Adelaide
-
రోహిత్కు విసుగుతెప్పించిన అభిమాని.. హిట్మ్యాన్ రియాక్షన్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘కోపమొచ్చింది’. తనను చుట్టుముట్టిన అభిమానుల్లో ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో హిట్మ్యాన్ నవ్వుతూనే విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనివ్వడంతో.. ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే, భార్యకు ప్రసవమైన వెంటనే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.పెర్త్ వేదికగా మొదటి టెస్టు మధ్యలోనే జట్టుతో చేరాడు. ఇక అడిలైడ్లో డిసెంబరు 6 నుంచి మొదలుకానున్న రెండో టెస్టు(పింక్ బాల్)తో రోహిత్ తిరిగి టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడు. అయితే, అంతకంటే ముందే గులాబీ బంతితో టీమిండియా సాధన చేసింది. కాన్బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.టీమిండియా విజయంశనివారం మొదలుకావాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల తొలిరోజు టాస్ పడకుండానే ముగిసిపోయింది. దీంతో ఆదివారం ఆట కొనసాగగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ మ్యాచ్కు వెళ్తున్న సమయంలో రోహిత్ శర్మను అభిమానులు చుట్టుముట్టారు.హిట్మ్యాన్ రియాక్షన్ వైరల్హిట్మ్యాన్తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు. అయితే, ఓ అభిమాని.. రోహిత్ వేరేవాళ్లకు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా తనతో సెల్ఫీ దిగాలంటూ పదే పదే విసిగించాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన రోహిత్.. ‘‘ఒకసారి ఒక్క పని మాత్రమే చేయగలం’’ అని సున్నితంగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో రోహిత్ కేవలం మూడు పరుగులే చేసి అవుటయ్యాడు.కాన్బెర్రాను వీడిన రోహిత్ సేనరెండో టెస్టు కోసం టీమిండియా అడిలైడ్కు పయనమైంది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్ కోసం కాన్బెర్రాకు వచ్చిన రోహిత్ సేన తొలుత ఆసీస్ ప్రధాని ఆంథోని ఆల్బనీస్తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం రోహిత్ ఆస్ట్రేలియన్ పార్లమెంటులో ప్రసంగించాడు. ఇక ఇప్పుడు పింక్ బాల్ టెస్టులో సారథిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు.Rohit to fan's : "ak time par ak hi kaam ho Sakta hai."😂👌🏻Captain Rohit Sharma giving autograph to fan's at Manuka oval Canberra.🙌🇮🇳 pic.twitter.com/kkCMb6LHQt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 30, 2024 -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్గా కొనసాగుతున్నాడు.అడిలైడ్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)
-
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్బాష్ లీగ్లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్బాష్ లీగ్లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఊచకోత.. 28 బంతుల్లోనే..!
బిగ్బాష్ లీగ్ 2023-24లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఈవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న ఈవాన్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఈవాన్స్ తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేశాడు. బీబీఎల్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టి కావడం విశేషం. ఈవాన్స్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈవాన్స్తో పాటు వైట్మ్యాన్ (31), ఆరోన్ హార్డీ (34), జోస్ ఇంగ్లిస్ (26) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో థార్టన్, ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్లో ఉన్నంతసేపు లక్ష్యం దిశగా సాగింది. అయితే షార్ట్ ఔటైన అనంతరం స్ట్రయికర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటై, 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లాన్స్ మోరిస్ (4-0-24-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో స్ట్రయికర్స్ పతనాన్ని శాశించాడు. జై రిచర్డ్స్సన్ (2/31), ఆండ్రూ టై (2/35), బెహ్రెన్డార్ఫ్ (1/24) తలో చేయి వేశారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్లో షార్ట్తో పాటు క్రిస్ లిన్ (27), థామస్ కెల్లీ (29), ఆడమ్ హోస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
తొలి రౌండ్లోనే సానియా జోడీ ఓటమి.. ప్రైజ్మనీ?
Adelaide Open 2023: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సంవత్సరాన్ని ఓటమితో ప్రారంభించింది. సోమవారం మొదలైన అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 టోర్నీలో సానియా మీర్జా–అనా డానిలినా (కజకిస్తాన్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సానియా–డానిలినా ద్వయం 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన సానియా– డానిలినా జోడీకి 4,350 డాలర్ల (రూ. 3 లక్షల 58 వేలు) ప్రైజ్మనీ దక్కింది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ -
ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన సబలెంకా
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్లో ఇది 11వ టైటిల్కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Adelaide International 1: జొకోవిచ్... టైటిల్ నంబర్ 92
అడిలైడ్: కొత్త ఏడాదిని సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్తో మొదలుపెట్టాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల జొకోవిచ్ చాంపియన్గా నిలిచాడు. 3 గంటల 9 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–7 (8/10), 7–6 (7/3), 6–4తో ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై శ్రమించి గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. అంతేకాకుండా 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడిలైడ్ ఓపెన్లో ఈ మాజీ నంబర్వన్ విజేతగా నిలిచాడు. 2007లో 19 ఏళ్ల ప్రాయంలో జొకోవిచ్ తొలిసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాడు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ పీటర్ కోర్డా తనయుడైన సెబాస్టియన్ కోర్డాతో తొలిసారి తలపడ్డ జొకోవిచ్ ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచాడు. తొలి సెట్ కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్లో 5–6తో వెనుకబడి తన సర్వీస్లోని 12వ గేమ్లో 30–40తో మ్యాచ్ పాయింట్ను కాచుకున్నాడు. ఓవర్హెడ్ షాట్తో పాయింట్ గెలిచి 40–40తో సమం చేసిన జొకోవిచ్ అదే జోరులో తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. ఆ తర్వాత టైట్రేక్లో జొకోవిచ్ పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. జొకోవిచ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాక 12వ గేమ్లో కోర్డా సర్వీస్ను బ్రేక్ చేసి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 94,560 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 77 లక్షల 85 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జొకోవిచ్, రాఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిల్స్తో సమఉజ్జీగా నిలిచారు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా; 109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 103 టైటిల్స్), ఇవాన్ లెండిల్ (అమెరికా/చెకోస్లొవేకియా; 94 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్బాష్ లీగ్లో చారిత్రక విజయం
బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్తో జరిగిన మ్యాచ్లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్లో భాగంగా చెక్ రిపబ్లిక్తో జరిగిన మ్యాచ్లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
Ind Vs Aus: భారత జట్టుకు మరో ఓటమి.. సిరీస్ ఆస్ట్రేలియాదే
India Vs Australia- Hockey Series: ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత జట్టు 1–4తో కోల్పోయింది. అడిలైడ్లో జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 4–5తో ఓడింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ (24వ, 60వ ని.లో) రెండు గోల్స్... అమిత్ రోహిదాస్ (34వ ని.లో), సుఖ్జీత్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున విఖామ్ (2వ, 17వ ని.లో) రెండు గోల్స్.. జలెవ్స్కీ (30వ ని.లో), అండర్సన్ (40వ ని.లో), వెటన్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కాగా ఈ సిరీస్లో భారత్కు ఒకే ఒక్క విజయం దక్కింది. మూడో మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. తద్వారా ప్రపంచ నంబర్వన్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టుపై ఆరేళ్ల విరామం తర్వాత తొలి విజయం నమోదు చేసిన జట్టుగా హర్మన్ప్రీత్ బృందం చరిత్ర సృష్టించింది. అయితే తొలి, చివరి రెండు మ్యాచ్లలో ఓడి ఆతిథ్య జట్టుకు సిరీస్ను అప్పగించింది. చదవండి: Ind Vs Ban: రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ -
'ఇది ఆటేనా.. ఫైనల్లో పాక్తో తలపడే అర్హత భారత్కు లేదు'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్ట పేలవ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి ప్రదర్శనేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని విమర్శలు గుప్పించాడు. భారత జట్టు ప్రదర్శన పాతాళానికి పాడిపోయిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. 'మెల్బోర్న్లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్తో తలపడే అర్హత భారత్కు లేదు. టీమిండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్తో తేలిపోయింది. సెమీ ఫైనల్కు చేరడం గొప్పేం కాదు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇలా ఉంటే చాలా కష్టం. టీమిండియా కెప్టెన్సీపై పునరాలోచించుకోవాలి. దారుణ పరాభవానికి జట్టు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి.' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సనాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధ సెంచరీలతో కదం తొక్కి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఫైనల్ చేర్చారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుత ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి ప్రపంచకప్ను ముద్దాడాలని చూస్తుండగా.. 1992 సీన్ను రిపీట్ చేసి ఇంగ్లాండ్ను ఓడించి మరోసారి కప్పు ఎగరేసుకుపోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. చదవండి: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
T20 WC 2022 2nd Semi Final: హేమాహేమీల సెమీస్.. మళ్లీ అదే చర్చ!
ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పుడు మరో లెక్క... అవును, లీగ్ దశలో ఎలా ఆడామో, ఏం చేశామో అనేది అనవసరం... మరో రెండు మ్యాచ్లు ఈ భారత జట్టు ఘనతను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి... లేదా తేడా వస్తే ఎప్పటికీ మరచిపోలేని వేదనను మిగులుస్తాయి... ఆ రెండింటిలో మొదటి అంకానికి నేడు రంగం సిద్ధమైంది... 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐదు ఐసీసీ టోర్నీలలో భారత్ నాకౌట్ సమరాల్లో చేతులెత్తేసింది. ఇప్పుడు ఆనందం పంచేందుకు మరో అవకాశం టీమిండియాకు వచ్చింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా ఎక్కడా తగ్గేలా లేదు. మూడేళ్ల వ్యవధిలో ఆ జట్టు రెండో ఐసీసీ టోర్నీ విజయాన్ని ఆశిస్తోంది... అందుకు తగ్గ వనరులు కూడా జట్టు వద్ద ఉన్నాయి కాబట్టి సెమీస్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. టోర్నీలో వాన కారణంగా ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడితేనేమి... న్యూజిలాండ్, శ్రీలంకలపై సాధించిన సాధికారిక విజయాలు జట్టు సామర్థ్యాన్ని చూపించాయి. లైనప్లో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాయాది జట్టు తుది పోరుకు అర్హత సాధించి రా రమ్మని మనల్ని పిలుస్తున్నట్లుగా ఉంది... ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కోరిక అయిన భారత్, పాక్ ఫైనల్ జరగాలంటే ఇంగ్లండ్ రూపంలో ఉన్న అడ్డంకిని రోహిత్ సేన తొలగించాల్సిందే! అడిలైడ్: టి20 ప్రపంచకప్ను రెండోసారి గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు సెమీఫైనల్లో ఇంగ్లండ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్ బెర్త్ కోసం నేడు ఇరు జట్లు తలపడనున్నాయి. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే నాకౌట్ సమరంలో ఉండే తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది చూడాలి. ఇంగ్లండ్తో జరిగిన గత నాలుగు టి20 ద్వైపాక్షిక సిరీస్లను కూడా భారతే గెలుచుకోవడం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇందులో రెండు భారత్లో జరగ్గా, మరో రెండు ఇంగ్లండ్లో జరగడం చూస్తే భారత్ ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టమవుతుంది. మళ్లీ అదే చర్చ! భారత తుది జట్టు విషయంలో మొదటి మ్యాచ్ నుంచీ చూస్తే పెద్దగా అనూహ్యాలేమీ జరగలేదు. ఒక మ్యాచ్లో అక్షర్ స్థానంలో హుడా, మరో మ్యాచ్లో కార్తీక్కు బదులుగా పంత్ ఆడటం మినహా అంతా సాఫీగానే సాగిపోయింది. సెమీస్లో కూడా ఈ విషయంలోనే టీమ్ మేనేజ్మెంట్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. బ్యాటింగ్లో అదనపు బలమంటూ అశ్విన్, అక్షర్లను రెగ్యులర్గా ఆడిస్తున్నారు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపడం లేదు కూడా. ఒకరిని తప్పించి స్పెషలిస్ట్ లెగ్స్పిన్నర్ చహల్ను ఆడించేందుకు ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది. కానీ కీలకమైన పోరులో వరల్డ్కప్లో ఒక్క మ్యాచ్ ఆడకుండా నేరుగా చహల్ బరిలోకి దిగడం కూడా సానుకూలాంశం కాదు. కీపర్ విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతోంది. జింబాబ్వేపై పంత్ను ఆడించినా, జట్టు ప్రాధాన్యతల్లో కార్తీక్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఓవరాల్గా చూస్తే టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నమెంట్ టాప్ స్కోరర్ కోహ్లి (246 పరుగులు) గురించి కొత్తగా చెప్పేదేముంది. అతనికి తోడుగా అగ్నిలా సూర్యకుమార్ (225) దాదాపు 200 స్ట్రయిక్రేట్తో చెలరేగిపోతున్నాడు. రాహుల్ కూడా కుదురుకోగా, రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కొంత ఇబ్బంది పెడుతోంది. 5 మ్యాచ్లలో కలిపి 89 పరుగులే చేసిన రోహిత్ తన స్థాయిని ప్రదర్శించేందుకు సెమీస్ను వేదికగా చేసుకుంటే మంచిదేమో. ముగ్గురు పేసర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటం శుభసూచకం. భువీ బౌలింగ్లో 32 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 30 పరుగులు మాత్రమే చేసి 5 సార్లు అవుట్ అయ్యాడంటే ఆరంభంలో పైచేయి చూపించేందుకు భారత్కు మరో అవకాశం ఉంది. ఆల్రౌండర్లతో... స్టోక్స్, వోక్స్, స్యామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్స్టోన్...100 శాతం రెండు విభాగాల్లో పనికొచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్లు వీరంతా. బ్యాటింగ్లో విఫలమైతే బౌలింగ్లో, బౌలింగ్లో విఫలమైతే బ్యాటింగ్లో సత్తా చాటగల సమర్థులు. ఇంగ్లండ్ విజయావకాశాలు వీరి ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత స్యామ్ కరన్ రాటుదేలగా, కీలక మ్యాచ్లో ఏమాత్రం ఒత్తిడిని దరి చేరనీయకుండా ఎలా ఆడాలనేది స్టోక్స్కు బాగా తెలుసు. ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ అందించే దూకుడైన ఆరంభం ఇంగ్లండ్ను ముందంజలో నిలపగలదు. హేల్స్ టోర్నీ మొత్తం నిలకడగా ఆడుతుండగా, బట్లర్ అసలు సమయంలో ఫామ్లోకి వచ్చాడు. మిడిలార్డర్లో లివింగ్స్టోన్ కీలకం కాగా, మలాన్ రూపంలో మరో కీలక బ్యాటర్ జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో బాధపడుతున్న మలాన్ కోలుకోకపోతే సాల్ట్ జట్టులోకి వస్తాడు. బౌలింగ్లో కూడా జట్టుకు పెద్ద దెబ్బ పడింది. ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ బౌలర్గా ఉన్న మార్క్ వుడ్ కూడా గాయపడి కోలుకోలేదు. అతను ఆడలేకపోతే జోర్డాన్కు అవకాశం దక్కుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లి, సూర్య, హార్దిక్, కార్తీక్, అక్షర్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), హేల్స్, మలాన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్స్టోన్, అలీ, స్యామ్ కరన్, వోక్స్, జోర్డాన్, రషీద్. పిచ్, వాతావరణం సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. బంగ్లాదేశ్పై ఇదే మైదానంలో ఆడి భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ కూడా బంగ్లాను ఇక్కడే ఓడించింది. స్క్వేర్లెగ్ బౌండరీలు చిన్నవి (గరిష్టంగా 63 మీటర్లు) కాగా, నేరుగా బౌండరీ ఎక్కువ దూరం (80 మీటర్లు) ఉండటం ఈ ఓవల్ మైదానం ప్రత్యేకత. దీనిని బట్టి జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. 3: టి20 ప్రపంచకప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య 3 మ్యాచ్లు జరగ్గా, భారత్ 2 గెలిచి, 1 ఓడింది. 12: ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మధ్య 22 అంతర్జాతీయ టి20లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 10 మ్యాచ్ల్లో గెలిచాయి. -
ఇంగ్లండ్తో సమరం.. అన్నింటా టీమిండియాదే పైచేయి.. రికార్డులే సాక్ష్యం
ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 10) జరుగబోయే సెమీస్ సమరంలో టీమిండియానే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లండ్ అభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం అంచనా వేస్తుంది. వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ఒక కారణమైతే.. గత రికార్డులు మరో కారణం. బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్లు వరుస హాఫ్సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తమ పాత్రలను న్యాయం చేస్తూ టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్కు, అనూకూలంగా ఉన్న గత రికార్డులు తోడవ్వడంతో టీమిండియాదే విజయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్ ముఖా ముఖి పోరులో ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో ఇంగ్లండ్కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది. ఈ రికార్డులే కాక, అడిలైడ్లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే వేదికపై బంగ్లాదేశ్పై విజయం, ఈ ప్రపంచకప్లో ఇంగ్లండ్కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మరోపక్క టీమిండియాను కూడా మూడు సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్ శర్మ ఫామ్, దినేశ్ కార్తీకా లేక రిషబ్ పంతా అని ఎటూ తేల్చుకోలేకపోవడం, స్పిన్నర్ల వైఫల్యం.. ఈ మూడు అంశాలు టీమిండియాకు అందోళన కలిగిస్తున్నాయి. రేపటి మ్యాచ్లో భారత్.. ఈ మూడింటిని అధిగమించగలిగితే టీమిండియాను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. చదవండి: అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..! -
అడిలైడ్ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్కు చుక్కలే..!
అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు (నవంబర్ 10) జరుగబోయే టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్లో తలమునకలై ఉన్నాయి. రేపటి సంగ్రామంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగనుందని క్రికెట్ అభిమనాలు అంచనా వేస్తున్నారు. ఇక, మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ విషయానికొస్తే.. ఈ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వేదికపై టీమిండియా తురుపుముక్క కింగ్ కోహ్లికి భీభత్సమైన రికార్డు ఉంది. ఇక్కడ మ్యాచ్ అంటేనే కింగ్ను పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్, ప్రస్తుత వరల్డ్కప్లో బంగ్లాదేశ్పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్కప్లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. చదవండి: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్ కోహ్లి -
WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2022- Semi Final Schedule: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. సూపర్-12లో భాగంగా ఆదివారం (నవంబరు 6) నాటి ఆఖరి మ్యాచ్ల ఫలితాలతో గ్రూప్-2 సెమీస్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్ మట్టికరిపించగా.. టీమిండియా నేరుగా సెమీ ఫైనల్కు చేరుకుంది. తర్వాతి మ్యాచ్లో సెమీస్ అర్హత కోసం పాకిస్తాన్- బంగ్లాదేశ్ పోటీపడగా.. బాబర్ బృందానిదే పైచేయి అయ్యింది. దీంతో చిరకాల ప్రత్యర్థి భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 🇮🇳 & 🇵🇰 - 2 Asian giants from Group 2 qualify for the Semi-Finals of the ICC Men's #T20WorldCup2022! How do you think they’ll do in the semis? 😉#BelieveInBlue pic.twitter.com/ngOxm0Wjdt — Star Sports (@StarSportsIndia) November 6, 2022 ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్ను తేలికగా తీసుకోని రోహిత్ సేన ఘన విజయంతో సూపర్-12ను ముగించింది. క్రెయిగ్ ఎర్విన్ బృందంపై 71 పరుగుల తేడాతో గెలుపొంది గ్రూప్-2 టాపర్గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా భారత మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగతంగా పలు రికార్డులు సృష్టించారు కూడా! ఇక గ్రూప్-1 విషయానికొస్తే.. న్యూజిలాండ్.. ఐర్లాండ్ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా.. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఆధారపడ్డ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది. శ్రీలంకను బట్లర్ బృందం చిత్తు చేయడంతో ఆతిథ్య ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. లంకపై విజయంతో ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించింది. Ladies and gentlemen, here are our first two semi-finalists of the ICC Men's #T20WorldCup 2022! Any surprise in there for you in the Super 12 Group 1 Final standings? pic.twitter.com/cNZEuYl82r — Star Sports (@StarSportsIndia) November 5, 2022 ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ ఎనిమిదో ఎడిషన్లో సెమీఫైనల్లో ఎవరితో ఎవరు తలపడనున్నారో ఖరారైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, మ్యాచ్ వేదికలు, ఆరంభ సమయం, ఫైనల్ వేదిక తదితర వివరాలు తెలుసుకుందాం. మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు: న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్. పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైదర్ అలీ రెండో సెమీ ఫైనల్ నవంబర్ 10: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వేదిక: అడిలైడ్ ఓవల్, అడిలైడ్ సమయం: మధ్యాహ్నం గం. 1:30 నుంచి జట్లు భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా. ఇంగ్లండ్: అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, ఫిలిప్ సాల్ట్ లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్–1 చానెల్లో టీవీలో ప్రత్యక్ష ప్రసారం డిజిటల్లో డిస్నీ+హాట్స్టార్ వివిధ దేశాల్లో ప్రసారం చేసే చానెల్స్ ►భారత్లో- స్టార్ స్పోర్ట్స్ చానెల్స్ ►పాకిస్తాన్లో- పీటీవీ స్పోర్ట్స్, టెన్ స్పోర్ట్స్ ►ఆస్ట్రేలియా- కాయో స్పోర్ట్స్, ఫాక్స్టెల్ ►న్యూజిలాండ్- స్కై స్పోర్ట్స్ ►సౌతాఫ్రికా- సూపర్స్పోర్ట్ ►యునైటెడ్ కింగ్డం- స్కై స్పోర్ట్ ►అమెరికా- విల్లో టీవీ, విల్లో ఎక్స్ట్రా టీవీ ►కెనడా- విల్లో టీవీ ►యూఏఈ- మధ్య ప్రాచ్య దేశాలు- బీఇన్(BeIN) స్పోర్స్ ►హాంకాంగ్, మలేషియా, సింగపూర్- ఆస్ట్రో క్రికెట్ ఫైనల్: నవంబరు 13, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చదవండి: WC 2022: ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు! ఇకపై T20 WC 2022: నెదర్లాండ్స్ సంచలనం.. బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్
టీ20 ప్రపంచకప్-2022(సూపర్-12)లో భాగంగా కీలక మ్యాచ్లో ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్ ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంటుంది. కాగా ఈ కీలక మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ మంగళవారం(నవంబర్ 1)న వెల్లడించింది. దీంతో వర్షం ఆటంకం ఉందనడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆడిలైడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. బుధవారం(నవంబర్ 2) ఉదయం నుంచి ఆడిలైడ్లో వర్షం పడేలేదు. అదే విధంగా నిన్నటి కంటే(మంగళవారం) ఈ రోజు వాతావరణం గణనీయంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బోరియా మజుందార్ ట్విటర్లో వెల్లడించారు. "గత కొన్ని గంటల నుంచి ఇక్కడ పూర్తిగా వర్షం పడడంలేదు. అదృష్టవశాత్తూ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షంఆటంకం కలిగించే ఛాన్స్ లేదు" అని మజుందార్ ట్విటర్లో పేర్కొన్నారు. 9am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB — Boria Majumdar (@BoriaMajumdar) November 1, 2022 తుది జట్లు (అంచనా) బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ చదవండి: T20 World Cup 2022: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ -
బంగ్లాదేశ్తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్!
సాధారణంగా అయితే బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ అంటే ఎలాంటి విశ్లేషణలు లేకుండా మనదే గెలుపు ఖాయమని అందరిలో నమ్మకం. అయితే కొంత కాలంగా బంగ్లాతో మ్యాచ్లు కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా... మ్యాచ్లో వేర్వేరు దశల్లో బంగ్లా అనూహ్యంగా చెలరేగి మన జట్టును ఇబ్బంది పెడుతోంది. పాక్తో మ్యాచ్ తరహాలో అభిమానులు కూడా అదనంగా కొన్నిసార్లు తమ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయం కానుండగా, తమకంటే చిన్న జట్లపై రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. అడిలైడ్: గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరచి కొత్త ఉత్సాహంతో మరో పోరుకు భారత్ సన్నద్ధమైంది. సఫారీలను ఓడించి ఉంటే ఇప్పటికే మన సెమీస్ అవకాశాలపై మరింత స్పష్టత వచ్చేది. అయితే పెర్త్ పిచ్ అలాంటి అవ కాశం ఇవ్వలేదు. ఇప్పుడు గ్రూప్–2లో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్ను నేడు రోహిత్ సేన ఎదుర్కొంటోంది. బలాబలాలు, ఫామ్ను బట్టి చూస్తే భారత్ సహజంగానే ఫేవరెట్ కాగా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాల్సి ఉంటుంది. తమ స్థాయిని బట్టి చూస్తే టోర్నీలో ఇప్పటికే సంతృప్తికర ప్రదర్శన ఇచ్చిన బంగ్లా ఈ మ్యాచ్లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. పంత్కు చాన్స్! వరల్డ్కప్లో ఇప్పటి వరకు కోహ్లి, సూర్యకుమార్ రెండు అద్భుత ఇన్నింగ్స్లతో అభిమానులను ఆనందపరిచారు. రోహిత్ కూడా నెదర్లాండ్స్పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే టోర్నీలో ఇప్పటికీ తనేంటో కేఎల్ రాహుల్ నిరూపించుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్లలో అతను 4, 9, 9 చొప్పున పరుగులు చేశాడు. అయితే రాహుల్ విలువేంటో తమకు తెలుసని, జట్టులోంచి అతడిని తప్పించే అవకాశమే లేదని కోచ్ ద్రవిడ్ ఖరాఖండీగా చెప్పేశాడు కాబట్టి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవు. కీపర్ దినేశ్ కార్తీక్ గాయం విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక్కు ఆడించడంకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పంత్కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం కావచ్చు. బౌలింగ్లో ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు తోడు స్పిన్నర్గా అశ్విన్నే కొనసాగిస్తారా చూడాలి. బంగ్లా లైనప్లో నలుగురు ఎడంచేతివాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ సరైనోడు కావచ్చు. బౌలింగ్పైనే ఆశలు... లీగ్ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్లపై స్వల్ప తేడాలతో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ రెండు విజయాలు బౌలింగ్ కారణంగానే వచ్చాయి. ముఖ్యంగా పేసర్ తస్కీన్ అహ్మద్ జట్టు భారం మోస్తున్నాడు. ముస్తఫిజుర్ మళ్లీ ఫామ్లోకి రావడం సానుకూలాంశం. హసన్ మహమూద్ కూడా కీలక పేసర్. ఆఫ్స్పిన్నర్ మొసద్దిక్ కూడా ప్రభావం చూపగలడు. అయితే వీరంతా కూడా బలమైన భారత బ్యాటింగ్ను నిలువరించడం అంత సులువు కాదు. బ్యాటింగ్లోనైతే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. నజ్ముల్, లిటన్, సర్కార్, అఫీఫ్లు ఏమాత్రం రాణిస్తారనేదానిపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి కెప్టెన్ షకీబ్ ఫామ్లో లేకపోవడమే ఇబ్బందిగా మారింది. పైగా ‘మేం వరల్డ్ కప్ గెలవడానికి రాలేదు’ అంటూ అతను వ్యాఖ్యానించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవే. పిచ్, వాతావరణం అడిలైడ్ ఓవల్ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే... టి20ల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య 11 మ్యాచ్లు జరగ్గా, 10 భారత్ గెలిచింది. వరల్డ్కప్లో 2016లో ఆఖరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్లో పరుగు తేడాతో భారత్ నెగ్గింది. 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన బంగ్లా వరుసగా 2 ఫోర్లు కొట్టి సంబరాలు చేసుకోగా, తర్వాతి 3 బంతుల్లో భారత్ ఒక్క పరుగూ ఇవ్వకుండా 3 వికెట్లు తీయడాన్ని అభిమానులు మరచిపోలేరు. చదవండి: కేఎల్ రాహుల్కు కోహ్లి పాఠాలు -
అడిలైడ్కు చేరుకున్న టీమిండియా.. వైరల్ అవుతున్న కోహ్లి ఫొటో
ICC Mens T20 World Cup 2022- India vs Bangladesh- Virat Kohli: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. అడిలైడ్ ఓవల్ మైదానం వేదికగా సూపర్-12లో భాగంగా బుధవారం(నవంబరు 2) షకీబ్ అల్ హసన్ బృందంతో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సోమవారం పెర్త్ నుంచి అడిలైడ్కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక అడిలైడ్కు చేరే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులతో ఫొటోకు పోజులిచ్చాడు కింగ్. వైరల్ అవుతున్న కోహ్లి ఫొటో ‘అడిలైడ్కు చేరుకున్నాం’ అన్న క్యాప్షన్తో కోహ్లి షేర్ చేసిన ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్గా మారింది. గంటలోనే 2 మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఇక ఈ ఫొటోపై కోహ్లి సతీమణి అనుష్క శర్మ బ్లూ హార్ట్ ఎమోజీలతో బదులివ్వగా.. కొంత మంది ఫ్యాన్స్ మాత్రం హోటల్ రూం లీక్ ఘటనను గుర్తు చేస్తూ సలహాలు ఇస్తున్నారు. ‘‘సర్ హోటల్ గదిని లాక్ చేసుకుని వెళ్లండి. ఆటతో పాటు మీ భద్రత కూడా మాకు ముఖ్యమే. దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అంటూ కోహ్లికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో పెర్త్లో బస చేసిన కోహ్లి హోటల్ రూం వీడియో లీకైన విషయం విదితమే. నేరుగా సెమీస్ చేరాలంటే! ఇదిలా ఉంటే.. గ్రూప్-2 సూపర్-12లో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ను మట్టికరిపించిన టీమిండియా.. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో రోహిత్ సేన తప్పక విజయం సాధించాలి. బంగ్లాదేశ్, జింబాబ్వేలను భారీ తేడాతో ఓడిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టడం లాంఛనమే! చదవండి: Virat Kohli: కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం రాహుల్ను తీసేసి.. అతడితో ఓపెనింగ్ చేయిస్తే బెటర్! మ్యాచ్ విన్నర్ను పక్కన పెట్టడం ఏంటి? T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) Touchdown Adelaide 📍 #TeamIndia | #T20WorldCup pic.twitter.com/l6GalMP0TI — BCCI (@BCCI) October 31, 2022 -
భళా బోపన్న... అడిలైడ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
అడిలైడ్: నాలుగు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 20వ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్సీడెడ్ బోపన్న–రామ్కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల బోపన్న కెరీర్లో ఇది 20వ డబుల్స్ టైటిల్. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్కుమార్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో బోపన్న–రామ్కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. 55 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో భారత జోడీ పైచేయి సాధించి సెట్ను దక్కించుకుంది. రెండో సెట్లో మాత్రం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండుసార్లు ప్రత్యర్థి జోడీ సర్వీస్లను బ్రేక్ చేసి తమ సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన బోపన్న–రామ్కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నేడు మొదలయ్యే అడిలైడ్ ఓపెన్–2 టోర్నీలో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలసి బోపన్న బరిలో దిగుతుండగా... మరోవైపు రామ్కుమార్తోపాటు భారత్కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, యూకీ బాంబ్రీ మెల్బోర్న్లో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడనున్నారు. చదవండి: సాయిప్రణీత్కు కరోనా పాజిటివ్ -
Rohan Bopanna-Ramkumar: టైటిల్కు విజయం దూరంలో...
అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్కాగా... రామ్కుమార్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్సీడెడ్ బోపన్న–రామ్కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్కుమార్ ఎని మిది ఏస్లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్గా నిలిచాడు. (చదవండి: కోహ్లిని స్టార్క్తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్) -
సానియా మీర్జాకు షాక్... టోర్నీ నుంచి అవుట్!
Adelaide Open: కొత్త ఏడాదిలో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అడిలైడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా (భారత్)–నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. యాష్లే బార్టీ–స్టార్మ్ సాండెర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన మ్యాచ్లో సానియా–కిచెనోక్ 1–6, 6–2, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి చవిచూశారు. సెమీస్లో బోపన్న ద్వయం మరోవైపు అడిలైడ్ ఓపెన్ పురుషుల టోర్నీలో రోహన్ బోపన్న–రామ్కుమార్ (భారత్) జంట సెమీఫైనల్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్6–1, 6–3తో బోంజి (ఫ్రాన్స్)–హుగో నిస్ (మొనాకో)లపై నెగ్గారు. చదవండి: SA vs IND: "కోహ్లి స్థానంలో కెప్టెన్గా అతడే సరైనోడు" -
రెండు వైపులా రనౌటయ్యాడు..
సిడ్నీ: బిగ్బాష్ లీగ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు. దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్మెన్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అచ్చం ధోని తరహాలో..
అడిలైడ్ : ఆసీస్తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మాథ్యూ వేడ్ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. సాహా రనౌట్ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.. అది కీపర్ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్ రనౌట్గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు) ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ' అలర్ట్.. అద్భుతమైన రనౌట్.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. Bizarre dismissal alert! What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE — cricket.com.au (@cricketcomau) December 19, 2020 -
96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు
అడిలైడ్ : ఆసీస్తో జరిగిన పింక్బాల్ టెస్టులో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులు చేసిన టీమిండియా టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో పాటు మరో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆసీస్ పేసర్ల దాటికి భారత బ్యాట్స్మన్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ 9 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒక ఇన్నింగ్స్లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. (చదవండి : షమీ రిటైర్డ్ హర్ట్ కాదు.. రిటైర్డ్ అవుట్) 1924లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌటైంది. అప్పటి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో హెర్బీ టేలర్ 7 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం.. మిగతా ఆటగాళ్లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కాగా మ్యచ్ విషయానికి వస్తే ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్ 33, లబుషేన్ 6 పరుగులు చేశారు. కాగా అంతకముందు క్రితం రోజు స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.(చదవండి : టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్) ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోర్లను పరిశీలిస్తే.. 1955లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో కివీస్ 26 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత తక్కువస్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు మూడుసార్లు అత్యల్పస్కోరును నమోదు చేసింది. 1896,1924,1899లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో 30,30,35 పరుగులకు ఆలౌట్ అయింది. 1902లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. తాజాగా 2020లో అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరిగిన పింక్బాల్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయింది. -
పింక్బాల్ టెస్ట్ : 8 వికెట్లతో ఆసీస్ ఘన విజయం
అడిలైడ్ : టీమిండియాతో జరిగిన పింక్బాల్ టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్ 33, లబుషేన్ 6 పరుగులు చేశారు. కాగా అంతకముందు ఓవర్నైట్ స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ మూడో రోజు పేకమేడలా కుప్పకూలింది. భారత జట్టు 21.2 ఓవర్లు మాత్రమే ఆడి 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కేవలం 27 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది (చదవండి : టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్) ఆసీస్ పేసర్లు హాజిల్వుడ్, పాట్ కమిన్స్ దాటికి ఏడుగురు భారత బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా..ముగ్గురు ఖాతా తెరవకపోవడం విశేషం. కాగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పింక్బాల్టెస్టుల్లో ఆసీస్ వరుసగా ఎనిమిదో విజయం సొంతం చేసుకొని తన రికార్డును మరింత పటిష్టపరుచుకుంది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 25 శుక్రవారం మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీమిండియా ఘోర ఓటమిని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.మెరుగైన ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వంటివారిని పక్కనబెట్టి పృథ్వీ షా, వృద్ధిమాన్ సాహాను ఆడించారని ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా జట్టు కూర్పులో టీమిండియా యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : అలా టీ కోసమని వెళ్లొచ్చా, అంతా ఖతం!) -
టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్
అడిలైడ్ : ఆసీస్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర వైఫల్యంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 36 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీమిండియా ఆటతీరుపై నెటిజన్లు చేసిన ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 'ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం.. 36 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. వెంటనే జట్టును స్వదేశానికి రప్పించాలని బీసీసీఐని కోరుతున్నా.. బీసీసీఐ వల్ల కాకపోతే భారత ప్రభుత్వం ద్వారా వారిని రప్పించండి... 'సిగ్గు సిగ్గు.. టీమిండియా ఘోర వైఫల్యం నేను చూడలేను..' 'ఇవాళ టీమిండియా చెత్త ఆట బాధించింది. నా జీవితంలో 2020 లేకపోయుంటే బాగుండేది అనిపించింది... ఈ ఏడాది మాకు కలిసిరాలేదు.. టీమిండియా వైఫల్యం జీవితాంతం వెంటాడుతుంది.. 2020 ముగింపులో ఇదో విషాద వార్త అంటూ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి : పింక్ బాల్ టెస్టు: ఈ నెంబర్స్ చూస్తే షాకే!) ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ వేడ్, జోస్ బర్న్స్లు ఇన్నింగ్స్ కొనసాగించారు. 70 పరుగుల వద్ద 33 పరుగులు చేసిన వేడ్ రనౌట్గా వెనుదిరగ్గా.. బర్న్స్ 40, లబుషేన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
షమీ రిటైర్డ్ హర్ట్ కాదు.. రిటైర్డ్ అవుట్
అడిలైడ్ : ఆసీస్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో ఇన్నింగ్లో టీమిండియా అనూహ్యంగా 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుతో చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా టీమిండియా ఇన్నింగ్స్లో మహ్మద్ షమీ రిటైర్డ్ అవుట్గా వెనుదిరగడం ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది. అదే 'రిటైర్డ్ అవుట్'.. సాధారణంగా క్రికెట్లో 'రిటైర్డ్ హర్ట్' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. బ్యాటింగ్ సమయంలో ఎవరైనా బ్యాట్స్మన్ గాయపడినా లేక అనారోగ్య కారణాలు ఉంటే అంపైర్ అనుమతితో ఇన్నింగ్స్కు బ్రేక్ తీసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఒక్కసారి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్కు రావాలనుకుంటే మాత్రం అతనికి అవకాశం కల్పిస్తారు. తాజాగా ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్ అయిన ఆటగాడి స్థానంలో కాంకషన్ సబ్స్టిట్యూట్ను వినియోగించుకునే కొత్త రూల్ను జట్లకు కల్పించారు. (చదవండి : టీమిండియాకు ఏమైంది..?) అయితే రిటైర్డ్ అవుట్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దం. ఒక బ్యాట్స్మన్ అంపైర్ అనుమతి లేకుండా.. తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇన్నింగ్స్ కొనసాగించకుండా బయటికే వెళ్లిపోవడాన్ని రిటైర్డ్ అవుట్గా పరిగణిస్తారు. రిటైర్డ్ అవుట్గా ఎవరైనా బ్యాట్స్మన్ బయటికి వెళ్లిపోతే మళ్లీ ఆడేందుకు అనుమతించరు.క్రికెట్ చరిత్రలో రిటైర్డ్ అవుట్గా వెళ్లడం చాలా అరుదుగానే జరుగుతుంది. కాగా, ఒక టెస్టు మ్యాచ్లో రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్లోనే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగారు. వారే ఆటపట్టు, జయవర్దనే. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1) -
టీమిండియాకు ఏమైంది..?
టీమిండియాకు ఏమైంది..? పింక్ బాల్ టెస్టులో ఈరోజు భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూసిన తర్వాత సగటు అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న ఇది. కనీస పోరాట పటిమ కూడా చూపించకుండానే టీమిండియా బ్యాట్స్మన్ పెవిలియన్కు వరుసగా క్యూ కట్టి అత్యంత చెత్త రికార్డును జట్టు పేరిట లిఖించారు. అడిలైడ్ : టెస్టు క్రికెట్లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత బ్యాట్స్మెన్ ఘోర వైఫల్యం కారణంగా రెండో ఇన్నింగ్స్ను 36 పరుగల వద్ద ముగించింది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఈ స్కోరును నమోదు చేసింది. కాగా మహ్మద్ షమీ గాయంతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో నేడు భారత్ ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ 5 వికెట్లు.. పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచారు. (చదవండి : టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1) -
టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1
అడిలైడ్ : 4,9,2,0,4,0,8,4,0,1.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. ఆసీస్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతుంది అంతర్జాతీయ మ్యాచ్ లేక గల్లీ క్రికెట్ అనే అనుమానం కలిగింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ను 36 పరుగుల వద్దే ముగించింది. టెయిలెండర్ మహ్మద్ షమీ(1) రిటైర్డ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. షమీ మోచేతికి బంతి బలంగా తగలడంతో అతను మైదానాన్ని వీడాడు. ఓవరాల్గా భారత్కు89 పరుగుల ఆధిక్యం దక్కింది. 9/1 క్రితం రోజు స్కోరుతో ఆటను ఆరంభించిన టీమిండియా మూడోరోజు కమిన్స్ వేసిన తొలి ఓవర్లోనే 2పరుగులు చేసిన నైట్వాచ్మెన్ బుమ్రా వెనుదిరిగాడు. బుమ్రాతో మొదలైన టీమిండియా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. కేవలం 10 పరుగుల వ్యవధిలో 5 వికట్లు కోల్పోవడం టీమిండియా ఆట తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కమిన్స్, హాజల్వుడ్ పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోయారు. ఆసీస్ పేసర్ల దాటికి పుజారా, రహానే, అశ్విన్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. టీమిండియా ఆటగాళ్లు ఎవరూ డబుల్ డిజిట్ను చేరకపోవడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో హజిల్వుడ్ ఐదు వికెట్లు, కమిన్స్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్నిశాసించారు. -
కోహ్లి సూపర్ క్యాచ్.. కష్టాల్లో ఆసీస్
అడిలైడ్ : టీమిండియాతో జరుగుతున్న పింక్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తడబడుతుంది. 84 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు ఆసీస్ ప్రధాన బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్నస్ లబుషేన్ 43 పరుగులతో, కెప్టెన్ టిమ్ పైన్ 4 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ ఇరగదీస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్లో కామెరాన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్ను కోహ్లి అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఒడిసి పట్టుకున్నాడు. ఈ సూపర్ క్యాచ్ దెబ్బకు ఆసీస్ 5వ వికెట్ కోల్పోయింది. (చదవండి : పృథ్వీ షా ఏందిది?) Flying 1 handed Catch by 🐐 Kohli #AUSvIND #INDvsAUS #ViratKohli pic.twitter.com/qYjmCsmZIS — Abhishek Singh 🇮🇳 (@ItsNobody4U_) December 18, 2020 వన్డేల్లో మంచి ప్రదర్శన కనబరిచిన స్టీవ్ స్మిత్ను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో వెనుదిరగడం భారత్కు సానుకూలాంశంగా మారింది. స్టీవ్ స్మిత్ భారత్పై ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్లు ఆడగా.. 5 పరుగులలోపు అవుట్ కావడం ఇదే తొలిసారి. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కోహ్లి 74 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రహానేతో సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్గా వెనుదిరగడం అభిమానులను నిరాశ పరిచింది. (చదవండి : 51 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి) -
పృథ్వీ షా ఏందిది?
అడిలైడ్ : టీమిండియా ఆటగాడు పృథ్వీ షా మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు. అడిలైడ్ వేదికగా జరగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన పృథ్వీ షా డకౌట్ అయి విమర్శలు మూట గట్టుకున్నాడు. గిల్ స్థానంలో పృథ్వీ ని ఎంపిక చేసిన మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్విటర్లో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. తాజాగా పృథ్వీ షా మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను పృథ్వీ షా వదిలేశాడు. అయితే అతను వదిలేసిన క్యాచ్ అంత కష్టంగా కూడా లేదు. బ్యాటింగ్లో డకౌట్ అయ్యాడన్న విమర్శలున్న షాను నెటిజన్లు మరోసారి టార్గెట్ చేశారు. 'పృథ్వీ షా జట్టుకు భారంగా మారాడు... నీకు బ్యాటింగే రాదనుకున్నాం.. ఇప్పుడు క్యాచ్ పట్టడం కూదా రాదని తెలిసిపోయింది... పృథ్వీ షా కెరీర్ డేంజర్ జోన్లో పడింది.. సాహా, పృథ్వీ షాలు జట్టుకు భారం.. భారత్ 10 మంది..ఆసీస్ 12 మందితో ఆడుతుంది..క్యాచ్లు పట్టడం రానివాడు అసలు అంతర్జాతీయ కెరీర్లోకి ఎలా వచ్చాడు..'అంటూ చురకలంటించారు. Dropped, again! Luck is with Marnus Labuschagne 👀pic.twitter.com/RseThp7IF5 — ICC (@ICC) December 18, 2020 ఇక ఆసీస్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ ఈరోజు నక్కతోకను తొక్కాడు. ఇప్పటికే మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బుమ్రా బౌలింగ్లో మొదటిసారి 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లబుషేన్ ఇచ్చిన క్యాచ్ను సాహా వదిలేశాడు. మళ్లీ 12 పరుగుల వద్ద షమీ బౌలింగ్లో బుమ్రా లబుషేన్ క్యాచ్ను జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ కొంత కష్టతరమైనదే. మూడోసారి బుమ్రా బౌలింగ్లో 22 పరుగుల వద్ద లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను ఈసారి పృథ్వీ షా జారవిడిచాడు. ఇక ఆసీస్ ఇప్పటివరకు 32 ఓవర్లలో 61 పరుగులు చేసింది. లబుషేన్ 37 పరుగులు, ట్రేవిస్ హెడ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : ఆమిర్కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు) Poor from Saha...didn't even get a glove on that. FOLLOW #AUSvIND LIVE: 👉 https://t.co/nrSvVZVdjZ 👈 #INDvAUS pic.twitter.com/MDAzQ13pyG — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 18, 2020 Dropped! Labuschagne gets a life on 12! #AUSvIND live: https://t.co/LGCJ7zSdrY pic.twitter.com/ooHxon8aCE — cricket.com.au (@cricketcomau) December 18, 2020 -
51 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న పింక్ టెస్టులో కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు బ్రేక్ చేయడానికి 51 సంవత్సరాలు పట్టింది. ఇంతకముందు ఆసీస్పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా మాజీ ఆటగాడు ఎంఏకే పటౌడీ పేరిట ఉంది.(చదవండి : 'కోహ్లి రనౌట్.. మాకు పెద్ద అవమానం') ఆసీస్తో భారత్ ఆడిన 40 టెస్ట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన పటౌడీ 829 పరుగులు చేశాడు. తాజాగా కోహ్లి మాత్రం 10 టెస్టులకు నాయకత్వం వహించి 851 పరుగులు చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో రహానేతో సమన్వయలోపం వల్ల కోహ్లి రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక అడిలైడ్ టెస్టులో ఆరంభం నుంచి నిధానంగా ఆడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. (చదవండి : వైరల్ : గొడవపడిన కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్) -
11 పరుగులు.. 4 వికెట్లు
అడిలైడ్ : ఆసీస్తో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయింది. 233/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన క్రితం రోజు స్కోరుకు మరో 11 పరుగులు మాత్రమే జత చేసింది. అశ్విన్, సాహాలు క్రీజులో ఉండడంతో టీమిండియా 300 మార్కును సులభంగా దాటుందని అంతా భావించారు. కానీ పిచ్పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న స్టార్క్, కమిన్స్లు రెచ్చిపోయారు. రెండో రోజు కమిన్స్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే రవిచంద్రన్ అశ్విన్(15 పరుగులు) క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో 9 పరుగులు చేసిన సాహాను స్టార్క్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఉమేశ్ యాదవ్, షమీలు వీరిద్దరి దాటికి ఎక్కువసేపు నిలవలేకపోయారు. అంతకుముందు తొలి రోజు ఆటలో కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు), పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4.. పాట్ కమిన్స్ 3 వికెట్లతో రాణించారు. -
పుజారా గోడ.. ద్రవిడ్ కంటే బలమైనదట!
అడిలైడ్ : టెస్టు మ్యాచ్ అంటేనే ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటుంది. బ్యాట్స్మెన్ తమ ఇన్నింగ్స్ను నత్తనడకన సాగిస్తూ బౌలర్లకు చిరాకు తెప్పిస్తుంటారు. కొన్నిసార్లు బ్యాట్స్మెన్లు ఆడే జిడ్డు ఇన్నింగ్స్లే జట్టును ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీమిండియా క్రికెట్లో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తర్వాత జిడ్డు క్రికెట్కు పర్యాయపదంగా మారిపోయిన వ్యక్తి మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్. ద్రవిడ్ తన 16 ఏళ్ల కెరీర్లో టెస్టు క్రికెట్లో డిఫెన్స్ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పాడు. అతని కాలంలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్ల్లో ఎన్నో జిడ్డు ఇన్నింగ్స్లు ఆడి చాలాసార్లు ఓటమి నుంచి తప్పించాడు. అందుకే 'ది వాల్' అనే పేరును ద్రవిడ్ తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ద్రవిడ్ తరహాలోనే టీమిండియాకు టెస్టుల్లో మరో వాల్గా తయారయ్యాడు... చటేశ్వర్ పుజారా.. టెస్టు స్పెషలిస్ట్గా ముద్ర పడిన పుజారా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు.(చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) తాజాగా అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతుంది. టెస్ట్ స్పెషలిస్ట్గా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా మతి పోతుంది. టెస్టు క్రికెట్ అంటే ఎలా ఉంటుందో ఆసీస్ ఆటగాళ్లకు చూపిస్తున్నాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదవ్వకుండానే ఓపెనర్ పృథ్వీ షా డకౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పుజారా ఎంతో ఓపికగా ఆడుతూ 145 బంతుల ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా లేకుండా 30 పరుగులు చేశాడు. బహుశా తన కెరీర్లో అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. వాస్తవానికి అది పుజారా తప్పు కాదు.. పిచ్ పరిస్థితి బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అయితే పుజారా ఆటతీరుపై సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. అసలైన టెస్టు క్రికెటర్ అంటే పుజారా.. మా పుజారా సిమెంట్ అంబుజా సిమెంట్ కంటే దృడంగా ఉంటుంది.. పుజారా కట్టే గోడ ద్రవిడ్ గోడ కన్నా బలంగా ఉంటుంది.. ద్రవిడ్ తర్వాత మాకు మరో వాల్ దొరికాడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : వైరల్ : ఒకరినొకరు తోసుకున్న ఆటగాళ్లు) ఇక తొలి టెస్టులో టీమిండియా తన ఇన్నింగ్స్ను నత్తనడకన కొనసాగిస్తుంది. మొదటిరోజు రెండో సెషన్లో భాగంగా టీమిండియా 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. పుజారా 31, కోహ్లి 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే డకౌట్గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కమిన్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి,పుజారాలు కలిసి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ లంచ్ విరామానికి వెళ్లారు. Rahul Dravid right now pic.twitter.com/2DAAM0i81V — Millennials United (@90sKids_United) December 17, 2020 -
బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే..
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారేనని న్యూజిలాండ్ మాజీ బౌలర్ షేన్ బాండ్ అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ వేదికగా నేడు తొలి టెస్టు ప్రారంభమైన సందర్భంగా బాండ్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బూమ్ బూమ్.. బుమ్రా ఫామ్లో ఉంటే చాలా ప్రమాదకారి. గంటకు 145 కిమీ వేగంతో వేసే బంతులు ఆసీస్ను సర్వనాశనం చేయనున్నాయి. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ సరైన పిచ్ తగిలితే మాత్రం అతన్ని ఆపడం ఎవరితరం కాదు. పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్( వాకా మైదానం)లో బుమ్రా చెలరేగే అవకాశం ఉంది.2018-19 ఆసీస్ పర్యటనను అతను మరోసారి రిపీట్ చేస్తే మాత్రం ఆసీస్కు కష్టాలు తప్పకపోవచ్చంటూ' తెలిపాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) వాస్తవానికి బుమ్రాకు ఆసీస్ టూర్ ప్రారంభంలో అంతగా అచ్చి రాలేదు. వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లు కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వన్డే మ్యాచ్లు జరిగిన వేదికలన్ని ఫ్లాట్ పిచ్లు సిద్దం చేయడంతో ఎక్కువగా వికెట్లు తీయలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్లో బుమ్రాను ఆడించలేదు. అయితే టెస్టు సిరీస్లో మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు. టెస్టు ఫార్మాట్లో సుధీర్ఘంగా బౌలింగ్ చేసే అవకాశం ఉండడం.. మ్యాచ్లన్నీ పేసర్లకు అనుకూలించే విధంగా వికెట్లు రూపొందించడం బుమ్రాకు సానుకూలాంశంగా మారనుంది. ఇక 2018-19 ఆసీస్ పర్యటనలో బుమ్రా టెస్టు సిరీస్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్లో 21 వికెట్లు తీసి టీమిండియా 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా) -
'నీకు అవకాశాలు దండగ.. పోయి ఇంట్లో కూర్చో'
అడిలైడ్ : ఆసీస్తో జరుగుతున్న పింక్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ పృథ్వీ బ్యాట్ పైకెత్తడంతో బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో పృథ్వీ షాపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించిన శుబ్మన్ గిల్ను కాదని ఓపెనర్గా పృథ్వీ షాను తీసుకోవడం.. అతను డకౌట్గా వెనుదిరగడంతో నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. (చదవండి : పరుగులే కాదు వికెట్లు కూడా తీయగలరు) 'పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కావడం లేదు.. పృథ్వీ స్థానంలో గిల్ లేదా రాహుల్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది.. పృథృ షా వన్డే.. టెస్టు.. ప్రాక్టీస్ ఇలా ఏదైనా నీ ఆటతీరు మారదా.. వరుసగా విఫలమవుతున్న షాకు ఇంకా ఎన్ని అవకాశాలు ఇస్తారో.. పృథ్వీ నీకు అవకాశాలు ఇచ్చి దండగ.. పోయి ఇంట్లో కూర్చో ' అంటూ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రాక్టీస్ మ్యాచ్లో శుబ్మన్ గిల్ మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్కు ఒకరోజు ముందు ప్రకటించిన తుది జట్టులో గిల్ ఉంటాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా గిల్ను కాదని పృథ్వీ షాకు చాన్స్ ఇచ్చి మయాంక్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం కల్పించారు. కానీ పృథ్వీ ఆ అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకోకుండానే డకౌట్గా వెనుదిరగడం విమర్శలకు దారితీస్తోంది. కాగా టీమిండియా ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. పుజారా 15 పరుగులతో, విరాట్ కోహ్లి 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను') 🔥 pic.twitter.com/U3o5CgweZU — ICC (@ICC) December 17, 2020 pic.twitter.com/c1lsucvu1J — Brown Bunny (@sujays06) December 17, 2020 Wicket on 2nd ball ... Everyone to Starc :- #INDvAUS pic.twitter.com/PcWm34c7O3 — 💲💔〽️ (@Samcasm7) December 17, 2020 #Shaw back in form Clean Bold Just On Second Ball Of The Match !!!😒😒#INDvAUS pic.twitter.com/TTFT5litdq — Lelouch Lamperouge (@LelouchL11) December 17, 2020 #PrithviShaw Vs cummins Hazelwood and starc on day 1 #Shaw pic.twitter.com/QRv6lhZ7dP — Akshay Sharma (@AkshayS76169779) December 17, 2020 -
భారత్-ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్ల క్రికెట్ సిరీస్
-
స్వదేశంలో కలిసొచ్చింది.. మరి విదేశంలో
అడిలైడ్ : అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు అదే బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు అంతే ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి సిరీస్లో తొలి మ్యాచ్లోనే డే నైట్(పింక్ బాల్) ఆడనుంది. టీమిండియాకు ఇది రెండో డై నైట్ టెస్టు మాత్రమే.. అదే ఆసీస్ మాత్రం ఇప్పటికే 7 డే నైట్ టెస్టు మ్యాచ్లు ఆడి అన్నింటా గెలవడం విశేషం. టీమిండియా మాత్రం స్వదేశంలో 2019లో బంగ్లాదేశ్పై కోల్కతా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకే ఆలౌటైంది. ఇషాంత్ శర్మ 5వికెట్లతో టాప్ లేపగా.. ఉమేశ్యాదవ్ 3, షమీ 2 వికట్లెతో రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 347 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా జట్టు ఉమేశ్, ఇషాంత్ల దాటికి 195 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో ఆడకపోవడంతో.. ఆసీస్తో జరిగే తొలి టెస్టు అతనికి మొదటి పింక్ బాల్ టెస్టు కానుంది. ఇక అనుభవం పరంగా చూసుకుంటే ఆసీస్ బలంగా కనిపిస్తున్నా.. టీమిండియా కూడా మంచి ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. స్వదేశంలో ఆడిన తొలి పింక్ టెస్టు గెలిచిన టీమిండియాకు విదేశంలో ఆడనున్న తొలి డే నైట్ కలసి వస్తుందా అనేది చూడాల్సి ఉంది. జట్ల వివరాలు భారత్ (తుది జట్టు): కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా. ఆస్ట్రేలియా (తుది జట్టు): పైన్ (కెప్టెన్), బర్న్స్, వేడ్, లబ్షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్, లయన్. -
ఆసీస్కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!
అడిలైడ్ : టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఆసీస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయంతో దూరం కాగా.. ఆసీస్ కీలక బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్కు గాయమైనట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాటింగ్ చేయకుండానే స్మిత్ హోటల్ రూంకు వెళ్లిపోయాడని తెలిపింది. (చదవండి : రబ్బిష్.. కోహ్లిని మేమెందుకు తిడతాం) అయితే స్మిత్ గాయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టు ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ఆసీస్కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. వన్డే సిరీస్ను ఆసీస్ గెలవడంలో స్మిత్ కీలక పాత్ర పోషించాడు. వరుస సెంచరీలతో హోరెత్తించిన అతను అద్భుత ఫామ్ కనబరుస్తూ టెస్టు సిరీస్కు కీలకంగా మారాడు. ఈ దశలో స్మిత్కు గాయం కావడం ఆసీస్కు ఇబ్బందిగా మారనుంది. (చదవండి : అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు) ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరమవడం.. తాజాగా స్మిత్ గాయపడడం దీనిని మరింత రెట్టింపు చేసింది. అంతేగాక యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి త్యాగి బౌన్సర్ దెబ్బకు మొదటి టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఇక టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆసీస్ కీలక బౌలర్ సీన్ అబాట్ కండరాలు పట్టేయడంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కు దిగలేదు. ఆ తర్వాత అబాట్ తొలి టెస్టుకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతకముందు బుమ్రా ఆడిన స్ట్రెయిట్డ్రైవ్ కామెరాన్ గ్రీన్ తలకు బలంగా తాకడంతో తొలి టెస్టుకు అతను కూడా దూరమవుతాడని భావించారు.. కానీ అదృష్టం బాగుండి గాయం తీవ్రత పెద్దగా లేకపోవడంతో తొలి టెస్టులో గ్రీన్ ఆడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఏదైమైనా స్మిత్ తొలి టెస్టుకు దూరమైతే మాత్రం ఆసీస్ విజయంపై ప్రభావం పడనుంది. 2018-19 సిరీస్లోనూ స్మిత్, వార్నర్లు ఆడకపోవడంతో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా కాగా ఇరుజట్ల మధ్య తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. -
లాక్డౌన్: ఇంటికి ఒక్కరికి మాత్రమే పర్మిషన్
మెల్బోర్న్: కరోనా వైరస్ పుట్టి ఏడాది పూర్తయ్యింది. ఇంతవరకు మహమ్మారి పని పట్టే వ్యాక్సిన్ రాలేదు. కానీ వైరస్ మాత్రం వీర విహారం చేస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ఆయా దేశాలు మరోమారు లాక్డౌన్ని విధిస్తున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. సెకండ్ వేవ్ కట్టడి కోసం ఈ సారి మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఔట్డోర్ ఎక్సర్సైజ్, డాగ్ వాకింగ్ వంటి కార్యక్రమాలని బ్యాన్ చేసింది. ఇక వారంలో ఆరు రోజుల్లో ఇంటికి కేవలం ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని.. అది కూడా చాలా ముఖ్యమైన కారణాలకు మాత్రమే అని తెలిపింది. స్కూల్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, యూనివర్సిటీలు, కేఫ్లను నిర్ణిత గడువు వరకు పూర్తిగా ముసి ఉంటాయి. పెళ్లిల్లు, చావులకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఇక మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నియమాలన్ని నేటి నుంచి అమల్లోకి వస్తాయి. (చదవండి: కేంద్రం అనుమతిస్తే మరోసారి లాక్డౌన్..) ‘చాలా త్వరగా.. చాలా కఠినంగా లాక్డౌన్ని అమలు చేయాలి. అప్పుడే తక్కువ నష్టం వాటిల్లుతుంది’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అడిలైడ్ పట్టణంలో ఓ హోటల్ క్లీనర్ ద్వారా 23 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం అధికారులు కాంటాక్ట్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఇక కరోనా వైరస్ ఉపరితలాల మీద 24 గంటలపాటు జీవించి ఉంటుందని.. ఫలితంగా ఎక్కువ మందికి సోకుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వైరస్ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఇది ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఇక విక్టోరియా, మెల్బోర్న్ వంటి నగరాల్లో లాక్డౌన్ మంచి ప్రభావం చూపించింది. విక్టోరియాలో ఆగస్టులో 700 కేసులు ఉండగా.. ప్రస్తుతం అవి 20కి పడిపోయాయి. -
అమ్మో అడిలైడ్!
సిడ్నీ: భారత్తో ప్రతిష్టాత్మక సిరీస్ను విజయవంతంగా నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ)కు కొత్త సమస్య వచ్చి పడింది. తొలి టెస్టు మ్యాచ్కు వేదికైన అడిలైడ్లో సోమవారం ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్తో పాటు పలువురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లిపోయారు. ఆదివారం వరకు 4 కేసులు ఉన్న అడిలైడ్లో సోమవారం 17 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ నగరం ఉండే సౌత్ ఆస్ట్రేలియాతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు పక్క రాష్ట్రాలు వెస్ట్రన్ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీ, టాస్మేనియా, క్వీన్స్లాండ్ ప్రకటించాయి. అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా కచ్చితంగా 14 రోజుల హోటల్ క్వారంటైన్కు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశాయి. అయితే డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టు (డే–నైట్)కు ఎలాంటి ఆటంకం ఉండబోదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రకటించింది. అప్పటిలోగా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి టెస్టుకు స్టేడియంలో సగం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే పరిస్థితి మారకపోతే మాత్రం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగవచ్చు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాలని సీఏ భావిస్తోంది. కరోనా సమస్య లేని సిడ్నీకి (న్యూసౌత్వేల్స్ రాష్ట్రం) అందరినీ తీసుకెళితే అన్ని మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అవకాశం ఉంటుందనేది సీఏ ఆలోచన. ప్రస్తుతం భారత జట్టు సిడ్నీలోనే ఉంది. -
ఫస్ట్ సెంచరీ చేయనివ్వలేదని..
అడిలైడ్: షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా టాస్మానియన్ టైగర్స్, న్యూ సౌత్ వేల్స్ తలపడుతున్నాయి. న్యూ సౌత్ వేల్స్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఓ దశలో ఆ జట్టు 37 పరుగుల వ్యవధిలో కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. కాగా, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలిసి 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూ సౌత్ వేల్స్ 522 పరుగుల భారీ స్కోర్ చేసింది. అబాట్ 97 పరుగుల వద్ద ఉండగా.. ఫోర్ బాది సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే సౌత్ వేల్స్ కెప్టెన్ పీటర్ నెవిల్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అబోట్ తన తొలి సెంచరీని 116 బంతుల్లో చేశాడు. అయితే పీటర్ నెవిల్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే సమయానికి మిచెల్ స్టార్క్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి సెంచరీ చేసే అవకాశం లేకుండా పోయింది. సహచర బౌలర్ సీన్ అబాట్ సెంచరీ చేయడం.. తాను అరుదైన మార్క్ అందుకోకపోవడంతో స్టార్క్ అసహనం వ్యక్తం చేశాడు. డగౌట్లోకి వెళుతూ చేతిలో ఉన్న బ్యాట్ను నేలకేసి కొట్టాడు. మరోవైపు గ్లోవ్స్ విసిరిపారేశాడు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'మిచెల్ స్టార్క్ సంతోషంగా లేడు' అని రాసుకొచ్చింది. తన క్రికెట్ కెరీర్లో మిచెల్ స్టార్క్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 99. ఈ మ్యాచ్లో న్యూసౌత్వేల్స్ రెండో ఇన్నింగ్స్లో 522/6 వద్ద డిక్లేర్డ్ చేయగా, టాస్మానియా 239 పరుగుల వద్ద ఆలౌటైంది. కాగా, న్యూసౌత్వేల్స్ తన తొలి ఇన్నింగ్స్లో 64 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టాస్మానియా మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. టాస్మానియా విజయానికి 322 పరుగులు కావాలి. Peter Nevill declared while Mitch Starc was on 86*... The quick wasn't too happy! #SheffieldShield pic.twitter.com/NQLTkh1L0w — cricket.com.au (@cricketcomau) November 10, 2020 -
అడిలైడ్లో ఆసీస్తో భారత్ డేనైట్ టెస్టు
కోల్కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తొలి టెస్టును అడిలైడ్ వేదికగా డేనైట్లో ఆడుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ) తమకు పంపిందని ‘దాదా’ చెప్పాడు. ‘ఆసీస్తో భారత్ మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు నాలుగు టెస్టుల సిరీస్లో తలపడుతుంది. తొలి టెస్టును ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆడుతుంది. అడిలైడ్లో ఈ పింక్బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది’ అని గంగూలీ వివరించాడు. ‘దాదా’ ఐసీసీ చైర్మన్ రేసులో నుంచి తప్పుకున్నాడా? గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లే! భారత బోర్డు నుంచి ఐసీసీకి నామినేషన్లే రాలేదని తెలిసింది. భారత్కే చెందిన శశాంక్ మనోహర్ తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పదవి కోసం నామినేషన్లను ఈ నెల 18లోపే దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఆదివారంతో గడువు ముగిసినా బీసీసీఐ నుంచి నామినేషన్లు రాలేదని ఐసీసీ తెలిపింది. నామినేషన్ల స్క్రూటిని అనంతరం డిసెంబర్లో ఎన్నిక జరుగనుంది. -
కోహ్లి, దాదాలకు వార్న్ విన్నపం ఇదే!
కోల్కతా : భారత గడ్డపై తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ డేనైట్ టెస్ట్కు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తుండటంపై బీసీసీఐ ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పింక్ బాల్ టెస్టుపై అభిమానులు అమితమైన ఆసక్తి కనబర్చుతున్నట్లు పేర్కొంది. ఇక రెండు టెస్టుల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. ఈ చారిత్రక టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో మూడో రోజే ఆటను ముగించే అవకాశం ఉంది కోహ్లి సేన. ఇక డేనైట్ టెస్టు విజయవంతం చేసినందుకు స్వదేశీ, విదేశీ తాజా, మాజీ క్రికెటర్లు బీసీసీఐపై, టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టెస్టు క్రికెట్కు ఇది శుభపరిణామని పేర్కొన్నాడు. కాగా షేన్ వార్న్ ఓ అడుగు ముందుకేసి తన మనసులోని మాటను బయటపెట్టాడు. తొలి డేనైట్ టెస్టుతో భారత్ సంతృప్తితో ఉండటంతో భవిష్యత్లో ఇలాంటి మరిన్ని టెస్టులు ఆడాలని ఆకాంక్షించాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది టీమిండియా ఆసీస్ పర్యటన నేపథ్యంలో అడిలైడ్లో డేనైట్ టెస్టు ఆడేలా చర్యలు తీసుకోవాలని సారథి విరాట్ కోహ్లి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు వార్న్ కోరాడు. ఇక ఈ టెస్టు ఆరంభానికి ముందు ఆసీస్లో కూడా డేనైట్ మ్యాచ్లు ఆడేందకు సిద్దంగా ఉన్నామని కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పింక్ బాల్ క్రికెట్కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆడిలైడ్లో తమకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేయాలన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింక్ బాల్ టెస్టుపై ఆమితాసక్తి కనబర్చిడు. వెంటనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. సారథి కోహ్లిని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఒప్పించి కోల్కత్లో డేనైట్ టెస్టుకు ఏర్పాట్లు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విజయంవంతం కావడంతో అందరికంటే దాదా రెట్టింపు ఆనందంతో ఉన్నాడు. గతేడాదే టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు డేనైట్ టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదన పెట్టగా బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. ఇక ఈ పర్యటనలో ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలుచుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. -
ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అడిలైడ్ : అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్(ఏటిఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ పట్టణంలోని ఎల్డర్స్ పార్క్లో అక్టోబర్ 5న(శనివారం) ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. -
ధోనికి కోపమొచ్చింది
అడిలైడ్: టీమిండియా మిస్టర్ కూల్కు కోపమొచ్చింది. అవును టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. యువ ఆటగాడు ఖలీల్ అహ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి శతకంతో పాటు ధోని చిరస్మరణీయ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయంలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో టీమిండియా 12వ ఆటగాడు ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడు యజువేంద్ర చహల్లు ధోని, దినేశ్ కార్తీక్లకు డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే ఖలీల్ పిచ్పై పరుగెత్తుకుంటూ రావడంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా అంటూ ఖలీల్పై ధోని గుస్సా అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక దీనిపై ‘ఖలీల్ జాగ్రత్త.. మిస్టర్ కూల్కు కోపం తెప్పించకు’.. ‘ఏమైంది ఈ యువ ఆటగాళ్లకు.. మొన్న కుల్దీప్, నిన్న ఖలీల్.. ధోనికి కోపం తెప్పించినందుకు తప్పదు భారీ మూల్యం’అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
టీమిండియా లక్ష్యం 299
అడిలైడ్: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమిండియాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్ష్ సెంచరీకి మ్యాక్స్వెల్ మెరుపులు తోడవడంతో ఆసీస్ మంచి స్కోరు సాధించింది. మార్ష్ 123 బంతుల్లో 11 ఫోర్లతో 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 48 పరుగులు బాదాడు. అలెక్స్ క్యారీ 18, ఖవాజా 21, పీటర్ హ్యాండ్స్కోంబ్ 20, స్టొయినిస్ 29, లయన్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు. -
అడిలైడ్ వన్డే; మార్ష్ హాఫ్ సెంచరీ
అడిలైడ్: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయినప్పటికీ షాన్ మార్ష్ అర్ధ సెంచరీతో ఆసీస్ కోలుకుంది. మార్ష్ 62 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్లతో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. హ్యాండ్స్కోంబ్(20) నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. ఆసీస్ 30 ఓవర్లలో 141/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మార్ష్ 65, స్టొయినిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. 26 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరోసారి విఫలమ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుటయ్యాడు. 18 పరుగులు చేసిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీని మహ్మద్ షమి పెవిలియన్కు పంపాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు దిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీలో రాణించినట్టుగానే ఇక్కడ కూడా సత్తా చాటుతామన్నాడు. ఆస్ట్రేలియా జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. (లెక్క సరిచేస్తారా!) తుది జట్లు భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి(కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), షాన్ మార్ష్, ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టొయినిస్, మ్యాక్స్వెల్, రిచర్డ్సన్, లయన్, పీటర్ సిడిల్, జాసన్ బెహ్రిన్డార్ఫ్ -
టైరును రాసుకుంటూ.. 16కిమీ ప్రయాణించి
ఆడిలైడ్ : ప్రపంచంలో అంతరిస్తున్న అరుదైన జీవుల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా ఉంది. అయితే అనుకోకుండా ప్రమాదాన్ని కొరితెచ్చుకొని తృటిలో ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది ఓ ఆడ కొఆలా. ఆడిలైడ్ శివారు ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో ఆగిన ఓ కారు టైరు పైన ఉన్న ఆక్సల్ను పట్టుకుంది. ఇది గమనించకుండానే కారు యజమాని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 16 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత బయట నుంచి శబ్ధం రావడంతో కారు ఆపి చూసే సరికి వెనక టైరు వద్ద కొఆలా ఉండటాన్ని గమనించాడు. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. తీవ్రగాయాలతో అరుస్తున్న కోఆలాను టైర్ తీసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. కొఆలాను బయటకు తీసిన తర్వాత దాని వెంట్రుకల నుంచి కాలిన వాసనను గమనించానని ఫౌనా సంరక్షణ స్వచ్ఛంద సంస్థకు చెందిన జేన్ బ్రిస్టర్ తెలిపారు. ప్రయాణంలో ఉన్న కారు టైరుకు అతిదగ్గరగా ఉండటంతో రాపిడి జరిగి కొఆలా వెంట్రుకలు కొద్ది భాగం కాలిపోయాయి. అయితే సరైన సమయంలో డ్రైవర్ స్పందించి కారు ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. స్పల్పగాయాల నుంచి కొఆలా కోలుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్లి అడవిలో వదిలి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం లక్ష కొఆలాలు మాత్రమే ఉన్నట్టు ఆస్ట్రేలియన్ కొఆలా ఫౌండేన్ తెలిపింది. తృటిలో ఈ అరుదైన జీవి ప్రాణాపాయం నుంచి బటయ పడటంతో జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. -
‘గాబా’లో పేస్ వికెట్!
బ్రిస్బేన్: తొలి టెస్టులో స్పిన్కు అనుకూలించిన అడిలైడ్కంటే రెండో టెస్టు వేదిక బ్రిస్బేన్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి వూలెన్ గాబా స్టేడియం వికెట్ పేస్ బౌలింగ్కు అనుకూలిస్తుందని క్యురేటర్ కెవిన్ మిషెల్ వెల్లడించారు. ‘కాస్త పచ్చిక ఎక్కువగా ఉంటూ జీవం ఉన్న వికెట్ ఇది. గతంలోని సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మంచి బౌన్స్, పేస్ ఈ పిచ్పై ఉన్నాయి. అదే తరహాలో దీనిని సిద్ధం చేస్తున్నాం. ఇది ఆస్ట్రేలియా పేసర్లకు సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ మైదానంలో బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. గత ఏడాది ఇక్కడ ఇంగ్లండ్పై జాన్సన్ 9 వికెట్లు తీశాడు. టాప్-20లోకి కోహ్లి దుబాయ్: అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-20లోకి వచ్చాడు. ఈ మ్యాచ్కు ముందు 26వ ర్యాంక్లో ఉన్న విరాట్.. ఏకంగా పది స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్కు చేరాడు. పుజారా 18వ ర్యాంక్లో ఉన్నాడు. -
ఇక నేను ఆడలేనేమో: క్లార్క్
గాయం కారణంగా సిరీస్కు దూరం అడిలైడ్: భారత్తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరమయ్యాడు. తొలి టెస్టు చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కుడి మోకాలి కండరాలు పట్టేయడంతో క్లార్క్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన కుడి కండర ంలో చీలిక వచ్చినట్టు తేలింది. ఆ తర్వాత మైదానంలో కనిపించినప్పటికీ కుంటుతూనే నడిచాడు. దీంతో మిగిలిన టెస్టు సిరీస్కు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. క్లార్క్ స్థానంలో నాయకత్వ బాధ్యతలను వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్కు అప్పగించే అవకాశం ఉంది. రెండో టెస్టుకు మార్ష్: క్లార్క్ సిరీస్కు దూరం కావడంతో రెండో టెస్టుకు షాన్ మార్ష్ జట్టులోకి రానున్నాడు. ఈనెల 17 నుంచి బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. మార్ష్తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్ను కూడా ఎంపిక చేశారు. ‘వైద్య నిపుణులు నా గాయానికి సంబంధించిన స్కాన్లను పరిశీలిస్తున్నారు. ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటానో నాకు తెలీదు. వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాను. మా తొలి ప్రాక్టీస్ గేమ్కు ఇంకా ఎనిమిది వారాల సమయం ఉంది. ముక్కోణపు సిరీస్లో ఆడాలని ఆశిస్తున్నాను. కానీ ఇక ముందు ఎప్పటికీ ఆడలేనేమో.. అలా జరక్కూడదనే అనుకుంటున్నాను. నా శక్తిమేరా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. అలా అని వాస్తవ పరిస్థితిని విస్మరించలేం కదా. ఆసీస్ తరఫున ఒక్క మ్యాచ్కు దూరమైనా అది నా హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఇంకా నాలో క్రికెట్ మిగిలే ఉంది. ఇక భారత్పై తొలి టెస్టు విజ యం మాకు చాలా ‘ప్రత్యేకమైంది’. మా కెరీర్ మొత్తం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది. నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన టెస్టు ఇది’ - మైకేల్ క్లార్క్ (ఆసీస్ కెప్టెన్) -
బాధను మరచి... బ్యాట్ తో మెరిసి
ఆస్ట్రేలియా దూకుడు తొలి ఇన్నింగ్స్లో 354/6 వార్నర్ అద్భుత సెంచరీ రాణించిన స్మిత్, క్లార్క్ భావోద్వేగాలు ఉన్నాయి... బౌన్సర్లూ ఉన్నాయి... గుండెల్లో అభిమానం ఉంది... మైదానంలో దూకుడూ ఉంది... ఆటలో ఆస్ట్రేలియన్లు తమ శైలిని మార్చుకోలేదు... అటు భారత ఆటగాళ్లూ వెనక్కి తగ్గలేదు... అడిలైడ్లో తొలి రోజు దృశ్యాలివి... గత రెండు వారాల పరిణామాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరినీ ఆట మరో సారి ఒక చోటికి చేర్చింది. ‘63’కు వందనం చేసినా... అందరూ ‘408’గా మారిపోయినా...విషాదం దాటి చివరకు క్రికెట్ విజేతగా నిలిచింది. సహచరుడికి ఆటతోనే నివాళి ఇవ్వాలనుకుంటూ మైదానంలో దిగిన ఆస్ట్రేలియా మొదటి టెస్టులో తొలి రోజును తమదిగా మార్చుకుంది. చివర్లో టీమిండియా కూడా తేరుకొని కొంత వరకు పుంజుకుంది. అందరి అంచనాలకు అనుగుణంగా సిరీస్కు రసవత్తర ఆరంభం లభించింది. అడిలైడ్: ఆత్మీయ స్నేహితుడు, సహచరుడు ఫిల్ హ్యూస్ రూపం మనసులో కదలాడుతుండగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతోనే అతనికి సరైన నివాళి అందించాడు. వేడుక చేసుకోవాలో, లేదో తెలీని సందిగ్ధ స్థితిలోనూ తన అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. వార్నర్ (163 బంతుల్లో 145; 19 ఫోర్లు) సూపర్ బ్యాటింగ్తో మంగళవారం భారత్తో ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆసీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు మంగళవారం ఆట ముగిసే సమయానికి 89.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ (130 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజ్లో ఉండగా... కెప్టెన్ క్లార్క్ (84 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు) వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మైదానం వీడాడు. ఒక దశలో 345/3తో ఉన్న ఆసీస్, 9 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ, ఆరోన్ చెరో రెండు వికెట్లు తీశారు. కరణ్, ఇషాంత్లకు ఒక్కో వికెట్ దక్కింది. రెండో రోజు బుధవారం ఆసీస్ను తొందరగా ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్లో నిలబడే అవకాశం ఉంటుంది. కెప్టెన్గా తొలి టెస్టులో కోహ్లి వ్యూహాలు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చాయి. తొలి సెషన్ అంతా దాదాపు భారత బౌలర్లంతా రౌండ్ ద వికెట్ వేశారు. వార్నర్ బ్యాటింగ్ సమయంలో ఎక్కువగా డీప్లో ఫీల్డింగ్ పెట్టడం కూడా కలిసి రాలేదు. రెండు సెషన్లలో కలిపి 50 ఓవర్లే వేయడంతో ఓవర్ రేట్ కూడా సమస్యగా మారింది. దాంతో కొత్త బంతికి ముందు అతను పార్ట్ టైమర్ విజయ్తో వరుసగా 12 ఓవర్లు వేయించాల్సి వచ్చింది. బౌలింగ్లో ఇషాంత్ కట్టడి చేసినా... షమీ, ఆరోన్ కలిసి వేసిన 34.2 ఓవర్లలో ఆసీస్ ఏకంగా 178 పరుగులు పిండుకుంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 9; వార్నర్ (సి) ఇషాంత్ (బి) కరణ్ 145; వాట్సన్ (సి) ధావన్ (బి) ఆరోన్ 14; క్లార్క్ (రిటైర్డ్హర్ట్) 60; స్మిత్ (బ్యాటింగ్) 72; మిషెల్ మార్ష్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 41; లయోన్ (బి) షమీ 3; హాడిన్ (సి) సాహా (బి) షమీ 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (89.2 ఓవర్లలో 6 వికెట్లకు) 354. వికెట్ల పతనం: 1-50; 2-88; 2-206 (రిటైర్డ్ నాటౌట్), 3-258; 4-345; 5-352; 6-354. బౌలింగ్: షమీ 17.2-1-83-2; ఆరోన్ 17-1-95-2; ఇషాంత్ 20-4-56-1; కరణ్ 23-1-89-1; విజయ్ 12-3-27-0. ‘జీవితాంతం నాకు తోడుగా నిలిచే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. 63 వద్ద ఆడుతున్న సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో చెప్పలేను. స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నా నాకు నాటి భయంకర ఘటనే గుర్తుకొచ్చింది. కోలుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. మేం పైకి చూసినప్పుడల్లా హ్యూస్ కూడా మా వైపే చూస్తూ ఉంటాడనే నమ్ముతున్నా. సెంచరీ చేశాక వేడుక చేసుకోవాలా, వద్దా అని నాలో నేను చాలా మధన పడ్డాను. కానీ నా శైలి హ్యూస్కు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ ఇలాగే జంప్ చేయాలని అతను ఎప్పుడూ అతనికే అంకితమిస్తున్నా’ - డేవిడ్ వార్నర్ సెషన్ 1: బౌండరీల హోరు వార్మప్ మ్యాచ్లలో ఆకట్టుకున్న ఆరోన్, షమీ... భారీగా పరుగులు ఇచ్చారు. ఆరోన్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన వార్నర్, ఆ తర్వాతి షమీ ఓవర్లో కూడా మరో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. మరో వైపు ఇషాంత్ తన రెండో ఓవర్లో రోజర్స్ (9)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. 45 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే వాట్సన్ (14) వెనుదిరిగాడు. ఓవర్లు: 24, పరుగులు: 113, వికెట్లు: 2 సెషన్ 2: భారీ భాగస్వామ్యం... లంచ్ తర్వాత వార్నర్, క్లార్క్ కలిసి మరింత స్వేచ్ఛగా ఆడారు. ఏ బౌలర్ కూడా వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇదే క్రమంలో కరణ్ బౌలింగ్లో కవర్స్ దిశగా సింగిల్ తీసి వార్నర్ 106 బంతుల్లో సెంచరీ మార్క్ను చేరుకోగా, 69 బంతుల్లో క్లార్క్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్కు 118 పరుగులు జోడించిన తర్వాత వెన్ను నొప్పితో క్లార్క్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు. ఓవర్లు: 26, పరుగులు: 125, వికెట్లు: 0 సెషన్ 3: కోలుకున్న భారత్ విరామం అనంతరం ఎట్టకేలకు భారత్కు బ్రేక్ లభించింది. భారీ షాట్ ఆడబోయిన వార్నర్, డీప్ మిడ్వికెట్లో ఇషాంత్కు క్యాచ్ ఇవ్వడంతో కరణ్కు టెస్టుల్లో తొలి వికెట్ దక్కింది. మరో వైపు స్మిత్ మాత్రం తగ్గలేదు. ఇటీవలి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ మిచెల్ మార్ష్ (87 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. అయితే సరిగ్గా 80 ఓవర్ల తర్వాత తీసుకున్న కొత్త బంతి భారత్కు కలిసొచ్చింది. మార్ష్ను అవుట్ చేసి ఆరోన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, షమీ వరుస ఓవర్లలో లయోన్ (3), హాడిన్ (0)లను అవుట్ చేసి సెషన్ను ముగించాడు. ఓవర్లు: 39.2, పరుగులు: 116, వికెట్లు: 4 ఘనంగా నివాళి రాకాసి బౌన్సర్కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన తమ సహచరుడు ఫిలిప్ హ్యూస్కు ఆసీస్ క్రికెటర్లు ఘనంగా నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. తొలి రోజు ఆటలో వార్నర్, స్టీవెన్ స్మిత్ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద బ్యాట్లు పెకైత్తి ఆకాశం వైపు చూసిస్తూ సహచరుడిని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో స్టేడియంలోని అభిమానులు కూడా లేచి నిలబడి తమ నివాళులు అర్పించారు. మ్యాచ్కు ముందు కూడా మైదానంలో భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. టర్ఫ్పై రాసిన ‘408’ నంబర్ ముందు ఆటగాళ్లు వరుసగా నిలబడి సరిగ్గా 63 సెకన్ల పాటు మౌనం పాటించారు. మ్యాచ్కు హాజరైన ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించారు. ఆటగాళ్ల కోరిక మేరకు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో 13వ ఆటగాడిగా హ్యూస్ పేరును అధికారికంగా ప్రకటించింది. క్లార్క్సేన తమ జెర్సీలపై 408 నంబర్ను రాసుకోగా... ఇరుజట్ల ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించారు. టాస్ వేసే సందర్భంగా కూడా కెప్టెన్లు క్లార్క్, కోహ్లిలు హ్యూస్ను మననం చేసుకున్నారు. హ్యూస్ లాకర్ వాట్సన్కి... హ్యూస్ మృతి చెంది రెండు వారాలు అవుతున్నా... సహచరుడి జ్ఞాపకాలను ఆసీస్ క్రికెటర్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అడిలైడ్ ఓవల్ మైదానంలో హ్యూస్ పేరిట ఉన్న లాకర్ను, డ్రెసింగ్ రూమ్లో అతనికి కేటాయించిన సీట్ను ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఉపయోగించుకుంటున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియాను సొంత గడ్డగా చేసుకున్న హ్యూస్కు అడిలైడ్ ఓవల్ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో సహచరులు కూడా వాటిని గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు కెప్టెన్ క్లార్క్... టామ్ కూపర్కు చెందిన లాకర్లో తన వస్తువులను భద్రపర్చుకున్నాడు. హ్యూస్ మైదానంలో కుప్పకూలినప్పుడు రెండో ఎండ్లో ఉన్నది కూపరే. ఇతను హ్యూస్కు హౌస్మేట్తో పాటు మంచి స్నేహితుడు కూడా. తిరగబెట్టిన గాయం చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న మైకేల్ క్లార్క్కు మరోసారి గాయం తిరగబెట్టింది. పూర్తి ఫిట్గా లేకపోయినా హ్యూస్ స్మృతి కారణంగా కావచ్చు అతను అడిలైడ్ టెస్టు బరిలోకి దిగాడు. ఇషాంత్ వేసిన 44వ ఓవర్లో షార్ట్ బాల్ను తప్పించుకునే క్రమంలో వెనక్కి వంగిన క్లార్క్ నొప్పితో విలవిల్లాడాడు. స్వల్ప ఎక్సర్సైజ్ల తర్వాత కూడా ఇబ్బందిగా అనిపించడంతో అతను మైదానం వీడాడు. అనంతరం ఇంజక్షన్లు తీసుకున్న క్లార్క్ రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే తాజా గాయం క్లార్క్ రెండో టెస్టు ఆడటంపై సందేహాలు పెంచింది. 19వ బంతికి... హ్యూస్ ఉదంతం నేపథ్యంలో టెస్టు సిరీస్ ఆరంభంలో బౌన్సర్లపై తీవ్ర చర్చ జరిగింది. అయితే ఆసీస్ సంగతేమో గానీ భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. తొలి మూడు ఓవర్లు సాధారణంగా గడిచాయి. నాలుగో ఓవర్ తొలి బంతికి ఆరోన్ బౌన్సర్ వేయడం, వార్నర్ కిందికి వంగి దానిని తప్పించుకోవడం వేగంగా జరిగాయి. ఆ సమయంలో మైదానమంతా హోరెత్తింది. వాట్సన్కు ఇషాంత్, క్లార్క్కు ఆరోన్ తొలి బంతిని బౌన్సర్లు వేశారు. కరణ్ శర్మ: నం. 283 ఈ మ్యాచ్తో లెగ్స్పిన్నర్ కరణ్ శర్మ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు ఆడుతున్న 283వ ఆటగాడు కరణ్. 1990లో కుంబ్లే (మాంచెస్టర్) తర్వాత ఒక భారత స్పిన్నర్ ఉపఖండం బయట టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఇదే తొలి సారి. కరణ్కు ధోని క్యాప్ను అందజేశాడు. ‘ఈ టూర్లో ఒక్కసారైనా అవకాశం దక్కుతుందని ఆశ పడ్డాను. అది తొలి మ్యాచ్కే కావడం ఆనందంగా ఉంది. నాదైన శైలిలో బౌలింగ్ చేసేలా అంతా ప్రోత్సహించారు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఉద్వేగాలను నియంత్రించుకోవాలి’అని కరణ్ చెప్పాడు. -
తొలి టెస్టులో ధోని ఆడతాడు!
పేస్ను సమర్థంగా ఎదుర్కొంటాం ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్య అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టెస్టుకు కెప్టెన్ ఎంఎస్ ధోని అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. విరాట్ కోహ్లి తొలిసారిగా టెస్టు జట్టుకు సారథిగా ఉండేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని ధావన్ అన్నాడు. ‘ఇద్దరు కెప్టెన్లు చాలా దూకుడుగా ఉంటారు. అయితే ఇద్దరికీ స్పష్టమైన తేడా ఉంది. కోహ్లి మైదానంలో కాస్త ఆవేశంగా ఉంటాడు. ఇద్దరి నేతృత్వంలో ఆడడం చాలా బాగుంటుంది. ధోని రానుండడంతో కోహ్లి టెస్టు కెప్టెన్సీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే’ అని అన్నాడు. ‘జాన్సన్ను మెరుగ్గా ఆడతాం’ మరోవైపు సిరీస్లో పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో జాన్సన్ ఒకడని, అయితే తనలాంటి పేస్ను ఎదుర్కొనే విషయంలో తాము చాలా ప్రాక్టీస్ చేశామని గుర్తుచేశాడు. అలాగే అంతర్జాతీయ మ్యాచ్ల్లో, ఐపీఎల్లో గతంలోనే తాను అతడి బౌలింగ్ను ఆడానని చెప్పాడు. ‘ఓవరాల్గా దూకుడుగా ఆడే ఓపెనర్ జట్టుకు అత్యం త ముఖ్యం. ఇది ఒక్క ఆస్ట్రేలియా గడ్డపైనే కాకుండా ప్రస్తుత క్రికెట్లో అవసరం. మిడిలార్డర్పై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. నేనలాంటి పాత్రను నిర్వర్తించడానికి ఇష్టపడతాను’ అని చెప్పాడు. ‘జట్టుకు ఉపయోగపడతా’ 2013లో ధావన్ తన తొలి టెస్టును మొహాలీలో ఆసీస్పైనే ఆడి అత్యంత వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి జట్టులో చోటు పక్కా చేసుకున్నప్పటికీ విదేశీ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ‘తొలి టెస్టు కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది మాకు చాలా ముఖ్యమైన పర్యటన. ఆసీస్ అత్యుత్తమ జట్టు. వీరిపై భారీ స్కోరు సాధించడం ప్రత్యేకతనిస్తుంది. నా వైఫల్యాల నుంచి ఎప్పుడూ పాఠాలు నేర్చుకుంటాను. ఆసీస్ దేశం నాకు కొత్త కాదు. మెల్బోర్న్లో నా భార్య, పిల్లలతో గడిపేందుకు వస్తుంటాను. గతంలో చాలా క్రికెట్ ఇక్కడ ఆడాను. ఓపెనర్గా మంచి ఆరంభాన్నిచ్చి జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నాను’ అని ధావన్ పేర్కొన్నాడు. -
ఇక ఆటపై దృష్టి: హాడిన్
వరుసగా రెండో రోజు ఆసీస్ జట్టు ప్రాక్టీస్ జట్టుతో కలిసిన క్లార్క్ అడిలైడ్: గత రెండు వారాలుగా భావోద్వేగ పరిస్థితుల తర్వాత మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఎక్కువగా ఆలోచించి సమస్యలను జటిలం చేసుకోదల్చుకోలేదన్నాడు. వరుసగా రెండో రోజు ప్రాక్టీస్లో పాల్గొన్న ఆసీస్ జట్టు నెట్స్లో బౌన్సర్లు వేయడం కాస్త తగ్గించింది. ‘ఇప్పుడే మళ్లీ క్రికెట్లోకి వచ్చాం. ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లందరూ కోరుకున్నారు. రాబోయే రెండు రోజులు బాగా శ్రమిస్తాం. ఆదివారం మాకు అత్యంత కీలకమైన రోజు’ అని హాడిన్ పేర్కొన్నాడు. శుక్రవారం సిడ్నీలో ఉన్న కెప్టెన్ క్లార్క్... శనివారం జట్టుతో పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. అయితే అతని ఫిట్నెస్పై మాత్రం సందేహాలు వీడటం లేదు. మరోవైపు తొలి టెస్టుకు తాను సారథ్యం వహించడంపై ఆలోచించడం లేదని హాడిన్ వెల్లడించాడు. ‘మధ్యాహ్నం క్లార్క్ ప్రాక్టీస్కు వచ్చాడు. సెషన్లో బాగా ఆడాడు. కాబట్టి నాకు కెప్టెన్సీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. సుదీర్ఘకాలంగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన కెప్టెన్ కూడా. తొలి టెస్టులో తొలి గంట క్లార్క్ కెప్టెన్గా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు అడిలైడ్లో ఆడటంపై మాట్లాడుతూ... ‘వేదిక మారినప్పుడు ప్రణాళికలు కూడా మారుతాయి. ఈ పిచ్ కూడా బాగుంది. వేదిక గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా భావన. పరిస్థితులు ఎలా ఉన్నా ఆడటం మన బాధ్యత కాబట్టి. దాన్ని సమర్థంగా నిర్వహించాలి. మా తరహా క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. బౌన్సర్లు వేయాలా? వద్దా? అనేది క్లిష్టమైన అంశం. అయితే మాపై ఒత్తిడి ఉన్నా ప్రణాళిలకను మాత్రం అమలు చేస్తాం. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను చూపిస్తాం’ అని వైస్ కెప్టెన్ వివరించాడు. క్లార్క్కు మినహాయింపు తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడే అంశంలో క్లార్క్కు మినహాయింపు ఇచ్చారు. హ్యూస్ మృతితో కాస్త ఒత్తిడిలో ఉన్న అతను తొలి టెస్టులో ఆడతాడో లేదోనన్న సందిగ్ధం కూడా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టుకు ముందు రోజు కెప్టెన్లు మీడియాతో మాట్లాడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం క్లార్క్కు బదులుగా పేసర్ జాన్సన్ మాట్లాడతాడు. ఆసీస్ జట్టు జెర్సీపై ‘408’ ఇటీవల మృతి చెందిన హ్యూస్కు నివాళిగా... భారత్తో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జెర్సీపై ‘408’ నంబర్ను ధరించనున్నారు. తమ సహచరుడి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో హ్యూస్ 408 ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. సాధారణంగా ప్రతి టెస్టు ఆటగాడికి వాళ్లు ధరించే జెర్సీపై వ్యక్తిగత నంబర్ ఉంటుంది. కానీ మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో ప్రతి ఆసీస్ ప్లేయర్ హ్యూస్ టెస్టు క్యాప్ నంబర్ను ధరించనున్నారు. హ్యూస్ మృతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా అభిమానులు అతడిని గుర్తు చేసుకుంటూ తమ ఇంటి ముందు క్రికెట్ బ్యాట్లను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఓ దొంగకు మాత్రం ఇదేమీ పట్టలేదు. ఒక ఇంటి ముందు ఉంచిన బ్యాట్ను ఎత్తుకుపోయాడు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. -
ఆసీస్లో ఫుల్ ‘ప్రాక్టీస్’
ఆకట్టుకున్న భారత బ్యాట్స్మెన్ సీఏ ఎలెవన్తో మ్యాచ్ డ్రా అడిలైడ్: కీలకమైన టెస్టు సిరీస్కు ముందు ఆసీస్ గడ్డపై భారత్కు ఫుల్ ‘ప్రాక్టీస్’ లభించింది. రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో తొలి రోజు బౌలర్లు తడాఖా చూపితే... రెండో రోజు బ్యాట్స్మెన్ నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఓవరాల్గా నలుగురు బ్యాట్స్మెన్ అర్ధసెంచరీలు నమోదు చేయడంతో సీఏ ఎలెవన్తో శుక్రవారం ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయ్యింది. గ్లైడరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... భారత్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (94 బంతుల్లో 66 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు), విజయ్ (136 బంతుల్లో 60 రిటైర్డ్; 10 ఫోర్లు), రహానే (64 బంతుల్లో 56 రిటైర్డ్; 7 ఫోర్లు), సాహా (67 బంతుల్లో 51 రిటైర్డ్; 8 ఫోర్లు)లు రాణించారు. రోహిత్ శర్మ (48) ఫర్వాలేదనిపించాడు. తర్వాత సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్లో 21 ఓవర్లలో 5 వికెట్లకు 83 పరుగులు చేసింది. సిల్క్ (41 నాటౌట్), షార్ట్ (26) ఓ మోస్తరుగా ఆడినా... మిగతా వారు విఫలమయ్యారు. ఇషాంత్కు 2 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 243 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 60; ధావన్ (సి) ప్యాటిసన్ (బి) లాలర్ 0; పుజారా (సి) టర్నర్ (బి) లాలర్ 22; కోహ్లి రిటైర్డ్ అవుట్ 66; రహానే రిటైర్డ్ అవుట్ 56; రోహిత్ రనౌట్ 48; సాహా (సి) టర్నర్ (బి) మూడీ 51; రైనా (సి) సిల్క్ (బి) టర్నర్ 20; జడేజా (సి) కార్టర్స్ (బి) లాలర్ 23; కరణ్ (సి) టర్నర్ (బి) లాలర్ 4; ఉమేశ్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు: 22; మొత్తం: (90 ఓవర్లలో ఆలౌట్) 375. వికెట్ల పతనం: 1-1; 2-36; 3-159; 4-169; 5-262; 6-272; 7-311; 8-351; 9-355; 10-375. బౌలింగ్: బర్డ్ 22-4-81-0; లాలర్ 17-4-59-4; గుల్బిస్ 17-3-48-0; మూడీ 13-1-56-1; షార్ట్ 8-0-47-0; ప్యాటిసన్ 7-1-32-0; టర్నర్ 6-1-40-1 సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 21 ఓవర్లలో 83/5. -
ఆరోన్, కరణ్... సూపర్
సీఏ ఎలెవన్ను కట్టడి చేసిన భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్లో 243 ఆలౌట్ భారత్ 99/2 రెండో ప్రాక్టీస్ మ్యాచ్ అడిలైడ్: ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. వరుసగా రెండో ప్రాక్టీస్ మ్యాచ్లోనూ సత్తా చాటారు. వరుణ్ ఆరోన్ (4/41), కరణ్ శర్మ (3/57)లు విజృంభించడంతో గురువారం ప్రారంభమైన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్లో 68.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. సిల్క్ (58), గోట్చ్ (58 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసింది. విజయ్ (39 బ్యాటింగ్), కోహ్లి (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ధావన్ (0), పుజారా (22) విఫలమయ్యారు. విజయ్, కోహ్లిలు మూడో వికెట్కు అజేయంగా 63 పరుగులు జోడించారు. గ్లైడరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... చెరో 100 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు ఇరుజట్లు అంగీకరించడంతో టాస్ లేకుండానే భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన సీఏ జట్టుకు ఆరంభంలో షమీ, ఆరోన్ కొత్త బంతితో చుక్కలు చూపించారు. కార్టర్స్ (1), టర్నర్ (0), షార్ట్ (19)లను అవుట్ చేయడంతో సీఏ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిల్క్, కీత్ (19)లు నాలుగో వికెట్కు 71 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే సిల్క్ అవుటైన తర్వాత స్పిన్నర్ కరణ్ శర్మ తన మ్యాజిక్ను ప్రదర్శించాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. అయితే ఓ ఎండ్లో గోట్చ్ పట్టు వదలకుండా పోరాడటంతో ఓ దశలో 159/7 స్కోరుతో ఉన్న సీఏ ఇన్నింగ్స్ కాస్త కోలుకుంది. లాలర్ (21), ప్యాటిసన్ (16), రెయిన్బర్డ్ (4)లో కలిసి గోట్చ్ మొత్తం 84 పరుగులు జోడించాడు. షమీ 2, జడేజా ఒక్క వికెట్ తీశాడు. స్కోరు వివరాలు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 243. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 39; ధావన్ (సి) ప్యాటిసన్ (బి) లాలర్ 0; పుజారా (సి) టర్నర్ (బి) లాలర్ 22; కోహ్లి బ్యాటింగ్ 30; ఎక్స్ట్రాలు: 8; మొత్తం(29 ఓవర్లలో 2 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1-1; 2-36 బౌలింగ్: రెయిన్బర్డ్ 10-1-41-0; లాలర్ 8-2-18-2; గుల్బిస్ 5-2-10-0; మూడీ 6-1-27-0. హ్యూస్ మృతికి సంతాపంగా ఇరుజట్లు మ్యాచ్కు ముందు ఒక నిమిషంపాటు మౌనం పాటించాయి. భారత ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి మ్యాచ్ ఆడారు. తమ బ్యాట్ల మీద టోపీలు పెట్టి మైదానంలో ఉంచారు. స్కోరు బోర్డుపై ‘ఆర్ఐపీ’ హ్యూస్ 408 అని రాశారు. -
ఇక ఆటపై దృష్టి
నేటి నుంచి భారత్కు ప్రాక్టీస్ మ్యాచ్ శుక్రవారం జట్టుతో చేరనున్న ధోని అడిలైడ్: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఫిల్ హ్యూస్ మైదానంలో గాయపడటం... ఆ తర్వాత అతను మృతి చెందడంతో వారం రోజుల పాటు క్రికెట్ గురించి ఎవరూ మాట్లాడలేదు. అంతా హ్యూస్ గురించే చర్చ. బుధవారం హ్యూస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక గురువారం నుంచి మళ్లీ క్రికెట్ మీద దృష్టి సారించనున్నారు. గ్లెనెల్గ్లోని గ్లిడొరెల్ స్టేడియంలో జరిగే రెండు రోజుల మ్యాచ్లో భారత్... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్తో తలపడుతుంది. హ్యూస్ అంత్యక్రియలకు హాజరైన విరాట్, రోహిత్, విజయ్ కూడా ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ముందు ప్రాక్టీస్ కోసం ఇదే చివరి అవకాశం కాబట్టి... తుది జట్టులో ఉండే ఆటగాళ్లందరికీ ఎక్కువ అవకాశం ఇవ్వాలని జట్టు భావిస్తోంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్, బౌలర్లు అందరూ రాణించారు. అయితే ఆ తర్వాత ఒకట్రెండు ప్రాక్టీస్ సెషన్లలో మాత్రమే పాల్గొన్నారు. చేతి గాయం నుంచి కోలుకున్న ధోని శుక్రవారం సాయంత్రం భారత జట్టుతో చేరతాడు. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండానే... 9 నుంచి అడిలైడ్లోనే జరిగే తొలి టెస్టులో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది ఆసక్తికరం. -
ధోని వచ్చేస్తున్నాడు!
తొలి టెస్టు బరిలో కెప్టెన్ కోహ్లికి చేజారిన నాయకత్వ అవకాశం హ్యూస్ అంత్యక్రియలకు ముగ్గురు భారత ఆటగాళ్లు అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ అడిలైడ్లో జరగనుంది. చేతి గాయం కారణంగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లని ధోని, ఇప్పుడు నేరుగా అడిలైడ్ చేరుకోనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మీడియా మేనేజర్ ఆర్.ఎన్. బాబా ధ్రువీకరించారు. తొలి టెస్టు ఆరంభానికి చాలా ముందుగానే ధోని జట్టుతో కలుస్తాడని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 4నుంచి తొలి టెస్టు జరిగితే ధోని ఆడే అవకాశం లేకపోయేది. అయితే హ్యూస్ మరణంతో షెడ్యూల్లో మార్పు జరిగింది. దాంతో గాయంనుంచి కోలుకునేందుకు ధోనికి తగిన సమయం లభించింది. గురువారంనుంచి జరగాల్సిన భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్కు మాత్రం మహి అందుబాటులో ఉండడు. అయితే తగినంత విరామం లభించినా... ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి టెస్టు ఆడతాడా, లేదా అనేదానిపై మాత్రం ఇంకా సందిగ్ధం వీడలేదు. నమన్ ఓజా వెనక్కి! భారత టెస్టు కెప్టెన్గా వ్యవహరించేందుకు విరాట్ కోహ్లి మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పేట్లు లేదు. అడిలైడ్ టెస్టుకు ధోని సిద్ధం కావడంతో కోహ్లికి నాయకత్వం అవకాశం పోయింది. మరో వైపు ధోని గైర్హాజరీలో ఒక టెస్టు కోసం రిజర్వ్ కీపర్గా వెళ్లిన నమన్ ఓజాకు కూడా నిరాశే ఎదురు కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో సాహా రూపంలో రిజర్వ్ కీపర్ ఉండటంతో ధోని రాకతో ఓజా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. మరో వైపు మాక్స్విలేలో బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియలకు భారత జట్టు తరఫున కోహ్లి హాజరు కానున్నాడు. మరో ఇద్దరు క్రికెటర్లు రోహిత్ శర్మ, మురళీ విజయ్లతో పాటు ఫ్లెచర్, రవిశాస్త్రి, మేనేజర్ అయూబ్ కూడా వెళుతున్నారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొని ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పడం తొందరపాటు: సీఏ తొలి టెస్టు కోసం తమ ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని సీఏ వెల్లడించింది. ‘సమయం వచ్చినప్పుడు జట్టులోని ప్రతి సభ్యుడు ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ఏ ఆటగాడూ ఆడేందుకు సుముఖంగా లేడు. క్రికెటర్లపై ఒత్తిడి తేవొద్దని వైద్య బృందం సలహా ఇచ్చింది. దీన్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అభిమానులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. టెస్టు క్రికెట్ అనేది చాలా పెద్దది. రెండు గంటల్లో ముగిసేది కాదు’ అని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ను బట్టి తుది జట్టును ఎంపిక చేయడం ఆనవాయితీ అని చెప్పిన సదర్లాండ్ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత టెస్టు గురించి ఆలోచిస్తామన్నారు. మరోవైపు తొలి టెస్టులో తాను ఆడటంపై కచ్చితంగా హామీ ఇవ్వలేనని రేయాన్ హారిస్ తెలిపాడు. తొలి రెండు వన్డేల షెడ్యూల్ మార్పు భారత జట్టుకు తగినంత విశ్రాంతినివ్వడం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పు చేసింది. సిరీస్ తొలి మ్యాచ్లో భారత్ ఆడాల్సిన అవసరం లేకుండా దీనిని మార్చింది. పాత షెడ్యూల్ ప్రకారం జనవరి 16న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఇప్పుడు జనవరి 18కి మారింది. జనవరి 18న జరగాల్సిన ఆసీస్, ఇంగ్లండ్ మ్యాచ్ను రెండు రోజుల ముందుగానే సిరీస్లో తొలి వన్డేగా నిర్వహిస్తారు. -
తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోని!
అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని హాజరయ్యే అవకాశం ఉంది. ముందుగా ఖరారు చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితా ప్రకారం తొలి టెస్టులో ధోని పేరు లేదు. చేతికి గాయం కారణంగా 'బ్రిస్బేన్'టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ ధోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా తొలి టెస్టు వేదిక బ్రిస్బేన్ నుంచి అడిలైడ్ కు మారింది. పాత షెడ్యూల్ ప్రకారం 12నుంచి అడిలైడ్లో రెండో టెస్టు జరగాల్సి ఉండగా... 4 వ తేదీ నుంచి బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరగాలి. ఇప్పుడు మెల్బోర్న్ మినహా మిగతా మూడు టెస్టు మ్యాచ్ల తేదీల్లో స్వల్ప మార్పులతో కొత్త షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది.గత రెండేళ్లుగా ఫిల్ హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా సీఏ భావిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మారిన షెడ్యూల్ సమీకరణాలు దృష్ట్యా ధోని అడిలైడ్ టెస్టుకు హాజరైనా.. ఆ టెస్టులో ఆడతాడా?లేదా అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
తొలి టెస్టు అడిలైడ్లో 9నుంచి
మూడు మ్యాచ్ల తేదీల్లో మార్పులు అడిలైడ్: ఫిల్ హ్యూస్ హఠాన్మరణంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) టెస్టు సిరీస్పై స్పష్టత తీసుకు వచ్చింది. అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. పాత షెడ్యూల్ ప్రకారం 12నుంచి అడిలైడ్లో రెండో టెస్టు జరగాల్సి ఉండగా... ఇప్పుడు మెల్బోర్న్ మినహా మిగతా మూడు టెస్టు మ్యాచ్ల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. సిరీస్ ప్రసారకర్త చానల్ 9 ముందుగా దీనిని ఖరారు చేయగా...ఆ తర్వాత సీఏ తమ వెబ్సైట్లో కొత్త షెడ్యూల్ను ఉంచింది. కొత్త షెడ్యూల్ను బీసీసీఐ కూడా ఖరారు చేసింది. 1976-77 తర్వాత ఓ సిరీస్లో అడిలైడ్ మొదటి టెస్టుకు వేదిక కానుండటం ఇదే తొలిసారి. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా... గత రెండేళ్లుగా ఫిల్ హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా సీఏ భావిస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 9 నుంచి అడిలైడ్లో, 17నుంచి బ్రిస్బేన్లో రెండో టెస్టు జరుగుతాయి. 26నుంచి మెల్బోర్న్లో మూడో టెస్టు, జనవరి 6నుంచి నాలుగో మ్యాచ్ సిడ్నీలో జరుగుతాయి. మొత్తం 33 రోజుల వ్యవధిలో నాలుగు టెస్టుల సిరీస్ ముగించే విధంగా షెడ్యూల్ సవరించారు. దీంతో మొదటి రెండు టెస్టుల మధ్య మూడు రోజులు...రెండు, మూడో టెస్టుల మధ్య నాలుగు రోజుల విరామం మాత్రమే లభించనుంది. హ్యూస్ మృతితో రద్దయిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా భారత్కు లభిస్తోంది. అడిలైడ్లో గురు, శుక్రవారాల్లో భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. అందువల్ల భారత ఆటగాళ్లు బ్రిస్బేన్కు వెళ్లకుండా అడిలైడ్లోనే ఆగిపోయారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న ఇరు జట్ల కెప్టెన్లు ఎంఎస్ ధోని, మైకేల్ క్లార్క్లకు కూడా కోలుకునేందుకు అవకాశం దక్కింది. దీంతో వీరిద్దరు కూడా తొలి టెస్టులో ఆడతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ క్రికెటర్ల ప్రాక్టీస్ మొదలు సహచరుడి ఆకస్మిక మృతినుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా మైదానం వైపు కదులుతున్నారు. బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియల కోసం మైకేల్ క్లార్క్ ఇప్పటికే మాక్స్విలే చేరుకోగా, మిగతా న్యూసౌత్వేల్స్ జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ ప్రారంభించారు. తొలి టెస్టు జట్టులో సభ్యులైన బ్రాడ్ హాడిన్, జోష్ హాజల్వుడ్ సోమవారం ఇతర ఆటగాళ్లతో కలిసి సాధన చేశారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ మ్యాచ్లను కూడా 9నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఏ ప్రకటించింది. హ్యూస్ గాయపడి ప్రాణాలు కోల్పోయిన మైదానంలోనే కొత్త షెడ్యూల్ ప్రకారం న్యూసౌత్వేల్స్, క్వీన్స్లాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ వారాంతంలో ఆసీస్ గ్రేడ్ క్రికెట్ రద్దు కాగా, దిగువ స్థాయిల్లో క్లబ్ క్రికెట్కు మాత్రం విరామం ఇవ్వలేదు. కొనసాగుతున్న నివాళులు... హ్యూస్ను అభిమానించే క్రికెటర్లు తమదైన శైలిలో దివంగత క్రికెటర్కు ఇంకా నివాళులు అర్పిస్తున్నారు. పెర్త్లో యూనివర్సిటీ జట్టు తరఫున ఆడుతూ అస్టిన్ అగర్ 98 పరుగులకు అవుటయ్యాడు. గత ఏడాది ట్రెంట్బ్రిడ్జ్లో తన తొలి టెస్టు మ్యాచ్లో కూడా 98 పరుగులే చేసిన అగర్... ఫిల్ హ్యూస్తో కలిసి చివరి వికెట్కు 163 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ప్రదర్శనను ఇది గుర్తుకు తెస్తోంది. విక్టోరియాలో జరుగుతున్న క్లబ్ మ్యాచ్లో స్థానిక క్రికెటర్ షాన్ ఆర్థర్ మరో తరహాలో హ్యూస్ను గుర్తు చేసుకున్నాడు. తమ జట్టు స్కోరు 63 ఓవర్లలో 408 పరుగులకు చేరగానే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఆ సమయంలో 220 పరుగులతో ఆడుతున్న అతను మరో 11 పరుగులు చేస్తే అత్యధిక పరుగుల రికార్డు సృష్టించేవాడు. కానీ హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్, అతని టెస్టు నంబర్ రాగానే ఆర్థర్ మ్యాచ్ ముగించాడు. -
హ్యూస్ 'హోం గ్రౌండ్'లో తొలిటెస్టు?
సిడ్నీ: భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలిటెస్టు వేదికను మార్చే యోచనలో ఉన్నారు. దివంగత క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ కు నివాళిగా తొలి టెస్టును అడిలైడ్ లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సన్నద్దమైనట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 వ తేదీ నుంచి తొలి టెస్టు బ్రిస్బేన్ లో నూ, రెండో టెస్టు డిసెంబర్ 12వ తేదీ నుంచి అడిలైడ్ లో ఆరంభం కావాలి. అయితే తొలి టెస్టు ను హ్యూస్ సొంత గ్రౌండ్ అడిలైడ్ కు మారిస్తే ఎలా ఉంటుంది అనే యోచనలో సీఏ ఉంది. తొలి టెస్టు రద్దయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా.. అందుకు బదులుగా తొలిటెస్టును అడిలైడ్ ఏర్పాటు చేస్తేనే హ్యూస్ కు సరైన నివాళిగా ఉంటుందని క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. బౌన్సర్కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన హ్యూస్ గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
కారులో దాక్కుని 16 కిలోమీటర్లు...
సాక్షి, అడిలైడ్: హైవేలో కారులో రయ్మని ఒంటరిగా దూసుకుపోతున్న వ్యక్తికి ఉన్నట్లుండి ఏడుపులు వినిపిస్తే ఎలా ఉంటుంది? గుండె ఆగిపోదు. కానీ, జేన్ బ్రిస్టర్ మాత్రం ధైర్యం చేయటంతో.. ఓ జీవి ప్రాణం నిలిచింది. గత వారం జేన్ తన కారును అడిలైడ్లో పార్కింగ్ చేయగా, ఎక్కడి నుంచి వచ్చింది తెలీదుగానీ ఓ కోలా(ఒక రకం ఎలుగుబంటి) టైర్ల గుండా కారు ముందు భాగంలోకి యాక్సల్ ప్రాంతంలో దాక్కుంది. అది గమనించని జేన్ కారును బయటికి తీసి తన గమ్యస్థానానికి బయలుదేరాడు. అలా ఓ పది మైళ్ల(16 కిలోమీటర్లు) దూరం వెళ్లాక అతనికి ఏవో ఏడుపులు వినిపించాయి. చివరకు జుట్టు కాలిన వాసన రావటంతో అనుమానం వచ్చి కారు మొత్తం వెతికి చూశాడు. తీరా చూస్తే కారు ముందు భాగం ఓపెన్ చూస్తే అది బిక్కు బిక్కు మంటూ ఓ మూల నక్కింది. వెంటనే జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా, వారొచ్చి దానిని రక్షించారు. సాధారణంగా కొలాలు చాలా సున్నితమైన జీవులను, అంతా దూరం ప్రయాణించినా వేడికి ఆ ఆడ కోలా అది బతికి ఉండటం ఆశ్చర్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
‘మిస్సైల్’ జాన్సన్
అడిలైడ్: కనీసం రెండో టెస్టులోనైనా రాణించి యాషెస్ సిరీస్ను సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ ఆశలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ (7/40) నీళ్లు చల్లాడు. నిప్పులు చెరిగే బంతులతో కుక్ సేనను వణికించాడు. దీంతో అడిలైడ్లో జరుగుతున్న ఈ మ్యాచ్పై క్లార్క్ సేన పట్టు బిగించింది. జాన్సన్ దెబ్బకు శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో కంగారూలకు 398 పరుగుల ఆధిక్యం లభించింది. బెల్ (72 నాటౌట్), కార్బెరీ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్ను ఫాలోఆన్ ఆడించే అవకాశం వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గుచూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 39 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా 530 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్నర్ (83 బ్యాటింగ్), స్మిత్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 35/1 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రూట్ (15), పీటర్సన్ (4) వెంటనే అవుటయ్యారు. కార్బెరీ, బెల్ నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే జాన్సన్ బంతులకు మిడిల్, లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. బెల్ క్రీజులో నిలదొక్కుకున్నా... రెండోఎండ్లో ఆసీస్ పేసర్ వరుస పెట్టి వికెట్లు తీస్తూ పోయాడు. దీంతో ఇంగ్లండ్ 61 పరుగులకు చివరి 7 వికెట్లు కోల్పోయింది. లియోన్, సిడిల్, వాట్సన్ తలా ఓ వికెట్ తీశారు. -
క్లార్క్, హాడిన్ సెంచరీలు
అడిలైడ్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ క్లార్క్ (245 బంతుల్లో 148; 17 ఫోర్లు), హాడిన్ (177 బంతుల్లో 118; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను 158 ఓవర్లలో 9 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హారిస్ (55 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కార్బెరీ (20 బ్యాటింగ్), రూట్ (9) క్రీజులో ఉన్నారు. కుక్ (3)ను జాన్సన్ దెబ్బతీశాడు. అంతకుముందు 273/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన క్లార్క్, హాడిన్లు నిలకడగా ఆడారు. ఇంగ్లండ్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. క్లార్క్ భారీ షాట్లు ఆడకపోయినా.. హాడిన్ మాత్రం స్పిన్నర్ల బౌలింగ్లో సిక్సర్ల మోత మోగించాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్ లెగ్లో బెల్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న క్లార్క్... క్రమంగా కెరీర్లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు స్టోక్ బౌలింగ్లో అండర్సన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్కు నెలకొన్న 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జాన్సన్ (5), సిడిల్ (2) వెంటవెంటనే అవుటైనా... హారిస్ సమయోచితంగా ఆడాడు. హాడిన్తో కలిసి తొమ్మిదో వికెట్కు 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాడిన్ 4వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన లియోన్ (17 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పదో వికెట్కు హారిస్తో కలిసి అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్ 3, స్వాన్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన 12 సిక్సర్లు యాషెస్లో ఆసీస్ తరఫున రికార్డు. 2005 ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్పై 10 సిక్సర్లు కొట్టారు. మండేలాకు నివాళి: శుక్రవారం తెల్లవారుజామున మరణించిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఇరుజట్లు నివాళులు అర్పించాయి. మ్యాచ్కు ముందు ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించి నల్ల బ్యాండ్లను ధరించి బరిలోకి దిగారు.