బాసూ రెడీయా...  | Mark Antony Trailer Launched By Rana Daggubati | Sakshi

బాసూ రెడీయా... 

Sep 4 2023 12:18 AM | Updated on Sep 4 2023 12:19 AM

Mark Antony Trailer Launched By Rana Daggubati - Sakshi

‘ఏం బాసూ రెడీయా.. వెల్‌ కమ్‌ టు ది వరల్డ్‌ ఆఫ్‌ మార్క్‌ ఆంటోని’ అనే డైలాగ్స్‌తో ‘మార్క్‌ ఆంటోని’ ట్రైలర్‌ ఆరంభం అయింది. విశాల్‌ పలు షేడ్స్‌లో టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ఇది. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్‌గా, గుండుతో స్టైలిష్‌గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్‌లో విశాల్‌ కనిపిస్తారు. ఓ టైమ్‌ మిషన్‌ కాకుండా ఓ ఫోన్‌ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్‌ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement