Rana Daggubati
-
బిగ్బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా ఆమెకు బిగ్బాస్లో ఛాన్స్ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.నాగార్జున వద్దుఅందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసురానా.. ఫ్రెండ్షిప్ను లవ్ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్బాస్కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: బెట్టింగ్ యాప్స్.. సడన్గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ -
విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటిపై కేసు నమోదు
-
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్లో.. ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్లు జంగిల్రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్విన్ సైట్లు, యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
రానాపై బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన టీమ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై వస్తున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రానాపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రానా పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. స్కిల్ ఆధారిత గేమ్లకు బ్రాండ్ అంబాసిడర్గా రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. అయితే ఈ అగ్రిమెంట్ 2017లోనే ముగిసిందని వెల్లడించింది. కేవలం చట్టబద్ధమైన కంపెనీలకే రానా ప్రమోట్ చేశారని పీఆర్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొందిఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించారు. చట్టపరంగా అనుగుణంగా ఉంటేనే రానా అంగీకరిస్తారని తెలిపారు. రానా దగ్గుబాటి ప్రమోట్ చేసిన యాప్ చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ జారీ చేశామని వెల్లడించారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్లను హైలైట్ చేయడం చాలా అవసరమని.. ఇలాంటి గేమ్లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని.. అందువల్ల చట్టబద్ధంగా వీటిని అనుమతించారని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని నోట్లో ప్రస్తావించారు.బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్, యూట్యూబర్స్తో పాటు పలువురు బుల్లితెర నటీనటులపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియతో పాటు రీతూ చౌదరి పంజాగుట్ట పీఎస్లో పోలీసులకు వివరణ ఇచ్చారు. -
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కలకలం
-
బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్కి వెళ్లింది. తన అడ్వకేట్తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు. -
శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?
👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్ని అడిగినా, ‘డాక్టర్ కాబోయి యాక్టర్ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది. విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.👉: కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్. యశ్ భార్య రాధికా పండిట్కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!👉: యశ్ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.👉: పుష్ప –2లో కిస్సిక్ సాంగ్తో ఆడియన్స్ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది.👉: డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్గా డాన్స్ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి పెట్టారు.👉: పుష్ప –2లో ఐటమ్ సాంగ్ చేసి, సమంతని రీ ప్లేస్ చేసింది. కిస్సిక్ సాంగ్కు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్లో భగవంత్ కేసరిలోని పాత్ర, సాంగ్స్లో కిస్సిక్ సాంగ్ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.👉: నితిన్తో రాబిన్హుడ్ సినిమాలో నటిస్తోంది. నితిన్తో రెండో సినిమా. నిజానికి రాబిన్హుడ్లో రష్మిక మందన్నా హీరోయిన్గా చేయాలి. మొదట షూటింగ్ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్ చేసింది.👉: పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.👉: బై టూ లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పింది శ్రీ లీల.👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్లా కోట్లాది వ్యూస్తో టాప్ ప్లేస్లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటుంది శ్రీ లీల. -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల
మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.! ఇదే పాయింట్తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.23 సినిమా టీజర్లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటనతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్తో '23' చిత్రంలో చూపించనున్నారు. -
తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)
-
పావుకిలో టమాట రూ.850, పుట్టగొడుగు రూ.5 లక్షలు.. రానా షాప్లో రేట్లు ఎక్కువే!
చాలామంది ఇప్పుడు ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా (Rana Daggubati) దంపతులు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఫుడ్ స్టోర్స్ అనే షాప్ను జనవరిలో ప్రారంభించారు. ఇక్కడ కిరాణా సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు, మాంసం, దుస్తులు, షూలు, బ్యాగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. అయితే అన్నీ ప్రీమియం సరుకులే ఉంటాయి. బయట ఎక్కడా దొరకని అంతర్జాతీయ ఐటంస్ ఈ చోట లభించడం విశేషం.ఖరీదైన కూరగాయలుఈ ఫుడ్ స్టోరీస్లో స్మూతీస్, జ్యూస్, కాఫీ, చాక్లెట్స్, నూడుల్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లి వంటి ప్రముఖులు ఉపయోగించే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. విదేశాల్లో మాత్రమే దొరికే ప్రత్యేక చీజ్లు, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు కిలోల మష్రూమ్ ఈ ఫుడ్ స్టోరీస్లో ఉంది. దీని విలువ ఏకంగా రూ.5 లక్షలు. మామూలు పుట్టగొడుగులు 100 గ్రాముల ధర రూ.175 నుంచి వెయ్యి రూపాయలపైనే ఉంది. కొబ్బరి బోండా వెయ్యి రూపాయలుకూరగాయల్ని సైతం విదేశాలనుంచి తీసుకొస్తారు. మెక్సికో, స్పెయిన్, నెదర్లాండ్స్.. ఇలా ఎన్నో దేశాల నుంచి దిగుమతి చేస్తారు. ఉదాహరణకు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన టమాట ధర 200 గ్రాములకుగానూ రూ.850గా నిర్ణయించారు. ఒక గ్లాస్ చెరకు రసం రూ.275గా ఉంది. థాయ్లాండ్కు చెందిన కొబ్బరి బోండాం ఒక్కోటి వెయ్యి రూపాయలని తెలుస్తోంది. ఈ ధరలు చూసిన నెటిజన్లు.. రానా- మిహికా పెట్టిన షాప్ కేవలం ధనవంతులకేనని, సామాన్యులు ఇక్కడ ఏదీ కొనే పరిస్థితి లేదని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా! -
బాపు అరుదైన సినిమా: రానా దగ్గుబాటి
రెగ్యులర్కి భిన్నంగా ఉండే ‘బాపు’లాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఒక సంస్కృతిని చూపించే ఇలాంటి చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకుల్లా నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati ) అన్నారు. బ్రహ్మాజీ(Brahmaji) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘బాపు’(Bapu). దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.హైదరాబాద్లో నిర్వహించిన ‘బాపు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రానా దగ్గుబాటి, నటుడు తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘బాపు’ ట్రైలర్లో మట్టివాసన కనిపించింది. దయాగారు చాలా మంచి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘మన కుటుంబంలోని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి.ఈ మూవీని అందరం ్రపోత్సహిద్దాం’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పేర్కొన్నారు. ‘‘బాపు’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి మంచి పేరు రావాలి’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘మా చిత్రాన్ని అందరూ థియేటర్స్లో చూడాలి’’ అని దయా కోరారు. ‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘బాపు’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. -
సిద్ధు జొన్నలగడ్డ ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ చిత్రం ప్రెస్మీట్ (ఫొటోలు)
-
'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ చూశారా..?
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంది. సుమారు ఐదేళ్ల తర్వాత 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో బిగ్ స్క్రీన్పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. హీరో రానా దగ్గుబాటి సోషల్మీడియా వేదికగా రీసెంట్గా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసిందే. -
నెట్ఫ్లిక్స్తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
భారత్లో పర్యటించనున్న మాజీ బాక్సింగ్ లైట్ వెయిట్ ఛాంపియన్
భారత్లో పోరాట క్రీడలను ప్రోత్సహించడానికి.. అలాగే అంతర్జాతీయ, దేశీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్ మొదటిసారి (మార్చిలో) భారత్లో పర్యటించనున్నాడు. ఆరు భారతీయ నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు) ఆంథోనీ పెట్టిస్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (APFC), ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) మధ్య బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఏపీఎఫ్సీ భారత పర్యటన ఖరారైన విషయాన్ని ఐపీబీఎల్ నిర్ధారించింది. 'ROAD TO IPBL' పేరుతో సాగే ఈ పర్యటనలో WBC ఇండియా ఛాంపియన్ శబరి జైశంకర్.. మాజీ బెల్లాటర్ బాంటమ్వెయిట్ ఛాంపియన్ సెర్గియో పెట్టిస్ (ఆంథోనీ పెట్టిస్ సోదరుడు) మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన సెర్గియో పెట్టిస్.. ప్రస్తుతం బెల్లాటర్ MMAతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెల్లాటర్లో చేరడానికి ముందు సెర్గియో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో పోటీ పడ్డాడు. అక్కడ బాంటమ్వెయిట్ విభాగంలో అగ్రశ్రేణి యోధులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.సెర్గియో ప్రత్యర్థి శబరి జైశంకర్ భారతదేశపు అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాక్సర్. శబరి జైశంకర్.. WBC ఇండియా, WBC ఆస్ట్రలేసియా, WBC మిడిల్ ఈస్ట్ టైటిళ్లతో సహా బహుళ ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) టైటిళ్లను గెలుచుకున్నారు.'రోడ్ టు IPBL' ఇండియా టూర్ అనేది కేవలం బాక్సింగ్ మ్యాచ్ల శ్రేణి మాత్రమే కాదు. ఇది ప్రపంచ పోరాట క్రీడల వేడుక. ఇది భారతీయ అభిమానులు మరియు పోరాట క్రీడాకారుల అభిరుచిని రేకెత్తించడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఒకచోటికి చేర్చింది. మేము సందర్శించే ప్రతి నగరంలో IPBL ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మరియు మరపురాని క్షణాలను సృష్టించాలని భావిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. మేము చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము అని IPBL వ్యూహాత్మక భాగస్వామి రానా దగ్గుబాటి అన్నారు.IPBL బాక్సింగ్ గురించి:IPBL బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (www.indianproboxingleague.com) భారతదేశంలోని ఒక ప్రముఖ బాక్సింగ్ ప్రమోషన్ కంపెనీ. ఇది బాక్సింగ్ క్రీడను ఉన్నతీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్ల ప్రతిభను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. బాక్సింగ్ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. -
వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ విడుదలైంది.ఈ సిరీస్కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊. Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025 -
ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంది. ‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల సమయంలో హీరో రానా దగ్గుబాటి సోషల్మీడియా వేదికగా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు థియేటర్స్లో విడుదల సందర్భంగా ఆయన మరోసారి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తన సోషల్మీడియాలో ఒక ఫన్నీ వీడియోతో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే, ఈసారి 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో ఫిబ్రవరి 14 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Title endhuk marchamo adagakandi, It’s complicated anthe! Unexpected drama tho final ga theatres lo release avthundi ee Feb 14th ki. Catch us with your loved ones! Or two’s 😉#ItsComplicated #Starboy #FinallyIntheatres#SiddhuJonnalagadda @RanaDaggubati @ShraddhaSrinath… pic.twitter.com/vBOemAKPqD— Rana Daggubati (@RanaDaggubati) February 3, 2025 -
హీరో రాణా సహా సంపన్నుల నివాసగృహాలు కేఫ్స్, రెస్టారెంట్స్గా
ప్రస్తుతం స్పెయిన్లో నివసిస్తూ ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్గానూ పాపులర్ అయిన ఆశ్రిత ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటితో కలిసి ఆశ్రిత దగ్గుబాటి ఇటీవల తాము సందర్శించిన ఓ రెస్టారెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లోని కొత్త వీడియోలో పంచుకున్నారు. అది గతంలో తమ దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత నివాసగృహం కాగా ఇప్పుడు రెస్టారెంట్గా మారింది. నాటి దగ్గుబాటి నివాసం.. ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్లతో శాంక్చురీ బార్ అండ్ కిచెన్ అనే అత్యాధునిక రెస్టారెంట్గా మారిన తర్వాత ఆ ఇంటిని సందర్శించడం ఇదే తొలిసారి అని ఆశ్రిత తెలిపారు. కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ పాత ఇంటిలో నివసించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.ప్రకృతి మధ్యకు.... ఇళ్లను రెస్టారెంట్లుగా మార్చడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తమ పిల్లలు విదేశాల్లో నివసిస్తూ ఉండడంతో తాము ఇక్కడ ఒంటరిగా లంకంత ఇళ్ల నిర్వహణ చూడలేక లీజ్కి ఇస్తున్నట్టు కొందరు సంపన్న తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఈ రెస్టారెంట్లు.. పన్నులు విద్యుత్ బిల్లులతో సహా ఎంత అద్దె అయినా సరే చెల్లించడానికి వెనుకాడడం లేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అన్వేషకులు అద్దె బదులు ఇఎమ్ఐలు చెల్లించడానికి ఇష్టపడతారు. కానీ ఈ కేఫ్స్ అద్దెలు ఎక్కువైనా సై అంటాయి. ‘అని ఓ ప్రాపర్టీ యజమాని చెప్పారు. కరోనా తర్వాత కొన్ని కుటుంబాలు తమ ఆస్తులను లీజుకు ఇచ్చేసి నగరం నడిబొడ్డు నుంచి కాలుష్య రహిత ప్రాంతాలకు, శివార్లలోని విల్లాలకు తరలివెళ్లారు. ‘నా జీవితాంతం కష్టపడి పనిచేశాను. ఇప్పుడు నేను ప్రకృతి నీడలో నివసించాలని కోరుకుంటున్నాను. అందుకే గండిపేటలోని మా అర ఎకరం స్థలంలో చిన్న ఇంటిని నిర్మించుకుని అక్కడకు మారాను’ అని ఐదేళ్ల క్రితం జూబ్లీహిల్స్లో నివసించిన వ్యాపారి దినకర్ చెబుతున్నారు. మరికొందరు సినిమా సెలబ్రిటీలు.. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు తమ నివాసాలను మారుస్తూ.. హిల్స్లోని తమ ఇళ్లను రెస్టారెంట్స్కి అద్దెకు ఇవ్వడం లేదా తామే రెస్టారెంట్స్, బ్రూవరీ.. వంటివి ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. నాటి ఇంట్లో.. నేటి రెస్టారెంట్లో.. ‘మా ఇంటికి స్వాగతం. నేను 20 సంవత్సరాల పాటు ఇక్కడే నివసించాను’ అంటూ రానా సైతం గుర్తు చేసుకున్నారు. రానా, ఆశ్రిత ఆ రెస్టారెంట్లో తిరుగుతున్నప్పుడు గోడలపై రంగురంగుల కళాఖండాలు కనిపించాయి. కుటుంబ సభ్యులకు చెందిన వేర్వేరు గదుల్లో కలియ తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ తాము చాలా కాలం క్రితం నడిచిన బ్లాక్ రైలింగ్తో కూడిన స్పైరల్ చెక్క మెట్ల మీద నడిచారు. ఇంటి మొదటి అంతస్తు’ అని రానా గుర్తు చేసుకున్నారు. మొదటి అంతస్తులో చాలా గాజు తలుపులు కనిపించాయి. ఇప్పుడు బార్గా ఉన్న ఆ ప్రదేశం గురించి చెబుతూ ‘ఈ బార్ ఉన్న ప్లేస్లోనే అప్పట్లో నేను సినిమాలు చూసేవాడిని’ అని రానా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పాత బెడ్రూమ్లో బ్లాక్ షాండ్లియర్లు, రెస్టారెంట్ అతిథుల కోసం సీటింగ్స్ ఏర్పాటు చేశారు. రానాకు ఇష్టమైన బాల్కనీ ఇప్పుడు ‘పిజ్జా ప్లేస్’ గా మారింది. హిల్స్లో.. ఇవే ట్రెండ్స్.. ఒక్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇల్లు మాత్రమే కాదు జూబ్లీహిల్స్లోని పలు ఇండిపెండెంట్ ఇళ్లు రెస్టారెంట్స్గా మారిపోతున్నాయి. రోడ్డు నెం.1, 10, 36, 45, 92లు మినహాయిస్తే మిగిలినవన్నీ నివాసప్రాంతాలే అయినప్పటికీ.. దాదాపు 350 దాకా వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పబ్లు, బార్లు, కాఫీ హౌస్లు కాగా కొన్ని మాత్రం బొటిక్స్. జూబ్లీ హిల్స్లోని అనేక నివాసాలు ఇప్పుడు భారతీయ, ఇటాలియన్ జపనీస్ తదితర దేశ విదేశీ రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రెస్.నగరంలో విశాలమైన స్థలంలో విలాసవంతంగా నిర్మించిన పలు నివాసాలకు ఒకేఒక చిరునామా జూబ్లీహిల్స్ అని చెప్పాలి. మరెక్కడా అంత చల్లటి, ప్రశాంతమైన వాతావరణం కనిపించదు.రెస్టారెంట్స్తో పాటు కేఫ్స్ సందర్శకులు, కేఫ్స్లో ఆఫీస్ వర్క్ చేసుకునే కార్పొరేట్ ఉద్యోగులు తరచూ ప్రశాంతమైన, హోమ్లీ వాతావరణాన్ని కోరుకుంటారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కెఫేలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ఐదారేళ్ల క్రితం ఒకటో రెండో కేఫ్స్ ఉండే పరిస్థితి నుంచి పదుల సంఖ్యకు విస్తరించడానికి ఈ పీస్ఫుల్ వాతావరణమే దోహదం చేసింది.ఇళ్లను మారుస్తున్నారు.. : గత కొంత కాలంగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మా రెస్టారెంట్ సైతం అలా ఏర్పాటు చేసిందే. మాలాంటి కొందరు పూర్తిగా రూపురేఖలు మారుస్తుంటే.. మరికొందరు మాత్రం స్వల్ప మార్పులకు మాత్రమే పరిమితమై ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చూస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి జూబ్లీహిల్స్ ఒక మంచి ప్లేస్. -సంపత్, స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ఆపాతమధురం -
పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన రానా
పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.Already feels like an exhilarating ride :)Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025 -
హీరో వెంకటేష్ పై కేసు నమోదు.. దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్ట్ షాక్
-
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
రానా కోసం సమంత పోస్ట్.. సోషల్మీడియాలో వైరల్
రానా దగ్గుబాటి, సమంత ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు స్నేహం కూడా ఉంది. వారిద్దరూ కలిసి పలుమార్లు టాక్ షోలలో సరదాగా మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, తాజాగా సమంత షోషల్మీడియాలో రానా కోసం ప్రత్యేకంగా విషెష్ తెలిపింది.రానా కోసం బర్త్డే శుభాకాంక్షలు చెబుతూ సమంత ఇలా తెలిపింది. ' హ్యాపీ బర్త్డే రానా. నీవు చేసే ప్రతి పనిలోను 100శాతం ఎఫర్ట్ పెట్టి శ్రమిస్తావు. నేను కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకున్నాను. నీ మాదిరే నేను కూడా ప్రతి పనిని ఇంకా బాగా చేయాలి అనే కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె తెలిపింది.సమయం కుదిరినప్పుడల్లా సమంతతో తాను మాట్లాడుతుంటానని రానా గతంలోనే చెప్పారు. సామ్ మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె అనారోగ్య సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. వీరిద్దరూ ‘బెంగళూరు డేస్’ తమిళం రీమేక్ కోసం కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రీసెంట్గా జిగ్రా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా సమంత మాట్లాడుతూ.. రానా తనకు అన్న లాంటి వ్యక్తి అని సామ్ చెప్పింది. ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో రానా కూడా సమంత మై సిస్టర్ అని పిలిచాడు. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'మగధీర' లాంటి అద్భుతమైన సినిమాలే గుర్తొస్తాయి. రాజమౌళి ఫ్యామిలీ గురించి చాలావరకు ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు రానా టాక్ షోలో పాల్గొని.. తన ఇంటర్మీడియట్ ప్రేమకథని బయటపెట్టాడు.'ద రానా దగ్గుబాటి షో' పేరుతో నటుడు రానా ఓ టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్లో ప్రతి వీకెండ్ ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకే నాని, సిద్ధు జొన్నలగడ్డ-శ్రీలీల, నాగచైతన్య తదితరులు పాల్గొన్న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. తాజాగా రాజమౌళి-రాంగోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రాజమౌళి తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)'ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి ఉండేది. ఆమె అంటే ఇష్టముండేది. కానీ మాట్లాడాలంటే భయం. మా క్లాసులో అబ్బాయిలందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని. నన్ను ఈ విషయమై ఏడిపించేవారు. మొత్తం ఏడాదిలో ఒకేఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను' అని రాజమౌళి చెప్పాడు. దీంతో రానా పగలబడి నవ్వాడు. ఈ సంభాషణ అంతా చూసి చాలామంది 90స్ కుర్రాళ్లు తమని తాము రాజమౌళి మాటల్లో చూసుకుంటున్నారు.చివరగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి.. మహేశ్ బాబుతో కొత్త సినిమా చేయబోతున్నారు. చాన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు టైమ్ ఉండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్) -
నాగ చైతన్య మరదలినే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా!
-
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్చాట్కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
Rana Daggubati: నా ఫేవరెట్ షో..!
-
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
రానా దగ్గుబాటి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా
‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రానా-తేజలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. ‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్ చేసినవి మాత్రమే. ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అందుకే ఆ పేరు పెట్టాం: రానా
‘‘ఇది వరకు నేను కొన్ని టాక్ షోలు చేశాను. కానీ ప్రైమ్ వీడియోలో చేస్తున్న ఈ షో వైవిధ్యమైనది. అందుకే దీనికి ‘రానా దగ్గుబాటి షో’ అని పేరు పెట్టాం. ఇది ఆర్డినరీ టాక్ షో కాదు. వెరీ ఆథెంటిక్, అన్ ఫిల్టర్డ్, అన్స్క్రిప్టెడ్ షో’’ అన్నారు రానా. ఆయన ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్గా, క్రియేటర్గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న షో ‘ది రానా దగ్గుబాటి షో’. స్పిరిట్ మీడియా బ్యానర్పై అమేజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ టాక్ షో ఈ నెల 23 నుంచి అమేజాన్లో ప్రసారం కానుంది.శుక్రవారం ఈ షో ట్రైలర్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఈ షోలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్గోపాల్ వర్మ, నాగచైతన్య, నాని, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ షోలో మా మాటలు చాలా సరదాగా సాగుతాయి. సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే నిజాయతీగా, సహజంగా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇది. సెలబ్రిటీల గురించి ఎన్నో కొత్త విషయాలను డిస్కవరీ చేసే షో. 240 దేశాల్లో ఈ షో ప్రసారం కానుండటం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు. -
రానాతో టాక్ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్గా ఒక టాక్ షో రానుంది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టాక్ షో కార్యక్రమంలో సౌత్ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ట్రైలర్లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్ అవుతాయి. ప్రియాంక మోహన్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జా, రిషభ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్ ఎపిసోడ్ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
మరోసారి హోస్ట్గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
రానా డైరెక్షన్ లో RGVతో రాజమౌళి షూటింగ్
-
ఇండియన్ స్క్రీన్స్కి ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’
‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. కనికా కస్రుతి, దివ్య ప్రభ లీడ్ రోల్స్లో, ఛాయా కందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాల నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై, గ్రాండ్ ప్రీ అవార్డును గెలుచుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ ఈ చిత్రానికి చోటు దక్కింది. తాజాగా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. నవంబరు 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రానా సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అన్నదే ఈ చిత్రకథ. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్ను జోడించడం నాకు సవాల్గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ ఫస్ట్లుక్
‘డియర్ మేఘ’, ‘భాగ్ సాలే’ వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు."ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
రానా.. నన్ను చూపుతో భయపెట్టాడు: రజనీకాంత్
రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'బాహుబలి'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్)'రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పట్లోనే షూటింగ్కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు. అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని' అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సూపర్స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్.. ఇలా భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అక్టోబరు 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా)Imagine the level of Achievement when SUPER STAR himself talks something like this!🤯🤯🔥🔥🔥#RanaDaggubati #Vettaiyan #Rajinikanth pic.twitter.com/KMMKTrWa2s— Filmy Bowl (@FilmyBowl) October 8, 2024 -
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్స్క్రీన్లోనే కాదు.. ఆఫ్స్క్రీన్లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఓటీటీలో హిట్ సినిమా '35- చిన్న కథ కాదు' స్ట్రీమింగ్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు.నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, '35–చిన్న కథ కాదు' సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానున్నట్లు ఆహా ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్మీడియాలో ఆహా ప్రకటించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. Chinna Katha Kaadu ❤️Beautiful Blockbuster #35Movie coming soon on aha @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/PG7nMLqFYf— ahavideoin (@ahavideoIN) September 27, 2024 -
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
కేన్స్ అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్కి రెడీ
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తీసిన సినిమా 'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్'. కని కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మేలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందనతో పాటు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా మన దగ్గర థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్' సినిమాని అక్టోబరు 2న ఫ్రాన్స్లో రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21న కేరళలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. భారత దేశవ్యాప్తంగా తెలుగు హీరో రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణ సంస్ఛ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.మలయాళ వెర్షన్ సినిమా 'ప్రభయయ్ నీనచతళం' పేరుతో రిలీజ్ కానుంది. కథ విషయానికొస్తే ముంబైలో పనిచేస్తున్న కేరళ నర్సులు ప్రభ, అను జీవితాల్లో జరిగిన సంఘటనల ఏంటి? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. ఇకపోతే వచ్చే ఏడాది ఆస్కార్ బరిలోనూ ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ దేశం ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) -
అట్టహాసంగా ‘సైమా 2024 అవార్డుల’ వేడుక (ఫొటోలు)
-
స్టార్ హీరో కాళ్లకు మొక్కిన రానా.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో రానా ఇటీవలే కొత్త మూవీని ప్రకటించారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి రానా కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2024 ప్రెస్ మీట్లో రానా పాల్గొన్నారు. ముంబయిలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న రానా వేదికపై సందడి చేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ పాదాలకు నమస్కరించారు. నేను పూర్తిగా సౌత్ ఇండియన్.. అందుకే ఇలా అంటూ రానా మాట్లాడారు. దీంతో కరణ్, షారూఖ్ ఖాన్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ కార్యక్రమంలో సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.(ఇది చదవండి: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!)దుబాయ్లోని షారూఖ్ ఇంటికి వెళ్లనప్పుడు తమను అప్యాయంగా చూసుకున్నారని ఈ సందర్భంగా రానా గుర్తు చేసుకున్నారు. దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్కు సౌత్కు చెందిన సెలబ్రీటీలంతా వచ్చాం.. ఆ సమయంలో షారూఖ్ ఇంటికి వెళ్లగా.. అందరినీ బాగా చూసుకున్నారని తెలిపారు. షారూఖ్ కేవలం నటుడు మాత్రమే.. మానవతావాది కూడా అని రానా కొనియాడారు. కాగా.. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ 27,28, 29 తేదీల్లో అబుదాబిలోని ఓ ఐలాండ్లో జరుగనుంది. ఇందులో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి స్టార్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని షారూక్ వెల్లడించారు. We're fully South Indian so.. this is how we do.. 🥺🥹 Rana pic.twitter.com/NumYzPpCEc— . (@charanvicky_) September 11, 2024 -
IIFA అవార్డ్స్ 24వ ఎడిషన్ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥Starring @dulQuer #BhagyashriBorse Directed by #SelvamaniSelvaraj Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024 -
ఒక సినిమాకు ఇన్ని స్టార్స్ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా
ఒక మంచి సినిమా వస్తే..దాన్ని మీడియా ఎంత బాగా ప్రమోట్ చేస్తుందో ‘35-చిన్న కథ కాదు’చిత్రం ద్వారా తెలిసింది. ఈ సినిమాకి మీరు(మీడియా) ఇచ్చినన్ని స్టార్స్ నేను ఎప్పుడూ చూడలేదు .చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రానా. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. (చదవండి: 35: చిన్న కథ కాదు మూవీ రివ్యూ)ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్లో రానా మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం' అన్నారునివేదా థామస్ మాట్లాడుతూ.. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ' అన్నారు‘ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి '35-చిన్న కథ కాదు' తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా ఉంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విశ్వదేవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి ,సృజన్ యరబోలు పాల్గొన్నారు. -
రూ.కోటి సాయం ప్రకటించిన వెంకటేశ్, రానా
భారీగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎంతోమంది అమాయక జనాలు నిరాశ్రయులయ్యారు. నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి సినీతారలు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగార్జున, అలీ, సాయిధరమ్తేజ్.. ఇలా ఎంతోమంది విరాళాలు ప్రకటించారు.కోటి రూపాయ విరాళం తాజాగా దగ్గుబాటి వెంకటేశ్, రానా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దగ్గుబాటి హీరోలను అభిమానులు మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు. Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger. pic.twitter.com/Hz73oFNkYf— Venkatesh Daggubati (@VenkyMama) September 6, 2024 చదవండి: అదొక పెద్ద స్కామ్.. అయినా అదే కోరుకుంటున్నా: జోష్ నటి -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్లో కథనం సీరియస్ మోడ్లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
జీరోను దాటి గెలిచి తీరాలి.. ఆసక్తిగా '35–చిన్న కథ కాదు' ట్రైలర్
'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్కు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఉంది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్ర పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆపై ఆలోచింపచేస్తుంది. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్... ఇలాంటి బంధాల గురించి అందంగా ఈ సినిమాలో చెప్పారు. -
ఐఫా అవార్డ్స్-2024 షెడ్యూల్ ప్రకటన.. రానా, తేజను తప్పించారా..?
ఈ ఏడాదిలో జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 24వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్లో సెప్టెంబర్ 27-29 వరకు జరగనున్నట్టు తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్తో పాటు నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వెలువడింది.ఐఫా అవార్డ్స్ వేడుకలో షాహిద్ కపూర్తో సహా బాలీవుడ్ ప్రముఖులు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27న ఐఫా ఉత్సవం పేరుతో అద్భుతమైన ఈవెంట్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 28న అవార్డ్స్, 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తోంది.రేసులో ఈ సినిమాలే టాప్ఈ సంవత్సరం నామినేషన్లు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. రణబీర్ కపూర్ 'యానిమల్' అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ 10 నామినేషన్లను పొందింది. 2023 ఏడాదిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్తో పాటు జవాన్ రెండూ పాపులర్ కేటగిరీలో ఏడు నామినేషన్లను పొందగా, విక్రాంత్ మాస్సే చిత్రం 12th ఫెయిల్ ఐదు నామినేషన్లను సాధించింది. ఈసారి ఐఫా అవార్డ్స్ కోసం గట్టిపోటీ ఎదురుకానుంది.రానాను తప్పించారా..?ఐఫా అవార్డ్స్2024'కి హోస్ట్గా రానాతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ వ్యవహరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరబాద్లో ముందస్తు వేడుక(కర్టెన్ రైజర్ ఈవెంట్)లో కూడా వారు సందడి చేశారు. అయితే, ఇప్పుడు సడెన్గా షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్లు తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలను ఈసారి నిర్వాహుకులు తప్పించారా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, గతంలో కరణ్ ఐఫా హోస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది. -
రానా గొప్ప మనసు.. అభిమాని కోసం ఏకంగా!
టాలీవుడ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకుల స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్-2లోనూ కనిపించనున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా దీనిని రూపొందిస్తున్నారు.ప్రస్తుతం రానా అమెరికాలోని చికాగోలో పర్యటిస్తున్నారు. అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rana Daggubati ❤️ Diehard Fans (@ranadaggubatif) -
భారత బాక్సింగ్ చరిత్రలో ఇదొక మైలు రాయి: రానా
భారత్లో బాక్సింగ్కు ఆదరణ పెంచే దిశగా బాక్సింగ్బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బాక్సింగ్ ఈవెంట్లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వర్సెస్ 5గా జరగనున్నాయి. ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ను 1963లో స్ధాపించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్తో ఒప్పందం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మన బాక్సర్లకు అంతర్జాతీయ స్ధాయిలో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్లబ్తో భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భారత్, యూఎస్ బాక్సర్లకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్న నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా భారత్లో బాక్సింగ్కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే క్లబ్ అన్ని విధాల కృషి చేస్తుంది.భారత బాక్సింగ్ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్లో జరిగే ఈవెంట్లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్సీ లైట్ వెయిట్ ఛాంపియన్. -
నాలుగో యానివర్సరీ.. రానా భార్య స్పెషల్ పోస్ట్
చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. రానా-మిహికాల పెళ్లి జరిగి అప్పుడే నాలుగేళ్లవుతోంది. వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. నేడు నాలుగో యానివర్సరీ సందర్భంగా మిహిక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్ షేర్ చేసింది.జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. దీనికి విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోను జత చేసింది.ఇది చూసిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ.. మీరెప్పటికీ ఇలాగే కలిసుండాలి.. జీవిత చరమాంకం వరకు ఇంతే సంతోషంగా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు హోస్టింగ్.. గ్లోబల్ స్థాయికి రానా క్రేజ్!
రానా.. సీనీ ప్రియులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనదైన నటనతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, విలన్ అనేకాదు పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాడు. అందుకే నేటితరం నటుల్లో రానాకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం గెలుచుకున్నాయి.ఈ మధ్యకాలంలో అత్యధిక అవార్డులు అందుకున్న హీరో రానా అని చెప్పొచ్చు. ఆయన నటించి తొలి వెబ్ సిరీస్ ‘రానానాయుడు’కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు’లో ఆయన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఇండియన్ టెలీ అవార్డు 2024’లోనూ రానాకి ఉత్తమ నటుడు(రానా నాయుడు) అవార్డు లభించింది. అలాగే 68వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లోనూ ఉత్తమ సహాయక నటుడు(భీమ్లానాయక్) అవార్డు రానాను వరించింది.హోస్ట్గానూ..రానా కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు.అప్పడప్పుడు బుల్లితెరపై కూడా మెరుస్తుంటాడు. ఆయన హోస్ట్గాను పలు టీవీ, ఓటీటీ షోలు చేశాడు. అలాగే పలు ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి..తనదైన మాటలతో రక్తి కట్టించాడు. ఇక ఇప్పుడు అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ' ఐఫా అవార్డ్స్2024'కి రానా హోస్ట్గా చేయబోతున్నాడు. యూ ఏ ఈ అబుదాభి లోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరిగే ‘ఐఫా అవార్డ్స్2024'ప్రధానోత్సవక కార్యక్రమానికి యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్గా చేయబోతున్నాడు. అలాగే ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశాడు. తన స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిసి రానా టాక్ షో చేయబోతున్నాడు. ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.నిర్మాతగానూ..ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు రానా. తనకు నచ్చిన సినిమాలను నిర్మించడంతో పాటు కొన్నింటికి సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, గార్గి, చార్లీ 777, పరేషాన్, కృష్ణ అండ్ హీస్ లీల లాంటి చిన్న సినిమాలను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి పెద్ద విజయం అందించాడు. ఆయన నిర్మించిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. -
బాబాయ్- అబ్బాయి క్రేజీ సిరీస్.. సీక్వెల్ వచ్చేస్తోంది!
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్సిరీస్ రానా నాయుడు. నెట్ఫ్లిక్స్ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా సీక్వెల్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ షేర్ చేసింది.రానా నాయుడు.. సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్ల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్కు ఆదరణ దక్కడంతోనే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్తో రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming 🔥#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU— Netflix India (@NetflixIndia) July 23, 2024 -
హీరో రానా క్యూట్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రానా పేరు చెప్పగానే అందరికీ 'బాహుబలి' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకో కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం 'రానా నాయుడు' సిరీస్లో నటించాడు. యాక్టింగ్ చేయనప్పటికీ నిర్మాణం, ఇతర తెలుగు సినిమాల్ని ప్రమోట్ చేసే విషయంలో ముందుంటాడు. ఇదంతా పక్కనబెడితే తాజాగా రానా ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))తాజాగా ఓ హోటల్లో స్టే చేసేందుకు రానాకు అక్కడ సిబ్బంది పుష్ప గుచ్చంతో పాటు శాలువా బహుకరించారు. అందరిలానే వాటిని తీసుకుని పక్కనవాళ్లకు ఇచ్చేయకుండా తనకు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళా సిబ్బందికే ఫ్లవర్ బొకే ఇచ్చి, శాలువా కూడా తన చేతులతో కప్పేశాడు. దీన్ని చూసి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రానా ఫ్రెండ్లీ నేచర్ని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)Actor @RanaDaggubati in his natural habitat off screen 🤩#RanaDaggubati #Rana #Tollywood #PopperStopTelugu pic.twitter.com/FiCISww8Ip— Popper Stop Telugu (@PopperstopTel) July 22, 2024 -
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్గా రానా, తేజా సజ్జ
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను. – కుష్బూనెల రోజుల్లో కొత్త సినిమా ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను. – రానా దగ్గుపాటి రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది. శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను. ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను. సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది. అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను. నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను. -
కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా
‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్ మాట్లాడారు. -
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘రానా’ లోకాలోకా టెకీలా...
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, హర్షా వడ్లమూడి ఆధ్వర్యంలోని ఇరాన్ హిల్ ఇండియా సంస్థ.. రూపొందించిన టెకీలాబ్రాండ్ ‘లోకాలోకా’ పానీయం అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచి్చంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా మెక్సికోలోనే తయారయ్యే ఈ లోకాలోకా, తొలుత అమెరికా మార్కెట్లో విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా రానా దగ్గుబాటి తెలిపారు. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్
హీరోయిన్ నివేతా థామస్ పెళ్లి చేసుకోబోతుందా? సోషల్ మీడియా అంతా ఒకటే గోల. జస్ట్ ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టిందో లేదో రూమర్స్ తెగ వచ్చాయి. వచ్చే వారం నిశ్చితార్థం అని కొందరు, ఇప్పటికే పెళ్లి అయిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ పలువురు ఊహించినట్లే అది పెళ్లి గురించి కాదు. అందుకు సంబంధించి నివేతా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!)జెంటిల్మేన్, నిన్ను కోరి, బ్రోచెవారెవరురా, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో తెలుగు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్.. తెలుగులో చివరగా 'శాకినీ డాకినీ' మూవీ చేసింది. ఇది రిలీజై రెండేళ్లకు పైనే అయిపోయింది. గతేడాది ఓ మలయాళ మూవీ చేసింది. ఆ తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. దీంతో నివేతా ఏం చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కొంపదీసి పెళ్లి ఏమైనా చేసేసుకుందా అని మాట్లాడుకున్నారు.సోమవారం సాయంత్రం 'ఫైనల్లీ' అని చెప్పి లవ్ సింబల్ ఏమోజీని ఇన్ స్టా స్టోరీలో పెట్టడంతో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందేమో అనుకున్నారు. కానీ అది తను లీడ్ రోల్ చేస్తున్న '35 చిన్న కథ కాదు' మూవీ కోసమని చెప్పి క్లారిటీ ఇచ్చింది. హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీలో నివేతాతో పాటు ప్రియదర్శి, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'పుష్ప 2' కోసం అనుకున్న ఆగస్టు 15న దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) View this post on Instagram A post shared by Nanda Kishore Emani (@emaninandakishore) -
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్ను అమితాబ్ బచ్చన్కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్హాసన్కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్గారు సింపుల్గా ఉంటారు. సెట్స్లో నాకు కోపరేటివ్గా ఉన్నారు’’ అన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్లో జూమ్లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్గా నిలిచింది. -
సరికొత్త టాక్ షోకు హోస్ట్గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
వేట్టయాన్ లో ఎంట్రీ
‘వేట్టయాన్ ’ సెట్స్లో జాయిన్ అయ్యారు రానా. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. రజనీకాంత్– అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా సెట్స్లో తొలిసారి సోమవారం రానా జాయిన్ అయ్యారు. రజనీకాంత్–రానా కాంబినేషన్ సీన్స్ని ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట జ్ఞానవేల్. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, బూటకపు ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని తెలిసింది. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప అడగొద్దు: రానా ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్తో కలిసి గుర్గావ్లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్కు రానా హాజరయ్యారు. ఈవెంట్కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు. రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్లోని మాయో క్లినిక్లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు. హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు. 'ప్రకృతే గొప్ప వైద్యం' రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది. కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
BoxingBay Fight Nights: హైదరాబాద్లో మెగా బాక్సింగ్ ఈవెంట్
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్బే ఫైట్ నైట్స్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
నా జీవితంలో మరపురాని రోజు అదే: మిహికా పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో స్టార్ దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. విదేశాల్లో వేకేషన్కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాండాలను.. నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. (ఇది చదవండి: మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్) మిహికా తన ఇన్స్టాలో రాస్తూ.. 'నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు. అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో?.. అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది!' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
గ్యాంగ్స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Rana Daggubati Unseen Photos: రానా దగ్గుబాటి పుట్టినరోజు స్పెషల్ (ఫోటోలు)
-
‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్ అదిరింది
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. -
Abhiram Wedding : టాలీవుడ్ హీరో రానా తమ్ముడి గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
-
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..
తెలుగు నటుడు రానా దగ్గుబాటి తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియా సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓ సమావేశంలో రానా మాట్లాడారు. ‘2005లో నా 18వ ఏటా స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని భావించాను. కానీ అలా జరగలేదు. అయితే దాన్ని మొదట అత్యంత సృజనాత్మకంగా నిర్మించాలని అనుకున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని నిర్వహణ ఖరీదైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా అధునాతనమైనవి. దాంతో ఆ కంపెనీను మూసివేశాను. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని ప్రైమ్ ఫోకస్కి విక్రయించాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్లలో విడుదల కాలేదు. నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మకానికి ఉంచినపుడు నాకు బాధ అనిపించలేదు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం’అని అన్నారు. రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవర్ 170లో నటిస్తున్నారు. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా 'కల్కి 2898 AD' సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ హీరోల మధ్య పోటీ? రానా ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్లో రామ్చరణ్, అల్లు అర్జున్.. మేమంతా ఒకరి సినిమాలు మరొకం చూస్తా.. బాగుంటే మెచ్చుకుంటాం, బాలేకపోతే విమర్శిస్తాం.. అంతే తప్ప మా మధ్య పోటీ అనేదే లేదు అంటున్నాడు రానా దగ్గుబాటి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. మేమందరం ఒకటే పోటీలో లేము. ఎవరికి వారు వేర్వేరు దారుల్లో ఉన్నాం. ఎవరి పోటీ వారిదే! ఒక్కొక్కరు ఒక్కోరకమైన కాన్సెప్ట్ ఎంచుకుంటారు. ఆ సినిమాలతో విజయం సాధిస్తారు. మీకు కనిపించేవి కలెక్షన్స్ మాత్రమే! అలాంటప్పుడు దేని గురించి మేమంతా పోటీపడతాం? బాక్సాఫీస్ లెక్కల కోసమా? కలెక్షన్స్ మాత్రమే మీకు డైరెక్ట్గా కనిపిస్తాయి. కానీ కేవలం నెంబర్స్ కోసమే మేము పని చేయడం లేదు. ఇక్కడ మీకు ఇటీవల అల్లు అర్జున్తో జరిగిన సంభాషణ చెప్తాను. పుష్ప 1లో మనం ఇంకా ఏం చేయాల్సింది? సినిమాలో ఎక్కడైనా తప్పు చేశామా? అనేది చర్చ జరిగింది. మా ముగ్గురి గురించే చెప్పట్లేదు సినిమా హిట్టయినా, కాకపోయినా ఇలా ఎక్కడైనా తప్పు చేశామా? అనేదాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. నిజానికి ఇలాంటి సంభాషణలే మాకు ఎదగడానికి ఉపయోగపడతాయి. నేను మా ముగ్గురి(రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా) గురించే చెప్పడం లేదు. నాని, అడివి శేష్.. ఇలాంటి హీరోలంతా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు చేసేవాళ్లే! మేమంతా ఎప్పుడో ఒకసారి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లాను. గదిలోకి వచ్చి ముఖం మీదే అడిగాడు అప్పుడు అడివి శేష్ నా గదిలోకి వచ్చి.. నువ్వు వరుసగా సినిమాలు చేయడం లేదేంటి? నీ సినిమాలంటే నాకిష్టం.. కానీ నువ్వేమో చాలా గ్యాప్తో మూవీస్ చేస్తున్నావ్ అని అడిగాడు. నేనేమో అవునా.. సరే చేద్దాంలే అని బదులిచ్చాను. అప్పుడు శేష్.. నేను నీ కోసం కథ రాస్తాను.. ఒక ఏడాదిలోపు నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. అలా మనం పని చేయాలని కోరుకునేవాళ్లు, మనల్ని ఇష్టపడేవాళ్ల నుంచి మనకు ఎక్కడలేని శక్తి వస్తుంటుంది' అని చెప్పుకొచ్చాడు రానా దగ్గుబాటి. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
రజనీకాంత్ 170 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
రజనీకాంత్ 'తలైవార్ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్' చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్, దసరా విజయన్, రిత్విక సింగ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు. Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥 With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️ Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ — Lyca Productions (@LycaProductions) October 4, 2023 -
పాన్ ఇండియా ప్రాజెక్ట్లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
నేను కట్నం ఎంత తీసుకున్న అంటే : రానా దగ్గుబాటి
-
రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్ ల ప్రేమకథ గురించి..!
-
హిరణ్య కశ్యప సినిమా గురించి రానా దగ్గుబాటి
-
ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు : రానా దగ్గుబాటి
-
రజనీకాంత్ సినిమాలో అమితాబ్, రానా?
వరుస ఫ్లాప్లతో నిరుత్సాహంగా ఉన్న రజనీకాంత్కు ఊహించనంతగా జైలర్ చిత్రం విజయాన్ని సాధించడంతో ఆయనలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసిందనే చెప్పాలి. ఇటీవలే తనకు ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశమైన హిమాలయాలను కూడా చుట్టివచ్చిన రజనీకాంత్.. ఇప్పుడు తన 170వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ బిగ్బీ అమితాబచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుపాటి, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, నటి మంజువారియర్ వంటి ప్రముఖ తారాగణం నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నట్లు తెలిసింది. చిత్రం అక్టోబర్ మొదటి వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో షూటింగ్ ప్రారంభించి, కన్యాకుమారి, నాగర్కోయిల్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఇందులో కన్యాకుమారి ప్రాంత యాసలో మాట్లాడతారని సమాచారం. కాగా ఈయన తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను కూడా పూర్తి చేశారు. -
గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇదో వేదిక
‘‘సౌత్లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. పదకొండేళ్లుగా నేనీ వేడుకల్లో భాగమవుతున్నాను. గ్లోబల్ ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. దుబాయ్లో కలుద్దాం’’ అన్నారు రానా. ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్లో జరగనుంది. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా పాల్గొన్నారు. ‘‘సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీ యూనియన్ లాంటిది’’ అన్నారు సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. ‘‘సైమా వేడుకల్లో ఇదివరకు పాల్గొన్నాను. మళ్లీ ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘తొలిసారి సైమా వేడుకల్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ఈ సమావేశంలో శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు. -
బాసూ రెడీయా...
‘ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని’ అనే డైలాగ్స్తో ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ ఆరంభం అయింది. విశాల్ పలు షేడ్స్లో టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్గా, గుండుతో స్టైలిష్గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్లో విశాల్ కనిపిస్తారు. ఓ టైమ్ మిషన్ కాకుండా ఓ ఫోన్ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. -
పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్లో మరో యువ నటుడు పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సురేశ్బాబు రెండో కొడుకు అభిరామ్.. కొన్నాళ్ల ముందు 'అహింస' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో మరో మూవీ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలానే ఇప్పుడు వివాహం కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెంకటేశ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సురేశ్ బాబు నిర్మాతగా మారారు. ఇక సురేశ్ పెద్ద కొడుకు రానా.. హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమ్ తెచ్చుకోగా, రెండో కొడుకు అభిరామ్ ఈ మధ్యే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇప్పుడు అతడికే పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటున్నారట. ప్రస్తుతం మాటలు మాత్రమే జరిగాయని త్వరలో నిశ్చితార్థం, పెళ్లి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. దగ్గుబాటి రామానాయుడు తమ్ముడి కూతురి కూతురే.. అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై సురేశ్ బాబు ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండే అవకాశముంది. అదే టైంలో మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి బాజాలు మోగే అవకాశముంది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్) -
అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్!
సీతారామంతో టాలీవుడ్లోనూ క్రేజ్ దక్కించుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన రానా.. తన స్నేహితుడు దుల్కర్పై ప్రశంసలు కురిపించాడు. (ఇది చదవండి: ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా) అయితే అదే సమయంలో ఓ స్టార్ హీరోయిన్ను ఉద్దేశించి రానా చేసిన కామెంట్స్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అయితే 2018లో దుల్కర్, సోనమ్ కపూర్ జంటగా 'ద జోయా ఫ్యాక్టర్' అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్కు వెళ్లిన రానాకు ఆమె వ్యవహరించిన తీరు కోపం తెప్పించిందట. దుల్కర్ సెట్లో వెయిట్ చేస్తుంటే.. తాను మాత్రం భర్తతో ఫోన్ మాట్లాడుతూ కాలక్షేపం చేసిందని అన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటికే రానా వివరణ ఇచ్చారు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తన కామెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్న సోనమ్, దుల్కర్లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. రానా క్షమాపణల తర్వాత సోనమ్ తన ఇన్స్టాలో స్టోరీస్లో ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. అది యూఎస్ ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్వెల్ట్ రాసిన కోటేషన్. మె తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేస్తూ.. 'నేను కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రత్యేకించి అలాంటి వ్యక్తుల గురించి. సంకుచితమైన మైండ్సెట్ గలవారే వ్యక్తుల గురించి చర్చిస్తారు. యావరేజ్ మైండ్ వాళ్లు సంఘటనలపై మాట్లాడతారు. అలాగే గొప్ప మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.' అంటూ ఆ కోటేషన్లో ఉంది. అయితే ఈ కోట్ టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించి చేసిందనే చర్చ మొదలైంది. రానా క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. (ఇది చదవండి: ఖుషి ఈవెంట్లో మీడియా, మహిళలపై దౌర్జన్యం.. లోనికి రాన్వివకుండా..) -
ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, నటుడు దుల్కర్ సల్మాన్లకు హీరో రానా క్షమాపణలు చెప్పాడు. తన మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని తప్పుదోవపట్టిస్తున్నందుకు చింతిస్తున్నానని, ఏది ఏమైనా తన కామెంట్స్ కారణంగా ఇబ్బందిపడుతున్న సోనమ్, దుల్కర్లకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు. (చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!) వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో ప్రిరీలీజ్ ఈవెంట్ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి హీరో రానా ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా రానా.. దుల్కర్ మంచితనం గురించి మాట్లాడుతూ...‘ఓ రోజు దుల్కర్ నటిస్తున్న సినిమా షూటింగ్కి వెళ్లాను. ఆ సినిమాలో బాలీవుడ్కి చెందిన పెద్ద నటి హీరోయిన్. షూటింగ్ సమయంలో ఆమె నటనపై ఫోకస్ చేయకుండా.. లండన్లో ఉన్న భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దుల్కర్ ఎండలో అలాగే నిలబడి పోయాడు. ఆమె ఎక్కువ టేకులు తీసుకున్నా.. దుల్కర్ మాత్రం ఓపికగా అలానే ఎదురు చూశాడు. నాకే కోపం వచ్చి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్ని నేలకేసి కొట్టాను. కానీ దుల్కర్ మాత్రం చాలా సహనంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. రానా ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ సోనమ్ కపూర్నే అని నెట్టింట ప్రచారం జరిగింది. ఆమెను టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేయడంతో తాజాగా రానా ఆ హీరోయిన్కు సారి చెప్పాడు. I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted. I take… — Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023 -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా ఓ నోట్ కూడా రాసుకొచ్చారు. పనితో పాటు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటూ తన మెడపై బ్యాలెన్స్ అని టాటూ ఉన్న ఫోటోను పంచుకుంది. (ఇది చదవండి: మిహికా ఇన్స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!) మిహికా తన ఇన్స్టాలో రాస్తూ.. 'జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే సమతుల్యత. మన జీవితంలో బాధ్యతలు, అభిరుచుల మధ్య సామరస్యాన్ని కనుగొనడం. మీరు నైపుణ్య స్థాయిని అదుపులో ఉంచే శక్తిని మీరు కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు పని, సంబంధాలు, ఆటలతో జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితంలో ఉన్న లయను ఆనందించండి. మీరు వేసే ప్రతి అడుగు.. మీ ప్రత్యేకమైన ప్రయాణానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు సూపర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
రానా-మిహికా బజాజ్ల బంధానికి మూడేళ్లు, బ్యూటిఫుల్ ఫోటోలు
-
రానా సినిమాలో త్రివిక్రమ్ ఎంట్రీ కోపంతో రగిలిపోతున్న గుణశేఖర్
-
దేవుడు ఉన్నాడు.. దీని వెనుక ఎవరున్నా వదలను: గుణశేఖర్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు హిరణ్యకశిపుడుగా రానా నటిస్తుండగా. కథ త్రివిక్రమ్ అందిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయం మీద పరోక్షంగా గుణశేఖర్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: డింపుల్ హయాతి అసహనం.. ఆయనెక్కడ అంటూ మంత్రి కేటీఆర్కే ట్వీట్) ఏపీలోని ఆళ్లగడ్డకు దగ్గరలో ఉన్న 'అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి' దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. 'దేవుడిని మీ కథకు కేంద్ర ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది. అని ఆయన కామెంట్ చేశాడు. 'హిరణ్యకశిప' ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే గుణశేఖర్ చేయడంతో ఈ కామెంట్ 'రానా' మూవీ గురించే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గతంలో గుణశేఖర్ ఏమన్నారంటే సమంత-గుణశేఖర్ కాంబోలో వచ్చిన 'శాకుంతలం' ప్రమోషన్స్ కార్యక్రమంలో హిరణ్యకశిప ప్రాజెక్టుపై గుణశేఖర్ పలు వ్యాఖ్యలు ఇలా చేశారు. 'నేను హిరణ్యకశిప ప్రాజెక్టు మీ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు చేస్తే మీరు చేయాలి లేదంటే తప్పుకోవాలి కానీ అదే ప్రాజెక్టును వేరే వాళ్లతో సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగితే ఎవరినీ వదలను, అలాంటి వారిపై ఎంతవరకైనా వెళ్తాను. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే నేను వెనక్కు తగ్గను.' అంటూ గతంలో ఆయన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే హిరణ్యకశిప మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్లో గుణశేఖర్ లేకపోవడంతో ఇలా ముందే హెచ్చరిస్తున్నాడని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Gunasekhar (@gunasekhar1) (ఇదీ చదవండి: నేడు సితార పుట్టినరోజు.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Project K: శాన్ డీగోలో ల్యాండైన ప్రభాస్, రానా, కమల్ హాసన్
-
'హిరణ్య కశ్యప'గా రానా.. కథ రెడీ చేసిన త్రివిక్రమ్
రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ – 2023’ వేడుకల్లో భాగంగా రానా ‘హిరణ్య కశ్యప’ను ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రానా ఓ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అమర్ చిత్రకథల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇక గతంలో రానాతో ‘హిరణ్య కశ్యప’ తెరకెక్కిస్తానని గుణశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి.. ఆయన దర్శకత్వం లోనే ఈ ‘హిరణ్య కశ్యప’ ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. -
సైమా అవార్డ్స్-2023 వేడుకల ప్రకటన.. ఈసారి హోస్ట్ ఎవరంటే?
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 11 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2023 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు సైమా ఛైర్పర్సన్ బృందాప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు దుబాయ్ వేదిక కానుందని ఆమె తెలిపారు. వేడుకలకు స్పాన్సర్గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా వ్యవహరించనుందని ఆమె స్పష్టం చేశారు. (ఇదీ చదవండి: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్) టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది సైమానే అని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో తాను కూడా భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. తనకు దక్షిణాదికి చెందిన ఎందరో అభిమానుల నుంచి ప్రేమను పొందానని చెప్పుకొచ్చారు. తన తొలి చిత్రం సీతారామంతోనే సైమాలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. దుబాయ్లోని D.W.T.Cలో జరిగే ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్గా రానా వ్యవహరించనున్నారు. మరోక హోస్ట్గా మృణాల్ వ్యవహరించే అవకాశం ఉంది. Nexa Joins SIIMA as the Title Sponsor. SIIMA is the Biggest Awards Show in South India organising its 11th Edition in Dubai on 15th and 16th September. Rana Daggubati and Mrunal Thakur joined Brinda Prasad, Chairperson of SIIMA in announcing the Nexa SIIMA Partnership.… pic.twitter.com/H6na7W7uHr — SIIMA (@siima) July 7, 2023 -
వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు
కథను ముందుకు తీసుకెళతాడు కథానాయకుడు (హీరో). ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడుతుంటాడు ప్రతినాయకుడు (విలన్). హీరోగా ఒకరు, విలన్గా వేరొకరు నటిస్తుంటారు. అయితే నాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా కూడా నటిస్తుంటారు. ఇలా కొందరు కథానాయకులు ‘ప్రతినాయకులు’గా కనిపించడానికి రెడీ అయిన చిత్రాల గురించి తెలుసుకుందాం. మిషన్.. ప్రాజెక్ట్ కె రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు కమల్హాసన్. అలాగే దర్శకులు మణిరత్నం, హెచ్. వినోద్ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు కమల్హాసన్ ఆల్రెడీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’లో నటించడానికి కమల్హాసన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్హాసన్కు కొత్తేమీ కాదు. (ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో) ‘ఇంద్రుడు–చంద్రుడు’ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్), ‘ఇండియన్’, ‘ఆళవందాన్’ (తెలుగులో ‘అభయ్’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్గా నటించి మెప్పించారు. సో.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ నెగటివ్ షేడ్ క్యారెక్టర్లో కమల్ కనిపించినట్లు అవుతుంది. మరి.. ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ చేస్తున్నది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ వార్లో... నాయకుడి పాత్రైనా, ప్రతి నాయకుడి పాత్రైనా ఎన్టీఆర్ అవలీలగా చేసేస్తుంటారు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన జై, లవ, కుశ పాత్రల్లో జై విలన్ క్యారెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’లో చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ హిట్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘వార్’. ఈ సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ ఈ ఏడాది చివర్లో సెట్స్పైకి వెళ్లనుంది. ‘వార్’లో హీరోగా నటించిన హృతిక్ రోషనే సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. స్పై థ్రిల్లర్గా రూపొందనున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాక్షస రాజు హీరో, విలన్, గెస్ట్ రోల్.. ఇలా ఏ పాత్రలో అయినా రానా అదుర్స్. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా విలనిజమ్ పండించారు రానా. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోగా నటించిన రానా క్యారెక్టర్లో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఈ సినిమాకు తేజ దర్శకుడు. కాగా రానా, తేజ కాంబినేషన్లోనే ‘రాక్షస రాజు’ అనే టైటిల్తో మరో సినిమా తెరకెక్కనుంది. గోపీనాథ్ ఆచంట నిర్మిస్తారు. టైటిల్ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ టచ్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్య కశ్యప’, మిలింద్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో రానా హీరోగా నటిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. కొత్త ఇన్నింగ్స్ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత హీరోగా వెండితెరపై కనిపించలేదు మంచు మనోజ్. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో విశాల్, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్గా కొత్త ఇన్నింగ్స్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట మనోజ్. రవితేజ హీరోగా ‘కలర్ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో, మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ నున్నారని టాక్. మరి.. ప్రతినాయకుడి పాత్ర పరంగా మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్ను స్టార్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. లంకల రత్న? ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అన్నది విశ్వక్ సేన్ తాజా చిత్రంలోని డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రంలో విశ్వక్ క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా స్టార్టింగ్ సమయంలో మాస్ కా దాస్ బ్యాడ్గా మారాడు అంటూ చిత్ర యూనిట్ నుంచి వినిపించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకు ‘లంకల రత్న’ టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ముగిసినట్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రిమోట్ లొకేషన్స్లో చిత్రీకరించినట్లు శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్ సేన్. వీరే కాదు.. ఒకవైపు నాయకులుగా నటిస్తూ మరోవైపు ప్రతినాయకులుగానూ నటిస్తున్న హీరోలు ఇంకొందరు ఉన్నారు. -
మహేష్, రాజమౌళి సినిమా పై రానా సంచలన కామెంట్స్
-
ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్ -కె. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మల్టీటాలెంటెడ్ నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో రానా చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్కు వెళ్లిన ముద్దుగుమ్మ!) రానా మాట్లాడుతూ.. 'మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్-కె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఉన్నా. ఈ టాలీవుడ్ మూవీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. టాలీవుడ్లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇండియా సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరిస్తారు.' అని అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!) -
‘పరేషాన్’ మూవీ రివ్యూ
టైటిల్: పరేషాన్ నటీనటులు: తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్ తదితరులు నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి సమర్పణ: రానా దగ్గుబాటి దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ సంగీతం: యశ్వంత్ నాగ్ సినిమాటోగ్రఫీ: వాసు పెండమ్ ఎడిటర్ : హరిశంకర్ విడుదల తేది : జూన్ 2, 2023 ‘పరేషాన్’ కథేంటంటే.. క్రైస్తవ మతానికి చెందిన సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) తిరుగుబోతు. ఐటీఐ కూడా పాసవ్వక ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు. దాని కోసం పై అధికారికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. భార్య చేతిపై ఉన్న బంగారు గాజులు అమ్మి రెండు లక్షలను జమ చేస్తాడు. ఆ డబ్బును మధ్యవర్తికి అప్పజెప్పి రమ్మని ఐజాక్ని పంపిస్తే.. అందులో కొత ఆపదలో ఉన్న తన స్నేహితుడు పాషా(బన్నీ అభిరామ్)కు ఇస్తాడు. మిగిలిన డబ్బు మరో స్నేహితుడు ఆగమ్ సత్తి(అర్జున్ కృష్ణ)కు ఇస్తాడు. తన తండ్రికి తెలియకముందే ఆ డబ్బును మధ్యవర్తికి ఇవ్వాలని ఐజాక్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. మరోవైపు ఐజాక్ ప్రేయసి శిరీష(పావని కరణం)తో శారీరకంగా దగ్గర అవుతాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే భయంతో పట్నం వెళ్లి పరీక్షలు చేయించాలకుంటాడు. డబ్బులు జమ చేస్కోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే.. డబ్బులు కొట్టేస్తారు. అసలు ఆ డబ్బు ఎవరు కొట్టేశారు? లంచం కోసం ఇచ్చిన డబ్బుని కొడుకు తన స్నేహితులకు ఇచ్చాడని తెలిశాక సమర్పణ్ రియాక్షన్ ఏంటి? స్నేహితులకు ఇచ్చిన డబ్బులు రాక, అదే సమయంలో ప్రేయసి ప్రెగ్నెన్సీ టెన్షన్.. వీటిని ఐజాక్ ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ యాస, కల్చర్ని ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పరేషాన్ మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచిర్యాలకు చెందిన ఐదుగురు సింగరేణి పోరగాళ్ల కథ ఇది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్. సినిమా టైటిల్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది తెలంగాణ యాస, భాషని బేస్ చేసుకొని చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. అయితే కథలో మాత్రం కొత్తదనం లేదు. పనీపాట లేకుండా ఆవారాగా తిరిగే కొడుకు, తిట్టే తండ్రి, ఓ లవ్స్టోరి, చివర్లో హ్యాపీ ఎండింగ్.. ఈ తరహా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పరేషాన్ కూడా అలాంటి కథే.కానీ తెలంగాణ నేటివిటీని జోడించి చాలా వినోదాత్మకంగా చూపించారు. క్రైస్తవ మత ప్రార్థనలతో వినోదాత్మకంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఐజాక్ స్నేహితుల నేపథ్యం, పాషా చేసే ఓ పనికి పోలీసు స్టేషన్దాకా అందరు వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక స్నేహితులకు డబ్బులు ఇచ్చాక ఐజాక్ పడే పరేషాన్.. శిరీషతో ప్రేమాయణంతో ఫస్టాఫ్ కామెడీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. ఇక సెకండాఫ్లో కథ సింపుల్గా, ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగుతుంది. సత్తి కోసం వెతికే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. తాగుడుకు సంబంధించిన సీన్స్ ప్రతిసారి చూపించడం ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక సత్తి వేలు తెగిన సీన్, ఐజాక్ బ్యాండ్ డ్రెస్ సీన్ థియేటర్స్లో నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్యూర్ తెలంగాణ నెటివిటీ, యాస కారణంగా తెలంగాణేతర ప్రేక్షకులను ఈ సినిమా అంతగా అలరించకపోవచ్చు. కానీ ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్స్కు వస్తే మాత్రం ‘పరేషాన్’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిరువీర్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంటాడు. పరేషాన్లో కూడా అంతే. ఐజాక్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఆగమ్ సత్తిగా అర్జున్ కృష్ణ కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. ఐజాక్ స్నేహితులు ఆర్జీవీగా రవి, మైదాన్గా, పాషాగా బన్ని అభిరామ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యశ్వంత్ నాగ్ సంగీతం బాగుంది. సౌ సారా, ముసి ముసి నవ్వుల మంజుల పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణ పల్లె అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’: తిరువీర్
‘సింగరేణి పోరగాళ్ల కథే ‘పరేషాన్’. మంచిర్యాల ఊరుని ఒక బయోపిక్లా తీస్తే మా సినిమా అవుతుంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సహజమైన వినోదం ఉంటుంది’’ అని హీరో తిరువీర్ అన్నారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. (చదవండి: త్వరలో భోళా మానియా) ఈ సందర్భంగా తిరువీర్ మాట్లాడుతూ– ‘‘నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అనుకోకుండా ఘాజీ, మల్లేశం, పలాస.. అలాంటివే కుదిరాయి. ‘మసూద’ తర్వాత ఒక స్వేచ్ఛ దొరకడంతో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. ఎలాగైనా ‘పరేషాన్’ని జనాల్లోకి తీసుకెళ్దామని రానాగారు ముందుకు రావడంతో మా సినిమాకి బలం వచ్చింది. ప్రస్తుతం శివం సెల్యులాయిడ్ నిర్మాణంలో ఓ సినిమా, ‘బటర్ ఫ్లై’ ఫేం సతీష్గారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
రానా తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటిఅంటే..
-
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
నా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ అలరిస్తుంది: రానా
సాక్షి, ప్రకాశం(చీరాల): మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు తనయుడు ప్రముఖ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ చిత్రరంగంలోకి అరంగ్రేటం చేస్తున్న మొదటి సినిమా అహింస ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. శనివారం రాత్రి చీరాలలో స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూల్ గ్రౌండ్స్లో ఈ వేడుక నిర్వహించారు. సినీ నటీనటులను చూసేందుకు వేల సంఖ్యలో సినీ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు తరలి రావడం విశేషం. ఉదయభాను యాంకర్గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, హీరోయిన్ దీపిక దివని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, డైరెక్టర్ తేజ, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్లు హాజరయ్యారు. (చదవండి: సీరియల్ హత్యలు, పోలీసుల ఈగో.. కేసు చేధిస్తారా?) ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ రామానాయుడు కుటుంబం నుంచి మరో హీరో సినీ అరంగ్రేటం చేయడం శుభపరిణామమన్నారు. తెలుగు సినీఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దగ్గుబాటి కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిందన్నారు. నూతన హీరో అభిరామ్ను అందరు ఆదరించాలన్నారు. దగ్గుబాటి కుటుంబంతో తమకు సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉన్నాయని నూతన సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సినీరంగానికి, చిత్రాల నిర్మాణానికి చీరాల నియోజకవర్గం అనుకూలమన్నారు. అహింస చిత్రం ప్రేక్షకులు ఆదరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలన్నారు. సినీ హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ తన తమ్ముడు అభిరామ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం అందరిని అలరిస్తుందని, ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని చేకూర్చాలన్నారు. ప్రజల అభీష్టంతో ప్రేక్షకులను హత్తుకునేలా చిత్రాన్ని రూపొందించి చక్కని పాటలు, సంగీతం ఇచ్చామన్నారు. చీరాలతో మాకు విడదీయరాన్ని సంబంధం ఉందని తమ కుటుంబం సినీరంగం, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో చెరగని ముద్రను పొందామని, నూతన నటీనటులను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. -
పరేషాన్ హిట్ కావాలి
‘‘యంగ్ టీమ్ అంతా ప్రేమించి ప్యూర్ ఎనర్జీతో ‘పరేషాన్’ సినిమా తీశారు. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం మంచి హిట్ కావాలి. అలాగే నా తమ్ముడు అభిరామ్ నటించిన ‘అహింస’ కూడా జూన్ 2న రిలీజ్ అవుతోంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు తిరువీర్. ‘‘పరేషాన్’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్ళపల్లి. ‘‘కుటుంబంతో కలిసి మా సినిమాకి రండి’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఈ కార్యక్రమంలో పావని కరణం, సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్, సినిమాటోగ్రాఫర్ వాసు, నటుడు మురళి, గీత రచయిత చంద్రమౌళి పాల్గొన్నారు. -
రానాకు గంగవ్వ కల్లు దావత్.. ‘పరేషాన్’ చేసిన దగ్గుబాటి హీరో!
అచ్చమైన తెలంగాణ పల్లె మాటలతో ఆరుపదుల వయసులోనూ యూట్యూబ్ని షేక్ చేస్తుంది గంగవ్వ. మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా అందరికి పరిచమైన గంగవ్వ.. బిగ్బాస్ 4 ద్వారా మరింత ఫేమస్ అయింది. ఇస్మార్ట్ శంకర్, లవ్స్టోరీతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయింది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం విలేజ్కి వెళ్లిన రానాకు కల్లు తాగించి మరోసారి వార్తల్లో నిలిచింది గంగవ్వ. (చదవండి: బికినీలో అనసూయ రచ్చ...స్విమ్మింగ్ ఫూల్ పిక్స్ వైరల్) రానా సమర్పణలో ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. వాల్తేర్ ప్రొడక్షన్స్పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మై విలేజ్ షో టీమ్తో కలిసి సందడి చేశాడు రానా. (చదవండి: వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలుగా రెండువేల నోట్ల కట్టలు.. ఫోటో వైరల్) పరేషాన్ టీమ్తో కలిసి గంగవ్వ ఉండే ఊరికి వెళ్లాడు. పల్లెటూరు వాతావరణం లోకి అడుగుపెట్టిన రానా కి గంగవ్వ తాటి కల్లు తాగిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. View this post on Instagram A post shared by My Village Show (@myvillageshow) -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రానా సందడి (ఫొటోలు)
-
నా గురించి రానా ఎందుకు అలా చెప్పాడో ఫోన్ చేసి కనుక్కోవాలి
-
వినోదాల పరేషాన్
‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం ‘పరేషాన్’. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు.పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండమ్, సంగీతం: యశ్వంత్ నాగ్, లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి. -
వెంకీ మామ ఈ సిరీస్ మనకొద్దురా రామా..
-
రానా నాయుడు 2 వెంకటేష్ పరిస్థితి ఏంటో?
-
Rana Naidu 2: గెట్ రెడీ..రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానాలు తొలిసారి కలిసి నటించిన వెబ్సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్లోనూ రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్ను సంపాదించుకున్న రానా నాయడు ఇప్పుడు సీజన్-2తో వచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. 'బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది'.. అంటూ నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. కాగా కంటెంట్ పరంగా ఈ సిరీస్కు మంచి పేరొచ్చినా, అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలతో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరి సీజన్-2 ఏ విధంగా ఉండనుందన్నది చూడాల్సి ఉంది. Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH — Netflix India (@NetflixIndia) April 19, 2023 -
షూటింగ్ సమయంలోనే బైక్ రైడింగ్ నేర్చుకున్నా: శ్రీ సింహా
‘‘ఉస్తాద్’ టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. టీమ్ అందరూ కలిసి ఓ మంచి సినిమా తీశారని అనుకుంటున్నాను’’ అన్నారు రానా. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్ రామ్ జంటగా వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’. బుధవారం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘హీరో శ్రీ సింహాతో సహా దాదాపు ‘ఉస్తాద్’ చిత్రబృందం అందరితో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత రాకేష్ నా నంబర్వన్ యారి షో చేశాడు. మరో నిర్మాత హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీని నడిపాడు. ఇక ‘బాహుబలి’ టైమ్లో ఐదేళ్ల పాటు శ్రీసింహాతో కలిసి ట్రావెల్ చేశాను. ‘ఉస్తాద్’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరోకి బైక్ ఎలాగైతే ఉస్తాద్ అయ్యిందో నాక్కూడా అలాగే అయ్యింది. ఎందుకంటే షూటింగ్ సమయంలో బైక్ రైడింగ్ బాగా నేర్చుకున్నాను. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు శ్రీ సింహా. ‘‘టీజర్లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది’’ అన్నారు రాకేష్. ‘‘రెండేళ్ల ముందే ఈ టైటిల్ను రిజిస్టర్ చేయించాం. నాతో సహా ఈ సినిమాతో చాలామంది జర్నీని స్టార్ట్ చేశారు’’ అన్నారు ఫణిదీప్. -
ఉస్తాద్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ ఫోటోలు
-
ఆస్కార్ వేడుక చేసుకోవడం నాకు చాలా వింతగా ఉంది
-
తండ్రి కాబోతున్న రానా?
-
ఈ సమోసా గోల ఏంట్రా బాబు పడి పడి నవ్వుకుంటారు
-
మిహికా ఇన్స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మిహికా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు. ఏమీ చేయకుండా ఉండటంలో కూడా ఓ స్వీట్నెస్ ఉంటుంది అంటూ క్యాప్షన్ జోడించింది. మిహికా ప్రెగ్నెంటా? ఈ వీడియోలో ఆమె బీచ్లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిహికా గర్భవతిలా కనిపిస్తోంది, అందుకే వదులైన డ్రెస్ వేసుకుంది కాబోలు అంటూ ఏకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు మిహికాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వచ్చాయి. కానీ అవి వట్టి పుకారుగానే మిగిలిపోయాయి. గతంలో మిహికా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ గాసిప్స్ గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని.. తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చింది మిహికా. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
రానా నాయుడు వెబ్ సిరీస్పై నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం!
టాలీవుడ్ స్టార్స్ విక్టరి వెంకటేశ్, రానా దగ్గుబాటిలు నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో విడుదలై ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్లో రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్ను సంపాదించుకున్న రానా నాయడుపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ వెబ్ సిరీస్లో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్ వైరల్ ఇందులో సెన్సార్కు మించి అసభ్య పదాలు, శృంగారపు సన్నివేశాలు అధికంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్పై నెట్ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రానా నాయుడు సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్లో అభ్యంతకర భాష ఎక్కువగా ఉండటంతో ఈ తెలుగు ఆడియోను తొలగించాలని నెట్ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇదే విషయాన్ని నెట్ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించనుందట. తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం అసభ్య పదాలు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. చదవండి: వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక కాగా అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్లో బాలీవుడ్ నటి మాధురి ధీక్షిత్ను అవమారిచే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నెట్ఫ్లిక్స్కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో నెట్ఫ్లిక్స్ జాగ్రత్త పడినట్లు కూడా తెలుస్తోంది. -
ముంబైలో కీర్తి.. ఎత్తిన బాటిల్ దించకుండ తాగి షాకిచ్చిన ‘మహానటి’
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
వెంకటేశ్ నోట పచ్చిబూతులు.. వినలేకపోతున్నామంటున్న ఫ్యామిలీ ఆడియన్స్
-
కుడి కన్ను కనిపించలేదు, కిడ్నీ కూడా పాడైపోవడంతో.. : రానా
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రానా. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన గతంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. 'కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడే అతి తక్కువమందిలో నేను ఒకడిని. ఇదెలా మొదలైందంటే.. ఓ పిల్లవాడు తన తల్లికి కన్ను కనిపించడం లేదని ఎంతో బాధపడ్డాడు. అతడిని చూసి జాలేసింది. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. అంతెందుకు, నాకు కూడా ఓ కన్ను కనిపించదని చెప్పాను. చాలామంది ఏదైనా శారీరక అనారోగ్యానికి గురైతే ఎంతో మనోవేదన చెందుతారు. చివరికి వారు కోలుకున్నా సరే నాకు ఇలా జరిగిందేంటి? అని పదేపదే దాని గురించే ఆలోచిస్తారు. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు కుడి కన్ను సరిగా కనిపించడం లేదని శస్త్రచికిత్స చేయించుకున్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా. చెప్పాలంటే నేనొక టెర్మినేటర్ని(నవ్వుతూ). మరి ఇన్ని చేయించుకున్నా నేను బాగానే ఉన్నాను కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనవసర ఆలోచనలు మానేసి హాయిగా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాగా 2016లో తన అనారోగ్య సమస్యల గురించి మొదటిసారి నోరు విప్పాడు. కుడి కన్ను ద్వారా సరిగా చూడలేకపోతున్నానని, పైగా కిడ్నీ కూడా పాడైందని చెప్పాడు. అయితే చికిత్స ద్వారా తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానన్నాడు.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
నెగిటివ్ టాక్ వచ్చినా దూసుకుపోతున్న రానా నాయుడు..రీజన్ ఇదే!
సినీ ప్రేక్షకులకి ఎప్పుడు ఏది నచ్చుతుందో...ఏది నచ్చదో చెప్పటం కష్టం. అలా ఒకరికి నచ్చనది ఇంకొరికి నచ్చుతుంది. మెజార్టీ ప్రేక్షకులకి నచ్చినదే ఫైనల్ రిజల్ట్ అవుతుంది. ఈ విషయం రానా నాయుడు వెబ్ సిరీస్ విషయంలో ప్రూవ్ అయింది. టాలీవుడ్ ఇంతవరకు ఏ అగ్రహీరోలు కానీ...స్టార్ హీరోలు కానీ వెబ్ సిరీస్ లో నటించలేదు. ఫస్ట్ టైమ్ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్.. రానా కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను అమెరికన్ డ్రామా రే డొనోవన్ కి రీమేక్ గా డైరెక్టర్స్ కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ కలిసి తెరకెక్కించారు. తెలుగు హీరోలు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడుకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక వెంకటేశ్ ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వెంకటేశ్ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా ప్లే బాయ్ రోల్ లో కనిపించాడు. ఇక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో వెంకీ మేనరిజమ్స్ ఆకట్టుకున్నా...బూతులు మాట్లాడటం టాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ శృతి మించిదంటూ...ఫ్యామిలీ తో ఎలా కలిసి చూడాలంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఇక మీమర్స్కి రానా నాయుడు ఒక సోర్స్ గా మారింది. దీంతో రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది..ఈ సిరీస్ ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్ పచ్చి బూతులు మాట్లాడడమే. వెంకీ తన కెరీర్ లో ఏ సినిమాలో కూడా ఇలాంటి బూతులు మాట్లాడలేదు. దీంతో వెంకటేష్ ని అభిమానించే వాళ్ళ దగ్గర నుండి చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి..పరిస్థితి అర్ధం చేసుకున్న రానా రంగంలో దిగాడు. సిరీస్ ను మెచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నచ్చని వారికి తన హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు.అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ పై మొదట్లో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ...ఇప్పుడు టాక్ మెల్లగా మారుతోంది.కొంతమంది యూత్ ఈ అడల్ట్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సిరీస్ చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇండియన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న అన్నీ వెబ్ సిరీస్ ల కంటే రానా నాయుడు టాప్ వన్ పోజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ కి 80 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినట్టు సమాచారం.ఇక ఈ అడల్ట్ కంటెంట్ లో వెంకటేశ్ నటించేందుకు ఒప్పుకోవడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్ 12 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట. అలాగే రానా కి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. వీళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఈ బోల్డ్ కంటెంట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.ఇంకో విషయం ఏంటంటే రానా నాయుడు తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేశారు అంతే. రానా నాయుడు నిదానంగానే ప్రారంభమైన వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. ఇదే ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ ను ట్రెండింగ్ లో నిలబెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
రానా నాయుడు వెబ్ సిరీస్.. వెంకటేశ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్లో వెంకటేశ్ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు. అబ్బాయి రానాకు తండ్రిగా నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్పై ఫ్యాన్స్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సిరీస్లో నటించేందుకు వెంకటేశ్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్లో నటించేందుకు వెంకటేశ్ దాదాపు రూ.12 తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం: వెంకటేశ్
‘ఒక నటుడిగా కొత్త పాత్రలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ‘రానా నాయుడు’లో నాగ నాయుడు పాత్రలో కొత్తగా చేయడానికి అవకాశం దొరికింది. ఇలాంటి పాత్రని నేను గతంలో చేయలేదు. సరికొత్తగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచం. ఓటీటీలో చేయడం ఇదే మొదటిసారి. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో భావోద్వేగ సన్నివేశాలు చాలా కొత్తగా, పవర్ఫుల్గా ఉంటాయి. రానాతో తొలిసారి ఫుల్ లెంత్ స్క్రీన్ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కరణ్, సుపర్ణ్ వర్మలతో పని చేయడం గొప్ప ప్రయాణంలా అనిపించింది’’ అన్నారు. రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ డార్క్ కామెడీ డ్రామా. ఇలాంటి కథలు సినిమాల్లో చేయడం కష్టం. హైదరాబాద్కి చెందిన ఓ కుటుంబం ముంబై వెళ్లి అక్కడ గ్యాంగ్స్టర్ పనులు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలు ఇందులో ఉంటాయి. ఈ సిరీస్ కోసం బాబాయ్తో (వెంకటేశ్) పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’అన్నారు. ‘‘వెంకటేశ్, రానాగార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ. ‘‘రానా నాయుడు’ వీక్షకులను తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత సుందర్ ఆరోన్. -
‘రానా నాయుడు’ ప్రెస్మీట్లో బాబాయ్, అబ్బాయ్ సందడి (ఫోటోలు)
-
నా పాత్రలో రెండూ ఉంటాయి
‘‘నేను సాధారణంగా మంచి లేదా చెడు పాత్రలు పోషిస్తాను. కానీ, ‘రానా నాయుడు’ లో నేను చేసిన రానా పాత్రలో ఆ రెండూ కలిసి ఉంటాయి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. వెంకటేష్, రానా తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్లో నటించారు. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ లో రానా చీకటి జీవితం గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పో షించడానికి బాగా కష్టపడతాడు. నా పాత్రలో ఎక్కువ కోపం చూపించే సన్నివేశాలున్నాయి. నిజ జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ ఈ సిరీస్లో కోపం ప్రదర్శించడం సవాలుగా అనిపించింది. అదృష్టవశాత్తూ మా బాబాయ్కి(వెంకటేష్), నాకు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ ఉండటంతో నటించడం సులభం అయింది. వైరం ఉన్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్తో కూడుకున్నప్పటికీ రానా, నాగా(వెంకటేష్ క్యారెక్టర్) పాత్రలు, వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాల పైనే దృష్టిపెట్టాం’’ అన్నారు. -
తరచూ సమంతతో మాట్లాడుతుంటా: రానా
తరచూ స్టార్ హీరోయిన్ సమంతతో మాట్లాడుతుంటానని ఆసక్తికర విషయం చెప్పాడు హీరో, నాగ చైతన్య కజిన్ దగ్గుబాటి రానా. వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10న నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రానా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను, పలువురు సినీ సెలబ్రెటీల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సీఎం రేంజ్లో భారీ బందోబస్తు మధ్య అత్తారింటికి మనోజ్.. వీడియో, ఫొటోలు వైరల్ ఇందులో భాగంగా నాగ చైతన్య మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతతో ఇప్పటికి తను కాంటాక్ట్లో ఉన్నానని చెప్పాడు. ‘సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టు తెలిసిన వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాను. అంతేకాదు వీలు కుదరినప్పుడల్ల సమంతతో మాట్లాడుతూనే ఉంటా. నటీనటులు తమకు ఉన్న సమస్యల గురించి బయటకు చెప్పాలా? లేదా? అనేది వారి వ్యక్తిగతం. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏదో ఓక సమస్య వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఎవరి లైఫ్ పూలా పాన్పులా ఉండదు. చదవండి: ఆ వ్యక్తిని చాలా నమ్మాను, కానీ అతడు నా డబ్బు కాజేశాడు: నటి ఆవేదన ఎలాంటి సమస్య అయినా దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తావననేది ముఖ్యం. సమస్య వచ్చినప్పటికీ కంటే దాన్ని ఎదుర్కొని ముందు సాగడంలోనే ఆనందం ఉంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో రానా- విక్టరి వెంకటేశ్లు తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రూపొందింది. ఇందులో బాలీవుడ్ నటీనటులు సుర్వీన్ చావ్లా ఆశిస్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
నమ్రత భర్తగానే మహేశ్బాబు తెలుసు: రానా దగ్గుబాటి
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో వెంకీ, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో రానా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు హిందీలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. అంతెందుకు? నా రెండో సినిమా(ఘాజీ) హిందీలోనే చేశా, తర్వాత మాత్రం తెలుగులోనే వరుస సినిమాలు చేశాను. కానీ మనం అనవసరంగా ఇలా సినిమాను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం. త్వరలోనే ఆ సరిహద్దులు కూడా చెరిపోయే రోజు వస్తుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకిప్పటికీ గుర్తుంది. చాలాకాలం పాటు నేను బాహుబలి షూటింగ్లోనే నిమగ్నమయ్యాను. ఆ సమయంలో బాలీవుడ్లోని నా మిత్రుడొకరిని కలిసినప్పుడు బాహుబలి సినిమా గురించి చెప్పాను. అప్పుడతను అందులో హీరో ఎవరని అడగ్గా ప్రభాస్ అని చెప్పాను. దీనికతడు ప్రభాస్ ఎవరు? అని తిరిగి ప్రశ్నించాడు. ఓ క్షణం పాటు అవాక్కైన నేను ప్రభాస్ నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పి అతడి గురించి వివరించే ప్రయత్నం చేశాను. కానీ ప్రభాస్ సినిమాలు ఏ ఒక్కటీ తను చూడలేదట. అంతేకాకుండా తనకు టాలీవుడ్లో చిన్ను భర్త ఒక్కరే తెలుసన్నాడు. చిన్ను ఎవరో అర్థం కాక నేను ఆలోచనలో పడ్డాను. కాసేపటి తర్వాత చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని అర్థమైంది. నమ్రత భర్తగా మహేశ్బాబు తెలియడమేంటి? అని నేను షాక్ అవ్వాల్సి వచ్చింది. నాలుగైదేళ్లు ఆగు, మా ఆర్మీ అంతా బాలీవుడ్లో ల్యాండ్ అవుతుందని చెప్పాను. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను చెప్పింది జరగడంతో సంతోషం వ్యక్తం చేశాడు' అని చెప్పుకొచ్చాడు రానా. -
రానాతో వార్ అంత సులువు కాదు
‘‘సంక్లిష్టమైనపా త్రలు నన్ను ఆకర్షిస్తాయి. ‘రానా నాయుడు’లో నేను చేసిన నాగనాయుడు అలాంటిపా త్రే. నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నపా త్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ సంతృప్తిని ఇచ్చింది’’ అని హీరో వెంకటేష్ అన్నారు. కరణ్ అన్షుమాన్– సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్లో వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘వెబ్ సిరీస్లో పని చేయడానికి, సినిమాలో చేయడానికి చాలా తేడా ఉంటుంది. వెబ్ సిరీస్లో కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి నాకు కొంత సమయం పట్టింది. ఇందులో నెగిటివ్పా త్రను పోషించడం నావరకూ రిఫ్రెషింగ్ చేంజ్. ‘రానా నాయుడు’లో మునుపెన్నడూ చూడనిపా త్రలో నన్ను చూస్తారు. రానాకి ఎదురుగా నిలబడి వార్ చేయడం అంత సులువు కాదు.. నటుడిగా నాకిది ఒక సవాల్. నిజ జీవితంలో మేం బాబాయ్ అబ్బాయ్లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. కానీ తెరపై ఒకరంటే ఒకరికి పడని తండ్రీ కొడుకులుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం అనిపించింది. ఇది కచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం’’ అన్నారు. -
లీడర్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
హైదరాబాద్లో పుట్టి.. అమెరికాలో పెరిగి.. చెన్నైలో మోడలింగ్ చేసి హీరోయిన్గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. రానా మూవీ లీడర్ సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. ఆ చిత్రంలో జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాకముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. వామనన్ అనే తమిళ చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశించింది. తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్ లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. సినిమా హిట్ అయినప్పటికీ ఆమె పెద్దగా అవకాశాలు రాలేదు. పలు కారణాలతో ఆమె ఛాన్సులు రాకుండా పోయాయి. కొన్ని సినిమాల్లో సెకండ్ ఛాయిస్గా ప్రియాను తీసుకున్నారు. వాటిలో రామ్ పోతినేని, సిద్దార్థ్, రానా, శర్వానంద్తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె చేస్తుందన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ కనుమరుగై పోయినా.. కోలీవుడ్లో మాత్రం బీజీ అయిపోయింది. ఇటీవల తమిళ డబ్బింగ్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అవకాశాలు రావడంతో అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే ఓ తమిళ మూవీలో హీరోయిన్గా చేస్తుండగా.. మరో కన్నడ మూవీకి ఓకే చెప్పిందంట ప్రియా ఆనంద్. -
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాగ వెర్సస్ రానా
బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నాగ పాత్రలో వెంకటేశ్, రానా నాయుడుగా రానా నటించారు. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇండియన్ అడాప్షన్గా రూపొందిన ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ‘రానా నాయుడు’ ట్రైలర్ను విడుదల చేశారు. సుందర్ ఆరోన్, కరణ్ అన్షుమాన్ నిర్మించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ‘‘రానాకి అతని తండ్రి నాగతో పెద్ద సమస్య ఉంటుంది. ఈ తండ్రీకొడుకుల మధ్య వచ్చే సమస్య ప్రధానాంశంగా ఈ సిరీస్ సాగుతుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘రానా నాయుడు పాత్ర సవాలుగా అనిపించింది’’ అన్నారు రానా. వెంకటేశ్, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
రానా నాయుడు ట్రైలర్: తండ్రీ-కొడుకుల వార్!
దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ట్రైలర్ రిలీజ్ అయ్యింది. స్కాండల్స్లో ఇరుకునే సెలబ్రిటీగా రానా, జైలు నుంచి రిలీజ్ అయిన వ్యక్తిగా వెంకీలు ఈ కథలో కనిపించనున్నారు. కథలో ఈ ఇద్దరిదీ తండ్రీకొడుకుల క్యారెక్టర్లు. అయినా ఇద్దరికీ అస్సలు పడని క్యారెక్టర్లుగా చూపించారు. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణనే ప్రధాన కథాంశంగా మలిచినట్లు అర్థమవుతుంది. డైలాగులు కూడా కాస్త కటువుగా, నాటుగానే ఉండడం గమనార్హం. హిందీ స్ట్రెయిట్, తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో మార్చి 10వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! 🤯👀#RanaNaidu, releasing on March 10. pic.twitter.com/mOnbRGA5oA — Netflix India South (@Netflix_INSouth) February 15, 2023 -
మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం గ్లింప్స్..
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీప్రసన్న నిర్మించారు. మంగళవారం ఈ సినిమా గ్లింప్స్ని హీరో రానా రిలీజ్ చేసి, చిత్రయూనిట్కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో లక్ష్మీప్రసన్న పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘అగ్ని నక్షత్రం’. రానా విడుదల చేసిన గ్లింప్స్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి. -
'అదే నీతో ప్రేమలో పడేలా చేస్తుంది'.. రానా భార్య మిహికా క్యూట్ పోస్ట్
ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు తమ వలెంటైన్స్తో కలిసి ఉన్న స్పెషల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. భర్త రానాతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫోటోను షేర్చేస్తూ.. ''నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్, ఇంకా వండర్ఫుల్. నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవడం లేదు. అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు..(ఫన్నీ ఎమోజీ). రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ నవ్వు మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే రానా'' అంటూ తన భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రిత సహా పలువురు నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
'వచ్చేయ్.. ఎంట్రీ నేనే ఇప్పిస్తా'.. రానా స్వీట్ వార్నింగ్
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డొనవన్కు రీమేక్గా తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రానా.. వెంకటేశ్కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు రానా. ఆ వీడియోలో ఏమన్నారంటే.. రానా మాట్లాడుతూ.. 'వచ్చేయ్. ట్రైలర్ లాంఛ్లో కలుద్దాం. అక్కడా గేటు దగ్గర వద్ద నీకు ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు తండ్రినని చెప్పు. నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు.' అని అన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే వెంకటేశ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నెట్ఫ్లిక్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకీ. చేతిలో గన్ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. Video toh koi bhi bana leta hai, Naga. Trailer launch par mil. Batata hu asli baap kaun hai.@VenkyMama #RanaNaidu pic.twitter.com/qveDM25zOB — Rana Daggubati (@RanaDaggubati) February 13, 2023 -
సిక్స్ ప్యాక్ మానియాలో హీరోలు..ఆరోగ్యంపై ఎఫెక్ట్
సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై దశాబ్ధంపైగానే అయినా అంతకంతకూ తన క్రేజ్ను పెంచుకుంటోంది. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలు అందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో దేశ ముదురు సినిమా కోసం అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, సుధీర్బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్లో తళుక్ మంటున్నారు. నాణేనికి మరోవైపు... ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని కూడా కొన్ని విశ్లేషణలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిక్స్ప్యాక్ కారణం? టాలీవుడ్లో హీరోలకు క్రేజీగా మారిన సిక్స్ప్యాక్ దక్కించుకుని, దాని కొనసాగింపుల కోసం నాగశౌర్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని, అదే విధంగా కఠినమైన డైట్ రొటీన్ను పాటిస్తున్నారని సమాచారం. యువకుడు, ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే నాగశౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చునని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని థృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీ కి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉంది. అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా... నిపుణులేమంటున్నారు? ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్ప్యాక్ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు. సిక్స్–ప్యాక్ మానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాతని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారేం చెప్తున్నారంటే... ► అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్ను బాగా ప్రభావితం చేస్తుంది. ► తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరమైన విషయం. ఆహారం నుంచి ఉప్పును తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ► అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్కు గురి చేసే అవకాశం ఉంది. ► అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, ఆ ఆరు పలకల కండరాలు ప్రస్ఫుటంగా కనిపించడం కోసం తరచు తరచి చూసుకోవడం, అవి కనపడని రోజున తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగవచ్చుని అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని కూడా సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ► బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎవరు ఎక్కువ శ్రమపడినా అది ప్రమాదకరమే కావచ్చునంటున్నారు. ► ఇక ఫాస్ట్గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకునేవారు కూడా ఆరోగ్యపరమైన తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు.