
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 50 మంది ప్రముఖులు గురువారం సీఎంను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలు పంచుకున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజ్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


















