

టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ భావోద్వేగానికి లోనయ్యాడు

‘‘ఒకే రోజు.. రెండు అవార్డులు.. నా కుటుంబం నాతోనే ఉంది ఇలా! ఇంతకంటే ఇంకేం కావాలి?’’ అంటూ తల్లిదండ్రులతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు

ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డుల వేడుకలో యశస్వి తన తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నాడు

తనకు లభించిన రెండు అవార్డులను వారిద్దరి చేతిలో పెట్టి.. వాళ్లను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోలను షేర్ చేశాడు

సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్ టీమిండియా స్టార్ ఓపెనర్గా ఎదిగాడు

ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 23 టీ20లు ఆడిన యశస్వి ఆయా ఫార్మాట్లలో 1407, 723 పరుగులు సాధించాడు

ప్రస్తుతం యశస్వి ఆస్ట్రేలియా టూర్లో ఉన్నాడు

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు

