చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల | Chilakaluripet And Tsunduru Incident Movie 23 Teaser | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట, చుండూరు మారణకాండపై సినిమా.. టీజర్ విడుదల

Published Sun, Mar 9 2025 12:42 PM | Last Updated on Sun, Mar 9 2025 12:43 PM

Chilakaluripet And Tsunduru Incident Movie 23 Teaser

మ‌న స‌మాజంలో చ‌ట్టం అంద‌రికీ స‌మానంగా వ‌ర్తిస్తుందా.! ఇదే పాయింట్‌తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

23 సినిమా టీజ‌ర్‌లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.  1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జ‌రిగిన చుండూరు మారణకాండ ఘ‌ట‌న‌తో టీజర్‌ ‍ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో  హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో జ‌రిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement