపోతే ఈ రోజు నేను లేను. ధైర్యంగా ఉండడం ఆమె నుంచే నేర్చుకున్నాను. ఇద్దరు అన్నయ్యలు. నాన్న సూరేపల్లి కృష్ణయ్య .. ఎక్సైజ్ ఆఫీసర్గా పనిచేసేవారు. చనిపోయారు. అప్పటి నుంచి కష్టమంతా అమ్మదే. నేను పాలిటిక్స్లోకి వస్తుంటే వద్దనకపోవడమే వాళ్లు నాకిచ్చే సపోర్ట్(నవ్వుతూ). అన్నయ్యలు, అమ్మ అందరి సపోర్ట్ ఉంది. ఎక్కడైతే స్త్రీ, శిశు సంక్షేమానికి కూడా పురుషుడే మంత్రిగా ఉన్నాడో, ఎక్కడైతే కొత్తగా మహిళా కమిషన్నూ వేయలేదో.. స్త్రీలు సాయుధ పోరాటం చేసిన నేల మీద పాలనలో స్త్రీలకు భాగస్వామ్యం లేదో.. నిర్బంధం ఉందో.. అక్కడ పాలనలో భాగం కావాలని స్టెప్ వేశాను. చూద్దాం.. గేర్ మార్చిన ఈ ప్రయాణం గమ్యం ఏంటో? ఫలితం ఏదైనా వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ముగించింది. శబరిమలలో స్త్రీల ప్రవేశం? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కావడానికి ఇంత రభస జరుగుతోందంటే సమాజం ఇన్క్లూడింగ్ ఆల్ పార్టీస్లో హిందూమత పితృస్వామ్య వ్యవస్థ భావజాలం ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమైంది కదా! అంతటా డబుల్ స్టాండర్డే. రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కనీస అవగాహన లేనితనానికి నిదర్శనం. మీ టూ మీద? తమ పట్ల జరిగిన హింసను ఇన్నాళ్లకైనా బయటకు వచ్చి చెప్పడం మంచి పరిణామమే. దీన్ని బట్టి దేర్ ఈజ్ నో సేఫ్ స్పేస్ ఫర్ ఉమన్ అని తేలింది. ఏ మహిళకు ఎలాంటి అవమానం జరిగినా సాలిడారిటీ ఉంటుంది. అయితే మీ టూ మీద మీడియా చేసినంత ఫోకస్ సామాన్య స్త్రీలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు చేయదు? మహిళల మీద జరుగుతున్న అన్నిరకాల హింసా ఆగాలి. మహిళలను పక్కన పెట్టే ఎన్ని పథకాలు వచ్చినా అవి పనికిమాలినవే. ఆకాశంలో సగం అంటారు.. ముందు అసలు నేలమీదే సగం లేము. నేను మహిళను కాబట్టి మహిళ గురించి ఆలోచించాలి అని కాకుండా.. అందరూ ఆలోచించి సమభాగస్వామ్యం ఇచ్చినప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. స్టార్ క్యాంపెయిన్ నిజంగా ప్రజాసమస్యల మీద అవగాహన ఉండి ప్రచారానికి వస్తే మంచిదే. కాని కేవలం జనాల అటెన్షన్ కోసమే అయితే.. మార్కెట్ కల్చర్లో భాగంగా చూస్తా. దళిత్మూవ్మెంట్ స్వాతంత్య్రానికి ముందు.. ఇప్పుడు? దీన్ని టైమ్ అండ్ స్పేస్ కాంటెక్స్›్టలో చూడాలి. అంబేద్కర్ ఉన్నంతవరకు చాలా క్లిష్టమైన రాజకీయ అవగాహన జరిగిందని నా అభిప్రాయం. ఇప్పడు దళిత మూవ్మెంటే కాదు అన్ని మూవ్మెంట్స్ హైలీ పొలిటిసైజ్ అయిపోయాయి. అప్పటిలా ఒక్కనేతే దేశమంతా నడిపే అవకాశంలేదు. దళిత ఉద్యమానికి సంబంధించీ అంతే. ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందో.. అంతే కాన్షస్నెస్ ఉంది. ఫీనిక్స్లా పడి లేస్తూనే ఉంది. ఒక స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఆ శక్తిపేరు మెర్సీ మార్గరెట్. పొయెట్గా అందరికీ తెలుసు. కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత కూడా. స్వస్థలం ముషీరాబాద్లోని రంగానగర్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం..ఆ ప్రాంత పరిస్థితులే అంటుంది మెర్సీ. ‘నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉంది. ఎలాంటి మార్పు లేదు. అయిదేళ్లకు ఒక్కసారి మాత్రమే కనిపించే నేతలు, అబద్ధపు హామీలతో విసిగి పోయున్నారు జనాలు. ఈ సిట్యుయేషన్ మారాలనే ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చా. చిన్నప్పుడు మా తాతయ్య, నాన్న దగ్గర రాజకీయాల గురించి వినేదాన్ని. రైటర్గా మారాక ఇంకొంత అవగాహన వచ్చింది.ఎన్జీవోలో పనిచేసినప్పుడూ కొన్ని విషయాలను నేర్చుకున్నా. ఆలోచనలు చేతల్లో ఉంటేనే మార్పు సాధ్యం. దానికి అధికారం ఉండాలి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. విద్య, ఆరోగ్యం, ఉపాధి నా లక్ష్యాలు. గెలుపు ఓటముల కన్నా.. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఉండాలి. ఆ ధ్యేయంతోనే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడ్డా’’ అంటుంది మెర్సీమార్గరేట్. ప్రస్తుతం ఆమె భారత్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. – సరస్వతి రమ -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కర్నూలు జిల్లా / గడివేముల: కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. మండల పరిధిలోని పెసరవాయిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలను ఎస్ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గ్రామానికి చెందిన స్వాములుకు 12ఏళ్ల క్రితం సుజాత(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా సుజాత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు వచ్చి, రోజూ గొడవ పడేవారు. తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక ఇటీవల ఆమె తిరుపాడులో ఉన్న తన సోదరి రాజ్యలక్ష్మి వద్దకు వెళ్లింది. ఇక నుంచి గొడవ పడకుండా ఉందామని చెప్పి శుక్రవారం భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో తలపై నరికి పరారయ్యాడు. రక్తపు మరకల్లో విగత జీవిగా పడివున్న సుజాతను చూసి చుట్టుపక్కల వారు సోదరికి సమాచారం ఇచ్చారు. పాణ్యం సీఐ వాసుకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి అక్క రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: ఎక్స్లెన్స్ ఇన్ ఫార్మింగ్ సుజాత
-
కలప దోషులపై చర్యలు తీసుకోవాలి
ఆదిలాబాద్: కోట్ల రూపాయల విలువ చేసే కలప పట్టుకున్నా దోషులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని, వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గం డ్రత్ సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం ఆ దిలాబాద్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ఆమె ఇంటి నుంచి ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను లోపలికి వెళ్లుకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయటే బైఠాయించారు. డీఎఫ్ఓ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కోట్లు విలువ చేసే కలపను పట్టుకున్న అధికారులు, దానికి సంబంధించిన సరైన వివరాలు వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన మంత్రి సమాధానం దాటవేస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా, డీఎఫ్ఓ వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించడంతో గంట తర్వాత డీఎఫ్ఓ ప్రభాకర్ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తమకు కలప వివరాలు తెలియజేయాలని, పట్టుకున్న విలువ, దానికి వెనుక ఉన్న దోషులను బయట పెట్టాలని డీఎఫ్ఓతో తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాట్లే, సైదుల్లాఖాన్, వామన్వాంక్డే, రూప్రావు, గన్శ్యాం, సంజయ్గుండావార్, గిమ్మ సంతోష్, నగేష్, పొచ్చన్న, తదితరులు పాల్గొన్నారు. -
కలప స్మగ్లింగ్లో మంత్రి నైతిక బాధ్యత వహించాలి
ఆదిలాబాద్టౌన్: ఇటీవల జరిగిన ఆక్రమ కలప వ్యవహారంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నైతిక బాధ్యత వహించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రి స్వంత జిల్లాలో లక్షల రూపాయల్లో కలప స్మగ్లింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నోరు విప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించా రు. దీని వెనుక మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హరితహారం పేరిట దోచుకుంటూ టీఆర్ఎస్ నాయకులు, మరో వైపు కశ్మీర్ లాంటి ఆదిలాబాద్ జిల్లాలను ఏడారి ప్రాంతంగా మరుస్తున్నారని ఆరోపించారు. కలప స్మగ్లింగ్పై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్, సంతోష్రావు, పోచ్చన్న, రఫిక్, భూమారెడ్డి, సంతోష్, రాజేశ్వర్, బాబాసాహెబ్, లింగన్న, వెంకటి, రూపేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హత్యచేసి..అమాయకుడిలా...
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ప్రియుడి చేతిలో మోసపోయి దారుణంగా హత్యకు గురైన సుజాత కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆధారాలు లేకుండా చేశాను కదా... తనతోపాటు మృతురాలి ఆచూకీ కూడా తెలియని భావించి గోపాలపట్నం పెట్రోల్ బంకు జంక్షన్ సమీపంలోని తన ఫొటో స్టుడియోలో ఉంటూనే హంతకుడు రాయపురెడ్డి సతీష్ పోలీసుల దర్యాప్తుని గమనించాడు. మరోవైపు సుజాతను నమ్మించి దారుణంగా హతమార్చిన తర్వాత కూడా తనకేం తెలియనట్లు మృతురాలి అక్కతో కబుర్లు చెప్పడం విశేషం. హత్య జరిగిన వారం రోజుల తర్వాత... వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో సుజాత కనిపించడం లేదని... నీ దగ్గరుందా... అని సతీష్కి సుజాత సోదరి అరుణ ఫోన్ చేసింది. దీంతో సతీష్ నీళ్లు నమిలాడు. తనకూ కొద్ది రోజులుగా సుజాత కనిపించడం లేదు.. ఎక్కడుందో ఏంటో.. రెండుమూడు నెలల్లో వచ్చేస్తుంది లెండి.. అంటూ నమ్మించేందుకు యత్నించాడు. అంటే ఆమె ఎక్కడుందో నీకు తెలుసన్నమాట అని అరుణ ప్రశ్నించే సరికి అయ్యో.. నన్నే అనుమానించేలా ఉన్నారేంటి.. నా సంగతి మీకు తెలీదా.. మీకు సుజాత కనిపించలేనందుకు 90శాతం టెన్షన్ ఉంటే నాకు వంద శాతం ఉంది.. చచ్చిపోదామన్నంత టెన్షన్ అనుభవిస్తున్నా.. నరకం అనుభవిస్తున్నా... నాకు వైజాగ్లో, హైదరాబాద్లో స్నేహితులున్నారు.. నాకు సుజాతకు ఇలా సంబంధం ఉందని కాకుండా ఫలానా ఆమె కనిపించలేదని అందరికీ వాకబు చేస్తున్నా.. నా ప్రయత్నంలో నేనున్నా.. ఇంకా చెప్పాలంటే సుజాత కనిపించక, ఊళ్లో నన్ను చూసి ఏమైందిరా.. అంటూ అడగడం, నేను తలెత్తుకోలేక చావాలని ప్రయత్నిస్తే మా నాన్న రక్షించడంతో బతికాను.. అని కథ అల్లాడు. సుజాత హ్యాపీగా ఉంటే చాలు నేను కళ్లు మూసుకుని పడుకుంటాను.. నా పరిస్థితి నది మధ్యలో చిక్కుకున్న నావలా ఉంది.. మీరు సుజాత కోసం ఎలా అనుకుంటున్నారో గానీ ఆమేమీ పిరికిది కాదు... మీకేమైనా సమాచారం తెలిస్తే నాకు తెలియజేయండి... నాకు తెలిస్తే మీకు ఫోన్ చేస్తా... అంటూ హంతకుడు సతీష్ ఫోన్ సంభాషణ సాగించడం గమనార్హం. ఈ ఫోన్ సంభాషణను మృతురాలి సోదరి అరుణ పెందుర్తి పోలీసులకు అందించారు. -
ప్రేమగా నమ్మించి గొంతు నులిమేశాడు
విశాఖ క్రైం: ఒంటరి మహిళతో మాటలు కలిపాడు. ప్రేమగా చేరువై సహజీవనమూ చేశాడు. కొన్నాళ్ల తర్వాత తనో ఇంటివాడు కావాలనుకున్నాడు. అందుకు అడ్డంకిగా మారిన ప్రియురాలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళిక రచించుకుని హత్య చేశాడు. ఏ ఆధారమూ లభించకపోవడంతో మిస్టరీగా మారినప్పటికీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా భావించి భిన్నకోణాల్లో శోధించి ఛేదించారు. సఖ్యతగా ఉన్నప్పుడు ప్రియుడు కొనిచ్చిన పట్టీలే నిందితుడిని పట్టించాయి. పెందుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం నరవ రహదారిలోని రైల్వే లే అవుట్ సమీపంలో జరిగిన మహిళ హత్యకేసులో ప్రియుడే కాలయముడని తేల్చారు. అనైతిక సంబంధాలు చివరకు విషాదాంతం అవుతాయనేందుకు మరో ఉదాహరణగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీసీపీ రవికుమార్మూర్తి వెల్లడించారు. హంతకుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బతుకుతెరువుకు నగరానికి వచ్చి... గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కొండపూరి సుజాత (32)కు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తితో 2004లో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా 2011లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. అనంతరం విశాఖపట్నం చేరుకుని అశీలుమెట్ట దరి సంపత్ వినాయకుని గుడి సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్లోని హెర్బల్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అదే జంక్షన్లో ఫొటో స్టూడియో నడుపుతున్న దేవరాపల్లి మండలం తిమిరాం గ్రామానికి చెందిన రాయపురెడ్డి సతీష్(27)తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతో 2016వ సంవత్సరం ఏప్రిల్ 2న ఇద్దరూ సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం బాజీ జంక్షన్ వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. అనంతరం గోపాలపట్నం పెట్రోల్ బంక్ సమీపంలో ఈశ్వర్ డిజిటల్ పేరుతో మరో స్టూడియోను సతీష్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో అతనికి గాజువాక నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. తనను కాదని పెళ్లి చేసుకునేందుకు సతీష్ సిద్ధం కావడంతో ఆగ్రహించిన సుజాత పెద్దలను సంప్రదించింది. ఈ క్రమంలో సతీష్ స్వగ్రామం దేవారాపల్లి మండలంలోని తిమిరాం గ్రామానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకూ విషయం తెలియజేసింది. తాము సింహాచలం లో పెళ్లి చేసుకున్నామని, తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు పెరగడంతో బాజీ జంక్షన్లోని ఇల్లు ఖాళీ చేసేసి రామాటాకీస్ సమీపంలోని వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో సుజాత చేరింది. ప్రేమగా నమ్మించి గొంతు నులిమేశాడు ♦ తన వివాహానికి అడ్డంకిగా ఉన్న సుజాత అడ్డు తొలగించుకోవాలని సతీష్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ముందే ప్రణాళిక రచించుకుని స్థలం కూడా ఎంపిక చేసుకున్నాడు. ♦ ప్రణాళికలో భాగంగా ఈ నెల 3న రాత్రి 7 గంటల సమయంలో రామాటాకీస్ సమీపంలోని హాస్టల్కు వెళ్లి సుజాతను బైక్పై తీసుకెళ్లాడు. ♦ అనంతరం ఇద్దరూ వీమ్యాక్స్లో సెకెండ్ షోకి వెళ్లి రంగస్థలం సినిమా చూశారు. ♦ థియేటర్ నుంచి బీచ్కు వెళ్లి కొంత సేపు గడిపిన తర్వాత నేరుగా గోపాలపట్నంలోని ఫొటో స్టూడియోకు చేరుకున్నారు. ♦ స్టూడియోలో కొంతసేపు గడిపిన తర్వాత బయటకు వెళ్దామని సుజాతను నమ్మించాడు. ♦ ముందుగానే తను ఎంపిక చేసుకున్న పెందుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం నరవ రహదారిలోని రైల్వే లే అవుట్ వద్దకు తీసుకెళ్లాడు. ♦ అక్కడ మాటలు కలిపి ముందుగానే కొనుగోలు చేసి తీసుకొచ్చిన తాడును సుజాత మెడకు బిగించి హతమార్చాడు. ♦ అనంతరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బైకులోని పెట్రోల్ తీసి మృతదేహంపై పోసి కాల్చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. పట్టించిన పట్టీలు ♦ స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నవుడు దేముడుబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. సమీపంలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినా ఎక్కడా ఏ ఆధారమూ లభించలేదు. ♦ మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేయడంతో పెద్దగా ఆనవాళ్లు దొరకలేదు. ♦ ఆ సమయంలోనే పోలీసులకు మృతురాలి కాళ్లకు ఉన్న పట్టీలు కనిపించాయి. ♦ వాటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో నగరంలోని ప్రముఖ దుకాణంలో కొనుగోలు చేసినట్లు ఆ కంపెనీ లోగో కనిపించింది. ♦ వెంటనే సదరు దుకాణం నిర్వాహకుల నుంచి జాబితా సేకరించగా సుజాత పేరు మీద పట్టీలు కొనుగోలు చేసినట్లు బిల్లు లభించింది. బిల్లులోని ఫోన్ నంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తే రాయపురెడ్డి సతీష్ వద్ద ఆగింది. డీసీపీ రవికుమార్ మూర్తి నేతృత్వంలో ఏసీపీ అర్జున్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సతీష్ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారిస్తే హత్యోదంతం మొత్తం వెలుగుచూసింది. సమావేశంలో ఏసీపీ అర్జున్, సీఐలు సూర్యనారాయణ, చంద్రశేఖర్ ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: ఎంతో ప్రాణంగా ఏడేళ్లుగా ప్రేమించిన మేనమామ పెళ్లికి నిరాకరించడంతో గుంతకల్లు మండలంలోని దోసలుడికి గ్రామానికి చెందిన సుజాత (24) అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములు, గురులక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా అందులో రెండో కూతురు సుజాత. అదే గ్రామానికి చెందిన తన మేనమామ గురునాథ్, సుజాతలు ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుజాత పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ అప్పులు, ఇతర సమస్యలను సాకుగా చూపి గురునాథ్ మాట దాటవేస్తూ వచ్చాడు. మేనమామపైనే ఆశలు పెట్టుకున్న సుజాత ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూడటంతో గురునాథ్ను తప్ప వేరేవాళ్లను చేసుకోనంటూ ఇంట్లో వాళ్లకు తెగేసి చెప్పింది. కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుంటానని గురునాథ్ కూడా అంగీకరించడంతో సుజాత తల్లిదండ్రులు ఆమెను ఏడాది క్రితం మూడో కూతురుకు వివాహం చేశారు. కాగా గురునాథ్ ఇటీవల సుజాతతో పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పడంతో సుజాత తీవ్ర మనస్థాపానికి గురైంది. కూతురు బాధను చూడలేని ఆమె తల్లి ఆగ్రహంతో తన కూతురుకు వేరే సంబంధం చూసేందుకు సిద్ధపడింది. గురువారం ఉదయం పెళ్లి సంబంధం చూడటానికి ఏర్పాట్లు చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుజాత బుధవారం అర్ధరాత్రి సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం కొన ఊపిరితో ఉన్న సుజాతను చూసిన కుటుంబ సభ్యులు అసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేసకొని దర్యాప్తు చేపట్టారు. -
‘బొండా’గిరికి ప్రభుత్వ దన్ను
సాక్షి, అమరావతిబ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూబాగోతానికి ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ఆయన భూ బండారం బట్టబయలైనా చర్యల విషయంలో ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి కేసును నీరుగార్చాలని చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొండా ఉమా రూ.50 కోట్ల భూబాగోతం కేసులో ఏ–1గా ఉన్న అబ్దుల్ మస్తాన్, ఏ–2గా ఉన్న రామిరెడ్డి కోటేశ్వరరావు అందులో తమ ప్రమేయం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ 5.16 ఎకరాలను తాము కొనలేదని, అలాంటప్పుడు దాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతోపాటు ఇతరులకు విక్రయించే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. సీఐడీ, రెవెన్యూ, రిజిస్ట్రార్ అధికారుల విచారణలో ఈ విషయాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం అబ్దుల్ మస్తాన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఆయన మాట్లాడలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోజు కూలీ చేసుకునే తమకు కోట్ల విలువైన భూమి కొనే స్తోమత ఎక్కడిదని వారు సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అయినా ప్రభుత్వం దన్ను... ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూదందాకు పాల్పడినట్లు స్పష్టం అవుతున్నా ప్రభుత్వం మాత్రం మౌనం వీడడంలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వ ముఖ్యనేతతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలుస్తోంది. అందుకే ఆ భూమిని ఎమ్మెల్యే బొండా కుటుంబం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకోవడమే లేదు. నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ నిర్మించిన షెడ్డూ, ప్రహరీని కూల్చివేయాలి. ఆ దిశగా చర్యలు తీసుకునే ఉద్దేశమే లేనట్లు వ్యవహరిస్తుండటం సందేహాలకు కలిగిస్తోంది. జీపీఏ చేసుకోవడానికి రద్దుకు మధ్యలో ఆ భూమిపై ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం పలు క్రయవిక్రయాలు నిర్వహించింది. అవన్నీ కూడా అధికారికంగా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీ, రెవెన్యూ అధికారులు నెమ్మదించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు మౌనం తరువాత కేసును నీరుగార్చాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. ముఖ్యనేతతో సంప్రదింపుల తరువాత బొండా వర్గం ఎదురుదాడికి దిగడం గమనార్హం. సూర్యనారాయణ కుటుంసభ్యులపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. వారు చూపించిన పత్రాలు నకిలీవని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులను సామ, దాన, భేద, దండోపాయాలతో తమదారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ అండతోనే భూ కబ్జాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ అండతోనే... రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలను బొండా ఉమామహేశ్వరరావు తన కనుసన్నల్లో పెట్టుకొని కబ్జాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆరోపించారు. బీసెంట్ రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొండా నడవడిక విజయవాడ చరిత్రకు మాయనిమచ్చగా నిలిచిందన్నారు. బొండా ఉమాపై మూడు నెలల కిందట సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. బొండా ఉమా దందాలలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శార్వాణి మూర్తి, వెన్నం రత్నారావు, బీసీ సెల్ నేత బంకా భాస్కర్, లీగల్ సెల్ నగర అధ్యక్షుడు టి.సుబ్బారావు, నగర అధికార ప్రతినిధులు కొండలరావు, మారుతి మహావిష్ణు పాల్గొన్నారు. -
ప్రేమ పేరిట వంచించాడు..
నస్పూర్(మంచిర్యాల): తనను ప్రేమించి, కొతకాలంగా సహజీవనం గడిపిన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్లంపల్లికి చెందిన గంపల సుజాత అనే యువతి గురువారం నస్పూర్లోని మోతునూరి నరేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. సుజాత, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక స్కానింగ్ సెంటర్లో ఆరు సంవత్సరాలుగా ఇరువురు పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం నరేష్ వేరొక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సుజాత ప్రతిరోజు బెల్లంపల్లి నుంచి రాకపోకలు సాగించడంతో నరేష్ ఆమెను మంచిర్యాలలో ఒక అద్దె ఇంటిలో ఉంచి సంవత్సర కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సుజాత చిట్టీ వేస్తూ పొదుపు చేసుకున్న రూ.1.80 లక్షలు తన ఖర్చులకోసం వాడుకున్నాడు. ఇటీవల నరేష్ తల్లిదండ్రులు అతనికి వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని నిలదీసింది. దీనికి అతడు నిరాకరించాడు. దీంతో నరేష్పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నరేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సీసీసీ ఎస్సై రాజేంద్రప్రసాద్ సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని సుజాత పేర్కొంది. -
వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?
బంజారాహిల్స్: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్ను మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
అద్దంకి రూరల్: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి పట్టణంలోని కొత్త దామావారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు పట్టణంలోని కొత్తదామావారిపాలెంలో నివాసం ఉంటున్న కటికల సుజాత (25) స్థానిక పెట్రోలు బంకులో పనిచేస్తున్న వీరాంజనేయులుని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవల భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా, మార్గమధ్యంలోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
దంపతులపై వేట కొడవళ్లతో దాడి
-
నీవు లేని జీవితం మాకొద్దు
► డెత్నోట్ రాసి తల్లీ, కుమారుడు రైలు కిందపడి ఆత్మహత్య ► చిన్న కుమారుడి ఆత్మహత్య జీర్ణించుకోలేక బలవన్మరణం కర్ణాటక: చిన్న కుమారుడి మరణం జీర్ణించుకోలేని ఒక తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి డెత్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక సంఘటన దేవనహళ్లి తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకాలోని యలియూరుకు చెందిన తల్లి సుజాత (35), ఈమె పెద్ద కుమారుడు సూర్యతేజ్ (17) ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల క్రితం సుజాత చిన్న కుమారుడు చంద్రతేజ్ (12) ఇంట్లో గొడవతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న సుజాత సోమవారం సాయంత్రం తన పెద్దకుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం వీరు రైలు పట్టాలపై శవాలై కనిపించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి డెత్నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో చంద్రతేజ్ మృతితో బాధతాళలేక ఆత్మహహత్య చేసుకుంటున్నామని, తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఇద్దరినీ ఒకే గుంతలో పూడ్చిపెట్టాలని కోరారు. అందులో విల్సన్ బాల్, పౌడర్ డబ్బా, చెప్పులు కూడా వేయాలని, అంగడి సరస్వతమ్మ, ఆనంద్ అనే ఇద్దరి వద్ద చిన్నమొత్తం అప్పు తీసుకున్నామని, ఆ డబ్బు ఇంట్లో టీవీ కింద పెట్టామని అది వారికి ఇవ్వాలని రాసుకున్నారు. యశ్వంతపూర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్ ఆర్టిస్ట్
-
ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్ ఆర్టిస్ట్
గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో డబ్బింగ్ ఆర్టిస్ట్ సుజాత.. భర్త యశ్వంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మౌనదీక్షకు దిగింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో యశ్వంత్ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత్ చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందని, యశ్వంత్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. -
సుజాత ఆత్మహత్య కేసులో పురోగతి
-
సుజాత కేసులో పురోగతి
హైదరాబాద్: కూకట్పల్లిలో ఇంటి ఓనర్ వేధింపుల కారణంగా సుజాత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. సుజాత అద్దెకు ఉన్న ఇంటి యజమాని ప్రసన్న కుమార్ రెడ్డి, స్నేహలత దంపతులపై కూకట్పల్లి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం వారిద్దరిని మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. ఇంటి ఓనర్ తనను తీవ్రంగా వేధించాడని ఇంట్లో పలు చోట్ల రాసి సోమవారం సుజాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే ఇంటి ఓనర్ ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యాడు. ఈ ఇంటిలో రెండున్నరేళ్లుగా సుజాత దంపతులు అద్దెకు ఉంటున్నారు. సుజాత పిల్లలు అల్లరి చేస్తున్నారని కొంతకాలంగా ఓనర్ గొడవ పడినట్టు తెలుస్తోంది. సుజాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ ఆమెతో గొడవపడి, అసభ్యంగా మాట్లాడాడని బంధువులు చెప్పారు. సుజాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. -
హోంమంత్రి ఆదేశాలు : అత్తింట్లోకి సుజాత
హైదరాబాద్: మూడు రోజులుగా అత్తింటి ముందు న్యాయం కోసం దీక్ష చేపట్టిన సుజాత హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు అత్తింట్లోకి అడుగు పెట్టింది. ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీలో నివసించే బీజేపీ నేత ఎస్పీ.శ్రీను కొడుకు అశోక్ 2004లో నవనిర్మాణ్నగర్ బస్తీకి చెందిన సుజాతను ప్రేమ పేరుతో కొద్ది రోజులు సహజీవనం చేసి పెద్దలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడు. (చదవండి : ‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే.. ) వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఇటీవల అశోక్ మరో వివాహం చేసుకోవడానికి పథకం వేసుకొని సుజాతను దూరం పెట్టాడు. దీంతో ఆమె రోడ్డున పడింది. న్యాయం కోసం అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్ష చేపట్టింది. హోం మంత్రిని కలవగా ఆమెను అత్తింట్లోకి పంపించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం స్థానిక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాల మద్దతుతో అత్తింటి గ్రౌండ్ఫ్లోర్లో ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లింది. -
ఇంటి యజమాని వేధిస్తున్నాడంటూ..
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్పల్లి మెడికల్ సొసైటీలో చోటుచేసుకుంది. స్థానిక ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నర సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి మూడు, ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఒక బాబు, పాప ఉన్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ ఓనర్ గొడవపెట్టుకున్నాడని సుజాత బంధువులు చెబుతున్నారు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ గొడవకు దిగడంతో మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ప్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులకు తెలిపారు. కాగా తన చావుకు ఇంటి యజమాని కారణమంటూ ఇంట్లో గోడలు, తలుపులపై రాసి సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.