Vishal
-
Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ
టైటిల్: మదగజరాజానటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులునిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుందర్ సితెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్సంగీతం: విజయ్ ఆంటోనిఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.విడుదల తేది: జనవరి 31, 2025తమిళ స్టార్ విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?అరకు చెందిన మదగజరాజా( అలియాస్ ఎంజీఆర్(విశాల్)(Vishal) ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కారణమని తెలిసి రాజా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్సెట్ కూడా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుందర్ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్లోనే ఉంటుంది. ఫస్టాఫ్లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండాఫ్ని సీరియస్గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్బాడీతో హీరో, అతని గ్యాంగ్ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్ కథకి సెకండాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..మాస్ యాక్షన్ సినిమాలు విశాల్కి కొత్తేమి కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్ పాత్రనే పోషించాడు. యాక్షన్తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలీ ఇద్దరూ తెరపై అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్ తనకు అలవాటైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. విజువల్స్గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
దయచేసి సినిమాల్లోకి రాకండి.. విశాల్ కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితి బాగోలేదని..సినిమాలు నిర్మించి డబ్బును వృథా చేయకండి అని కోరారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన ఇలాంటి మాటలు చెబితే తనను విలన్గానే చూస్తారని.. అయినా కూడా తాను చెప్పేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి గతంలోనే నేను మాట్లాడాను. పరిస్థితి బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్లా చూశారు. కానీ నేను చెప్పిందే వాస్తవం. ఒక చిన్న సినిమా తెరకెక్కించాలన్న కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్డ్ డిపాజిట్ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమా రంగంలో పెట్టి నష్టపోకండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితుల ఏం బాగోలేవు. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాలు చేయ్యొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బు ఉంది. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’ అని విశాల్ అన్నారు. కాగా, గతేడాది కోలీవుడ్ భారీగా నష్టాలను చవి చూసింది. ఏడాది మొత్తంలో 240 వరకు సినిమాలు నిర్మిస్తే..వాటిల్లో కేవలం 18 మాత్రమే విజయం సాధించాయి. మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.మొక్కు చెల్లించిన విశాల్..12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజా'(Madha Gaja Raja) చిత్రం తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విశాల్ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. దీంతో బుధవారం విశాల్ చెన్నైలోని కపలీశ్వరర్ టెంపుల్ సందర్శించి మొక్కులు చెల్లించాడు. సినిమా విజయం సాధిస్తే టెంపుల్కి వస్తానని మొక్కుకున్నానని.. అనుకున్నట్లే మూవీ హిట్ కావడంతో మొక్కులు చెలించానని విశాల్ చెప్పారు.సుందర్ సి దర్శకతవం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్గా నటించారు. సంక్రాంతి కానుకగా తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. -
తమిళ్లో పెద్ద హిట్.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ను అదే టైటిల్తో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్ హీరోయిన్గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు. -
15 ఏళ్లుగా ప్రేమ నిజమే.. విశాల్తో రూమర్స్పై 'అభినయ' కామెంట్
రవితేజ నటించిన 'నేనింతే' సినిమాతో నటి అభినయ (Abhinaya) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ‘శంభో శివ శంభో’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. విశాల్తో (Vishal ) పెళ్లి, ప్రేమ రూమర్స్పై ఆమె స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) అభినయ.. తన సైన్ లాంగ్వేజ్తో పలు విషయాలు పంచుకున్నారు. రీసెంట్గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'పని' (Pani). నటుడు జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఈ మూవీలో ఆమెపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం చాలా వివాదాస్పదమైంది. దీంతో జోజూ జార్జ్ మేకింగ్ను చాలామంది తప్పుపట్టారు. ఈ విషయంపై కూడా అభినయ స్పందించారు.విశాల్తో ప్రేమ.. అసలు ప్రియుడిని పరిచయం చేసిన అభినయవిశాల్తో పూజా చిత్రంలో మెప్పించిన అభినయ.. మార్క్ ఆంటోని మూవీలో ఆయనకు భార్యగా నటించారు. ఆమెలో నటన పరంగా చాలా టాలెంట్ దాగి ఉందని పలుమార్లు విశాలు కామెంట్ చేశారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. దీంతో పలు వేదికల మీద ఇప్పటికే వారిద్దరూ ఖండించారు. అయినా కూడా.. అభినయతో విశాల్ పెళ్లి అనే వార్తలు మాత్రం ప్రచారంలోనే ఉన్నాయి. త్వరలో పెళ్లి అంటూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. (ఇదీ చదవండి : ఓటీటీలో రొమాన్స్ సినిమా.. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు)అయితే, ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని అభినయ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన సైన్ లాంగ్వేజ్లో పంచుకున్నారు. 33 ఏళ్ల అభినయకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. ఆపై మీరు ఒంటరిగా ఉన్నారా..? ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా..? అనే ప్రశ్నలు ఎదురుకావడంతో అభినయ కంగుతిన్నారు. అయితే, ఏమాత్రం తడబాటుపడకుండా తిరిగి సమాధానం ఇచ్చారు. తాను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నానని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన అభినయ అభిమానులను ఆశ్చర్యపరిచారు.మలయాళ సినిమా 'పని'లో బోల్డ్ సీన్లో అభినయతాజా మలయాళ చిత్రం 'పని' సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చాలా బాగుంది అంటూ మంచి టాక్ ఉంది. నటుడు జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు . ఇందులో అభినయపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. దీంతో జోజూ మేకింగ్ను అందరూ ట్రోల్ చేశారు. దీనిపై కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. 'ఒక మూవీలో ఎలాంటి సీన్లు పెట్టాలి..? ఎలా తెరకెక్కించాలి..? వంటి అంశాలు పూర్తిగా దర్శకుడి నిర్ణయం. దానిని నటీనటులు తప్పకుండా గౌరవించాలి. దీంతో నేను ఈ అంశం గురించి పెద్దగా ఏం మాట్లడను. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే అందులో దర్శకుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అతని మాటే తుది నిర్ణయంగా భావించాలి. సౌత్ ఇండియాలో జోజూ చాలా గొప్ప నటుడు. గొప్ప గొప్ప దర్శకులతో ఆయన పనిచేశారు. మంచి అనుభవం ఉన్న నటుడు మాత్రమే కాకుండా ఒక సినిమా మేకర్గా ఆయన రాణిస్తున్నారు.' అని ఆమె అన్నారు. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ చెప్పిన దర్శకుడు
సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మిస్కిన్ క్షమాపణలు చెప్పాడు. బాటిల్ రాధ సినిమా ఈవెంట్లో మిస్కిన్ మాట్లాడుతూ.. తాను పెద్ద తాగుబోతునని చెప్పాడు. ఎన్నో సమస్యలకు మందు పరిష్కారమని చెప్పాడు. ఇళయరాజా సంగీతం వల్ల ఎందరో మద్యానికి అలవాటుపడ్డారన్నాడు. ఇళయరాజాపై ఈయన చేసిన కామెంట్లు వివాదాస్పదమవడంతో నేడు సారీ చెప్పాడు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారని పేర్కొన్నాడు.చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదుతాజాగా ఈ వివాదంపై తమిళ హీరో విశాల్ (Vishal) స్పందించాడు. అందరూ ఆరాధించే ఇళయరాజాను అగౌరవపర్చడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఆయన సంగీతం వల్ల ఎంతోమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని తెలిపాడు. అలాంటి మహనీయుడు గురించి, ఆయన సంగీతం గురించి చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించాడు. విశాల్-మిస్కిన్ కాంబోలో 2017లో వచ్చిన తుప్పరివాలన్(తెలుగులో డిటెక్టివ్) పెద్ద హిట్ అయింది.చేదు అనుభవం బయటపెట్టిన దర్శకుడుఇకపోతే మిస్కిన్ తాజాగా బాటిల్ రాధ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. 2013లో ఒనాయుమ్ ఆట్టుకుట్టియుమ్ సినిమా తీశాను. కొందరు ఈ మూవీ టెలివిజన్ రైట్స్ హక్కులు కొనేందుకు నన్ను సంప్రదించారు. ఓ బడా దర్శకుడు నాకు ఫోన్ చేసి ఈ సినిమా తాను కొంటానని, అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బిస్తానంటూ ఓ చోటుకు రమ్మన్నాడు.(చదవండి: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!)సగం కంటే తక్కువకే ఇచ్చేయమన్నారుసరేనని అతడు చెప్పిన ప్రదేశానికి వెళ్లాను. నన్ను ఓ పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో 20 మంది ఉన్నారు. రూ.75 లక్షలకే డిజిటల్ రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంతో కష్టపడి తీశాను సర్.. ఇది చాలా మంచి సినిమా.. కనీసం రూ.2 కోట్లు ఇవ్వండి అని కోరాను. కానీ వాళ్లు మాత్రం నా మాట వినలేదు. అంత డబ్బు ఇవ్వలేం.. మేము అడిగినదానికే డీల్ కుదిర్చేయ్ అని బలవంతం చేశారు. బెదిరించి బలవంతంగా సంతకంకాసేపటికి వాళ్లందరూ గూండాలని అర్థమైంది. నన్ను బెదిరించి పత్రాలపై సంతకం తీసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు రూ.75 లక్షలే ఇచ్చారు. ఇదంతా వెనకుండి నడిపించిన వ్యక్తి ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్. నా సినిమాను ఇప్పటివరకు వారి ఛానల్లో 80 సార్లు వేసి ఉంటారు. అది టీవీలో కూడా హిట్టయింది అని చెప్పుకొచ్చాడు.చెప్పు విసురుతానని..ఇళయరాజాపై వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. కొన్నిరకాల వివాదాలు నిర్మాతలను ఇబ్బందిపెడతాయి. అందుకే నా వల్ల ఏ సమస్యా ఉండకూడదని సారీ చెప్తున్నాను. అయితే నా వ్యాఖ్యలు విన్న నా స్నేహితుడు నాపై చెప్పు విసురుతానన్నాడు. నా చెప్పు సైజ్ 8.. కాబట్టి ఒకటికి బదులుగా రెండు విసరమని చెప్పాను. అతడికి కూడా క్షమాపణలు చెప్పాను. ఆరోజు సరదాగా అన్న మాటల్ని చాలాదూరం తీసుకెళ్తున్నారు. అందుకే సారీ చెప్తున్నా అన్నాడు మిస్కిన్.చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
'నిడదవోలుకు రైలుబండి' అంటూ హీరోయిన్లతో విశాల్ స్టెప్పులు
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు హైలెట్గా నిలిచిన 'చికుబుకు రైలుబండి' సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 12 ఏళ్ల పాటు పక్కనపడేసిన సినిమా కోలీవుడ్లో సంక్రాంతికి విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో సుమారు రూ. 100 కోట్ల వరకు రాబట్టింది.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి(Anjali), వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్గా నటించారు. ప్రస్తుతం విడుదలైన సాంగ్లో ఇద్దరు హీరోయిన్లతో విశాల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. -
అదిరిపోయే పంచ్లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్గా నటించారు. తెలుగు వర్షన్లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్ను హీరో వెంకటేశ్ హైదరాబాద్లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్ మాస్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్ సదా కూడా ఒక ఐటెమ్ సాంగ్లో కనిపించింది. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్పై కేసు నమోదు
కోలీవుడ్ నటుడు విశాల్పై(Vishal) దుష్ప్రచారం చేసిన తమిళ యూట్యూబర్ సెగురాపై కేసు నమోదు అయింది. తన యూట్యూబ్ ఛానెల్లపై దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్(Nasir) తాజాగా చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. విశాల్ నటించిన మదగజరాజా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. సినిమా విడుదల సమయంలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ‘మదగజరాజ’ (Madha Gaja Raja) ఈవెంట్లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా.. సడెన్గా తెలుగులో స్ట్రీమింగ్)'మదగజరాజ' సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ విడుదలకు మోక్షం రావడంతో విశాల్ తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వేదికపైనే మైక్ పట్టుకుని ఆయన వణికిపోయారు. అయితే, విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా కూడా కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాశారు. అందువల్ల అలాంటి వారిపై కేసు నమోదు చేశారు.విశాల్పై యూట్యూబర్స్ చేసిన కామెంట్స్విశాల్పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్స్ మీద నటుడు నాజర్ కేసు పెట్టారు. వారు చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. 'నటుడు విశాల్కు మద్యానికి బానిస కావడం వల్ల ఆయన శారీరక బలహీనతకు గురయ్యారు. ఆయన చేతులు, కాళ్ళలో వణుకు రావడం వెనుక ఒక బలమైన జబ్బు ఉంది. త్వరలో ఆయన మరింత బలహీనపడుతాడు. భవిష్యత్లో చిత్ర పరిశ్రమకు విశాల్ దూరం కావచ్చు. ఆయనతో నటించేందుకు ఎవరూ ఇష్టపడరు.' అని నిరాధారమైన, విశాల్ పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. నటుడు నాజర్ ఫిర్యాదుతో పరువు నష్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సహా మూడు సెక్షన్ల కింద సెగురాతో పాటు రెండు యూట్యూబ్ ఛానెల్స్పై కేసు నమోదు చేశారు.తెలుగులో కూడా విడుదలవిశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్లో సంక్రాంతి విన్నర్గా ఈ చిత్రం నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్ల వరకు ఇప్పటికే కలెక్ట్ చేసింది. అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ కథానాయికలుగా ఇందులో నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగులో కూడా జనవరి 31న విడుదల కానుంది. -
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
యాక్షన్... కామెడీ
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ నెల 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ‘‘విశాల్ పవర్ఫుల్ యాక్షన్, సంతానం కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ‘మదగజరాజ’ పన్నెండేళ్ల క్రితమే రూపొందింది. కానీ రిలీజ్ కాలేదు. చివరికి తమిళంలో ఈ పొంగల్కి రిలీజైంది. -
12 ఏళ్ళకు విశాల్ సంచలనం దెబ్బకు సంక్రాంతి రికార్డు బద్దలు
-
అనారోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అభిమానులు విశాల్కు ఏమైందని ఆందోళన చెందారు.వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విశాల్ఈ క్రమంలో విశాల్కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.ఆరు నెలలకోసారి దూరం?తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)ఇప్పుడు బానే ఉన్నానునేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాతో హీరోగా క్రేజ్కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.ఎయిట్ ప్యాక్తో విశాల్మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్లో 8 ప్యాక్స్తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. #Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025 చదవండి: పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్ -
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
విశాల్కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
హీరో విశాల్ (Vishal) వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తనకు చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా విశాల్ హీరోగా నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలవుతోంది. బక్కచిక్కిపోయిన విశాల్చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ (Madha Gaja Raja Pre-Release Event)లో విశాల్ సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తన మాటలతో పాటు చేతులు కూడా వణికాయి. అతడు సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అభిమానులు విశాల్కు ఏమైందని ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.(చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)సినిమాకాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండకోడి (పందెంకోడి) మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు. పాండియ నాడు మూవీతో నిర్మాతగానూ అవతారమెత్తాడు. మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమా మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ప్రస్తుతం విశాల్.. బ్లాక్బస్టర్ మూవీ తుప్పరివాలన్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. 2019లోనే ఈ చిత్రం ప్రకటించారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మదగజరాజ సినిమా..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్లో 8 ప్యాక్స్తో కనిపించాలని విశాల్తో అన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.(చదవండి: బాలకృష్ణ హీరోయిన్కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!)ఆ రెండూ సస్పెన్స్లో..సూపర్ హిట్ మూవీ అభిమన్యుడికి సీక్వెల్ ఉంటుందని హీరో విశాల్ 2021లో ప్రకటించాడు. అది కూడా తనే డైరెక్ట్ చేస్తానన్నాడు. ఏమైందో ఏమో కానీ మళ్లీ దాని ఊసే ఎత్తలేదు. అలాగే గతేడాది ఓ సంచలన ప్రకటన కూడా చేశాడు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఉంటుందని ప్రకటించాడు. 2026లో తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానన్నాడు. తన పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారని వెల్లడించాడు. మరి తను పెట్టబోయే పార్టీ గురించి, అటు అభిమన్యుడు సీక్వెల్ గురించి ఈ ఏడాదేమైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి! Actor #Vishal 🥹❤️❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...pic.twitter.com/4LrLpQmiEh— Official CinemaUpdates (@OCinemaupdates) January 5, 2025 చదవండి: హీరో విశాల్కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు? -
హీరో విశాల్కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?
హీరో విశాల్ (Vishal) నటించిన సినిమా పుష్కరకాలం తర్వాత రిలీజవుతోంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్ 2012లోనే పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు.వణికిపోతున్న విశాల్ఈ కార్యక్రమానికి విశాల్ పంచెకట్టులో హాజరయ్యాడు. అయితే ఆయన బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. తను మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురూ చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇంకేదైనా..?ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంత చిక్కిపోతారా? విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తే..మదగజరాజ మూవీలో విశాల్ ఎయిట్ ప్యాక్స్లో కనిపిస్తాడట! ఈ విషయాన్ని డైరెక్టర్ సుందర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. క్లైమాక్స్లో 8 ప్యాక్స్తో కనిపించాలన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. Actor #Vishal 🥹❤️Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja ...Dedication 💪 ❤️pic.twitter.com/qb1o3vHvuh— Movies4u Official (@Movies4u_Officl) January 5, 2025 చదవండి: 'గేమ్ ఛేంజర్' కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: దిల్ రాజు -
భారీ తారాగణం.. 12 ఏళ్ల తర్వాత 'విశాల్' సినిమాకు మోక్షం
విశాల్ నటించిన ఒక సినిమా సుమారు 12 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. సౌత్ ఇండియాలో విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో టాప్ నటీనటులు కూడా ఉన్నారు. చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అయితే, పలు కారణాల వల్ల సినిమా థియేటర్స్లో విడుదల కాలేదు.హీరో విశాల్, ప్రముఖ దర్శకుడు సుందర్ సి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'మదగజరాజ'. ఈ చిత్రంలో విశాల్తో పాటు అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ నటించారు. షూటింగ్ పనులన్నీ కూడా 2012లోనే పూర్తి అయ్యాయి. ఈ మూవీలో ఐటెంసాంగ్లో సదా మెరుపులు ఉన్నాయి. ఆపై కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్లో నటించాడు. సోనూసూద్, సంతానం వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చాడు. ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఉన్న ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే, నిర్మాతలు తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని కమెడియన్ సంతానం కోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి సినిమా విడుదలకు బ్రేకులు పడుతూనే వచ్చాయి.'మదగజరాజ'కు మోక్షంసుమారు 12 సంవత్సరాల తర్వాత 'మదగజరాజ'కు మోక్షం దక్కింది. జనవరి 12 విడుదల చేసేందుకు కోలీవుడ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను విశాల్ తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు తన బ్యానర్ మీదనే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని అధికారికంగా విశాల్ ప్రకటించనున్నారు. విశాల్ అసలు టార్గెట్ కోలీవుడ్. ఇప్పుడు అజిత్ విడాముయార్చి వాయిదా వేసుకోవడంతో టాప్ హీరోలు ఎవరూ రేసులో లేరు. దీంతో ఈ సినిమాకు కాస్త కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆయన ఆ ప్లాన్ అనుసరిస్తున్నట్లు సమాచారం. -
ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఐపీవో..!
ముంబై: సూపర్మార్కెట్ చైన్ విశాల్ మెగా మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్లో ఐపీవో చేపట్టనుంది. తద్వారా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్కు పెట్టుబడులున్న కంపెనీ లిస్టయితే 2024 ఏడాదికి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.అంతేకాకుండా దేశీ ప్రైమరీ మార్కెట్లో నాలుగో పెద్ద ఐపీవోగా రికార్డులకు ఎక్కనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) రూ. 8,912 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 462 కోట్ల నికర లాభం ఆర్జించింది.డిసెంబర్ మధ్యలో.. నిజానికి దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నమోదవుతున్న దిద్దుబాట్ల కారణంగా నవంబర్లో చేపట్టదలచిన ఇష్యూని విశాల్ మెగామార్ట్ డిసెంబర్కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే లండన్, సింగపూర్ తదితర ప్రాంతాలలో రోడ్షోలపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెల మధ్యలో చేపట్టనున్న ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ లేనట్లు తెలుస్తోంది.నిధుల సమీకరణకు వీలుగా హోల్డింగ్ కంపెనీ సంయత్ సర్వీసెస్ ఎల్ఎల్పీ వాటాలు విక్రయించనుంది. ప్రస్తుతం విశాల్ మెగామార్ట్లో సంయత్ సర్వీసెస్కు 96.55 శాతం వాటా ఉంది. కంపెనీ సీఈవో గుణేందర్ కపూర్ వాటా 2.45 శాతంగా నమోదైంది. సుమారు 626 సూపర్మార్కెట్ల ద్వారా కంపెనీ దుస్తులు, ఎఫ్ఎంసీజీ, సాధారణ వర్తక వస్తువులు తదితర పలు ప్రొడక్టులను విక్రయిస్తోంది. -
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్రమైన చర్యలు: విశాల్
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నటీమణలకు రక్షణగా నడిగర్ సంఘం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జనరల్ కమిటీ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచీ మురుగన్, కరుణాస్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు. మహిళ రక్షణ కోసం విశాఖ కమిషన్ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. లైంగిక వేధింపులకు ఎవరైన గురైనట్లు ఫిర్యాదు వస్తే.. తప్పు చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని విశాల్ హెచ్చరించారు. ఈమేరకు ఒక తీర్మానం కూడా చేశామని ఆయన అన్నారు. బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.అనంతరం విలేకరులతో అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ.. '68వ వార్షిక సభను అద్భుతంగా పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులను అభినందించి వారిని సత్కరిస్తున్నాం. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం. నటీనటుల సంఘం పొడిగింపును సభ్యులందరూ అంగీకరించారు.' అని అన్నారు. -
సైకిల్పై వచ్చిన స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ చెన్నైలో సందడి చేశారు. చాలా సింపుల్గా సైకిల్ తొక్కుతూ కనిపించారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ 68వ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి వచ్చారు. సైకిల్పై తమ అభిమాన హీరో రావడంతో ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అక్కడే గేట్ దగ్గర ఉన్న అభిమానులతో విశాల్ కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ఇటీవల మాలీవుడ్లో హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొద్దిరోజుల క్రితమే నడిగర్ సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో పది రోజుల్లో నడిగర్ సంఘం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రకటన వస్తుందని విశాల్ వెల్లడించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే ఇండస్ట్రీ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తామని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. VIDEO | Actor Vishal arrives on a bicycle to attend 68th South Indian Artist Association meeting being organised in Chennai.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/EYP25aY3rb— Press Trust of India (@PTI_News) September 8, 2024 -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్
మలయాళ చలనచిత్రపరిశ్రమలో ఆడవారిని వేధిస్తున్నారని, ఆర్టిస్టులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని జస్టిస్ హేమ కమిటీ బయటపెట్టింది. అయితే ఈ ఒక్కచోటే కాదు దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలున్నాయి. అందుకే తమిళనాట కూడా దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నాడు హీరో విశాల్.అతడు మాట్లాడుతూ.. అవకాశం కావాలంటే తాము చెప్పినదానికి అంగీకరించమని ఎవరైనా అడిగితే చెప్పు తీసుకుని కొట్టండి. కొందరు ఫోటోషూట్ పేరుతో ఆడవారిని ఆఫీసుకు రమ్మని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వెంటనే చెంప చెళ్లుమనిపించాలి. దీని గురించి ఫిర్యాదు చేయాలి. తమిళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే విశాల్ నేడు (ఆగస్టు 29న) 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇతడు చెల్లమే మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. సండకోడి (పందెంకోడి)తో హిట్ అందుకున్నాడు. లాఠీ, మార్క్ ఆంటోని, రత్నం.. తదితర చిత్రాలతో అలరించాడు.చదవండి: 'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్కు సూచన! -
నాపై చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి: విశాల్
‘‘ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి నాపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలి. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని హీరో విశాల్ అన్నారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పని చేసిన విశాల్ పలు అవకతవకలకు పాల్పడ్డారని, మండలి నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఇకపై విశాల్తో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు తమను సంప్రదించాలంటూ తమిళ నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది.దీనిపై విశాల్ స్పందించి, తమిళ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. ‘‘మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గంలో బాధ్యతలు నిర్వహించిన కదిరేశన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం.. వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు వేశాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు.కార్యవర్గం చేసిన తీర్మానంతోనే ‘ఇళయరాజా 75’ పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తెచ్చిపెట్టాను. వాటికి సంబంధించిన వివరాలు మండలి కార్యాలయంలో ఉన్నాయి. అలాంటిది ఏ ఆధారాలున్నాయని నాతో చిత్రాలు చేసే దర్శక–నిర్మాతలు మండలిలో చర్చించాలని తీర్మానం చేస్తారు? ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని స్పందించారు విశాల్. – సాక్షి, చెన్నై -
ఇది మూవీ షూటింగ్ కాదు, సరిగ్గా ఆన్సరివ్వు: విశాల్పై మండిపడ్డ కోర్టు
చెన్నై: కోలీవుడ్ హీరో విశాల్పై న్యాయస్థానం మండిపడింది. విశాల్కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీనిపై లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తెలియదన్నాడు. అతడి వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని గద్దించి అడిగారు.కాగా విశాల్.. ఫైనాన్షియర్ అన్బచెలియన్ దగ్గర తీసుకున్న రూ.21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకుగానూ ఆ డబ్బు తిరిగిచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్.. వీరమె వాగై చూడమ్ అనే సినిమా హక్కుల్ని లైకాకు బదులు వేరే సంస్థకు విక్రయించాడు. దీంతో రెండేళ్లక్రితం లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.చదవండి: కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లనన్న బ్యూటీ.. వెనక్కు తగ్గిందా? -
హీరో విశాల్ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.(ఇదీ చదవండి: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!)గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ) -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
రెబల్ ఎంపీ మద్దతు.. వందకు చేరిన కాంగ్రెస్ బలం!
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 100కు చేరనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విశాల్ పాటిల్ గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గేను కలిసి తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపే లేటర్ను అందజేశారు. ఈ విషయాన్ని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని అధ్యక్షడు ఖర్గే స్వాగతించారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్దాదా పాటిల్ మనవుడు విశాల్ పాటిల్. ఇక లోక్సభ ఎన్నికల్లో సీట్ల ఒప్పందాని కంటే ముందే శివసేన(యూబీటీ) కూటమి తరఫున తమ అభ్యర్థిని పోటీకి నిలిపింది. దీంతో కాంగ్రెస్ పునరాలోచించాలని శివసేన(యూబీటీ)ని కోరినా ఫలితం లేకుండా పోయింది.People of Maharashtra defeated the politics of treachery, arrogance and division. It is a fitting tribute to our inspiring stalwarts like Chhatrapati Shivaji Maharaj, Mahatma Jyotiba Phule and Babasaheb Dr Ambedkar who fought for social justice, equality and freedom.… pic.twitter.com/lOn3uYZIFk— Mallikarjun Kharge (@kharge) June 6, 2024 దీంతో విశాల్ పాటిల్.. సాంగ్లీలో స్వతంత్రంగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సంజయ్ కాకాపై విజయం సాధించారు. విశాల్ పాటిల్ గురువారమే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మద్దతు తెలిపే లెటర్ను అందజేశారు. లోక్సభ సెక్రటరీ అనుమతి ఇస్తే.. విశాల్ పాటిల్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన ఎంపీగా కొనసాగుతారు. దీంతో కాంగ్రెస్ అభ్యుర్థులు సంఖ్య కూడా 99 నుంచి 100కు పెరుగుతుంది. మరోవైపు.. బిహార్లో పూర్ణియా లోక్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పప్పు యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్లో కలిపిన పప్పు యాదవ్.. ఆర్జేడీతో సీట్ల ఒప్పందంతో టికెట్ లభించకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. -
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్లతో పాటు భారీ ఫైట్స్తో మాస్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్తో భరణి,పూజా చిత్రాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని, వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024 -
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు: హీరో విశాల్
♦ ‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు లోతుల్లో అనిపించిందే చెబుతున్నా.. ♦ జగన్ ప్రభుత్వంలో పల్లెల్లో విద్యా రంగంలో మార్పులు బాగా అనిపించాయి. ♦ ఏ నాయకుడైనా సరే... ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ♦ పొత్తు పెట్టుకోండి.. అయితే గతంలో ఇంత మంచి చేశామని ప్రజలకు చెప్పగలరా? ♦ ఈ ఐదేళ్లూ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేకపోయారని ధైర్యంగా మాట్లాడగలరా? ♦ ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. ♦ ఎవరెన్ని కూటములు కట్టినా... ఈ ఎన్నికల్లో జగన్దే గెలుపు అని నా భావన ♦ వీడెందుకు ఇంత మంచి చేస్తున్నాడనే మంటతో కొందరు కాళ్లు పట్టుకుని లాగాలని చూస్తారు. ♦ అలాంటి వాటికి వెరవని నేత జగన్ అనేది నా నమ్మకం..’ అని హీరో విశాల్ తన మనసులో మాటను బయటపెట్టారు. రత్నం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఆయనే సీఎం.. నేనెప్పుడూ మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజుల నుంచి జగన్ను గమనిస్తున్నాను. ట్రెడ్ మిల్పై రెండు కి.మీ వాకింగ్ చేస్తే అలసి పోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటిచెబుతోంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం. విద్యలో సంస్కరణలు భేష్ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చయినా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్ను ఇవ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వలంటీర్లు అలాంటి వారిని వెదికి చదివించడం చేస్తున్నారు. మంచి నేతను ఎవరూ ఆపలేరు ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం.. మంచి చేసేవాళ్లని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరితరం కాదు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూచుని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. –సాక్షి, అమరావతి మనసులో ఉన్నదే చెబుతున్నా నాకు ఆంధ్రలో ఓటు లేకున్నా.. కొంతకాలంగా ఇక్కడి రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్సార్సీపీ ని సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీ లు జత కట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒకే మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈ ఐదేళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికే రెండు, మూడు తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి.. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారో ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరెన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో జగన్దే గెలుపు. -
మళ్లీ జగనే సీఎం ఎందుకంటే..!
-
ఏపీ ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే: హీరో విశాల్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం జగన్పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు. (Read this article in English) -
మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్
తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతడు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాడు. 'రత్నం' మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా అలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డాడు. (ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!) 'సినిమాలు ఏ తేదీన విడుదల కావాలి? ఎప్పుడు విడుదల కావాలి? ఎన్ని థియేటర్లు ఇవ్వాలో రెడ్ జెయింట్ డిసైడ్ చేస్తోంది. మేం ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, కష్టపడి రక్తం చిందించి సినిమాలు తీస్తుంటే.. ఎవరో ఒకరు ఏసీ రూంలో కూర్చుని థియేటర్ల ఓనర్లకు ఫోన్ చేసి.. ఆ సినిమా వేయకండి ఈ మూవీ వేసుకోండి. దాన్ని తీసేయండని చెబుతున్నారు. అసలు మీరు ఎవరు అలా చెప్పడానికి? మీకు అంతటి అధికారం, హక్కులు ఎవరిచ్చారు' అని విశాల్ మండిపడ్డాడు. విశాల్ గత చిత్రాలు 'ఎనిమీ', 'మార్క్ ఆంటోని' సినిమాలని వేరే సంస్థ తమిళనాట డిస్ట్రిబ్యూషన్ చేశాయి. దీంతో వీటికి థియేటర్ల కొరత ఏర్పడేలా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. దీనికి యజమాని. దీంతో చాలామంది నిర్మాతలు ఎందుకులే అని ఊరుకోగా, విశాల్ మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశాడు. తన 'రత్నం' చిత్రానికి కూడా వీళ్లు ఇబ్బందులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓ చెత్త సినిమా.. చూస్తుంటే చిరాకేసింది: 12th ఫెయిల్ నటుడు) Vishal's bold statement against Red Giant😳🔥 He says "Red Giant movies involved in Monopoly activities during release of Enemy & Mark Antony. He also mentions that they may raise an issue during #Rathnam release also"pic.twitter.com/8LuKcqjLWT — AmuthaBharathi (@CinemaWithAB) April 15, 2024 -
త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ ఇదే!
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తన పెళ్లి తనకే సర్ప్రైజింగ్గా ఉందని.. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. తాజాగా దీనిపై హీరో విశాల్ స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడింది. సంతోషంగా ఉంది అలాంటిది తను అనుకున్నది సాధించి తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. తను ఎంతో మంచి వ్యక్తి.. ఆమె తల్లిని నేను కూడా అమ్మ అనే పిలుస్తాను. పర్సనల్ లైఫ్లో సెటిలవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నాడు. కాగా గతంలో వరలక్ష్మి, విశాల్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ కార్యక్రమంలో లక్ష్మీకరమైన అమ్మాయితో ఏడడుగులు వేస్తానన్నారు. స్నేహితులమే.. దీంతో అతడు వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం ఊపందుకుంది. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమకు చోటు లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండే విశాల్ - వరలక్ష్మి 2019లో నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శత్రువులుగా మారిపోయారు. తన తండ్రి శరత్ కుమార్ గురించి విశాల్ అడ్డగోలుగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ఆ సమయంలో విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ చెల్లితో భర్త ఎఫైర్.. ఒక్క దెబ్బతో పక్షవాతం.. చివరికి..! -
'రత్నం' ట్రైలర్.. విశాల్ మళ్లీ అలాంటి సినిమానే!
విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'రత్నం'. ఫస్ట్ లుక్, పాటలు అవి రిలీజైనప్పుడే ఇది యాక్షన్ చిత్రమని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పడు చూద్దాం. (ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి) 'రత్నం' కథ విషయానికొస్తే.. హీరో పేరు రత్నం. ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. హీరోయిన్ (ప్రియా భవానీ శంకర్)ని కొందరు దుండగులు ఎందుకో చంపాలని చూస్తుంటారు. వాళ్ల నుంచి హీరో ఆమెని ఎలా రక్షించాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా సెపరేట్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు హరి.. 'రత్నం' సినిమాని తీశాడు. పూర్తిస్థాయి యాక్షన్ కథతో తీశారు కానీ కథే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఇదివరకే ఈ తరహా సినిమాల్లో విశాల్ కనిపించాడు. మరి ఈ సినిమాలో ఏమైనా కొత్తగా ఉందా లేదా అనేది థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అసలే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాల్ని తప్పితే రొటీన్ చిత్రాల్ని పెద్దగా ఆదరించడం లేదు. మరి 'రత్నం' సినిమాని ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
టార్గెట్ ఫిక్స్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విశాల్
తమళనాడులో పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియాలో టాప్ హీరో లిస్ట్లో ఉన్న విశాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న విశాల్ రాజకీయ ప్రకటన చేశారు. తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా.. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. విజయ్ తర్వాత విశాల్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటన రావడంతో ఈ టాపిక్ ఇప్పుడు తమిళనాట భారీ చర్చలకు దారితీసింది. తమిళనాడులో విశాల్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన అమ్మగారి పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. షూటింగ్లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని వారందరికీ తగిన సాయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తూ విశాల్ వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రత్నం సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రత్నం. కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తామరబరణి, పూజ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అన్నది గమనార్హం. కాగా తాజాగా విశాల్ దర్శకుడు హరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రత్నం. నటి ప్రియా భవాని శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి.స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా రెండవ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఎదనాల అనే పల్లవితో సాగే ఈ మెలోడి పాటను గీత రచయిత వివేక్ రాయగా నటుడు విశాల్, నటి ప్రియా భవాని శంకర్లపై చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. రత్నం చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్ ఇంతకుముందు నటించిన మార్క్ ఆంటోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత రాబోతున్న రత్నం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
నా 25 ఏళ్ల కల.. కొత్త ప్రయాణం మొదలైంది: విశాల్
తెలుగు కుటుంబానికి చెందిన స్టార్ హీరో విశాల్ కోలీవుడ్లో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయనకు సౌత్ ఇండియాలో అన్నీ భాషల్లో అభిమానులు ఉన్నారు. 2017లో మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘డిటెక్టివ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ను ప్లాన్ చేశారు విశాల్. డిటెక్టివ్2 పేరుతో త్వరలో సెట్స్పైకి ఈ చిత్రం వెళ్లనుంది. ఈ సినిమాకు ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా.. తన సినీ కెరియర్లో తొలిసారి డిటెక్టివ్2 చిత్రానికి దర్శత్వం వహించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలో 25 ఏళ్ల నా కల, ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నేను జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను అనే నా మొదటి ఆలోచన నిజమైంది. అవును, నా కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతను నేను తీసుకున్నాను., ఒక దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలైంది. తుప్పరివాలన్2..డిటెక్టివ్2 కోసం లండన్ బయలుదేరాం. అజర్బైజాన్, మాల్లాల్లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదు. మనం పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సార్ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా రానున్నాను. మీ అందరి మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్ సర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజ జీవితమైనా.. రీల్ జీవితమైనా నేను ఎవరి బిడ్డను అనాథగా విడిచిపెట్టను. గమ్యం చేరేలా చేస్తాను సార్.' అని విశాల్ తెలిపారు. డిటెక్టివ్2 ప్రాజెక్ట్ను కూడా మిస్కిన్ దర్శకత్వంలోనే విశాల్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ మూవీకి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు త్వరలో వెళ్లడి కానున్నాయి. And my journey begins finally after 25 years. My dream, my aspiration, my first thought of wat I wanna be in life has come true. Yes, I take charge of a new responsibility, the most challenging in my career,that of a debutante director. Here we go finally. Off to London,… pic.twitter.com/aiLVQZ3Bbx — Vishal (@VishalKOfficial) March 16, 2024 -
స్టార్ హీరో కోటి రూపాయల విరాళం.. ఎందుకంటే?
గతేడాది లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో దళపతి విజయ్. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీ స్టార్ హీరోయిన్ త్రిష నటించింది. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన సడన్ షాకిచ్చారు. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా హీరో విజయ్ కోటి రూపాయల విరాళం అందించి తన ఉదారతన చాటుకున్నారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని హీరో విశాల్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. ఇటీవలే స్టార్ హీరో కమల్ హాసన్ సైతం తన కోటి రూపాయల చెక్ను అందించారు. కాగా.. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవనం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. @actorvijay Thank u means just two words but means a lot to a person wen he does it from his heart. Well, am talking about my favourite actor our very own #ThalapathiVijay brother for DONATING ONE CRORE towards our #SIAA #NadigarSangam building work. God bless u. Yes we always… pic.twitter.com/EzJtoJaahu — Vishal (@VishalKOfficial) March 12, 2024 -
కోటి రూపాయలు సాయం చేసిన కమల్.. హీరో కార్తీ చేతికి చెక్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కోలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రంగానే కష్టపడుతున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. సుమారుగా రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న భవనం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ కోటి రూపాయాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చెక్కును హీరో కార్తీ చేతికి ఆయన అందించారు. ఆ సమయంలో కార్తీతో పాటుగా ప్రధాన కార్యదర్శి విశాల్, వైస్ ప్రెసిడెంట్ పూచీ మురుగన్తో కమల్ సమావేశం అయ్యారు. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విన్నపం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. త్వరలోనే ఈ సంఘం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించారు. అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం నిధుల కొరత ఉందని గతంలో విశాల్ తెలిపాడు. నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్ కూడా పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్ కోరాడు. భవన నిర్మాణ కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఆయన అన్నారు. తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి ఆర్థిక సాయం చేశారు. కోశాధికారి కార్తీకి ఉదయనిధి స్టాలిన్ ఆ చెక్ను అందజేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ప్రియమైన ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించడమే కాకుండా ఇలా వీలైనంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన తెలిపాడు. Dear Udhaya, I sincerely thank u as a friend, producer, actor and now sports minister of Tamil Nadu govt for your contribution to our South Indian artistes association building efforts and your willingness to finish it as early as possible and also coming forward to help in any… pic.twitter.com/H40q6HAzvo — Vishal (@VishalKOfficial) February 15, 2024 -
రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరో విశాల్..
సినీతారలకు రాజకీయాలు కొత్తేం కాదు. సినిమాల ద్వారా ఆదరణ పొందిన ఎంతోమంది సెలబ్రిటీలు పాలిటిక్స్లో తమ లక్ పరీక్షించుకున్నారు. కొందరికి రాజకీయాలు కలిసొచ్చాయి. మరికొందరికి అచ్చి రాకపోవడంతో యూటర్న్ తీసుకున్నారు. ఇకపోతే కొంతకాలంగా ఓపక్క సినిమాలు చేస్తూ మరోపక్క ప్రజాసేవ చేస్తున్న దళపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత పాలిటిక్స్కే పరిమితం అవుతానని ప్రకటించాడు. ప్రజలకు రుణపడి ఉంటా.. తాజాగా హీరో విశాల్ సైతం రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ అంశంపై విశాల్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశాడు. 'నన్ను నటుడిగా, సామాజిక కార్యకర్తగా గుర్తించిన తమిళ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు చేతనైనంతలో ప్రజలకు సాయం చేయాలనుకున్నాను. అందుకే నా ఫ్యాన్స్ క్లబ్ ఏదో సాదాసీదాగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండాలనుకున్నాను. తర్వాతి స్టెప్ అదే.. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలన్నదే ఫ్యాన్స్ క్లబ్ ప్రధాన ఉద్దేశ్యం. నెక్స్ట్ స్టెప్లో నియోజకవర్గాల వారీగా, జిల్లాలవారీగా ప్రజా సంక్షేమ ఉద్యమాన్ని చేపడతాం. మరోవైపు మా అమ్మ పేరిట నిర్వహిస్తున్న దేవి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాం. రైతులకు కూడా సాయం చేస్తున్నాం. షూటింగ్కు వెళ్లిన చాలా చోట్ల జనాల కనీస అవసరాలు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా రాజకీయాల కోసం చేయలేదు వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నేనెన్నడూ ఆశించలేదు. అయితే సమాజం కోరుకుంటే భవిష్యత్తులో జనాల కోసం ముందుకు రావడానికి వెనకడుగు వేయను' అని విశాల్ తన ఎక్స్ (ట్విటర్) మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశాడు. అంటే ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో రాజకీయ అరంగేట్రం ఉండవచ్చని చూచాయగా చెప్పాడు. அன்புடையீர் வணக்கம் pic.twitter.com/WBkGmwo2hu — Vishal (@VishalKOfficial) February 7, 2024 చదవండి: ఇన్డైరెక్ట్గా ప్రియుడ్ని పరిచయం చేసిన బబ్లీ బ్యూటీ -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో?
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. కానీ వచ్చిన తర్వాత ప్రజల ఆదరణ పొందడమే ప్రధానం. అప్పట్లో తమిళనాడు మక్కల్ తిలకంగా ఎంజీఆర్.. రాజకీయాల్లో సత్తాచాటి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందే సినీ రంగానికి చెందిన అన్నాదురై, కరుణానిధి లాంటివారు తమిళనాడుని ఏలారు. ఎంజీఆర్ తర్వాత ఆయన పార్టీని జయలలిత ముందుకు నడిపించి సీఎం అయ్యారు. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్.. చివరి క్షణంలో వెనకడుగు వేశారు. ఆయన తర్వాత నిర్ణయం తీసుకున్న కమలహాసన్.. మక్కల్ నీతి మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవకపోయారు. ప్రముఖ హీరో దళపతి విజయ్.. ఈ మధ్యే రాజకీయాల్లో వచ్చేశారు. పార్టీ పేరుతో సహా నోట్ విడుదల చేశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అంటున్నట్లు తాజా సమాచారం. చెప్పాలంటే విశాల్ చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మధ్య శాసనసభ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. కానీ దీన్ని తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా విశాల్ తన అభిమాన సంఘాన్ని ప్రజా రక్షణ సంఘంగా మార్చి ప్రజాసేవలో మమైకమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తన సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తూ వస్తున్నారు. రాబోయే 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?) -
విశాల్ మాటలు చెత్తబుట్టలో వేయండి: హీరో
ప్రముఖ గీత రచయిత ప్రియన్ కథానాయకుడిగా అవతారమెత్తి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అరణం. వర్ష హీరోయిన్గా నటించిన ఇందులో లఘుబరన్, కీర్తన ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ మూవీ హిట్ టాక్తో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమా చేయడం అవసరమా?.. ఈ వేదికపై చిత్ర కథానాయకుడు, దర్శకుడు ప్రియన్ మాట్లాడుతూ.. అరణం సక్సెస్ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా పలువురు చిన్న నిర్మాతలకు, కళాకారులకు కొత్త ధైర్యాన్ని అందించిందన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇలాంటి సమయంలో ఈ చిత్రం చేయడం అవసరమా అని హెచ్చరించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారన్నారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక చాలా సమస్యలు ఉన్నట్టు ఇంతకుముందు ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పానని అదేవిధంగా అరణం విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశానని, ఇప్పుడదే నిజమైందన్నారు. విశాల్ మాట విని వెనక్కు వెళ్లిపోయారు ఈ చిత్ర నిర్మాణంలో తాను చాలా నేర్చుకున్నానన్నారు. కొన్ని చిత్రాలు విడుదలైన వారంలోనే వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, 25 రోజులుగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తమ చిత్రానికి వేడుకలు ఎందుకు జరుపుకోకూడదన్నారు. మూడు, నాలుగు కోట్ల రూపాయలతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావొద్దని విశాల్ చెప్పడంతో చాలామంది తిరిగి వెళ్లిపోయారన్నారు. కానీ హీరోలను కాకుండా కథను నమ్మి చిత్రాలు చేస్తే విజయం తథ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాల్ వ్యాఖ్యలను చెత్తబుట్టలో వేయండన్నారు. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారని ఆరోపించారు. చదవండి: మేము ప్రశ్నిస్తే.. అన్నింటికీ సిద్ధపడే ఈ వృత్తిలోకి వచ్చారు కదా అంటున్నారు: రష్మిక -
నా సొంత సోదరిని కోల్పోయినట్లు ఉంది: స్టార్ హీరో ఎమోషనల్
ప్రముఖ సంగీత దర్శకుడు, పాటల రచయిత ఇళయరాజా ఇంట్లో విషాద నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) క్యాన్సర్తో కన్నుమూశారు. చికిత్స కోసం శ్రీలంక వెళ్లిన భవతారిణి.. అక్కడే కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ఆమె మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు విశాల్ విచారం వ్యక్తం చేశారు. తాను ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!) విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' నేను అభిమానించే ప్రియమైన భవతారిణి. ఈ వార్త విని నా హదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావ్. నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకి కజిన్గా కంటే ఎక్కువగా.. నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియదు. ఈ పరిణామాలు నా జీవితాన్నే తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. Dear Bavatha. I write this with a heavy heart and unable to digest it. Am really sorry you are not going to be with us anymore and left us to be with the gods. I miss u as a sister, as my own, more than I knew you as Ilayaraja sir’s daughter or Yuvan’s sister or Vasuki’s cousin.… — Vishal (@VishalKOfficial) January 26, 2024 -
రత్నం రెడీ
వేసవిలో థియేటర్స్కు వస్తున్నాడు ‘రత్నం’. విశాల్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. హరి దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగుతున్నాయి. కాగా ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’)కి సీక్వెల్గా ‘తుప్పరివాలన్ 2’ చేస్తున్నారు విశాల్. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారట విశాల్. ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
విశాల్ భారీ యాక్షన్ మూవీ.. విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది డైరెక్టర్ హరితో యాక్షన్ సినిమా అంటే మామూలుగా ఉండదు. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ మూవీ అంటే అభిమానులకు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మోడ్లో రాబోతోంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి మాస్ లవర్స్లో భారీ అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ను అందిస్తున్నారు. రత్నం ఫస్ట్ షాట్ టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ డేట్ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది. -
రోహిత్ శర్మ సొంత తమ్ముడు.. కవల పిల్లలు! అతడి పరిస్థితి?
సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్ శర్మ. ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్ననాడు తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంటిలో జీవించే భాగ్యానికి కూడా దూరమైన అతడు.. ‘హిట్మ్యాన్’గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. పేదరికాన్ని జయించి అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా నిలిచి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఆ లైఫ్లో కేవలం భార్య రతిక సజ్దే, కూతురు సమైరా శర్మ మాత్రమే ఉన్నారా?! రోహిత్ తల్లిదండ్రులు, తోడబుట్టిన తమ్ముడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైజాగ్ మనుమడు రోహిత్ శర్మ తల్లిదండ్రుల పేర్లు గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ. పూర్ణిమ విశాఖపట్నానికి చెందిన వారు. ఈ దంపతులకు 1987, ఏప్రిల్ 30న కుమారుడు రోహిత్ శర్మ జన్మించాడు. అనంతరం మరో కుమారుడు జన్మించగా అతడికి విశాల్ శర్మగా నామకరణం చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించిన రోహిత్కు రెండేళ్ల వయసు ఉన్నపుడు వాళ్ల కుటుంబం డోంబివలీ ఏరియాకు మారింది. గురునాథ్ శర్మ ఓ ట్రాన్స్పోర్ట్ సంస్థలో స్టోర్హౌజ్ కేర్టేకర్గా పనిచేసేవారు. తల్లిదండ్రులకు దూరంగా అయితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఆదాయం లభించేది కాదు. అందుకే డోంబివలీకి మకాం మార్చిన గురునాథ్ శర్మ.. తన పెద్ద కుమారుడు రోహిత్ను అతడి బామ్మతాతయ్యల వద్దకు పంపించారు. వాళ్ల దగ్గరే పెరిగిన రోహిత్ శర్మ వారాంతాల్లో మాత్రం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చేవాడు. అప్పుడే తమ్ముడు విశాల్తో ఆడుకునే సమయం దొరికేది. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడుతూ కబుర్లు చెప్పుకొనేవారు. అయితే, రోహిత్లో దాగున్న ప్రతిభను గమనించిన అతడి అంకుల్ క్రికెట్ క్యాంపులో.. రోహిత్ పేరును నమోదు చేయించాడు. 14వ ఏట అలా క్రికెట్లో అడుగుపెట్టిన ‘హిట్మ్యాన్’.. ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టులో కీలక సభ్యుడిగా.. ప్రస్తుతం కెప్టెన్గా మారాడు. తమ్ముడిని ఉద్యోగం మాన్పించి తనకు మేనేజర్గా వ్యవహరించిన రితికా సజ్దేను పెళ్లాడగా.. వీరికి కుమార్తె సమైరా జన్మించింది. భార్యా, కుమార్తెతో కలిసి ముంబైలోని లగ్జరీ ఏరియాలో నివసించే రోహిత్ శర్మ తన తల్లిదండ్రులు, తమ్ముడి కోసం అతడి ఇంటికి కాస్త దూరంలో మరో ఇల్లును కొనుగోలు చేశాడు. పెద్ద కొడుకుగా కుటుంబం పట్ల తన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్న రోహిత్ శర్మ.. తమ్ముడు విశాల్కు కూడా దన్నుగా నిలిచాడు. క్రికెటర్గా తను ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత విశాల్ వేరే చోట ఉద్యోగం చేయకుండా తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించాడు. విశాల్ శర్మ ప్రస్తుతం ఇండియా, సింగపూర్లో ఉన్న రోహిత్ క్రిక్కింగ్డమ్ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్గా ఉన్నాడు. కవల కుమార్తెలతో విశాల్ శర్మ PC: Vishal Sharma Instagram కవల పిల్లలతో ముచ్చటైన కుటుంబం ఇక విశాల్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. దీపాలి షిండే అనే అమ్మాయితో అతడికి వివాహం జరిగింది. ఈ జంటకు 2021లో కవల కూతుళ్లు అనైరా, అనైషా జన్మించారు. వీరిద్దరి పుట్టినరోజు నేడు(జనవరి 9). ఈ సందర్భంగా విశాల్ - దీపాలి తమ కుమార్తెలకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ అందమైన ఫొటోలు షేర్ చేశారు. అదండీ సంగతి!! అఫ్గన్తో సిరీస్తో అంతర్జాతీయ టీ20లలో.. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న రోహిత్ శర్మ జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్తో మొదలయ్యే సిరీస్తో టీమిండియా తరఫున టీ20లలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్లో భాగంగా రోహిత్ సారథ్యంలో భారత్ మూడు మ్యాచ్లు ఆడనుంది. చదవండి: IND vs SA 2nd Test: రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్టౌన్ పిచ్పై ఐసీసీ సీరియస్ -
స్టార్ హీరో లేటెస్ట్ మూవీ.. న్యూ ఇయర్కు క్రేజీ అప్డేట్
ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో అలరించిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విశాల్ నటిస్తోన్న చిత్రం రత్నం. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హరీ దర్శకత్వం వహిస్తుండగా.. కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్తో పాటు లిరికల్ సాంగ్ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తే విశాల్ ఎన్నడూ కనిపించని ఊర మాస్ లుక్లో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్లుక్తో పరాటు ఓ లిరికల్ పాటను విడుదల చేశారు. 'రా రా రత్నం' అంటూ సాగే ఈ పాట మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్లో నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా లిరిక్స్, ట్యూన్, విజువల్స్ ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్గా ఉన్నాయి. ఈ చిత్రంలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
అమ్మాయితో వైరల్ వీడియో.. క్షమాపణ కోరిన విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయనతో పాటు మరో అమ్మాయి ఉండటమే... న్యూయార్క్ వీదుల్లో ఆ అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై విశాల్ వెళ్తుండగా అక్కడ కొందరు ఆయన్ను గుర్తుపట్టి పిలుస్తారు... అప్పుడు విశాల్ షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకుని అమ్మాయితో కలిసి పరుగులు పెట్టాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు..? వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? అని ఆయన ఫ్యాన్స్ గూగుల్లో వెతికారు. కానీ ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ కొందరు ఫైర్ కావడంతో విశాల్ స్పందించారు. విశాల్ క్షమాపణ 'నన్ను క్షమించండి... ఇటీవల వైరల్ అయిన వీడియో గురించి అసలు నిజాన్ని తెలిపేందుకు ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. లొకేషన్ ప్రకారం అది కొంచెం వాస్తవం. ఆ వీడియో న్యూయార్క్లో తీసిందే. ఆ సమయంలో నేను న్యూయార్క్లో ఉన్నాను. రెగ్యూలర్గా ప్రతి ఏడాది నేను మా కజిన్స్ వద్దకు న్యూయార్క్ వెళ్తాను. ఏడాది కాలం పాటు సినిమాలకు సంబంధించిన పనులతో నిత్యం బిజీగానే ఉంటాను.. ఆ కష్టాన్ని మరిచిపోయి ఇలా నా కజిన్స్తో గడుపుతాను. ఆ వీడియో ఒక ప్రాంక్.. ముందుగా అనుకుని చేసినదే... కావాలనే ఆ వీడియో నేను మొహం దాచుకున్నాను. (ఇదీ చదవండి: బిగ్ బాస్ OTT: బర్రెలక్కతో పాటు సీజన్-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్) అలా చేయాలని ముందే ప్లాన్ ప్రకారం వీడియో తీసి నా ప్రమేయంతోనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై వస్తున్న రూమర్స్ ఇకనైన ఆగుతాయని ఆసిస్తున్నాను. కానీ కొంతమంది ఈ వీడియో వల్ల నా పట్ల ఫైర్ అవుతున్నారు. అయినా, నేను ఎవరినీ ద్వేషించలేను.' అని విశాల్ క్లారిటీ ఇచ్చేశాడు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబినేషన్లో రత్నం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. Sorry guys, I guess it's time to reveal the truth about the recent video. Well well well, it's half true in terms of location, yes I am in New York which is my regular retreat place with my cousins, which is a ritual of destressing myself every year after a super chaotic rest of… — Vishal (@VishalKOfficial) December 27, 2023 Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq — Ramesh Bala (@rameshlaus) December 26, 2023 -
విజయకాంత్ మృతిపట్ల నటుడు విశాల్ ఎమోషనల్
-
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్కాంత్ సార్కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
సలార్ ‘రాధా రమా’కు క్రికెట్తో లింకేమిటి?
ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా సలార్లో రాధా రమగా నటి శ్రేయా రెడ్డి దుమ్మురేపింది. ఖాన్సార్ను ఆమె ఒకే రేంజ్లో వణికించేసింది. ఆ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ తర్వాత శ్రేయా రెడ్డినే ఎక్కువ డామినేట్ చేసింది. ఇందులో జగపతిబాబు కూతురిగా పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఆమె గతం గురించి తెలియని వాళ్లు అందరూ ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వాళ్లు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో షేర్ చేస్తున్నారు. ఇంతకు ఈ డెవిల్... అదేనండి 'రాధా రమ' కాదు కాదు మన శ్రేయా రెడ్డి ఎవరో తెలుసుకుందాం. 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాలో కనిపించి కోలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగులో రెండు సినిమాలే చేసినా 2006లో వచ్చినా విశాల్ 'పొగరు' సినిమాలో ఈశ్వరిగా ఒక రేంజ్ల్ తన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె పేరు ఇప్పటికీ గుర్తుండేలా చేసింది. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్య విక్రమ్ను పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటూ నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఆ తర్వాత చెన్నైకి తిరిగొచ్చారు. గతేడాది సుడల్ (Suzhal) అనే వెబ్ సిరీస్తో లైమ్లైట్లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఈ క్రైమ్ వెబ్సీరిస్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం వరుసగా పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. సలార్ తర్వాత పవన్ కల్యాణ్ OG చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కింది. సలార్ దెబ్బతో శ్రేయా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. ముందు ముందు శ్రేయాను ఆపడం ఎవరి తరం కాదని చెప్పవచ్చు. శ్రేయా రెడ్డి భర్త ఏం చేస్తారు కోలీవుడ్లో వీజేగా విక్రమ్ కెరియర్ స్టార్ట్ చేశాడు. కెరియర్ ప్రారంభంలో శ్రేయా రెడ్డి కూడా వీజేగా పనిచేయంతో వారిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడటం ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విశాల్ కంటే ముందే విక్రమ్ కోలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా తక్కువ సినిమాల్లో కనిపించినా ఆ తర్వాత GK ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. ఇందులో ఎక్కువగా విశాల్తోనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆయన పలు సినిమాలకు పంపణీ దారుడిగా ఇండస్ట్రీలో ఉన్నారని సమాచారం. శ్రేయా రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా.. శ్రేయా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా జట్టు తరుపున పలు మ్యాచ్ల్లో రానించారు. అతను 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లపై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్లలో వికెట్-కీపర్గా కొనసాగారు. అతను 1982-83 నుంచి 1985-86 వరకు తమిళనాడుకు కెప్టెన్గా కూడా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్లో పనిచేశారు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో తోడ్పడ్డారు. అక్కడ అతను భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చారు. Sriya Reddy: ట్రెండింగ్లో సలార్ బ్యూటీ.. రాధారమగా రచ్చలేపిందిగా! (ఫోటోలు) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
'నాలో మనిషిని నిద్రలేపింది'.. విశాల్ ట్వీట్ వైరల్!
ఇటీవలే విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను పలరించాడు. అక్టోబర్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ స్టార్ హీరో రత్నం సినిమాలో నటిస్తున్నారు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. కార్తికేయన్ సంతానం జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. అయితే చెన్నైలో వరదలు రావడంతో బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రత్నం మూవీతో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ జీవిత కథను చదివినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ రాసిన పుస్తకం 'ఉమెన్ ఇన్ మీ' చదివాక నాలో మనిషిని నిద్రలేపిందని అన్నారు. ఇక నుంచి మహిళలను మరింత గౌరవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిస్టుల మనోభావాలను అర్థం చేసుకోవడం తెలుసుకున్నానని అన్నారు. ఆమె యూత్ ఐకాన్ అయినప్పటికీ చాలా చిన్న వయస్సులో జీవిత ప్రయాణం.. ఎదుర్కొన్న ఇబ్బందులు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఆమె జీవితంలో సాధించిన విజయాలకు.. ముఖ్యంగా స్తీలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని అన్నారు. మీ జీవితంలో సరైన ఎంపిక, ధైర్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం సరళంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని విశాల్ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు మహిళలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఉమెన్ ఇన్ మీ పుస్తకం.. ది ఉమెన్ ఇన్ మీ అనే పుస్తకాన్ని అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రాశారు. ఈ బుక్ అక్టోబర్ 24, 2023న 26 భాషల్లో విడుదలైంది. ఉమన్ ఇన్ మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Well, the transformation from b/w to color is the mood in my mind by Reading #BritneySpears #TheWomanInMe brings out the Man in me. Honestly makes me wanna respect women more. Especially understanding the psyche of performing artistes. Truly inspiring to read her life journey and… pic.twitter.com/H88utzadzV — Vishal (@VishalKOfficial) December 22, 2023 -
చలో కోల్కత్తా
ప్రేక్షకులను భయపెడతా అంటున్నారు బాలీవుడ్ నటి కాజోల్. ఆమె ప్రధాన పాత్రధారిగా విశాల్ ఫురియా ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్ సమాచారం. పూర్తి స్థాయి హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావొచ్చాయని, జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేలా విశాల్ ప్లాన్ చేశారని టాక్. తొలి షెడ్యూల్ కోల్కతాలో మొదలవుతుందట. నెల రోజులకు పైగా అక్కడి లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన చేశారట యూనిట్. ఇక ఈ సినిమాను కాజోల్ భర్త, దర్శక–నటుడు, నిర్మాత అజయ్ దేవగన్ నిర్మించనున్నారని బాలీవుడ్ భోగట్టా. -
ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)
-
ప్రభు కూతురిని పెళ్లాడిన ప్రముఖ డైరెక్టర్, ఫోటో వైరల్
ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'డార్లింగ్ అధిక్, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లిని మహారాణిలా చూసుకోవాలి జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సర్, పునీత ఆంటీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? సరదాగా అన్నానులే.. నువ్వు తనను బాగా చూసుకుంటావని నాకు తెలుసు. అదేంటో కానీ నా సోదరీమణులందరూ ఐశ్వర్య అనే పేరుతోనే కనిపిస్తారు. మీ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఐశ్వర్యకు రెండో పెళ్లి.. కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో బంధువైన కునాల్తో ఆమె పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. కానీ కొంతకాలానికి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు విడాకులిచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో దర్శకరచయితగా సినీ కెరీర్ ఆరంభించాడు. 'దబాంగ్ 3' అనే బాలీవుడ్ సినిమాకు రచయితగానూ పని చేశాడు. ఇటీవల 'మార్క్ ఆంటోని' సినిమాతో కోలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ 'కే-13', 'నేర్కొండ పార్వై', 'కోబ్రా' సినిమాల్లో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అజిత్తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్! So damn happy for u my darling Adhik and my dearest sister Aishwarya on your wedding today and starting a new chapter in your lives and u hav the universe s blessings and especially your parents prabhu sir and punitha aunty's positivity and blessings now. Coming to the point,… pic.twitter.com/Vucqwch3J0 — Vishal (@VishalKOfficial) December 15, 2023 చదవండి: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు) -
చెన్నై అతలాకుతలం.. కదిలొచ్చిన స్టార్స్.. సూర్య బ్రదర్స్ ఏకంగా..
మిచాంగ్ తుపాన్ చైన్నె ప్రజల్ని నిలువునా ముంచేసింది. కష్టాల కడగండ్లలోకి నెట్టేసింది. జనజీవనం స్తంభించిపోయింది. పేదలు, ధనికులు ఎవరినీ వదలలేదు.. అందరి నోటా ఆదుకోమన్న ఆర్తనాదాలే. తన తల్లి వైద్యం కోసం స్థానిక కాట్పాడిలో ఉంటున్న బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్, అదే ప్రాంతంలో నివసిస్తున్న హీరో విష్ణు విశాల్, మైలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న నటి నమిత తుపాన్ బాధితులే. రూ.10 లక్షల విరాళం ప్రభుత్వం సత్వరం స్పందించి నివారణ చర్యలకు ఉపక్రమించినా, మరో పక్క విమర్శల దాడి జరుగుతోంది. సినీ తారలు విశాల్, పార్థిబన్, అతిథి బాలన్ వంటి వారు ప్రభుత్వ అలసత్వం గురించి ప్రశ్నించారు. ఇక తుపాన్ బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నటుడు సూర్య, కార్తీక్ తమ అభిమానులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోని అభిమానుల కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తారల సాయం.. విజయ్ తన అభిమాన సంఘం నిర్వాహకులను రంగంలోకి దింపి బాధితులను తన వంతుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన నటుడు విశాల్, పార్థిబన్ కూడా తన వంతు సాయం అందించారు. అదేవిధంగా హాస్యనటుడు బాలా తమ వంతు సాయం అందించారు. అలాగు లేడీ సూపర్స్టార్ నయనతార తుపాన్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం విశేషం. ఈమె పిగ్మీ 9 సంస్థ ద్వారా వేలచ్చేరి ప్రాంతంలోని బాధితులకు శానిటరీ, మంచి నీళ్లు, బ్రెడ్, బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందించారు. చదవండి: ప్రశాంత్కు తన చేతులతో టైటిల్ అప్పగించేసిన అమర్! రైతుబిడ్డ అంటే అంత చులకనా..? -
ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్
మిచౌంగ్ తుపాను ధాటికి తమిళనాడు ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. రెండు రోజులు విరుచుపడుతున్న మిచౌంగ్ తుపాను ఇవాళ ఉగ్రరూపం దాల్చింది. చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఐదుగురు మరణించగా.. చాలామంది ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. దీంతో వరదలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ స్టార్ హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చెన్నై మేయర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన శ్రీమతి ప్రియా రాజన్ (చెన్నై మేయర్), కమిషనర్తో సహా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లోని ఇతర అధికారులు సురక్షితంగా మీ కుటుంబాలతో బాగా ఉన్నారని ఆశిస్తున్నా. ఎందుకంటే వరద నీరు, డ్రైనేజీ మీ ఇళ్లలోకి ప్రవేశించదు. మరీ ముఖ్యంగా మీకు ఆహారం, విద్యుత్ సరఫరా ఉంటుందని ఆశిస్తున్నా. మీరు ఉన్న ఇదే నగరంలో నివసిస్తున్న పౌరులుగా మీలా సురక్షితమైన స్థితిలో లేరు. డ్రైనేజీ కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా? లేదా చెన్నై కోసమా?' అంటూ నిలదీశారు. అంతే కాకుండా.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 2015లో మేమే రోడ్లపైకి వచ్చాం. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియజేయగలరని కోరుతున్నా. మేం ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆహారం, నీరు అందిస్తూనే ఉంటాం. కానీ ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులందరూ బయటకు వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ విషయాన్ని చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. అద్భుతం కోసం ఎదురుచూడకుండా సాధారణ పౌరులే డ్యూటీ చేయాలి. గాడ్ బ్లెస్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. విశాల్ ఇటీవలే మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 -
'మిచౌంగ్' తుపాను.. ఆవేదనతో ఫైర్ అయిన విశాల్
'మిచౌంగ్' తుపానుతో తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిపై హీరో విశాల్ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) విఫలమైందంటూ విశాల్ ఆరోపించారు. 'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), జీసీసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులకు నేను చెప్ప దలుచుకున్నది ఏమిటంటే... మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితిలో లేము. 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వారందరికీ మేము సాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం చాలా భాదగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము కచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాము. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నారు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 చదవండి: చెన్నైలో జలప్రళయం -
స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!
మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless. Tamil -… pic.twitter.com/7tmHn0FrJV — Vishal (@VishalKOfficial) December 2, 2023 -
తలలు నరికే ఊరమాస్గా విశాల్... ‘రత్నం’ టీజర్ అదుర్స్
విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ చిత్రానికి ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ఓ పెద్ద మైదానంలో బర్రెలు, గుర్రాలు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి వచ్చి మోకాలి మీద కూర్చున్న ఒక వ్యక్తి తలని విశాల్ నరికి, దాన్ని చేత్తో పట్టుకుని నడిచి వచ్చే సన్నివేశాన్ని టీజర్లో చూపించారు. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోధమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా...’ వంటి డైలాగులు టీజర్లో వినిపిస్తాయి. ‘రత్నం’ చిత్రంలో విశాల్ మరోసారి మాస్ లుక్లో కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సముద్ర ఖని, గౌతమ్ మీనన్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మరోసారి సీబీఐ ఆఫీసుకు వెళ్లిన హీరో విశాల్
విశాల్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోని చిత్రం గత అక్టోబర్లో విడుదలై అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో మార్క్ ఆంటోని సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ముంబైలోని సెన్సార్ బోర్డు అధికారులను సంప్రదించింది.కానీ మార్క్ ఆంటోని సినిమాను హిందీలో విడుదల చేసేందుకు సెన్సార్ సర్టిఫికెట్ రావడం అంత ఈజీ కాదని హీరో విశాల్ అన్నారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ పొందేందుకు లంచం అడిగేలా ముంబై సెన్సార్ బోర్డ్ అధికారులు మెర్లిన్ మేనకా అనే బ్రోకర్ ద్వారా మార్క్ ఆంటోని చిత్ర బృందాన్ని సంప్రదించారు. దీన్ని అస్సలు ఊహించని చిత్ర నిర్మాతలు.. తదనంతరం, విశాల్ మేనేజర్ హరికృష్ణన్ బ్రోకర్ మెర్లిన్ మేనకాతో మాట్లాడి లంచం ఇచ్చాడు. ఆపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్పై విశాల్ చేసిన ఆరోపణలతో సీబీఎఫ్సీ ముంబయి శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ఇలా తెలిపాడు. 'మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించిన ఈ కేసు పూర్తిగా కొత్త అనుభవాన్ని ఇచ్చింది. విచారణలో భాగంగా అక్కడి అధికారులు వ్యవహరించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు విచారణ కోసం వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది.' అని విశాల్ పేపర్కొన్నాడు. నటుడు విశాల్, అతని మేనేజర్ హరికృష్ణలను ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రెండోసారి పిలిపించిన అధికారులు వారికి ఎంత మొత్తంలో లంచంగా చెల్లించారనే దానిపై విచారణ చేపట్టారు. గత సారి సీబీఐ అధికారులు విశాల్ మేనేజర్ హరికృష్ణను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. Just finished my visit to CBI office in Mumbai for an enquiry regarding the CBFC case. Was a complete new experience and am glad the way the enquiry is being conducted. Took some inputs too about how a CBI office would look like. Lol. Never ever thought in my life I will be going… — Vishal (@VishalKOfficial) November 28, 2023 -
చిన్న సినిమాలను చులకన చేసిన విశాల్.. దర్శకుడి కౌంటర్..
దేవా సంగీత దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వా వరలామ్ వా'. ఎస్ జీఎస్ క్రియేటివ్ మీడియా పతాకంపై ఎస్ పీఆర్ నిర్మించారు. ఇంతకు ముందు ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి, మిసిమి, నాన్ అవళై సందిత్తపోదు వంటి చిత్రాలను తెరకెక్కించిన ఎస్జీ.రవిచంద్రన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఫేమ్ బాలాజీ మురుగదాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. కరుమేఘంగళ్ కరగిండ్రన చిత్రం ఫేమ్ మహానా సంజీవి హీరోయిన్గా నటించారు. విశాల్ వ్యాఖ్యలపై అసహనం నటుడు మైమ్ గోపి విలన్గా చేస్తున్నారు. నటి గాయత్రి, రెండా, రెడిన్ కింగ్స్ లీ, శరవణ సుబ్బయ్య, దీపా, వైయాపురి వాసు విక్రమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ రాజా చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, మోహన్ జీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రూ.2-3 కోట్లతో సినిమాలు చేసే నిర్మాతలు ఇండస్ట్రీకి రావద్దన్న విశాల్ వ్యాఖ్యలపై దర్శకుడు మోహన్.జీ తీవ్రంగానే స్పందించారు. చిన్న చిత్రాలు లాభాలు తెస్తున్నాయి మోహన్ జీ మాట్లాడుతూ.. విశాల్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో గాని, నిజానికి చిన్న చిత్రాలు బాగానే లాభాలు తెచ్చి పెడుతున్నాయని తెలిపారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలన్నీ లో బడ్జెట్లో చేసినవేనన్నారు. అన్నీ మంచి లాభాలు తెచ్చి పెట్టాయని చెప్పారు. అయితే చిత్రాలకు కంటెంట్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. తాను ఇంతకు ముందు చేసిన చిత్రాలన్నింటిలో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్.. 'రూ.1- 4 కోట్లతో సినిమాలు తీద్దామనుకునేవారు ఇండస్ట్రీకి రావొద్దు. ఆ డబ్బుతో ఏదైనా భూమి కొనుకోండి. ఎందుకంటే అంత తక్కువ డబ్బుతో సినిమా తీస్తే మీకు ఏమీ వెనక్కు రాదు' అని కామెంట్స్ చేశాడు. చదవండి: ఫ్లాప్ హీరో.. కొత్త డైరెక్టర్.. రూ.100 బడ్జెట్తో ‘యూవీ’ ప్రయోగం! -
గుడి దగ్గర స్టార్ హీరో సినిమా షూటింగ్.. ఇబ్బందిపడ్డ భక్తులు
విశాల్ కొత్త సినిమా షూటింగ్ తమిళనాడులోని వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం సమీపంలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలిరోజు విశాల్తోపాటు హీరోయిన్ ప్రియాభవాని శంకర్, కమెడియన్ యోగిబాబు తదితరులు పాల్గొన్నారు. షూటింగ్ కోసం కోట ఆలయం సమీపంలో తాత్కాలిక వేలూరు సౌత్ పోలీస్స్టేషన్ సెట్ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి:హీరో మహేశ్బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) హీరోయిన్ బైక్పై వెళ్తుండగా పోలీసులు ఖైదీలని పోలీస్స్టేషన్కు తీసుకొస్తున్న సీన్స్ తీశారు. దర్శకుడు హరి నేతృత్వంలోని ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే షూటింగ్ లొకేషన్ చుట్టూ జిమ్ బాయ్స్ బైటాయించి ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను అడ్డుకోవడంతో వీళ్లందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) -
‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), సీఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ ఏడాది ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహæనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్ కపూర్ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను, 474 మిలియన్ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్ఎల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయన్నారు. విద్యుత్ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్ కపూర్ ప్రశంసించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగులకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్ వాహనాలుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం ఈవీలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
సెన్సార్ బోర్డుకు లంచం.. అధికారుల ముందు హాజరైన విశాల్ కార్యదర్శి
హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. రిలీజ్కు ముందు మార్క్ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్ను సెన్సార్ బోర్డుకు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ కావాలంటే రూ.6.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్లుగానే విశాల్ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన బ్యాంక్ చలానా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్ బోర్డ్ సభ్యులు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్ కార్యదర్శి హరికుమార్ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. దీంతో హరికుమార్ శుక్రవారం అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే విశాల్ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద చిత్రాలకు చైన్నెలోనే సెన్సార్ సర్టిఫికెట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా -
మార్క్ ఆంటోనీ తర్వాత క్రేజీ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చిన విశాల్
మార్క్ ఆంటోనీ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టిన విశాల్.. తాజాగా కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇంతకుముందు విశాల్ కథానాయకుడిగా భరణి, పూజ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్ దర్శకుడు హరి ఇప్పుడు మూడోసారి డైరెక్ట్ చేస్తున్నారు. ఇది విశాల్ నటిస్తున్న 34వ చిత్రం. ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటిస్తుండగా దర్శకుడు సముద్రఖని, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీన్ని జి స్టూడియోస్ సౌత్ సంస్థతో కలిసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన స్టోన్ పెంచి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూత్తుకుడి జిల్లా విళాత్తికుళం పరిసర ప్రాంతాల్లో చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు హరి చిత్రీకరిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రను పోషిస్తున్ననట్లు నటుడు విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో ఆగిపోయిన డిటెక్టెవ్- 2 చిత్రాన్ని దర్శకుడిగా విశాల్నే హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా విశాల్, హరి కాంబోలో రూపొందుతున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు హరి అంటేనే మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్. మరి ఈయన విశాల్తో తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో చూడాలి. -
అమెజాన్ ప్రైమ్లో దూసుకుపోతున్న సూపర్ హిట్ తెలుగు సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కథానాయకుడిగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'మార్క్ ఆంటోని'. సెప్టెంబర్ 15న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఏకంగా రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. హీరో విశాల్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా జాకీ మార్తాండ పాత్రలో ఎస్జే సూర్య జీవించారు. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్) అక్టోబరు 13వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఇండియాలో టాప్ ట్రెండింగ్లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశాడు. ' నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే చూసి ఎంజాయ్ చేయండి' అని విశాల్ తెలిపాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పరపెక్ట్గా సెట్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్లో ఈ ఆదివారం చూసి ఎంజాయ్ చేయండి. Happy to see #MarkAntony killing it in Ott platform too. Trending no 1 in Amazon Prime. Enjoy the unlimited entertainment, especially my favourite Silk Smitha scene in your own homes now. God Bless pic.twitter.com/RXTCaQJNQY — Vishal (@VishalKOfficial) October 14, 2023