
మహిళల టీ20 ప్రపంచకప్-2024కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది

ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 3 నుంచి ఆరంభం కానుంది

ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం దుబాయ్కు చేరుకుంది

ఎయిర్పోర్టులో హర్మన్ప్రీత్ సేనకు అనుకోని అతిథి ఎదురయ్యాడు

అతడు మరెవరో కాదు బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి

టీమిండియాకు ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పాడు

ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు రానాతో ఫొటోలు దిగారు

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ వుమెన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు

భారత జట్టు అక్టోబరు 4న తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది

ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా యూఏఈకి చేరుకున్నట్లు కెప్టెన్ హర్మన్ వెల్లడించింది

కాగా ప్రపంచకప్ టోర్నీ అక్టోబరు 20న ఫైనల్తో ముగియనుంది



