
అడిలైడ్ స్ట్రయికర్స్తో స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన మహిళల బిగ్ బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో అడిలైడ్ స్ట్రయికర్స్ తరఫున బరిలోకి దిగనుంది.

చాన్నాళ్లుగా స్మృతి సేవల కోసం ప్రయత్నిస్తున్న అడిలైడ్ ఫ్రాంచైజీ ఎట్టకేలకు టీమిండియా స్టార్ను దక్కించుకుంది.

లీగ్లో కొత్తగా తీసుకొచ్చిన విదేశీ ప్లేయర్ల నిబంధనల ప్రకారం సీజన్ ఆరంభానికి ముందు గత సీజన్ చాంపియన్ అడిలైడ్ జట్టు స్మృతిని సొంతం చేసుకుంది.

స్మృతి డబ్ల్యూబీబీఎల్లో ఇప్పటివరకు బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, హోబర్ట్ హరికేన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.

అక్టోబర్ 27 నుంచి డబ్ల్యూబీబీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా... తొలి దశ పోటీలకు స్మృతి అందుబాటులో ఉండకపోవచ్చు. అదే సమయంలో భారత జట్టు న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడనుంది.

ఈ సిరీస్ ముగిశాక అడిలైడ్ స్ట్రయికర్స్తో స్మృతి చేరనుంది.

‘స్మృతి కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఎట్టకేలకు ఆమె మా బృందంలో చేరింది.

క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్లను లాగేసుకోవడంలో స్మృతిది అందెవేసిన చేయి.

మహిళల ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆమెతో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా’ అని అడిలైడ్ జట్టు కెప్టెన్ తాలియా మెక్గ్రాత్ పేర్కొంది.